ఈ సారి ఎలాగైనా కర్ణాటకలో ఎన్నికలు గెలిచి, తద్వారా దక్షిణ భారతంలో అడుగు పెట్టి, మిగిలిన రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని చూస్తున్న బీజేపీ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి... ఒక పక్క చంద్రబాబు ఎదురుతిరిగి, ఆంధ్రప్రదేశ్ విభజన హామీల విషయం, నేషనల్ ఇష్యూ చెయ్యటంతో, ఆ దెబ్బ కర్ణాటకలో కూడా పడింది... దాదాపు కోటి మంది తెలుగు ఓటర్లు ఉన్న కర్ణాటకలో, ఈ ప్రభావం ఉంటుంది అని, బీజేపీ నేతలే చెప్తున్నారు... ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు మరో సమస్య బీజేపీకి వచ్చి పడింది... అదే కావేరీ బోర్డు విషయం... ఇదే ఇష్యూతో, అన్నాడీయంకేతో నాటకం ఆడించి, పార్లమెంట్ వాయిదా వేసుకున్న బీజేపీకి, ఇప్పుడు ఇదే విషయం మెడకు చుట్టుకుంది...

amit 09042018

కావేరీ నదీ జలాల వివాదంపై గత ఫిబ్రవరిలో ఇచ్చిన తుది తీర్పును ఎందుకు అమలు చేయడం లేదంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఈ రోజు ప్రశ్నించింది... మే 3వ తేదీలోగా కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలాల పంపకాలకు సంబంధించి డ్రాఫ్ట్‌ను తయారుచేసి సమర్పించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది... మేనేజ్‌మెంట్‌ బోర్డు విషయమై ముందే తమను ఎందుకు సంప్రదించలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది... కోర్టు అన్ని విషయాలనూ అమలయ్యేలా చేయలేదని.. కేంద్రమే కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు...

amit 09042018

అయితే, ఇది కావాలనే కేంద్రం వాయిదా వేస్తూ వస్తుంది... ఎందుకంటే, ఇలా చేస్తే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి నష్టం వస్తుంది.. అందుకే, సాధ్యమైనంత వరకు, కర్ణాటక ఎన్నికలు అయ్యే దాక, ఈ విషయం పక్కన పెడదాం అనుకుంది... తీర్పు అమలుకు మరింత సమయం కావాలని కేంద్రం స్పష్టం చేసింది... కాని సుప్రీం కోర్ట్ మాత్రం, కనీసం మే 3లోగా కావేరి బోర్డు ముసాయిదాను అందించాలని పేర్కొంది.... దీంతో ఇప్పుడు కోర్ట్ ఆదేశాలు పాటించాల్సిన పరిస్థితి... ఇలా చేస్తే, ఇప్పటికే వ్యతిరేక పవనాలు వీస్తున్న కర్ణాటకలో, మరో ఎదురుదెబ్బ బీజేపీకి తగలనుంది... కావేరీ జలాల విషయంలో తమిళనాడులో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. కావేరీ జలాల్లో కర్ణాటకకే ఎక్కువ శాతం నీరు కేటాయించిన నేపథ్యంలో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నిన్న ఢిల్లీలో ప్రాధాని మోడీ ఇంటి ముందు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు మెరుపు ధర్నా చేసిన విషయం తెలిసిందే... నెల రోజుల నుంచి, చంద్రబాబు, మోడీని ఏకి ఏకి పెడుతుంటే, పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేసారు.. ఎంత చేసినా, పార్లమెంట్ లో ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు... పార్లమెంట్ వాయిదా పడినా, తెలుగుదేశం ఎంపీలు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. ఆదివారం ఉదయం ఉన్నట్టు ఉండి, తెలుగుదేశం ఎంపీలు అందరూ, మోడీ ఇంటికి బయలు దేరి వెళ్లి, మోడీ ఇంటి ముందు, టిడిపి ఎంపీల మెరుపు ధర్నా నిర్వహించారు...

sumanth 09042018 1

అయితే వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు... ఢిల్లీ పోలీసు కమీషనర్ తో సహా అందరూ వచ్చేశారు.. ఎంపీలను ఈడ్చి అవతల పడేసారు.. బలవంతంగా వారిని తరలించే క్రమంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని, గల్లా జయదేవ్ ని పోలీసులు లాగి పడేశారు.. ఎంపీలు వినక పోవడంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని బస్సులో అక్కడి నుంచి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషనుకు తరలించారు... అయితే, ఎంపీలను ఈ విధంగా, ఈడ్చి పడేయటం పై, అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి... సాక్షాత్తు, ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చి ఎంపీలను పరామర్శించి, పోలీసుల తీరుని తప్పుబట్టారు... అయితే, ఈ విషయం పై, హీరో సుమంత్ స్పందించారు...

sumanth 09042018 1

ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ, అలా జయదేవ్‌‌కు జరగడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోందంటూ హీరో సుమంత్ పోస్ట్ పెట్టారు. ‘నాకు తెలిసిన వ్యక్తుల్లో ది బెస్ట్ అయిన గల్లా జయదేవ్‌కు ఇలా జరగడం చూస్తుంటే చాలా బాధగా ఉంది’ అంటూ సుమంత్ గల్లా జయదేవ్ పెట్టిన పోస్ట్, ని రీ ట్వీట్ చేస్తూ స్పందించారు... ఒక్క జయదేవ్ కే కాదని, ప్రత్యేక హోదా కోసం, ఆందోళన చేస్తున్న అందరికీ మద్దతు పలుకుతున్నట్టు మరో పోస్ట్ కూడా పెట్టారు... ఇప్పటికే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పై, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర అసహనం ఉంది... ఇప్పటి వరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి, మన సమస్య పై సరైన స్పందన లేదు అనుకుంటున్న టైంలో, ఒక హీరో కనీసం ట్విట్టర్ ద్వారా అయినా స్పందించారు...

రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ గురించి గత నెల రోజులుగా కొన్ని కధనాలు వస్తున్నాయి... గత రెండు రోజుల నుంచి, మీడియాలో కధనాలు విస్తృతంగా వస్తున్నాయి... ఇవన్నీ చూస్తున్న, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ధన్యవాదాలు చెప్తున్నారు... ఈ కధనాల సారంశం, గవర్నర్ నివేదికలతోనే, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ కి గ్యాప్ పరిగింది... అదే విధంగా, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా, గవర్నర్ సూచన మేరకే, పవన్ తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడు అని... అయితే, ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు మాత్రం, నిజంగా గవర్నర్ నరసింహన్‌ కు రుణ పడి ఉంటామని చెప్తున్నారు...

narasimhan 09042018

ఎందుకంటే, చంద్రబాబు ఎవరినీ అంత తొందరగా వదులుకోరు... బీజీపీ వాళ్ళు ఏమో, మోడీ ఇమేజ్ వల్లే మేము గెలిచాం అని చెప్తున్నారు.. పవన్ అభిమానులు కూడా, పవన్ వల్లే తెలుగుదేశం గెలించింది అని చెప్తున్నారు... మరో పక్క, చంద్రబాబు నైజం ఇది కాదు, కేవలం రాష్ట్రం కోసం, కంప్రోమైజ్ అయ్యి పరిపాలన చేస్తున్నారు... ఇలా ఉంటే చంద్రబాబు భయపడుతున్నారని ప్రచారం చేస్తున్నారు... ఇలా అనేక ప్రచారాలతో, చంద్రబాబుని అవహేళన చేస్తుంటే, ఏమి చెయ్యాలని పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తలది... అయితే, ఇప్పుడు పరిస్థితి వేరు... 1999లో ఉన్న చంద్రబాబు దూకుడు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది... మోడీని ఒక ఆట ఆడుకుంటున్నారు... మరో పక్క ఇక పవన్ తో కాని, బీజేపీ తో కాని పొత్తు ఉండదు అనే వార్త తెలుసుకుని, ఇక ఇప్పుడు చంద్రబాబు సత్తా ఏంటో తెలుస్తుంది అని అంటున్నాయి టిడిపి శ్రేణులు... మొత్తానికి, గవర్నర్ పుణ్యమా అని, ఇవి అన్నీ జరిగాయి అని, అందుకే గవర్నర్ కు ధ్యానవాదాలు అని చెప్తున్నారు...

narasimhan 09042018

రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా ఉన్నాయనీ, పవన్‌ కల్యాణ్‌ ఎదురుతిరిగితే చంద్రబాబు మరింత బలహీనపడతారనీ కూడా గవర్నర్‌ నివేదిక ఇచ్చారట! కేంద్ర పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో గవర్నర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో వేలుపెట్టడం మొదలుపెట్టారు. పవన్‌ కల్యాణ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. ఐ.వై.ఆర్‌. కృష్ణారావు వంటివారితో కూడా సంప్రదింపులు జరిపారట.. గవర్నర్‌ నరసింహన్‌ చెబుతున్న మాటలు, ఇస్తున్న నివేదికలను నమ్మిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై దురభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుకు ఆయన చాలా రోజులు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు అనేది ఆ కధనాల సారాంశం...

ప్రపంచస్థాయి సంతోషకరమైన నగరాలకు చుక్కానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న చంద్రబాబు సంకల్పం నెరవేరనుంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను ఆ దిశగా అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో, సీఐఐ సౌజన్యంతో నిర్వహించనున్న సంతోష నగరాల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరుల మధ్య, మంగళగిరికి సమీపంలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న ఈ హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌కు 15 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది నిష్ణాతులు హాజరై, ప్రజల్లో సంతోష స్థాయిలను పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై మేధోమథనం సాగించనున్నారు.

amaravati 09042018 1

ఈ సదస్సుకు అమెరికా, ఇంగ్లండ్‌, స్పెయిన్‌, జపాన్‌, సింగపూర్‌, భూటాన్‌, ఫిన్లాండ్‌, యూఏఈ, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్‌ సహా 15 దేశాలకు చెందిన 100 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో సహా మొత్తం వెయ్యిమంది హాజరుకానున్నారు. దాల్‌బర్గ్‌, సీఐఐ, సింగపూర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో సంతోషానికి పేరొందిన ఫిన్‌ల్యాండ్‌ నుంచి పీటర్‌ ఆఫ్‌ యాంగ్రీబర్డ్స్‌ ఫేమ్‌ నేతృత్వంలో ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం రానుంది. సీఎం చంద్రబాబు, సద్గురు జగ్గీ వాసుదేవ్‌ సంయుక్త నిర్వహణలో హ్యాపీనెస్ పై ప్రత్యేక చర్చ జరగనుంది.

amaravati 09042018 1

రైతుల భాగాస్వామ్యంతో భూసమీకరణ, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, గణనీయమైన బ్లూ, గ్రీన్‌ సిటీ, వందల కిలోమీటర్ల సైకిల్‌ ట్రాక్‌లు నగర ప్రణాళికలో ఇమిడి ఉంటాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఆనందం కోసం అవలంభిస్తున్న విధానాలను, వ్యూ హాలను పంచు కొంటారు. ఆర్కిటెక్చర్‌, ప్లానింగ్‌ విద్యార్థులకు ఈ సదస్సు ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది. సిటీల్లో హ్యాపీనె్‌సను కొలిచే విధివిధానాలకు సంబంధించిన నియమావళిని రూపొందించే కార్యస్థలంగా ఈ సదస్సు నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. సంతోషంతో విలసిల్లే నగరాల అభివృద్ధికి విధానపరమైన మార్గదర్శక సూత్రాలు, నియమ నిబంధనలను రూపొందించే కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, డిక్లరేషన్‌కు వేదికగా ఇది నిలవనుంది.

Advertisements

Latest Articles

Most Read