అగ్రిగోల్డ్‌... కాంగ్రెస్ హయాంలో జరిగిన మరో భారీ స్కాం ఇది... కాకపొతే ప్రభుత్వ సొమ్ము కాకుండా, డైరెక్ట్ గా ప్రజల జేబులు కొట్టేసారు ఘరానా దొంగలు... దేశ వ్యాప్తంగా 32 లక్షల మంది అగ్రి గోల్డ్ బాధితులుంటే వీరిలో 19 లక్షల మంది ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు... చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, వీరికి ఎలా అయినా న్యాయం చెయ్యాలని, అగ్రి గోల్డ్ ఆస్తులను అమ్మి, నష్టపోయిన వారికి డబ్బులు చెల్లించాలని నిర్ణయించారు... ప్రభుత్వం తరుపున చేస్తే లేని పోనీ తలనొప్పులు అని, కోర్ట్ ద్వారా ఈ ప్రక్రియ చెయ్యటానికి రెడీ అయ్యారు... ఇదే తరుణంలో, అగ్రి గోల్డ్ ను టేకోవర్ చేసేందుకు జీఎస్సెల్ గ్రూపు ముందుకొచ్చింది. జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర అమరావతి వచ్చి ఆ మధ్య చంద్రబాబుతో చర్చలు కూడా జరిపారు.

subhash 100402018 1

కోర్ట్ కి కూడా ఇదే విషయం చెప్పారు... ప్రభుత్వం కూడా అగ్రిగోల్డ్‌ సంస్థలో డబ్బులు దాచుకున్న వారి జాబితా మొత్తం సిద్ధం చెయ్యమని సీఐడీ అధికారులని ఆదేశించింది... జీఎస్సెల్ గ్రూపు టేక్ ఓవర్ చేసిన అనంతరం సమకూరే నిధులు నుంచి బాధితులకు చెల్లించాల్సిన మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చెయ్యటానికి ప్రభుత్వం రెడీ అయ్యింది... అంతా స్వయంగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో, అగ్రిగోల్డ్‌ సంస్థను టేకోవర్‌ చేయడానికి ముందుకొచ్చిన ఎస్సెల్‌-జీ గ్రూపు చేతులేత్తేసింది... ఇదే విషయం నిన్న కోర్ట్ కి చెప్పింది.. అంతేకాదు, సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్‌ను కూడా తెరపైకి తీసుకు వచ్చింది, జీ గ్రూప్.. సంయుక్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆసక్తి ఉందని అమర్ సింగ్ చెప్పారని జీఎస్ఎల్ గ్రూప్ తెలిపింది.. ఈ ప్రతిపాదనను హైకోర్టు తోసిపుచ్చింది. నేరుగా మీరు అగ్రిగోల్డ్‌ను స్వాధీనం చేసుకుంటారా లేదా రెండు వారాల్లో చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.

subhash 100402018 1

అయితే, ఈ తతంగం మొత్తం వెనుక మోడీ, బీజేపీ పెద్దల ఒత్తిడి ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి... ఇంత పెద్ద గ్రూప్, ఏమి గ్రౌండ్ వర్క్ చేసుకోకుండానే, ఇక్కడ వరకు వచ్చిందా ? ఇప్పుడు వచ్చి, మా వాల్ల కాదు అంటున్నారు అంటే, ఒత్తిడి ఉండే ఉంటుంది అని భావిస్తున్నారు... ఇది కనుక ఒక కొలిక్కి వస్తే, 19 లక్షల మందికి చంద్రబాబు దేవుడు అవుతాడు... అల చేస్తే, రాజకీయంగా చంద్రబాబుకి లాభం... అందుకే, ఇది ముందుకు వెళ్ళకుండా ఆపారు అంటున్నారు... జీ ఛానెళ్ల నెట్ వర్క్ అధినేత సుభాష్ చంద్ర, 2016లో బీజేపీ సపోర్ట్ తో రాజ్యసభకు ఎన్నికయ్యారు... మోడీ, సూచనలు మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, చంద్రబాబుకి ఏ మేలు చెయ్యకూడదు అనే ఆదేశాలు మేరకు, ఇలా జరిగి ఉండవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.. అలాగే అమర్ సింగ్ పేరు తెర పైకి తీసుకురావటం కూడా, ఇందులో భాగమే అని భావిస్తున్నాయి... మొత్తానికి, మోడీ మన మీద అన్ని వైపుల నుంచి, కక్ష తీర్చుకుంటున్నారు...

అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. శంకుస్థాపన జరుపుకొన్న ఈ రెండు నెలల్లోనే 30 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇదే ఊపు కొనసాగితే, వచ్చే ఏడాది మార్చి నాటికి పరిశ్రమ సిద్ధం అవుతుంది. రూ.13,500 కోట్లు పెట్టుబడితో ఇక్కడ భారీ కార్ల పరిశ్రమకు ‘కియ’ శ్రీకారం చుట్టింది. దీనికిగాను అవసరమైన యంత్ర సామగ్రిని కొరియా నుంచి దిగుమతి చేసుకొంటోంది. ఆ సామగ్రిని తొలుత కృష్ణపట్నం రేవుకు తీసుకొచ్చి, అక్కడినుంచి రోడ్డు మార్గంలో పరిశ్రమ వద్దకు తరలిస్తున్నారు. ప్రస్తుతం బాడీ బిల్డ్‌షాపు యూనిట్‌, ప్రెస్‌ యూనిట్‌, అసెంబ్లింగ్‌ యూనిట్‌, పెయింటింగ్‌ షాపు ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి.

kia 09042018 1

ఉద్యోగుల కోసం దుద్దేబండ క్రాస్‌ వద్ద చేపట్టిన టౌన్‌షిప్ నిర్మాణ పనులు 30 శాతం పూర్తయ్యాయి. 12.6 ఎకరాల్లో 16 భవనాల్లో 82 గదుల నిర్మాణం చేపట్టారు. 2018 ఆగస్టు నాటికి ఈ భవనాలు అందుబాటులోకి రానున్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి పరిశ్రమకు నీటిని అందించడానికి చేపట్టిన రూ.22 కోట్ల విలువైన పైప్‌లైన్‌ నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.3.5 కోట్లతో ఇంటెక్‌వెల్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఉద్యోగ నియామకాల అనంతరం శిక్షణ ఇవ్వడానికి దుద్దేబండ క్రాస్‌లో 11 ఎకరాల్లో నిర్మిస్తున్న శిక్షణ కేంద్రం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ కేంద్రంలో ఒకేసారి వంద మందికి శిక్షణ ఇచ్చే వీలుంది.

kia 09042018 1

అయితే, ఇక్కడ పని చెయ్యాలి అంటే, కొరియా భాష నేర్చుకుంటే, ప్రయారిటీలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు... అందుకే, కొరియా భాష నేర్పేందుకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానించింది. ఎస్కేయూ స్కిల్‌ డెవలప్ మెంట్‌ ఆధ్వర్యంలో 3 నెలలపాటు ఈ భాషా శిక్షణ సాగనుంది. ‘కియ’ వంటి సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే కొరియా భాష వచ్చి ఉంటే మంచిదనే అభిప్రాయంతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్టు మండలి తెలిపింది. ఆసక్తి కలిగిన వారు www.skuniversity.ac.in, www.skillsku.com నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకుని, ఈనెల 12 లోగా పూర్తిచేసి సమర్పించాలని కోరింది. ఇక్కడ నుంచి, పూర్తి వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు http://skuniversity.ac.in/dload/SKU%20-%20Certificate%20Course%20in%20Korean%20Language%20-%20Notification.pdf

మోడీ జీ... ప్లీజ్ మోడీ జీ.. రిక్వెస్టింగ్ మోడీ జీ... ఇది ఈ రోజు, జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోడీని ఉద్దేశించి పెట్టిన ట్వీట్... ఒక పక్క రాష్ట్రం మొత్తం, మోడీ పై మండి పడుతుంటే, మనోడు మాత్రం, ప్లీజ్ ప్లీజ్ అంటూ దేవులాడుతున్నాడు... ఈ పేరు పలకటానికి, నాలుగేళ్ళు పట్టింది అనుకోండి అది వేరే విషయం... ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలు, చంద్రబాబు మోడీని నడి బజారులో, ఏకి పడేస్తుంటే, జగన్ మాత్రం, మోడీ అనే పేరు పలకటానికి కూడా భయపడుతున్నాడు... రెండు రోజులు క్రిందట, ఒక ప్రెస్ మీట్ పెట్టాడు... గంట మాట్లాడాడు... 130 సార్లు చంద్రబాబు పేరు తలిస్తే, ఒక్క సారి కూడా మోడీ పేరు తలవలేదు...

jagan 09042018

ఇదే విషయం కొంత మంది వైసిపీ నేతలను అడిగితే, వారు అఫ్ ది రికార్డు చెప్పిన మాట ఏంటి నటే, గెట్టిగా ఈయన మోడీ అంటే, ఈడీ బయటకు వస్తుంది.. అందుకే మోడీ అనే పేరు తలవటానికి కూడా మా వాడికి భయం.. ఎప్పుడన్నా తలిచినా, ఎంతో రెస్పెక్ట్ తో తలుస్తారు... ఎందుకో కారణాలు మీకు తెలియనిదా... మాకు కూడా అదే ఆదేశాలు ఉన్నాయి... మోడీ మీద ఒక్క విమర్శ చెయ్యవద్దు... అసలు మోడీ అనే పేరే తలవద్దు అని ఖటినమైన ఆదేశాలు ఉన్నాయి.. ఒక పక్క చంద్రబాబు అలా వాయిస్తుంటే, మా వాడు ఇలా ప్లీజ్ ప్లీజ్ అంటుంటే, మేము కూడా ప్రజల్లో చులకన అయిపోతున్నాం.. ఈయన కేసులు కోసం, ఈయన తాపత్రయం.... ఈయనతోనే అనుకుంటుంటే, ఆ విజయసాయి రెడ్డి ఒకడు అంటూ, అసహనాన్ని చూపించారు...

jagan 09042018

మరో పక్క ఎంపీలు రెండు రోజుల నుంచి నిరాహారదీక్ష చేస్తున్నారు... ఢిల్లీలో చేస్తున్నారు కాబట్టి, హోదా ఇవ్వాల్సింది, విభజన హామీలు నేరవేర్చాల్సింది మోడీ కాబట్టి, అయన పేరు తలుస్తారేమో అని ఎదురు చూసాం... వాళ్ళు కూడా, చంద్రబాబు చంద్రబాబు తప్ప వేరే మాట లేదు అంటూ, వైసిపీ నేతలు వాపోతున్నారు... మోడీ అనే గట్టిగా ఒక్క మాట అంటే, ఈడీ ఎంటర్ అయితే, మావోడి పరిస్థితి ఏంటి, పక్కన శశికళను చూసారుగా, ఒక్క రోజులో ఏమైందో ? మోడీ వచ్చి నెత్తిన చెయ్య పెట్టాడు, నాకు ఏంటిలే అనుకుంది.... మోడీకి ఎదురు తిరిగింది, లోపల వేసాడు... మా వాడి పరిస్థితి అదేగా... 16 సిబిఐ, ఈడీ కేసులు కింద పెట్టుకుని ఉన్నాడు... ఆయనకు తిక్క తిప్పేస్తే, ఏమవుతుందో మా వాడికి తెలుసు.. అందుకే ఈ బాధలు అని, వైసిపీ నేతలే చెప్పుకుంటున్నారు... ఇది జగన్ పరిస్థితి...

ఇప్పటిదాకా దక్షిణాదిపై వివక్ష గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడులు మాత్రమే పోరాడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కేరళ కూడా గొంతు కలుపుతోంది. కేరళ ఆర్థిక మంత్రి థామస్‌ ఇస్సాక్‌ దక్షిణాది రాష్ట్రాల ఆదాయాన్ని.. అభివృద్ధి అవసరాల పేరుతో ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇదే అంశంపై రేపు, ఏప్రిల్‌ 10న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం ఏర్పాటు చేసారు. మోదీ హయాంలో నిధుల కేటాయింపులో దక్షిణాదికి జరుగుతున్న అన్యాయమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా ఉంది. 14వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల ఏపీకి జరుగుతున్న నష్టం.. దక్షిణాదికి పనికి రాని కేంద్రం పథకాలు.. 15వ ఆర్థిక సంఘం విధి విధానాలవల్ల జరిగే నష్టాలపై మన రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు వివరిస్తారని సమాచారం.

south india 09042018

ఉపయోగం లేని పథకాలను తొలగించాలని లేదా ఆయా రాష్ట్రాల్లో కేంద్రం ఖర్చు చేస్తున్న మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే.. కేంద్ర పథకాల్లో 83:17గా ఉన్న రాష్ట్ర వాటా 14వ ఆర్థిక సంఘం నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత 69:31గా మారింది. ఆర్థికలోటులో ఉన్న ఏపీకి ఇది చాలా భారంగా మారింది. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే పథకాలకు నిధులు సర్దుబాటు చేయలేని దుస్థితి ఉంది. కేంద్ర పథకాలు అవసరం లేని రాష్ట్రాలకు ఆ మేర నిధులను ఆయా రాష్ట్రాలకే కేంద్రం ఇచ్చేయాలని 11వ ఆర్థిక సంఘమే చెప్పింది. కానీ కేంద్రంలోని పెద్దలు వీటిని పట్టించుకునే స్థితిలో లేరు. 14వ ఆర్థిక సంఘం తప్పుడు అంచనాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఏటా వేల కోట్ల రెవిన్యూ లోటు కోల్పోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సొంత పన్నుల ఆదాయం రూ.77,784కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసి.. రెవిన్యూ లోటును రూ.37,817 కోట్లుగా తేల్చింది.

south india 09042018

కానీ, రాష్ట్ర సొంత పన్నుల ఆదా యం రూ.50వేల కోట్లకు అటూ ఇటూగా ఉంది. ఇందులోని లోటే రూ.27 వేల కోట్లు. ఆర్థికసంఘం అంచనా వేసిన రెవిన్యూ లోటు.. పన్ను ఆదాయం లోటు కలిపితే ఈ మొత్తం లోటు రూ.64 వేల కోట్లకు చేరుకుంది. ఆ మేరకు నిధులు రాష్ట్రానికి రావాలి. కానీ రాలేదు. మూడేళ్లగా రాష్ట్రం విషయంలో జరిగింది ఇదేనని అధికారులు చెబుతున్నారు. సరాసరి రాష్ట్రం రూ.50 వేల కోట్లు కోల్పోయిందనేది వారి వాదన. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఐదేళ్ల పాటు నిధుల వస్తాయి కాబట్టి.. 15వ ఆర్థిక సంఘం నిబంధనలు, నిధుల కేటాయింపులో మొదటి నుంచీ పకడ్బందీగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ లోటు నిధిని రద్దు చేసే ఆలోచన.. 15వ ఆర్థిక సంఘం నిబంధనల్లో ఉండటంతో.. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రాష్ట్రాలు తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ప్రభుత్వ నిబంధనల్లో కొన్ని సవరణలు అవసరమని.. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చిస్తారని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read