అమరావతి మీద కొంత మంది నిత్యం ఎలా విషం చిమ్ముతున్నారో చూస్తూనే ఉన్నాం... హైదరాబాద్ నున్చివ్ వచ్చి మరీ, ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి, మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ లో హైదరాబాద్ పోయే బ్యాచ్, అమరావతిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండటం చూస్తున్నాం... మరో పక్క, అమరావతి ఒక్కే మెట్టు ఎక్కుతూ వెళ్తుంది.. అమరావతికి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) అందజేసే ప్రతిష్టాత్మకమైన ఐజీబీసీ గ్రీన్‌ ప్లాటినం పురస్కారం లభించింది. ఐజీబీసీ గ్రీన్‌ న్యూ సిటీ రేటింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా అమరావతి దీనికి ఎంపికైంది. భారతదేశంలో పూర్తిస్థాయిలో ఒక నగరానికి ఐజీబీసీ పురస్కారం లభించడం ఇదే ప్రథమం. ఇంతకు ముందు చిన్న ప్రాంతమైన గుజరాత్‌ ఇండస్ట్రియల్‌ గిఫ్ట్‌ సిటీ దీనిని అందుకుంది.

amaravati 09042018

ఈ నెల 10వ తేదీ నుంచి అమరావతిలో మొదలవనున్న సంతోష నగరాల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఏపీసీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఐజీబీసీ చైర్‌పర్సన్‌ ప్రేమ్‌.సి.జైన్‌ నుంచి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. పర్యావరణహితంగా, బ్లూ గ్రీన్‌ కాన్సె్‌ప్టతో రూపుదిద్దుకున్న అమరావతికి సంబంధించిన వివరాలను ఐజీబీసీ రేటింగ్‌ కోసం సీఆర్డీయే ఐజీబీసీకి సమర్పించగా, 100 పాయింట్లకుగాను 78 లభించాయి. క్రెడిట్‌ రేటింగ్‌లో వందకు కనీసం 74 పాయింట్లు రావాల్సి ఉంటుంది. అమరావతి నగర ప్రణాళిక, జోనింగ్‌ నిబంధనలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రణాళిక, ట్రాన్స్‌పోర్ట్‌ ప్లాన్‌, బ్లూ గ్రీన్‌ నెట్‌వర్క్‌, జలసంరక్షణ, నీటి పునర్వినియోగం, ఇంధన సామర్ధ్యం, సంప్రదాయేతర వనరుల వినియోగం ఇత్యాది అంశాలు ఐజీబీసీ పురస్కారం లభించేందుకు దోహదపడ్డాయి.

amaravati 09042018

అమరావతికి ప్లాటినం సిటీగా గుర్తింపు రావడం సంతోషకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌(ఐజీబీసీ) ఈ రేటింగ్‌ను ఇచ్చింది. మొత్తం నగరానికే ప్లాటినం సిటీగా రేటింగ్‌ ఇవ్వడం ఇదే మొదటిసారి. దేశంలోని నగరాల నిర్మాణ ప్రణాళిక, పచ్చదనం, బహిరంగ స్థలాలు, వేడిని తగ్గించే చర్యలు, పర్యావరణ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రేటింగ్‌ ఇచ్చినట్లు సీఎం తెలిపారు. విజయవాడ సమీపంలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 10 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న సంతోషనగరాల సదస్సుపై ఆదివారం సీఆర్‌డీఏ అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమరావతి కోసం 34 వేల ఎకరాలు ప్రభుత్వానికి అందజేసిన రైతుల త్యాగాల గురించి సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించాలని, అమరావతి అభివృద్ధికి సూచనలు తీసుకోవాలని ప్రత్యేకంగా సూచించారు.

"నరేంద్ర మోదీ రాజకీయాల్లో నాకంటే జూనియర్‌... అయినా, ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను. మోదీని కలిసిన ప్రతిసారీ... సార్‌ సార్‌ అంటూ ఆయన ఈగోని సంతృప్తి పరిచేందుకు కూడా వెనుకాడలేదు... ఇలా అంటుంటే, ఎగతాళి చేసిన వారు కూడా ఉన్నారు.. అయినా, నేను అవేమి పట్టించుకోలేదు... రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన అహాన్ని సంతృప్తిపరచడానికి కూడా వెనుకాడలేదు", అంటూ నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి... మోదీ ఒక నియంత తరహా నాయకుడు. మేం అప్పుడే ఎన్డీయే నుంచి బయటకు వస్తే రాష్ట్రానికి మరిన్ని వేధింపులుండేవి...

cbn 08042018

మోదీ.. రాజకీయాల్లో నాకంటే జూనియర్‌. అయినా ప్రధాని పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాను... రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. జగన్‌ నన్ను ఉద్దేశించి బావిలో పడి చావాలనడం దురదృష్టకరం. నన్ను తిట్టిన ప్రతిపక్ష నాయకుడినీ జగన్మోహన్‌రెడ్డిగారూ అనే అంటాను... మొట్టమొదటిసారి జాతీయ స్థాయిలో మోదీ అధికారాన్ని సవాల్‌ చేసింది మనమే. మనకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని దేశానికి చాటగలిగాం. ఇదే స్ఫూర్తితో మన పోరాట పంథా ఉండాలి అంటూ చంద్రబాబు అఖిలపక్ష నేతలతో అన్నారు.. భాజపా నాయకులు కర్ణాటక ఎన్నికలవగానే ఆంధ్రప్రదేశ్‌పైకి వస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘మనం నైతికంగా చాలా బలంగా ఉన్నాం. మనతో పెట్టుకుంటే వాళ్లకే నష్టం. రాష్ట్రానికి రావలసిన ప్రయోజనాలన్నీ సాధించేంత వరకు రాజీ లేదు. చాలా పోరాటాలు చూశాను’’ అని తెలిపారు.

cbn 08042018

ఎలాంటి సమస్యనైనా, కుట్రనైనా ఎదుర్కొనే నైతిక స్థైర్యం తనకుందని తెలిపారు. ‘మేం అనుకుంటే పోలవరం, అమరావతిలకు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా ఆపేవాళ్లం’ అనేలా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఇప్పుడు అంటున్నారని చంద్రబాబు తెలిపారు.. ‘రెండేళ్ల క్రితమే నేను బయటికి వచ్చుంటే ఎంతగా వేధించే వారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మోదీ డిక్టేటర్‌ తరహా నాయకుడు. ముందే వైదొలగి ఉంటే మరిన్ని వేధింపులు ఉండేవి. పోలవరంతో సహా అనేక ప్రాజెక్టులకు ఇక్కట్లు ఎదురయ్యేవి. వాళ్లు నమ్మక ద్రోహం చేస్తున్నారని పూర్తిగా రూఢీ చేసుకునేదాకా ఎన్డీయేలో ఉండి రాష్ట్ర హక్కుల కోసం పోరాడాను’’ అని చంద్రబాబు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల అములు కోసం తెలుగుదేశం పార్టీ ఏంపీలు చేస్తున్న ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు... హోదా సాధనలో భాగంగా ఆదివారం ఉదయం ప్రధాని మోదీ నివాసం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను పోలీసులు అరెస్టు చేసి తుగ్లక్‌రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు... ఈ విషయం తెలుసుకున్న సీఎం కేజ్రీవాల్‌ పీఎస్‌కు వెళ్లి ఎంపీలను పరామర్శించి.. సంఘీభావం ప్రకటించారు. టీడీపీ న్యాయపరమైన డిమాండ్లకు మద్దతిస్తున్నానని తెలిపారు. ప్రధానిని కలిసేందుకు వెళ్తున్నవారిని అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు కేజ్రీవాల్. కనీసం ఎంపీలన్న గౌరవం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు.

kejriwal 08042018

ఎంపీల ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని మరోమారు స్పష్టం చేసిన కేజ్రీవాల్, ఆంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రధాని మోదీ నివాసం దగ్గర మెరుపు ధర్నా తర్వాత ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. మోదీ నివాసం దగ్గర నుంచి బస్సులో తరలించి... తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్ నేరుగా పీఎస్‌కు వెళ్లారు. అక్కడ ఎంపీలను పరామర్శించిన ఆయన... వారికి సంఘీభావాన్ని తెలిపారు.

kejriwal 08042018

కాగా ఈ రోజు ఉదయం రాజ్యసభ ఎంపీ సుజనాచౌదరి నివాసంలో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన ఎంపీలు.. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధాని నివాసం ముట్టడికి యత్నించారు. ప్లకార్డులు చేతబూని ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ‘మాకు న్యాయం కావాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. దీంతో అక్కడికి చేరుకున్న కేజ్రీవాల్‌ ఎంపీలతో మాట్లాడి సంఘీభావం ప్రకటించారు.

"మోడీ పేరు చెప్తేనే గడగడలాడిపోతూ ఉంటాం... అందరి రాజకీయ నాయకుల పరిస్థితి అంతే... విపక్షాలు ఎప్పుడూ ఆయన పై శ్రుతిమించిన ఆరోపణలు చెయ్యలేదు... ఆయన రూపం కనిపిస్తేనే, ఆయనకు కనపడకుండా పక్కకి వెళ్ళిపోతారు... అలాంటిది, మీరు ఏకంగా ఆయన ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసారు ? నేను తెలంగాణా గొడవ అప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నా... అప్పట్లో సోనియా గాంధి ఇంటి ముందుకు వచ్చి సీమంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది... కాని ఎవ్వరూ రాలేదు... ఇప్పుడు మాత్రం, మీరు ఏకంగా మోడీ ఇంటి ముందు కూర్చున్నారు.. ఇది ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను... ఏంటండి మీ ధైర్యం" ఇది ఈ రోజు టిడిపి ఎంపీలను, ఢిల్లీలో ఒక సీనియర్ ఐపిఎస్ అడిగిన ప్రశ్న...

ias delhi 08042018

ఈ రోజు ఉదయం, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ప్రధాని మోడీ ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగిన విషయం తెలిసిందే... అయితే, వీరిని ఎంపీలు అని కూడా చూడకుండా, పోలీసులు ఈడ్చి పడేసారు... ఈ సందర్భంలో, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, మన ఎంపీలను ఉద్దేశించి, ఈ ప్రశ్న అడిగారు... ఇంత ధైర్యంగా, మీరు ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేసారు ఏంటి ? మేము ఇలా జరుగుతుంది అని కూడా ఎప్పుడూ అనుకోలేదు అంటూ, మన ఎంపీలను అడిగారు... దీనికి, తోట నరసింహం సమాధానం చెప్తూ, మా రాష్ట్ర ప్రజలే మా ధైర్యం... మా నాయకుడు చంద్రబాబు మా ధైర్యం.. మా పార్టీ పెట్టిందే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం అంటూ, ఆయనకి సమాధానం చెప్పారు..

ias delhi 08042018

ఈ సందర్భంగా, చంద్రబాబు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ ప్రస్తావన కూడా వచ్చింది... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ప్రధాని చేసిన అన్యాయం గురించి, ఢిల్లీలో ఇలా చెప్పటం మీరు ఎప్పుడైనా విన్నారా అంటూ, ఆ ఐపిఎస్ ను ప్రశ్నించారు ఒక ఎంపీ... మేము చేస్తున్నది న్యాయమైన పోరాటం... ఇన్నాళ్ళు, ఆయన ఎదో ఒకటి చేస్తారని ఓపికగా ఆగం.. ఏమి చెయ్యరు అని తెలిసిన తరువాత, మాలోని రెండో యాంగిల్ కూడా చూపించాలి కదా అంటూ, సమాధానం చెప్పారు... అయినా, మీరు మేము ఎంపీలు అని కూడా చూడకుండా, ఇలా లాగి పడేస్తారు అనుకోలేదు... 75 సంవత్సరాలు ఉన్న వారిని కూడా, మీ వాళ్ళు ఇలాగే లాగి పడేసారు.... అయినా మాకు ఇబ్బంది లేదు, అంటూ ఆ ఐపిఎస్ కు సమాధానం చెప్పారు...

Advertisements

Latest Articles

Most Read