స్విట్జర్లాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన సింధుని, నిన్న రాష్ట్ర ప్రభుత్వం సాన్మానించింది. ఇది జరిగి దాదపుగా రెండు వారల పైన అవుతుంది. సింధు ఇండియా వచ్చిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యామంత్రి కేసిఆర్ తో పాటు, మిగతా ప్రముఖులు కూడా సింధుని సన్మానించారు. అయితే సింధుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంత వరకు సన్మానించక పోవటంతో, సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. అయితే నిన్న ఎట్టకేలకు, సింధుని సన్మానించింది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ మోహన్ రెడ్డికి ఇన్నాళ్టకు ఫ్రీ అవ్వటంతో, సింధుకి అప్పాయింట్మెంట్ ఇచ్చారు. సింధుని సన్మానించి, విశాఖలో అకాడమీ కోసం ఐదు ఎకరాలు ఇస్తున్నట్టు ప్రకటించారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఇస్తునందని చెప్పారు.

sindhu 14092019 2

అయితే సింధుతో పాటు, సింధుని తీర్చి దిద్దిన కోచ్ పుల్లెల గోపీచంద్ లేకపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే, సింధుని ఎప్పుడు, ఎవరు సన్మానం చేసినా, కోచ్ గా ముందు గోపీచంద్ ను అభినందిస్తూ ఉంటారు. మొన్న సింధు, ప్రధాని మోడీని కలిసిన సమయంలో కాని, అలాగే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన సందర్భంలో కాని, గోపీచంద్ కూడా సింధు పక్కనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే జగన మోహన్ రెడ్డిని కలిసిన సమయంలో, గోపీచంద్ లేకపోవటంతో, రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. ఆయన అందుబాటులో లేకపోవటంతో, జగన్ మోహన్ రెడ్డిని కలవటానికి కుదరలేదని చెప్పారు. అయితే దీనికి వేరే కారణం ఉండనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

sindhu 14092019 3

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో బ్యాడ్మింటన్ అకాడమీ కోసం స్థలం ఇచ్చారు. అయితే తరువాత సియం అయిన రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు ఇచ్చిన స్థలాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నం చెయ్యటంతో, అది పెద్ద వివాదాస్పదం అయ్యింది. ఒకటి రెండు ఇంటర్వ్యూ ల్లో, గోపీచంద్ కూడా ఇదే విషయం చెప్పారు. కోర్ట్ ల్లో పోరాడి ఆ స్థలం సాధించామని, సింధు కూడా ఈ అకాడమీలోనే శిక్షణ పొందిందని చెప్పారు. అయితే ఇది మనసులో పెట్టుకుని, జగన్ వద్దకు గోపీచంద్ రాలేదా ? లేకపోతే ప్రభుత్వం తరుపున ఆయనకు పిలుపు అందలేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి సింధుని ఇన్నాళ్ళు ఎందుకు సన్మానం చెయ్యలేదు ? దేశం గర్వించే ఇలాంటి ఆడ పిల్లలను ప్రోత్సహించాలి కదా అనే విమర్శలకు చెక్ పెడుతూ ప్రభుత్వం నిన్న సింధుని సన్మానించినా, గోపి చంద్ లేకపోవటంతో, ఇది మరో చర్చకు దారి తీసింది.

గోరంతను కొండత చేసి చూపించి, చివరకు సెల్ఫ్ గోల్ వేసుకోవటం రాజకీయ నాయకుల స్టైల్. ఇందులో వైసీపీ రెండు ఆకులు ఎక్కువే చదివింది. ఇలా అతి ప్రచారం చేసి, చివరకు వారి మెడకే చుట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాగే ఫేస్బుక్ లో అతి ప్రచారం చేసి, తమ ప్రభుత్వానికి, తమ అధినేత జగన్ కు మంచి పేరు తీసుకువద్దాం అనుకుని, ఆయన బుక్ అయ్యింది కాక, తన ప్రభుత్వాన్ని, తమ అధినేత జగన్ ను కూడా బుక్ చేసి, అభాసుపాలు అయ్యారు. ఆ ఎమ్మెల్యే శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఎన్నికైన సీదిరి అప్పలరాజు. ఎంతో కష్టపడి, నిజాయతికి మారు పేరు అయిన సర్దార్ గౌతు లచ్చన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన మనవరాలు శిరీష పై గెలుపొందారు. అయితే అంతటి గొప్ప ఘన విజయం సాధించిన అప్పలరాజు, మరీ అతి ప్రచారం చేసి, ఇప్పుడు ఇబ్బందులు పాలు అయ్యారు.

appalraju 14092019 2

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, అలాగే నాణ్యమైన బియ్యం పధకాల పై, ప్రజలకు ప్రచారం చేయాలనీ, ఇది ఎంతో గొప్ప వ్యవస్థ, బియ్యం ఎంతో బాగున్నాయి అని చెప్దాం అనుకుని బుక్ అయిపోయారు. ఒక రేషన్ బియ్యం బస్తా ముందు పెట్టి, తన ఫ్యామిలీ మొత్తాన్ని ఉంచి, ఒక మాంచి ఫోటో ఒకటి దిగి, అది సోషల్ మీడియాలో పెట్టారు. చూసారా, ఈ వ్యవస్థ ఎంత గొప్పగా పని చేస్తుందో అని చెప్పాలని, ఆయన ఉద్దేశం. అయితే ఆ ఫోటో సాక్షిగా వచ్చే ముప్పుని, విమర్శలని గుర్తించలేక పోయారు. ఆ ఫోటో పెట్టగానే, నెటిజెన్ లు ప్రశ్నలు మీద ప్రశ్నలు అడగటం మొదలు పెట్టారు. అసలు మీకు తెల్ల రేషన్ కార్డు ఎలా వచ్చింది ? మీరు డాక్టర్ కదా, మీరు తెల్ల రేషన్ కార్డు, కోటా బియ్యం తీసుకునేంత పేద వారా ?

appalraju 14092019 3

ఒకవేళ ప్రభుత్వం పొరపాటున ఇచ్చినా, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఎందుకు తీసుకున్నారు ? ఇలా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసారు. ఇదేనా మీ ప్రభుత్వం విధానం ? పేదలకు ఇవ్వకుండా, మీలాంటి వారికి రేషన్ బియ్యం అవసరమా అంటూ సామాన్య ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ విమర్శల పై అప్పల రాజు స్పందిస్తూ, రేషన్ కార్డు తాను తీసుకోలేదని, తనకు అవసరం అయ్యి 2009లో తెల్ల కార్డ్ తీసుకున్నా అని, ఈ కార్డు ఎప్పుడో 2014లోనే రద్దు అయిపోయిందని, మళ్ళీ ఈ నెల ఎందుకు యాక్టివ్ అయ్యిందో తెలియదని, ఇప్పుడు వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చెయ్యమని కోరతా అని కవరింగ్ ఇచ్చుకోచ్చారు. అయితే ప్రజలు మాత్రం, ఇదంతా ఒక కట్టు కధ అని, ఒక స్క్రిప్ట్ రాసి, జగన్ ప్రభుత్వాన్ని గొప్పగా చెప్దాం అనుకుని, ఇలా బుక్ అయ్యారని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రశంసలు ప్రజల నుంచి రావాలి కాని, ఇలా ఎమ్మెల్యేలు, సొంత స్క్రిప్ట్ తో డబ్బా కొడితే, జగన్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా ?

జగన్ మోహన్ రెడ్డి పై, అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేసారు. ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పారని, ఇప్పటి వరకు ఏది నెరవేర్చలేదని, చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన డబ్బులు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. అంతే కాదు, అసలు జగన్ మమ్మల్ని కలవటానికి ఇష్టపడటం లేదని, తమకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని సంచలన ఆరోపణలు చేసారు. దీంతో మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ వివాదం మళ్ళీ రేగెంది. పాదయాత్ర సమయంలో ఊరు ఊరు తిరిగి, అగ్రిగోల్ద్ బాధితులను దగ్గరకు తీసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి రాగానే, వారికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వటం లేదని అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం అధ్యక్షుడు చేసిన ఆరోపణలు, దుమారం రేపాయి.

agrigold 13092019 2

అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఈ రోజు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముంది అగ్రిగోల్డ బాధితులకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని వెంటనే అమలు చెయ్యాలని డిమాండ్ చ్ద్సారు. జగన్ మోహన్ రెడ్డి తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే, 1150 కోట్లు మంజూరు చేస్తున్నామని, 20 వేల లోపు డిపాజిట్లు ఉన్న వారికి చెల్లింపులు చేస్తాం అని చెప్పారని, కాని అవి మాటల వరకే పరిమితం అయ్యాయని అన్నారు. ఇప్పటి వరకు మూడు నెలలు పైగా గడిచినా, ఈ ఆదేశాలకు సంబంధించి జీవో మాత్రం ఇవ్వలేదని అన్నారు. అలాగే గతంలో చంద్రబాబు ప్రభుత్వం 10 వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రూ.200 కోట్లు మంజూరు చేసిందని, కనీసం ఆ నిధులనైనా విడుదల చెయ్యాలని, జగన్ ప్రభుత్వాని కోరారు.

agrigold 13092019 3

చంద్రబాబు కేటాయించిన 200 కోట్లు అయినా ఇస్తే, 4 లక్షల మందికి న్యాయంజరుగుతుందని, కనీసం అదైనా చెయ్యాలని కోరారు. అలాగే చనిపోయిన వారికీ 10 లక్షలు ఇస్తామని జగన్ అన్నారని, ఆ హామీ కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని అన్నారు. జగన్ మొహన్ రెడ్డి గారు మాకు హామీ ఇస్తూ, గ్రామ, వార్డు వాలంటీర్లు అగ్రిగోల్డ్ బాధితుల ఇళ్లకు వెళ్లి రశీదులు అందజేస్తారని చెప్పారని, కాని ఇప్పటి వరకు అలాంటిది ఏమి జరగలేదని అన్నారు. ఎన్నికల ముందు అన్ని మాటలు చెప్పి, ఇప్పటికి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా, నేటికీ అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 20 లక్షల మంది బాధితుల తరుపున పోరాటం చేస్తున్న మాకు జగన్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. బాధితులు అందరికీ న్యాయం జరిగే వరకు, మేము పోరాటం చేస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కేబుల్ ఆపరేటర్లకు ప్రభుత్వం వైపు నుంచి వార్నింగ్ ఇచ్చారా ? తాము చెప్పినట్టు చెయ్యాల్సిందే, లేకపోతే కేబుల్ పీకి, ఏపి ఫైబర్ నెట్ అన్ని ఇళ్ళకు ఇస్తాం అని వార్నింగ్ ఇచ్చారా ? అవును అని చెప్తుంది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంచలన కధనం. మంత్రులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, కలిసి కేబుల్ ఆపరేటర్లకి వార్నింగ్ ఇచ్చారని, ఇద్దరు మంత్రులు కేబుల్ ఆపరేటర్లతో సమావేశమైన వీడియో ప్రసారం చేసింది ఏబీఎన్. ఈ సమావేశం పెర్ని నాని కార్యాలయంలో జరిగిందని, ఆ కధనంలో పెర్కుంది. అక్కడ సమావేశానికి వచ్చిన ఎంఎస్ఓ లను కూడా వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. మంత్రులు ఇద్దరూ, లోపల ఏమి చెప్పారో చెప్తూ, కధనం ప్రసారం చేసింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై వ్యతిరేక కధనాలు వేసే ఏ ఛానెల్ కూడా మీరు ప్రసారం చెయ్యకూడదు అంటూ, కేబుల్ ఆపరేటర్లకి మంత్రులు హుకం జారీ చేసారని ఆ కధనం సారంశం.

abn 13092019 2

అయితే మంత్రుల ఆదేశాలకు కొంత మంది ఎమ్మెస్వోలకు అది కుదరదు అని తేల్చి చెప్తూ, ట్రాయ్ తీసుకు వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారుడు కోరుకున్న చానల్ ను అందించాల్సి ఉంటుందని, అందులో ఫ్రీ చానల్ విషయంలో ఇవ్వాల్సిందే అని నిబంధనలు చెప్తున్నాయని, ఏబీఎన్ ఫ్రీ ఛానెల్ అని, దాన్ని బ్యాన్ చేస్తే చట్ట విరుద్ధమవుతుందని ఎమ్మెస్వోలు, మంత్రులకు చెప్పగా, వారి సమాధానంపై మంత్రులు సీరియస్ అయినట్లుగా ఆ కధనంలో ఏబీఎన్ చెప్పింది. అయితే దానికి మంత్రులు స్పందిస్తూ, ఆ చట్టాలు, నిబంధనల కాదు, తాము చెప్పిన టీవీ చానళ్లు మీ కేబుల్ లో రాకూడదు, కుదరదు అంటే చెప్పండి, మీ కేబుల్ తీసి అన్ని ఇళ్ళకు ఫైబర్ నెట్ వచ్చేలా చేస్తాం అంటూ, వారిని బెదిరించినట్టు ఆ కధనంలో ఏబీఎన్ పేర్కొంది.

abn 13092019 3

అయితే ప్రభుత్వం ఇలా చెయ్యటం పై, అందరూ మండి పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా, మీడియా స్వేఛ్చ అంటూ, తన సాక్షి పై పాఠాలు చెప్పిన జగన్, ఇప్పుడు ఇలా చెయ్యటం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి అంత చేసినా, ఆయన ఎదుర్కున్నారు కాని, ఇలా బ్యాన్ చెయ్యలేదని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు స్పందిస్తూ, న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమేంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మా గొంతు నొక్కేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరైనా వ్యతిరేకంగా పెడితే, వారిని అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పడు ఏకంగా ఛానెల్స్ నే బ్యాన్ చేసారు అంటూ చంద్రబాబు మండి పడ్డారు. 72 గంటల్లో ఎంఎస్‌వోలు స్పందించకపోతే ట్రాయ్‌కు ఫిర్యాదు చేయాలని, ప్రజలను చంద్రబాబు కోరారు.

Advertisements

Latest Articles

Most Read