తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో దాదపుగా 50 మంది పర్యాటకుల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆదివారం కావడంతో విహారానికి వెళ్లిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాష్ట్ర ప్రజల్లో ఈ ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇప్పుడు ఈ సంఘటన గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిన్న కూడా ఇలాగే ఒక పెద్ద బొట్ లో, 50 మందిని గోదావరి పర్యటకానికి తీసుకువెళ్ళారు. గోదావరి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న సమయంలో, ఇలా బొట్ లో వెళ్ళటంతో, నిన్నే అందరూ హెచ్చరించారు. ఈ విషయానికి సంబంధించి ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ లో, కూడా వార్త వచ్చింది. పాపికొండల విహారానికి ప్రమాదకర పరిస్థితుల నడుమ బోట్లు వెళ్తున్నాయని, నదీ విహారానికి ఈ సమయంలో వెళ్తే ప్రమాదం అని ఆ కధనంలో రాసింది.

paper 15092019 1

అధికారులు అక్కడ ఉన్నా సరే, ఆ బోట్‌ను అడ్డుకోకుండా, ఆపే ప్రయత్నం కూడా చెయ్యలేదని ఆ కధనం సారాంశం. ఇప్పటికీ, గోదావరి వరదలతో, దేవీపట్నం మండలంలో ఇంకా 36 గ్రామాలు జలదిగ్భంధనంలోనే ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పాపి కొండల విహారానికి వెళ్తే, ప్రమాదం అని ఆంధ్రజ్యోతి తన కధనంలో రాసింది. ఇంత వరద ఉన్నా కూడా, 50 మందితో బోటు వెళ్తే, అధికారులు ఎవరు పట్టించుకోలేదని, ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే, అధికారులు మేల్కునాలి అంటూ ఆంధ్రజ్యోతి కధనం రాసింది. అయితే ఈ కధనం రాసిన 24 గంటల్లోనే, అతి పెద్ద విషాద ఘటన జరిగింది. ఇప్పిటికీ 50 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే ఇంతటి విషాద ఘటన చూసిన ప్రజలు, ఆంధ్రజ్యోతి కధనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

paper 15092019 1

ఆంధ్రజ్యోతి ముందే హెచ్చరించినా, ఎవరూ పట్టించుకోలేదని, ఈ కధనాన్ని ఏ ఒక్క అధికారి చూసినా, ఈ రోజు ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు జగన్ మోహన్ రెడ్డి గారు ఆ పత్రికను, ఛానల్ ను కనపడకూడదు అని అప్రకటిత నిషేధం విధించటంతో.. పాలకపక్షం నాయకులు / అధికారులు బహుశా దీన్ని చూసిఉండరేమో అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే జగన్ గారు, మీడియా లేదా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, అధికారంలో ఉన్నవారు తమ పనితీరుని మెరుగుపరుచుకోవటం లేదా సరిదిద్దుకోవటం కోసం వాడాలి తప్పితే, విమర్శలు వచ్చాయి అని కనపడకూడదు / వినపడకూడదు అంటూ, అది స్వయంగా / సొంతంగా మీడియా అధిపతి అయినా జగన్ గారే ఇలా చేయటంతో, జరిగే తప్పులు ప్రభుత్వానికి తెలిసే అవకాసం లేదని ప్రజలు అనుకుంటున్నారు.

గోదావరిలో జరిగిన పెను విషాదం పై, మరో సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రమాదానికి గురైన బోటుకు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ప్రభుత్వం చెప్తుంది. రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నారని, ఆయన కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి అని ప్రభుత్వ వరాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఎలాంటి బోటు అయినా, దేవీపట్నం దగ్గర పోలీసులు చెక్ చేస్తారు. ఇక్కడ కూడా అక్కడ పోలీసులు చెక్ చేసి పంపించారని వార్తల్లో చెప్తున్నారు. మరి ఎలాంటి అనుమతులు లేని బోటుకు, అక్కడ పోలీసులు ఎందుకు వదిలి పెట్టారు ? కేవలం సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు మాత్రమే చూస్తారా ? అనుమతులు ఉన్నాయా లేవా అనేది చూడరా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మరోసారి, ఇలాంటి ఘటనలలో, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం బయట పడింది.

boat 15092019 2

మరో పక్క ఉదయం 10:30 కు సంఘటన జరిగితే, ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు చేపట్టలేదని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళటానికి తీవ్రమైన ఇబ్బందులు ఉండటంతో, నేవీ సహాయం తీసుకోవాలని చూస్తున్నారు. హెలికాప్టర్ వచ్చినా, వాళ్ళు సహాయక చర్యలు చేసేది ఏమీ ఉండదు. ఏజెన్సీ ప్రాంతం కావటంతో, అక్కడకు వెళ్ళటానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోటులో పాపికొండల పర్యాటకానికి వెళ్లిన వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 16 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నట్లు సమాచారం. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అక్కడ, స్థానికులు మాత్రమే గాలింపు చర్యలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళటానికి, ఇంకా సమయం పట్టే అవకాసం ఉంది.

boat 15092019 3

మరో పక్క, దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర జరిగిన బోటు ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాపికొండలకు వెళ్తూ పర్యాటకులు, సిబ్బంది ప్రమాదానికి గురికావడం బాధాకరం అన్నారు. జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. అలాగే బోటు ప్రమాదంపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాన్ స్పందించారు. బోటు ప్రమాదంలో సుమారు 50 మంది గల్లంతయ్యారనే విషయం బాధ కలిగించిందన్న పవన్.. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు తక్షణం ఘటనాస్థలానికి వెళ్లాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో పక్క తాడేపల్లి నుంచి జగన్ మోహన్ రెడ్డి కూడా పరిస్థితిని ఎప్పటికపుడు అడిగి తెలుసుకుంటున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని హౌసింగ్ ప్రాజెక్టుల కోసం అమరావతిలో తరహా ల్యాండ్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నల్లో ఉంది. అమరావతిలో రాజధాని కోసం 34,010 ఎకరాల భూమిని ఇవ్వడానికి సుమారు 28,074 మంది రైతులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ దేశ వ్యాప్తంగానే కాక, ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుకి మంచి పేరు తెచ్చి, అందరికీ ఒక రోల్ మోడల్ గా నిలించింది. ఎక్కడైనా ఒక ఎకరం భూమీ ప్రభుత్వాలు తీసుకోవాలి అనుకుంటే, నానా హంగామా చేస్తే కాని రాదు. అలాంటిది ఎక్కడా చిన్న ఆందోళన కూడా లేకుండా 33 వేల ఎకరాలు ఇవ్వటంతో, దేశ వ్యాప్తంగా ఈ విధనాననికి ప్రాచుర్యం వచ్చింది. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ కేటాయించిన ప్రాంతాల్లో సుమారు 76 లక్షల మంది జనాభాకు 17 లక్షల గృహాలను నిర్మాణం చెయ్యటానికి, ఇప్పుడు ఇలాంటి విధానాన్ని అక్కడ ప్రభుత్వం అమలు చేస్తుంది.

pooling 14092019 2

ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా గ్లోబల్ స్టాండర్డ్స్ ప్రకారం నగరం యొక్క పునరాభివృద్ధిని జరుగుతుందని కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా, భూమిని సమీకరించటం చాలా తేలిక అని, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన సమర్థవంతమైన విధానం అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో జరిగే ఈ కార్యక్రమం వల్ల పట్టణాభివృద్ధి వేగంగా సాగుతుందన్నారు. శుక్రవారం ఢిల్లీలో ‘భూసమీకరణ: ఇండియా కేపిటల్‌ నిర్మాణం- రియల్‌ఎస్టేట్‌, మౌలికవసతులరంగంలో అవకాశాలు’’ అన్న అంశంపై ఢిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

pooling 14092019 3

ల్యాండ్ పూలింగ్ విధానం కింద దిల్లీలో సమీకరించే భూమిలో 17 లక్షల నివాసాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో 5 లక్షల ఇళ్లను ఆర్థికంగా వెనకబడినవారి కోసం అందజేస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ఏదేమైనా, అమరావతిలో చంద్రబాబు నాయుడు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం కూడా భూ యజమానులకు, ఈ విధానం ద్వారా విశ్వాసం కలిగించగలదు. అయితే చంద్రబాబు ప్రవేశపెట్టిన విధానం, ఆయాన ముందు చూపును తెలియ చేస్తుంది. చంద్రబాబు ఏమి చేసినా ఒక విజన్ తో చేస్తారని చెప్పటానికి ఈ విధానం ఒక ఉదాహరణ. చంద్రబాబు చేసిందే, ఎప్పటికైనా దేశం మొత్తం పాటిస్తుంది. కాని బాధాకరమైన విషయం ఏమిటి అంటే, సొంత రాష్ట్ర ప్రజలు మాత్రం చంద్రబాబు విజన్ ని గుర్తించటంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు. తరువాత బాధపడతారు.

ఆదివారం పూట రాష్ట్ర ప్రజలకు విషాద వార్త. గోదావరి నదిలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మంద సమీపంలో పర్యాటక బోటు ప్రమాదానికి గురైంది. బోటు పూర్తిగా మునిగిపోయినట్టు సమాచారం. ఈ బోటులో 61 మందికి పైగా ఉన్నారని సమాచారం. వీరిలో 50 మంది పర్యాటకులు, మిగతా 11 మంది బోటు సిబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల టూర్‌కు వెళ్తున్న సమయంలో, ఈ ఘటన జరిగింది. అయితే లైఫ్‌ జాకెట్లు వేసుకున్న వారిలో 14 మంది సురక్షితంగా అక్కడి గ్రామస్తులు బయటకు చేరుకున్నారు. లైఫ్‌జాకెట్లు వేసిన వారిని స్థానికులు పడవల్లో వెళ్లి వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. ఇంత వరద ఉద్ధృతి ఉంటే బోటుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రత్యక్షసాక్షులు ప్రశ్నిస్తున్నారు.

godavari 15092019 1

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేందుకు పయనమయ్యారు. మరో పక్క చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుభ్రమణ్యం, అక్కడ కలెక్టర్ తో మాట్లాడి సహయక చర్యలు పై అరా తీసారు. రాజమండ్రి నుంచి ఒక హెలికాప్టర్ కూడా సహాయక చర్యల కోసం వెళ్లినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావటంతో, అక్కడ ఏమి జరిగిందో తెలియటం లేదు. కమ్యూనికేషన్ లేకపోవటంతో, సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. మరో పక్క అక్కడకు వెళ్ళటానికి రోడ్ మార్గం కూడా లేదని తెలుస్తుంది. లాంచీల్లోనే అక్కడకు వెళ్ళే అవకాసం ఉందని సమాచారం. విషయం తెలియటంతో, అధికారులు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి బయలుదేరారు.

godavari 15092019 1

గోదావారి తీవ్రత ఎక్కువగా ఉండటం, ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో, గల్లంతైన వారు క్షేమంగా ఉంటారో లేదో అని అక్కడ గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇంత వరదలో, అసలు పర్యాటక బోటు ఎలా వెళ్ళింది ? అసలు ఇది వెళ్ళటానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ? ఇంత ఫ్లో లో, అక్కడ ఇళ్ళు మునిగిపోతుంటే, అలాంటి చోటకు ఎలా అనుమతులు ఇచ్చారు అనే విషయాల పై అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు అప్పుడు, పర్యాటక శాఖ పై ఎన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటి నుంచి కూడా పర్యాటక శాఖ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని ఈ సంఘటనతో తెలుస్తుంది. ఏది ఏమైనా, నష్టం తక్కువ ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం.

Advertisements

Latest Articles

Most Read