ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ చనిపోయిన విధానం పై, ఆయన పై ప్రభుత్వ వేధింపులే కారణం అని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రూపాయి తీసుకుని వైద్యం చేసిన కోడెల, కేవలం ఫర్నిచర్ విషయంలో ఎదో చేసారు అంటూ, వైసిపీ కావాలని చేసిన విష ప్రచారం వల్ల, ఆయన తీవ్ర అవమానానికి గురై, బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఇదే విషయం పై తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ నేతలు సత్యప్రసాద్‌, మద్దాలి గిరి, కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎల్‌.రమ ణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ లో, కేంద్రం హోం సహాయ మంత్రి జి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం నడుస్తుందని ఫిర్యాదు చేసారు.

kishan 18092019 1

జగన్‌ ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని, కోడెలపై 19 అక్రమ కేసులు పెట్టి ఆయన్ను వేధించిందని, అది తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఈ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఈ దుర్మార్గపు ప్రభుత్వం పై, దీనికి కారణం అయిన వారి పై కేసు పెట్టాలని అన్నారు. అయితే ఇవన్నీ వని, కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కేంద్రానికి ఇప్పటికే, కొన్ని ఫిర్యాదులు అందాయని అన్నారు. రాష్ట్ర పోలీసులు, అక్కడ ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వచ్చాయని అన్నారు. ఈ విషయం పై కేంద్రంతో దర్యాప్తు చేయిస్తామని తెలిపారు.

kishan 18092019 1

కోడెల లాంటి మహా నాయకుడు ఇలా మృతిచెందడం చాలా బాధగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కోడెలతో తనకు వ్యక్తిగత సంబధాలున్నాయని కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏ కుటుంబంలో ఇలా జరగొద్దని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టాలను గౌరవించాలి కాని, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని హిత వుపలికారు. కోడెల విషయం పై, రెండు రాష్ట్రాల డీజీపీల నుంచి నివేదికలలను కేంద్రం తెప్పించుకుంటుందని అన్నారు. కోడెల మృతి పై రెండు రాష్ట్రాలు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. కోడెల మృతి విచారణ అంశాన్ని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని, కోడెల మృతిపై కేంద్రమే పూర్తిస్థాయిలో విచారణ జరిగేలా కూడా చూస్తామని వెల్లడించారు కిషన్ రెడ్డి.

మాజీ స్పీకర్, మజీ మంత్రి అయిన కోడెల శివ ప్రసాద్ చనిపోవటానికి, గత మూడు నెలలుగా జగన్ ప్రభుత్వం, వెంటాడి, వేటాడి, కోడెలను మానసిక క్షోభకు గురి చెయ్యటమే కారణం అని, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, టిడిపి పార్టీ కార్యకర్తలకు, కోడెల అభిమనులకు కోపం తెప్పించేలా చేసింది. ఒక పక్క వేధిస్తూనే, మరో పక్క కోడెల అంత్యక్రియలకు, ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని జగన్ ఆదేశించటం వీరి ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ రోజు కొంత మంది రెవిన్యూ, పోలీస్ అధికారులు, కోడెల ఇంటికి వచ్చి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చెయ్యమని జగన్ ఆదేశించారని చెప్పారు. అయితే, వారు తీవ్ర ఆవేదనకు గురై, ఆ అధికారులకు దండం పెట్టి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని, మీ ప్రభుత్వం వద్దు మీరు వద్దు, అభిమానులు, కార్యకర్తల మధ్య ఆయనకు కడసారి వీడ్కోలు పలుకుతాం అని అన్నారు.

kodela 18092019 2

అయితే చంద్రబాబు వచ్చిన వెంటనే, ఈ విషయం పై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాసం ఉంది. ఒక పక్క అంతిమయాత్రలో 144 సెక్షన్ పెడుతూ, ఇప్పుడు అధికార లాంచనాలా అంటూ, నిన్న చంద్రబాబు ఫైర్ అయిన తరువాత, నిన్న 144 సెక్షన్ ఎత్తేస్తున్నాం అని పోలీసులు ప్రకటించారు. అయితే, ఇప్పుడు అధికార లాంఛనాలతో చేస్తారా లేదా అనేది చంద్రబాబు నిర్ణయం పై ఆధార పడి ఉంటుంది. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని చంద్రబాబు ఒప్పుకుంటారా, లేక కోడెలకు సరైన గౌరవం ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వ లాంచనాలతో చెయ్యాలని, కుటుంబ సభ్యులను ఒప్పిస్తారా అనేది చూడాలి. అయితే అక్కడ కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం, ఈ ప్రభుత్వమే హత్య చేసి, ఇప్పుడు ఇలా వద్దు అని అంటున్నారు.

kodela 18092019 3

అంతకుముందు, అభిమానుల సందర్శనార్థం హైదరాబాద్‌లోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో కోడెల పార్థివదేహాన్ని ఉంచారు. మంగళవారం ఉదయం అక్కడ నుంచి అంబులెన్సులో గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. నిన్న అంతా జోరు వాన కురుస్తున్నా, లెక్క చేయకుండా అంబులెన్స్‌ వెళ్లే దారిపొడవునా ప్రతి ఊరిలో ఆయనకు నివాళులు అర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా కోడెల పార్థివదేహంతో కలిసి హైదరాబాద్‌ నుంచి గుంటూరు పార్టీ ఆఫీస్ వరకూ వచ్చారు. కొద్ది సేపు పార్టీ ఆఫీస్ లో ఉంచిన తరువాత, కోడెల పార్థివదేహాన్ని నరసరావుపేటలోని ఆయన నివాసానికి తీసుకు వచ్చారు. ఈ రోజు సాయంత్రం, 3 గంటలకు ఆయన అంత్యక్రియలు జరిగే అవకాసం ఉంది.

నవ్యాంధ్ర మొదటి స్పీకర్, మాజీ హోం మంత్రి, అలాగే ఇరిగేషన్, హెల్త్, సివిల్ సప్లైస్ లాంటి కీలక శాఖలకు మంత్రిగా పని చేసిన కోడెల శివప్రసాద్ మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా తప్ప, అన్ని కీలక శాఖలు చేసి, ఎంతో సేవ చేసిన కోడెల బలవంతంగా చనిపోవటం అందరినీ కలిచి వేసింది. నేటి రాజకీయంలో, సిగ్గు, మానం, అభిమానం లాంటి పదాలకు అడ్డ్రెస్ లేదు అనుకుంటున్న టైంలో, తనకు జరిగిన అవమానానికి ఆయాన చనిపోయారు అంటే ఎంతో బాధాకరం. ఒకప్పుడు పెత్తందారి వ్యవస్థకు తాను ఒక్కడే ఎదురు వెళ్లి, వాళ్లకి గుండె చూపించిన కోడెల, ఈ రోజు కావాలని వెంటాడి, వేటాడి, అవమానాలు చేసినందుకు, ఇంత జీవితంలో నాకు లభించే గౌరవం ఇంతేనా ? ఈ వేధింపులతో ఇక్కడ ప్రశాంతంగా ఉండలేను, కనీసం మరణంలో అయినా ప్రశాంతత చూసుకుంటాను అంటూ, తనకు ఇష్టమైన ఆ శివయ్య దగ్గరకే వెళ్ళిపోయారు.

cbn 17092019 2

అయితే కోడెల మరణం పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 72 ఏళ్ళ వయసులో, ఆయన పై వ్యక్తిగత కక్ష తీర్చుకుని, ఆయన్ను మానసికంగా క్షోభ పెట్టి, గుచ్చి గుచ్చి, అవమానాల పాలు చేసి, తమ మీడియాలో ఆయాన ప్రతిష్ట దిగజారేలా, ఆయనే చనిపోయేలా చేసారని అన్నారు. దీనికి సంబంధించి ఆధారాలు కూడా చంద్రబాబు తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆయన ఈ రోజు కేసులకు సంబంధించి ఒక పోస్ట్, అలాగే ఆయన పై నమోదైన ఫర్నిచర్ కేసు గురించి వివరాలు ఇచ్చారు. రెండు నెలల్లో కోడెల పై 19 కేసులు పెట్టారని, ఇవన్నీ గత మూడేళ్ళలో జరిగాయని అంటున్నారని, కాని వేటిలోను అవి, ఎప్పుడూ జరిగాయో కనీసం తేదీ కూడా చెప్పలదని అన్నారు. కోడెల పై వ్యతిరేకంగా కేసులు వేయాలని ట్విట్టర్‌లో, పేపర్‌లో ప్రకటనలు చేసి, సాక్షి పేపర్‌లో పదేపదే కోడెలను విమర్శిస్తూ కథనాలను రాయించారని చంద్రబాబు అన్నారు.

cbn 17092019 3

అలాగే ఫర్నిచర్ కేసు పై చంద్రబాబు స్పందిస్తూ, ఇలా ట్వీట్ చేసారు "రూ.43వేల కోట్లు దోచుకున్నారని సీబీఐ అభియోగాలున్న వ్యక్తి,11 చార్జిషీట్లలో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సిన వ్యక్తి... కేవలం రూ.లక్ష, రెండు లక్షలు విలువైన ఫర్నిచర్‌ విషయంలో కోడెల శివప్రసాదరావుపై కేసులు పెట్టడం, ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం శోచనీయం. పల్నాటి పులి అని పిలువబడ్డ ఒక సీనియర్ రాజకీయ నేతకే ఇలాంటి పరిస్థితి తెచ్చారంటే ఇలాంటి ఉన్మాదంతో కూడుకున్న పాలనలో రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఎంతమందిని చంపుకుంటూ పోతారు? కోడెల తప్పు చేసి చనిపోలేదు, వేధింపులకు గురై చనిపోయారు. ఈ ప్రభుత్వ హత్యమీద సీబీఐ విచారణ జరగాలి." అని ట్వీట్ చేసారు.

గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో, భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఘటన జరిగి రెండు రోజులు అయినా, ఇంకా అందరినీ కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు జగన మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి, బాధితులను హాస్పిటల్ లో పరామర్శించారు. తరువాత అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. అయితే ఈ సందర్భంలో అక్కడ అధికారులు ప్రవర్తించిన తీరుతో జగన్ అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనే గౌరవం కూడా అధికారులకు లేనట్టు ఉంది. అందుకే అక్కడ జగన్ ఉన్నా, ఆయన ముందే, తప్పు నీది అంటే నీతి అంటూ, అధికారులు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, తప్పు నెట్టేసే ప్రయత్నం చేసుకున్నారు. ఈ తతంగం అంతా చూస్తున్న జగన్, ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో అవాక్కయి, తేరుకుని, అక్కడ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

jagan 17092019 2

కాకినాడ పోర్టు అధికారులు మాట్లాడుతూ, తాము బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ మాత్రమే చూసుకుంటూ ఉంటామని చెప్పారు. అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే, పాపికొండల పర్యాటకానికి బోట్లు వెళ్లకుండా, వారం రోజుల నాడే అనుమతులు రద్దు చేశామని పర్యాటక శాఖ చెప్పింది. పర్యాటక శాఖ అధికారులు చెప్తూ ఉండగానే, నీటి పారుదల శాఖ అధికారులు స్పందిస్తూ, తమ అధికారాలను కత్తిరించారని ఆరోపించారు. ఇలా బోటు ప్రమాదానికి తాము కారణం కాదంటే, తాము కారణం కాదంటూ అధికారులు వాదులాడుకోగా, అసలు ఎవరూ అనుమతి ఇవ్వకుండా, బోటు ఎలా కదిలిందని జగన్ నిలదీశారు. బోట్లను ఎందుకు తనిఖీ చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

jagan 17092019 3

మరో పక్క, ప్రమాదానికి గురైన బోటు కచ్చులూరు వద్ద 200 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పడవ ప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 24 మృతదేహాలు వెలికితీశారు. ఇంకా 23 మంది గల్లంతు అయ్యారు. వారి కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దొరికిన మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించారు. అయితే మిగతా 23 మంది బోటులోనే ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఆ బోటుని బయటకు తియ్యాలి అంటే, మరో 2-3 రోజులు పైనే పట్టచ్చు. ఎందుకంటే 200 అడుగులో బోటు ఉంటే, వీళ్ళు 60 అడగులకు కూడా వెళ్ళలేక పోతున్నారు. సుడిగుండాలు ఎక్కువగా ఉండటం కారణంగా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిలో బోటు ఎప్పటికి బయటకు తీస్తారో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read