గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం ఘటన జరిగి అయుదు రోజులు అవుతున్నా, ఇంకా మృతదేహాలు తియ్యలేక పోతుంది, మన అధికార యంత్రాంగం. అయితే ఈ బోటు ప్రమాదం పై, ప్రభుత్వం పై పలు విమర్శలు వస్తున్న వేళ, మాజీ మంత్రి హర్ష కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటన పై ప్రభుత్వం కావాలనే తప్పుడు ప్రకటనలు ఇస్తుందని అన్నారు. బోటు ప్రమాద బాధితులను తక్కువ చేసి చూపిస్తున్నారని అన్నారు. నిన్న ఒక్క రోజే మరో అయిదు కుటుంబాలు, తమ వారి జాడ కనిపించటం లేదని ఇక్కడకు వచ్చారని, అంటే మరో అయుదుగురు ఉన్నారు కదా, ఆ విషయం ఎందుకు ప్రభుత్వం చెప్పటం లేదని అన్నారు. తన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం, బోటులో మొత్తం 93 మంది ప్రయాణికులు ఉన్నారని, హర్ష కుమార్ సంచలన ఆరోపణలు చేసారు. ప్రభుత్వం మాత్రం 73 మంది మాత్రమే ఉన్నారని చెప్తుందని అన్నారు.

harsha 19092019 2

కావాలని మృతుల సంఖ్యను తక్కువగా చూపించి, ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వానికి మునిగిపోయిన బోటు జాడ సోమవారం మధ్యాహ్నానికే తెలిసిందని, అయితే బోటు లోపల ఏసి రూమ్స్ లో లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయనే భయంతో ప్రభుత్వం బోటును వెలికి తీయడం లేదని ఘాటు విమర్శలు చేసారు. సంచలనం కోసమో, లేకపోతే మీడియాలో పేరు సంపాదించడం కోసమో తాను ఈ విషయాలను వెల్లడించడం లేదని, ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాల బాధ, ఇన్ని రోజులు అయినా శవాలు దొరక్క ఇబ్బంది పడుతున్న ఆ కుటుంబాల బాధ చూసి స్పందిస్తున్నానని హర్ష కుమార్ అన్నారు. అంతే కాకుండా, ఈ బోటుల మాటున, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని హర్షకుమార్ ఆరోపించారు.

harsha 19092019 3

ఈ బోటుల వెనుక, ఫారెస్ట్, టూరిజం, ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారని, అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. ఈ బోటు ప్రమాదం విషయానికి వస్తే, ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై ముందుగా అనుమతి ఇవ్వలేదని, అయితే అప్పుడు టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి బోటుకు పర్మిషన్ ఇప్పించేలా చేశారని ఆరోపించారు. అయితే తనపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజున బోటు అనుమతి కోసం ఏ అధికారినీ తాను ఒత్తిడి చేయలేదని, అది పచ్చి అబద్ధం అని, తన పై లేనిపోని ఆరోపణలు చేసిన హర్షకుమార్ పై పరువునష్టం దావా వేస్తానని అవంతి హెచ్చరించారు.

తమ వాదన కరెక్ట్ అని ప్రజలకు చెప్పటానికి, జగన్ ప్రభుత్వం గత మూడు నెలలుగా నానా తంటాలు పడుతుంది. ఎలాగైనా చంద్రబాబు పై అవినీతి ముద్రలు వెయ్యాలని, గత మూడు నెలలుగా తవ్వుతూనే ఉన్నారు. చివరకు జగన్ మోహన్ రెడ్డి, సచివాలయానికి మొదటి సారి వెళ్ళిన సందర్భంలో, గతప్రభుత్వంలో మీకు తెలిసిన అవినీతి ఏమైనా ఉంటే చెప్పండి, మీకు బహుమతులు ఇస్తాను అంటూ ఉద్యోగస్తులకు ఆఫర్ కూడా ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఏమి లేదు. ఇక విద్యుత్ ఒప్పందాల విషయంలో కూడా ఇదే తంతు. ఎదో జరిగి పోయింది అంటూ, కేంద్రం ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా వినకుండా, చివరకు ఏమి దొరక్క, కేంద్రం మాటే వినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా అదే తీరు. ఇప్పుడు అమరావతి టార్గెట్ గా జగన్ పావులు కదపుతున్నారు. రాజధానిలో ఏదో స్కాం జరిగింది అని జగన్ నమ్మకం.

sujana 19092019 2

అందుకే ఇప్పుడు దాని పై ఫోకస్ చేస్తూ, సుజనా చౌదరిని టార్గెట్ చేసారు. సుజనా చౌదరి బీజేపీలో చేరిన దగ్గర నుంచి, జగన్ పై దూకుడుగా మాట్లాడుతున్నారు. ఆయన బీజేపీ కావటంతో, సుజనాను అంతే ధీటుగా సమాధానం ఇవ్వటానికి వైసీపీ ఆలోచిస్తుంది. అందుకే సుజనా పై అవినీతి మరకలు వేసి, సుజనాను సైలెంట్ చెయ్యాలని ప్లాన్ చేసారు. అందుకే సుజనా పై ఒక సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. సుజనాకు కాని, అయన బంధువులకు కాని, అమరావతి ప్రాతంలో భూములు ఉన్నాయా, లేక వారి బినామీలతో ఉన్నాయా అన్న కోణంలో జగన్ ప్రభుత్వం రహస్య విచారణ మొదలు పెట్టింది. గత వారం రోజులుగా దీని పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందు కోసం, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అయిన రెవెన్యూ, సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులను రంగంలోకి దించారు.

sujana 19092019 3

వీరు గత వారం రోజులుగా గుట్టుగా విచారణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని మోగులూరు, మున్నలూరు, బత్తినపాడు, చెవిటికల్లు గ్రామాల పరిధిలో ఒక దర్యప్తు బృందం పర్యటించింది. బుధవారం ఈ బృందాలు అక్కడ గ్రామాల్లో తిరిగి స్థానిక రైతులను, సుజనా భూములు బినామీలు ఏమైనా ఉన్నాయా అనే విషయం ఆరా తీసారు. అలాగే గతంలో జరిగిన భూముల క్రయవిక్రయాల పై సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కంచికచర్ల తహసీల్దార్‌ వి.రాజకుమారిని వివరణ కోరగా, అధికార బృందం వచ్చి విచారణ చేసిన విషయం వాస్తవమే అని చెప్పారు. అయితే, సుజనా చౌదరి పై రాష్ట్ర ప్రభుత్వం, కావాలని నిఘా పెట్టి, ఇబ్బందుల్లోకి నేట్టటానికి ట్రై చేస్తుంటే, బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా ? తరువాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది వేచి చూడాలి.

గోదవరిలో బోటు ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయ్యింది. ఇప్పటికీ ఇంకా కొన్ని మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. మృతదేహాలు వాటంతట అవి కొట్టుకుస్తుంటే, ఇప్పటి వరకు 33 మంది మృతదేహాలను కనుకున్నారు. ఇంకా 13 మృతదేహాల కోసం గాలింపు చేస్తున్నారు. అయితే అవి బోటులోనే ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది. మరో పక్క దాదపుగా నాలుగు రోజులు అవుతూ ఉండటంతో, మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా అయిపోతున్నాయి. మిగతా మృతదేహాలు కనుక తొందరగా దొరక్కపొతే, అవి గుర్తుపట్టలేని విధంగా అయిపోయే ప్రమాదం ఉంది. అయితే ఈ మృతదేహాలు బోటులోని ఏసి గదిలో చిక్కుకున్నాయా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, ఈపాటికే మృతదేహాలు పైకి తేలేయి. ఇప్పటికీ అవి కనిపించకపోవటంతో, బోటు తీస్తే కాని, ఆ మృతదేహాలు కనిపించే అవకాసం లేదని చెప్తున్నారు.

boat 18092019 2

అయితే బోటు తీసే విషయంలో అధికారులు చేతులు ఎత్తేసారు. ఈ ప్రమాదంలో మునిగిపోయిన బోటు గోదావరి నదిలో దాదాపు 315 అడుగుల లోతులో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అంత కిందకు వెళ్లలేమని చేతులు ఎత్తేసారు. చివరకు నేవీ వాళ్ళు కూడా కుదరదని చెప్పేసారు. ముఖ్యంగా నౌకాదళానికి చెందిన ఉన్నతాధికారి దశరథ్‌ , ఇలాంటి ఘటనలలో బోటును వెలికి తియ్యటంలో అనుభవం ఉంది. ఆయన వస్తే, బోటు బయటకు వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. దీంతో దశరథ్‌ ను మంగళవారం రప్పించారు. ఆయన ప్రమాద ప్రాంతానికి వెళ్లి అక్కడ పరిస్థితులు పరిశీలించారు. గోదావరి నదిలోకి 150 అడుగుల లోతు దాకా వెళ్లేందుకే తమకు అనుమతి ఉందని, అంతకుమించి కిందకు వెళ్ళలేమని ఆయన తేల్చి చెప్పారు.

boat 18092019 3

ఇన్ని రోజులు గడిచిన తరువాత, అంత లోతులో ఎవరూ బ్రతికే అవకాసం ఉండదు కాబట్టి, సాహసం చేసేందుకు తమకు అనుమతులు ఉండవని ఆయన చెప్పారు. అయితే మరో పక్క, అధికారులు మరో పధ్ధతిలో బోటు తియ్యటానికి ప్రయత్నం చేసే విధానం గురించి ఆలోచించారు. కొన్నేళ్ల కిందట బలిమెల రిజర్వాయరులో భద్రతా బలగాలతో కూడిన బోటు మునిగిన సమయంలో బోటు ఎలా తీసామో, అలా తీద్దామని ప్రయత్నం చేసారు. కాని, ఇక్కడ పరిస్థితిలో అది కుదరదని, అంచనాకు వచ్చారు. అందుకే మృతదేహాలు వాటంతట అవి పైకి తేలితేనే అవి దొరికినట్టు అని, బోటులో కనుక ఉంటే, అవి తియ్యటం చాలా కష్టం అనే అంచనాకు అధికారులు వచ్చారు. అయితే ఇంకా మృతదేహాలు దొరకని బంధువుల ఇబ్బందులు మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయి. కనీసం మృతదేహాలు అయినా ఇవ్వమని కోరుతున్నారు.

 

 

ఈ రోజుల్లో, సహజంగా రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నేతలు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. ఏదైనా చిన్న సంఘటన జరిగినా, వారిని ట్రాప్ చేసి, అల్లరి అల్లరి చేసి, వారిని రాజకీయంగా దెబ్బ వేసి, తీవ్రంగా వేధిస్తారు. ఇందుకు ఉదాహరణే కోడెల ఉదంతం. ఒక చిన్న ఫర్నిచర్ కేసు, అదీ కోడెల అధికారంలో ఉండగా, తనకు హక్కుగా వచ్చింది వాడుకున్నారు. అధికారం దిగిపోగానే, రెండు ఉత్తారాలు రాసారు. దాన్ని ఇప్పటి స్పీకర్ కార్యాలయం అక్నాలేడ్జ్ కూడా చేసింది. అయినా తరువాత ఆయన పై కేసు పెట్టారు. కోడెల కోరినట్టు ఫర్నిచర్ తీసుకు వెళ్ళకుండా, ఆయన పై ఎదురు కేసు పెట్టారు. సహజంగా ఇలాంటివి, ఏ రాజకీయ నాయకుడు దగ్గర నుంచి అయినా రికవర్ చేసుకుంటారు, లేకపోతే డబ్బులు కట్టించుకుంటారు. కాని, ఇక్కడ అది ఏమి చెయ్యకుండా, దొంగ దొంగ అంటూ కేసులు పెట్టి అవమానించారు.

kodela vs 18092019 2

అయితే ఈ సందర్భంలోనే, కోడెల, వైసీపీ నేతల మధ్య ఇది వరకు జరిగిన సంఘటనలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, కోడెల మధ్య జరిగిన సంఘటన. కోడెల స్పీకర్ గా ఉండగా, వైసిపీ నేతలకు కావాల్సిన పనులు చేసి పెట్టారు. కాని కోడెల ను టార్గెట్ చేస్తున్న సమయంలో ఒక్కరు కూడా మాట్లాడలేదు. వ్యతిగత ఇమేజ్ దెబ్బ తీస్తున్నారని, ఇది మంచిది కాదని, వారికి వర్తమానం పంపినా, వారి నుంచి సమాధానం లేదు. ఇక విజయసాయి రెడ్డి విషయానికి వస్తే, ఆ రోజు కోడెల కనుక చూసి చూడనట్టు వెళ్ళకపోయి ఉంటే, ఈ రోజు విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యే వారు కాదు. ఇదే విషయం స్వయంగా కోడెల చెప్పారంటూ, ఈ రోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే, విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసారు.

kodela vs 18092019 3

రిటర్నింగ్‌ అధికారిగా అసెంబ్లీ అధికారి ఉన్నారు. ఈ సమయంలో, విజయసాయి రెడ్డి నామినేషన్ లో తప్పులు ఉన్నాయని, ఆయన్ను నామినేషన్ తిరస్కరించాలని, ఫిర్యాదులు వచ్చాయి. దీంతో విజయసాయి వెంటనే రంగంలోకి దిగి, కోడెలతో మాట్లాడి, అవి చిన్న చిన్న తప్పులు అని, వాటి కోసం నామినేషన్ తిరస్కరించవద్దు అని కోరారు. దీంతో కోడెల రంగంలో దిగి, రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న అసెంబ్లీ అధికారితో మాట్లాడి, చిన్న చిన్న ఫిర్యాదులు ఆధారంగా నామినేషన్‌ తిరస్కరించడం సరికాదని, రాజకీయంగా మేము మేము చూసుకుంటాం అని, విజయసాయి నామినేషన్‌ ఒకే అయ్యేలా చూసారు కోడెల. అయితే ఇప్పుడు ప్రభుత్వం వేధిస్తున్న విధానం చూసి, ఇలా చెయ్యటం మంచిది కాదని, కోడెల తనకు తెలిసినవారితో విజయసాయిరెడ్డితో మాట్లాడించారు. అయితే అప్పటి నుంచి, విజయసాయి ట్విట్టర్ లో ఇంకా హీనంగా కోడెల పై రాతలు రాయటం మొదలు పెట్టటంతో, కోడెల నివ్వెరపరపోయారు. వైసీపీ ప్రత్యర్ధులను వేటాడి వెంటాడు తుంటే, తెలుగుదేశం మాత్రం అధికారంలో ఉండగా, జాలి గుండెలతో వైసీపీ నేతలకు సహాయం చేసారు. రెండు పార్టీల రాజకీయానికి ఇదే తేడా.

Advertisements

Latest Articles

Most Read