నేషనల్ మీడియాలో చంద్రబాబునే సరిగ్గా చూపించరు, ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కె.ఇ. కృష్ణమూర్తి గురించి, న్యూస్ రావటం ఏంటి అనుకుంటున్నారా ? అదే మరి... ఏదైనా డైరెక్ట్ ఎవ్వరం.. అది పొత్తు అయినా, పోరాటం అయినా... బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని, చంద్రబాబు ఎలా ఎదుర్కున్నారో, మోడీ మోసాన్ని దేశానికీ తెలిసేలా ఎలా స్పందిస్తున్నారో చూస్తున్నాం... ఇప్పటి వరకు, ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా, దేశ రాజధానికి వెళ్లి, ఒక ప్రధాని చేసిన మోసాన్ని, వీడియోలు, డాక్యుమెంట్ లతో సహా, ఈ దేశానికి చూపించారు చంద్రబాబు... అదే స్పూర్తితో మంత్రులు కూడా, బీజేపీ పై ఎదురు తిరుగుతున్నారు.. బీజేపీకి వోట్ వెయ్యద్దు అని బహిరంగంగా చెప్తున్నారు... అందుకే ఇది నేషనల్ మీడియా న్యూస్ అయ్యింది...

deputy10042018 1

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించాలని ఏపీ ఉపముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. బెంగళూరు నగర శివార్లలోని వైట్ ఫీల్డ్ లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రగతికి నాలుగేళ్లలో ప్రధాని ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు, తీరని అన్యాయాన్ని చేశారు. అందువల్ల కర్ణాటకలోని తెలుగువారు ఎవ్వరూ వచ్చే ఎన్నికల్లో భాజపా అభ్యర్థులకు ఓటేయొద్దు' అని కోరారు. అమరావతి నిర్మాణానికి నిధులిస్తామని ఇవ్వలేదు. సాక్షిగా భరోసానిచ్చారు. ఇవేవీ గుర్తుంచుకోనందునే ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాం. భాజపాను నమ్మి తెలుగుదేశం మోసపోయింది. అదే మాదిరి ఇతరులెవరూ మోసపోకూడదనేదే మా ఆశయం ' అని పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రధాని ఇచ్చే వాగ్ధనలని ఎవరూ నమ్మరాదని హెచ్చరించారు...

deputy10042018 1

అయితే, ఈ వ్యాఖ్యల పై వెంటనే బీజేపీ కూడా స్పందించింది... అది ఆయన ఇష్టం... ఇది ప్రజాస్వామ్య దేశం. ఎన్నికలపుడు తమకిష్టమొచ్చినట్లు ప్రచారం చేసుకునే స్వేచ్చ ఆయనకు ఉంది, అని కె.ఇ. కృష్ణమూర్తి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ స్పందించారు. కర్ణాటకలోని తెలుగువారంతా భాజపాకు ఓటేయవద్దని పిలుపునిచ్చేందుకు ఆయనెవరు? ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోరు' అని భాజపా ముఖ్య మంత్రి అభ్యర్ధి యడ్యూరప్ప వ్యాఖ్యానించారు... మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ చేసిన ద్రోహానికి, కర్ణాటకలో అనుభవించేలా ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు... తెలుగు వారు దాదాపు కోటి మంది ఉన్న కర్ణాటక ఎన్నికల్లో, మనవాళ్ళు కీలకం కానున్నారు... ఇప్పటికే సోషల్ మీడియాలో దీని పై పెద్ద ఉద్యమం జరుగుతుంది... బీజేపీకి వోట్ వెయ్యద్దు అని, కర్ణాటక ప్రజలను, అక్కడ తెలుగువారని చైతన్యపరుస్తూ పోస్ట్లు పెడుతున్నారు..

"త్వరలో విద్యుత్ రేట్లు తగ్గిస్తా !" అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నవ్వారు... సంస్కరణ వల్ల వచ్చే లాభాలు , ప్రజలకే చెందాలి అంటే ఎగతాళి చేసారు... రెట్లు పెంచుకుంటూ వెళ్ళే ప్రభుత్వాలనే ఇన్నాళ్ళు చూసాం, కాని ఆంధ్రప్రదేశ్ లో రెట్లు తగ్గించే ప్రభుత్వం ఉంది... నాలుగేళ్ళు అయినా ఒక్క పైసా కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా, ఇప్పుడు చార్జీలు తగ్గిస్తున్నారు చంద్రబాబు... చంద్రబాబు తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు వల్ల, మొట్టమొదటి సారిగా విధ్యుత్ పై 82,00,00,000/- లాభం వచ్చింది... ఇంధన పొదుపును ఖచ్చితంగా అమలు చేయడం వలన 861 కోట్ల విధ్యుత్ ను ఆదా చేసి, దానిని విక్రయించడం ద్వారా నష్టాల నుండి లాభాలలోకి తీసుకువచ్చారు... ప్రస్థుతం రాష్ట్రం ఉన్న పరిస్ధితిలో వచ్చిన లాభాన్ని వేరే వాటికి వాడుకోవచ్చు... కానీ చంద్రబాబు అలా ఆలోచించలేదు. నిర్దేశిత సమయాలలో ధర తగ్గించడం ద్వారా, తిరిగి ప్రజలకే ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు..

cbn current 10042018

డిమాండ్ తక్కువగా ఉండే వేళల్లో విద్యుత్తు వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది... రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య పరిశ్రమలకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య విద్యుత్తును వినియోగించే ఇళ్లకు ఒక యూనిట్ కు రూపాయి చొప్పున ప్రోత్సాహకాన్ని ఇవ్వనుంది... బిల్లుల్లో ఆ మేరకు తగ్గింపును వర్తింపజేయనుంది. స్మార్ట్ మీటర్లు కలిగిన గృహ వినియోగదారులు మాత్రమే దీనిని పొందగలరు... ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది... దీనికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు.

cbn current 10042018

ముఖ్యమంత్రి ప్రత్యక్ష పర్యవేక్షణ వల్ల రూ. 861కోట్లు ఆదా చేశామని, మిగులు విద్యుత్తు విక్రయం ద్వారా తొలిసారిగా రూ. 82 కోట్లు లాభాలు ఆర్జించినట్లు అధికారులు వివరించారు. వినియోగదారుడి పై భారం పడకుండా ఛార్జీలు పెంచకపోవడమే అతి పెద్ద విజయమని సీఎం చంద్రబాబు వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అందుకు కారకులైన అధికారులు, సిబ్బందిని అభినందించారు. తిరుపతి కేంద్రంగా విద్యుత్తు ఆదా ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక సాంకేతికతతో వ్యవసాయంలో ఐఓటీ గరిష్టంగా వినియోగించడం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసేలా దీన్ని నిర్వహించనున్నామని చెప్పారు. ఈ పద్ధతిలో కనీసం పదిశాతం విద్యుత్తు ఆదా చేసినా విజయం సాధించినట్లేనని సీఎం వారితో అన్నారు...

దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నాయి... ఈ రోజు, కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ఆర్థికశాఖ మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయబోతున్నారు... తమ హక్కుల కాపాడుకొనే దిశగా సౌత్ స్టేట్స్ ఏకమవుతున్నాయి. దక్షిణాది నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం వస్తున్నా… నిధుల విడుదలలో వివక్ష చూపిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలు ఎప్పటి నుంచో విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ సమావేశానికి రావటం లేదు అంటూ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మంత్రులు కబురు పంపించారు... ఎందుకు రావటం లేదో సరైన కారణం చెప్పటం లేదు... ఈ నిర్ణయంతో, వీరు మోడీ తొత్తులు అనేది మరోసారి స్పష్టం అయ్యింది...

modi 10042018

మొన్న పార్లమెంట్ సమావేశాలు అప్పుడు కూడా, ఈ రెండు పార్టీలే గోల చేసి, అవిశ్వాస తీర్మానం రాకుండా అడ్డు పడ్డాయి... చివరి వారం రోజులు తెరాస ఎంపీలు వెనక్కు తగ్గారు... కాని అన్నడీయంకే కొనసాగిస్తూనే ఉంది... దేశంలో అన్ని పార్టీలు, ఈ రెండు పార్టీల చేత, బీజేపీనే గోల చేస్తుంది అని విమర్శలు కూడా చేసాయి... ఈ రోజు, అన్ని దక్షినాది రాష్ట్రాలు సమావేశం అయ్యి, కేంద్రం పై ఒత్తిడి తెస్తుంటే, తెలంగాణ, తమిళనాడు డుమ్మా కొట్టాయి... దీంతో, పూర్తి క్లారిటీ వచ్చేసింది... కేరళలో భేటీకి వెళ్లడం లేదని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వం కూడా ఈ సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించింది. ఆర్థికమంత్రి పన్నీర్‌సెల్వం ఈ సమావేశానికి వెళ్తారని తొలుత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సమావేశానికి ఒక్కరోజు ముందు తమిళనాడు ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది.

modi 10042018

ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఐదేళ్ల పాటు నిధుల వస్తాయి కాబట్టి.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు, నిధుల కేటాయింపులో మొదటి నుంచీ పకడ్బందీగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు... రెవెన్యూ లోటు నిధిని రద్దు చేసే ఆలోచన.. 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో ఉండటంతో.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర అధికారులు చెప్పారు. రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో కొన్ని సవరణలు అవసరమని.. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలిపారు. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా ఉంది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల ఏపీకి జరుగుతున్న నష్టం.. దక్షిణాదికి పనికి రాని కేంద్రం పథకాలు.. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలవల్ల జరిగే నష్టాలపై మన రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు వివరిస్తారని సమాచారం.

చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత, ఒక్కో కుట్ర బయటకు వస్తుంది... ఒరిస్సాలో ఓట్లు కోసం, ఒరిస్సాలో అధికారం కోసం బీజేపీ ఆడుతున్న నాటకాలు బయట పడ్డాయి... వీళ్ళు ఓట్లు కోసం, ఒక రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తున్నారో చూస్తున్నాం... ఇప్పుడే వాళ్ళే, స్వయానా వాళ్ళు చేసిన అన్యాయం చెప్పుకున్నారు... ఓట్లు కోసం, ఆడిన అబద్ధాలలో, పొరపాటున నిజం బయటకు వచ్చింది...కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ నిన్న, ఒరిస్సాలో పర్యటించారు...అక్కడ అధికార బీజేడీ పార్టీ పై విమర్శలు చేసారు... మనకు ఇక్కడ చెప్పినట్టే, ఒరిస్సాకు ఎంతో చూసాం, లక్షలు లక్షలు కోట్లు ఇచ్చాం, కాని ఇక్కడ ప్రభుత్వం అవినీతి చేసింది అంటూ, మనకు పాడిన పాటే పాడారు...

polavaram 10042018

ఈ సందర్భంలో పోలవరం గురించి మాట్లాడారు... పోలవరం ప్రాజెక్ట్ విషయం పై ఒరిస్సాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని, బీజేపీ ప్రభుత్వం, పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్షపాతం చూపిస్తుంది అంటూ ఆరోపణలు వస్తున్నాయి అని విలేకరులు అడగగా... పోలవరం విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం... కేంద్రం, ఒరిస్సాకు అన్యాయం చెయ్యాలని అనుకోవటం లేదు... అసలు చంద్రబాబు, మమ్మల్ని విడిచి వెళ్ళిపోయారు అంటే పోలవరం ప్రాజెక్ట్ గురించే అంటూ వ్యాఖ్యలు చేసారు.. అంటే, పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కేంద్రం సరిగ్గా సహకరించటం లేదు, తద్వారా ఒరిస్సాకి న్యాయం చేస్తుంది, అందుకే పోలవరం విషయంలో కేంద్రం సహకరించటం లేదు కాబట్టి, చంద్రబాబు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు అని కేంద్ర మంత్రి చెప్తున్నారు...

polavaram 10042018

అంతే కాదు, మరో విషయం మాట్లాడుతూ, మనకు బుద్ధి చెప్తారంట కేంద్ర మంత్రి గారు... కొఠియా గ్రూప్‌ గ్రామాలు ఒడిశావేనని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తమవంటే గుణపాఠం చెప్తామంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్నింగ్ ఇస్తున్నారు... డిశా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒడిశా సరిహద్దులను కాపాడుకోవడం ప్రతి పౌరుడు బాధ్యతగా గుర్తించాలని పిలుపునిచ్చారు... ఇలా వీళ్ళు వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో, అక్కడ పరిస్థితులకు తగ్గట్టు మాట్లాడుతూ, రాష్ట్రానికి రాష్ట్రానికి చిచ్చు పెడుతూ, మోడీ లక్షల లక్షల కోట్లు ఇస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాలే అవినీతి చేస్తున్నాయి అంటూ, ప్రతి రాష్ట్రంలో ఇదే పాట పాడుతున్నారు... ప్రజలు ఇప్పటికే వీళ్ళ ఫేక్ ప్రచారం కనిపెట్టారు... ఇలాని సోదికి విసిగి పోయారు.. పాపం ఈ బీజేపీ వాళ్ళకే అర్ధం కావటం లేదు...

Advertisements

Latest Articles

Most Read