సముద్రమట్టానికి 34 నుంచి 55 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న పోలవరంప్రాజెక్ట్ ని ఏమాత్రం అనుభవంలేని, ఎటువంటిసాంకేతిక పరిజ్ఞానంలేని లిఫ్టులు, పంపులు తయారుచేసే కంపెనీకి అప్పగిం చిన జగన్ ప్రభుత్వం, ప్రజల్లో భయాందోళనలకు తెరలేపిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు తెలిపారు. ఆదివారం ఆయన విశాఖపట్నంలోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడుతూ, 194 టీఎంసీలనీటిని నిల్వ చేసే రేడియల్ గేట్ల డిజైన్ లో, వాటితయారీకి ఉపయోగించిన మెటీ రియల్, ఫ్యాబ్రికేషన్, ఇతరత్రా నాణ్యతా పరమైన అంశాల్లో రాజీపడుతున్నారనే వార్తలు రాష్ట్రరైతాంగానికి, ప్రజలకు తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. వరదల సమయంలో ప్రాజెక్ట్ నుంచి 50లక్షలక్యూసెక్కుల నీరుఒక్కరోజే వస్తుందని, అంతటినీటిప్రవాహాన్ని నిలువరించగలసామర్థ్యం ప్రాజెక్ట్ గేట్లకు ఉంటుందాఅనే సందేహం అందరిలోనూ కలుగుతోందన్నా రు. ప్రాజెక్ట్ భధ్రతకు ప్రమాదంఏర్పడితే, ఉభయగోదావరి జిల్లాలు రెండూకూడా బంగాళాఖాతంలోకలిసే ప్రమాదముందని నిమ్మల వాపోయారు. ప్రాజెక్ట్ పనుల నాణ్యతపై నీలినీడలు కమ్మకుంటున్న తరుణంలోరాష్ట్రప్రజలంతా జగన్ ప్రభుత్వ అలసత్వంపై ఆలోచన చేయాలన్నారు. పోలవరంఎత్తుని తగ్గించడంద్వారా, రాష్ట్రం మొత్తానికి సాగు,తాగునీరు అందించే అవకాశం లేకుండా చేస్తున్నా రని, బహుళార్థసాథకప్రాజెక్ట్ అన్నపేరుని పిల్లకాలువగా, చెక్ డ్యామ్ గామార్చే ప్రయత్నాలను జగన్ ప్రభుత్వంచేస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే సుడిగుండంలో పోలవరం ప్రాజెక్ట్ చిక్కుకుపో యిందన్నారు. ప్రాజెక్ట్ ఎత్తుని 45.72మీటర్లనుంచి 41.15మీటర్ల కు (155అడుగుల ఎత్తుని 135 కి తగ్గించడం) తగ్గించేప్రయత్నం చేయడంతో, నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతుందన్నారు. ప్రభుత్వం ఎత్తుని తగ్గిస్తే, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అర్థం, పరమార్థమే అప హాస్యమవుతుందని నిమ్మల తెలిపారు. పోలవరం ఎత్తుపై ఎగువ రాష్ట్రాలుసుప్రీంకోర్టుకు వెళ్లడంజరిగిందని, 156 అడుగులఎత్తు వరకు ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ఎక్స్ పర్ట్స్ కమిటీ ఇచ్చిన నివేదికపై దేశఅత్యున్నత న్యాయస్థానంకూడా ఆమోదం తెలిపిందన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా, రాష్ట్రప్రభు త్వం పోలవరం ఎత్తుని తగ్గించేప్రయత్నాలు చేయడం, ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న చీకటిఒప్పందంలో భాగంగా జరుగుతున్నదేనని రామానాయుడు మండిపడ్డారు.

కేసీఆర్ ఎన్నికలవేళ తనకు ఆర్థికసహాయం అందించాడన్నకృతజ్ఞతతోనే జగన్మోహన్ రెడ్డి పోలవరంప్రాజెక్ట్ నిర్మాణాన్ని పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టడానికి సిద్ధమయ్యాడన్నారు. ఎన్నికల్లో ఆయన ఈ ముఖ్యమంత్రికి నిధులిచ్చాడని, నేడు జగన్ఆయనకు నీళ్లు ఇవ్వడానికి సిద్ధపడ్డాడన్నారు.ఆ విధంగా చేయడం జగన్ కు బాగా అలవాటైన క్విడ్ ప్రోకో పద్ధతేనని నిమ్మల ఎద్దేవాచేశారు. కేంద్రజలశక్తి మంత్రిత్వశాఖకు సలహాదారుగా ఉన్న వెదిరే శ్రీరామ్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా ఉన్నా ఆయనసతీమణి శిల్పారెడ్డిలు జగన్ కనుసన్నల్లో తెలంగాణరాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని నిమ్మల మండిపడ్డారు. జగన్, కేసీఆర్ తో చేసుకున్న చీకటిఒప్పందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రే ఆ రాష్ట్ర అసెంబ్లీలో బట్టబయలుచేశాడన్నారు. రెండు, మూడుమీటర్లవరకు పోలవరం ఎత్తు తగ్గించుకుంటే, నష్టమేముంటుందని కేసీఆర్ తెలం గాణ అసెంబ్లీలోచెప్పినప్పుడే, జగన్ ఈరాష్ట్రానికి చేస్తున్న అన్యా యం ఏమిటో తెలిసిపోయిందన్నారు. తెలంగాణకు ఉపకారం చేయడంకోసమే జగన్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని 155 అడుగుల నుంచి 135 అడుగులకు కుదించాడన్నారు. దానివల్ల జగన్ ప్రభుత్వం, నిర్వాసితుల కుటుంబాలసంఖ్యను లక్షా7వేలనుంచి45వేలకు తగ్గించడానికి సిద్ధమైందన్నారు. దానివల్ల ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కూడా రూ.55వేలకోట్లనుంచి రూ.30వేలకోట్లకు తగ్గుతుందన్నారు. పోలవరం వ్యయంలో రూ.25వేలకోట్లను మిగుల్చుకోవడానికి సిద్ధ పడిన ముఖ్యమంత్రి జగన్, అంతిమంగా రాష్ట్ర రైతాంగంప్రయోజనా లను కేసీఆర్ కు తాకట్టుపెట్టడానికి సిద్ధపడ్డాడన్నారు. పోలవరం ఎత్తుని 135 అడుగులకే పరిమితంచేస్తే, ప్రాజెక్ట్ లో నీటినిల్వ సామర్థ్యం కూడా 194 టీఎంసీలనుంచి 115టీఎంసీలకే పడిపోతుం దన్నారు. 115 టీఎంసీలసామర్థమంటే అది కేవలం డెడ్ స్టోరేజ్ కే పరిమితమవుతుందని, దానివల్లబహుళార్థ సాథక ప్రాజెక్ట్ నిర్మాణ మనేది ఎందుకూ కొరగాకుండాపోతుందన్నారు.

గోదావరి జలాల నుసద్వినియోగంచేసుకోవాలన్న గతప్రభుత్వఆలోచనలన్నీ నీరు గారిపోయేలా ఇప్పుడున్న పాలకులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ ఎత్తుతగ్గిపుంతో విశాఖపట్నం పారిశ్రామిక, తాగునీటి అవసరాలకు వినియోగించుకుందామనుకున్న 23.44 టీఎంసీల నీరుకూడా రాకుండాపోతుందని రామానాయుడు స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ఎత్తు తగ్గించడంద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా, ప్రకాశం జిల్లా సోమశిలకు నీటితరలింపుకూడా నిలిచిపో తుందన్నారు. దానితోపాటే, గోదావరి జలాలనురాయలసీమకు తరలించడం కూడా కలగానే మిగులుతుందన్నారు. కేసీఆర్ తో జగన్ చేసుకున్న చీకటిఒప్పందంకారణంగా, పోలవరం ప్రాజెక్ట్ బలి కాబోతోందన్నారు. తనక్విడ్ ప్రోకోలోభాగంగా, పోలవరంప్రాజెక్ట్ ని కేసీఆర్ కు తాకట్టుపెట్టడానికి అదేమీ జగన్ అబ్బసొత్తకాదని నిమ్మల తేల్చిచెప్పారు. జగన్ దుర్మార్గపు చర్యలపై రాబోయే రోజుల్లో రాష్ట్రరైతాంగంతో కలిసి, పోరాటంచేయడానికి కూడా టీడీపీ వెనుకాడదని నిమ్మలతేల్చిచెప్పారు. ప్రాజెక్ట్ఎత్తు తగ్గించాలే ఆలోచనకేంద్రానికి లేదన్ననిమ్మల, ఎత్తుతగ్గింపునకు సంబంధిం చిన ప్రపోజల్స్ వెదిరేశ్రీరామ్ రెడ్డి, ఆయనభార్య శిల్పా రెడ్డిలు కేంద్రానికి అందచేశారని విలేకరులు అడిగినప్రశ్నకు సమాధానంగా నిమ్మల అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి16న జరిగిన సమావేశంలో, శ్రీరామ్ రెడ్డి, శిల్పారెడ్డి లు ఇచ్చిన నివేదికను జగన్ ప్రభుత్వం తక్ష ణమే బహిర్గతంచేయాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను, జగన్ తోసిపుచ్చకపోవ డంకూడా పలుఅనుమానాలకు తావిస్తోందన్నారు.

మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పోస్కో విషయంలో విజయసాయి రెడ్డి టార్గెట్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాటల్లో ? "ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, ముఖ్యమంత్రి ఏంచేశాడనేది పట్టాభిగారు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇంతజరిగినా విజయసాయిరెడ్డి తనకేమీ తెలియనట్లు ఇప్పటికీప్రజలను మభ్యపెడుతూనేఉన్నాడు. ఇవన్నీ ఏ1, ఏ2లసమక్షంలోజరిగిన చీకటి ఒప్పందాలు. వారిస్వప్రయోజ నాలకోసం స్టీల్ ప్లాంట్ ను తాకట్టుపెట్టడానికి సిద్ధమయ్యారు. ఒక వ్యాపారవేత్త, దొంగ, అవినీతిపరుడు ముఖ్యమంత్రి అయితే, రాష్ట్ర సంపదఏమవుతుందో చెప్పడానికి విశాఖస్టీల్ ప్లాంట్ ఉదంతం ఒక్కటిచాలు. విశాఖపట్నంస్టీల్ ప్లాంట్ ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే ఏర్పడింది. మరెందరో రైతులు ప్లాంట్ నిర్మాణానికి భూములిచ్చారు. అటువంటి ప్లాంట్ ను కొట్టేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా అర్థంచేసుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకో వాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉంది. విజయసాయిరెడ్డి పార్లమెం ట్ లోఅడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పష్టంగా సమాధానం చెప్పినా కూడా,సిగ్గులేకుండా ఏ2ఇక్కడ పాదయాత్రలుచేస్తున్నాడు. 2019 అక్టోబర్ లోనే పోస్కో కంపెనీతో, ఆర్ఐఎన్ఎల్ ప్రైవేటీకరణ పై ఒప్పందం జరిగిందని కేంద్ర మంత్రి స్పష్టంగాచెప్పారు. ప్లాంట్ లో పోస్కో వాటా 50శాతముంటుందని, ఈ వ్యవహారానికి సంబంధించి పోస్కోవారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారని, అందుకు రాష్ట్రప్రభుత్వం కూడా అంగీకరించిందని కేంద్ర మంత్రి పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారు. ఇంతజరిగినా విజయసాయి తనకపట నాటకాలు మానుకోలేదు. పోస్కోప్రతినిధులు తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలనుకూడా తాము విలేకరులకు చూపించాము. చీకటి ఒప్పం దాలు జరిగాక, పోస్కో కంపెనీ సీఈవోను సన్మానించారు కూడా. ఎంతోమంది త్యాగాలతో ఏర్పడిన విశాఖస్టీల్ ప్లాంట్ ను కాజేయడా నికి పూనుకోవడం సమంజసమేనా? సుమారు లక్షా52వేలకార్మికుల కుటుంబాల పొట్టగొట్టడం ప్రభుత్వానికి భావ్య మేనా అని ప్రశ్నిస్తున్నా. ఈ వ్యవహారానికి సంబంధించి వాస్తవా లు మాట్లాడాము. అక్టోబర్29, 2020న పోస్కోకంపెనీ సీఎండీ, ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యారనేది వాస్తవమా కాదా? ఆసమావేశం ఎందుకుఏర్పాటుచేశారు. విశాఖస్టీల్ ప్లాంట్ ను అమ్మడానికి కాదా? నిజానిజాలేవో ముఖ్యమంత్రి జగన్, విజయసా యిరెడ్డే సమాధానం చెప్పాలి. ఆగస్ట్ 2020లో ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్రంనుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్న రజత్ భార్గవ, సీఎస్ గాఉన్ననీలంసహానీ హాజరయ్యారు.

ఆ సమావేశాని కి వారుముఖ్యమంత్రికి తెలియకుండానేవెళ్లారా? చీకటి ఒప్పందా లుచేసుకొని, చేయాల్సిందంతాచేసి, నంగనాచిలా విజయసాయి రెడ్డి ముసలికన్నీరుకారుస్తూ, విశాఖపట్నంలో పాదయాత్రలు చేస్తున్నాడు. ఆయనకు, ఈముఖ్యమంత్రికి నిజంగా విశాఖస్టీల్ ప్లాంట్ నుకాపాడాలనే చిత్తశుద్ధిఉంటే, వారిపార్టీఎంపీలతో కలిసి ఢిల్లీలోపాదయాత్ర చేయాలి. ఇక్కడ పాదయాత్రలుచేయడం పబ్లిసిటీకోసమే. నిజంగా స్టీల్ ప్లాంట్ నుకాపాడేవారైతే మోదీని కలిసి, సమస్యగురించిచెప్పి, కేంద్రం మెడలువంచాలి. 20సార్లకు పైగా ఢిల్లీవెళ్లిన ముఖ్యమంత్రి విశాఖఉక్కుఫ్యాక్టరీకోసం ఏంసాధించా డు? విశాఖవచ్చికూడా దొంగస్వామీజీలను కలిసి, కార్మికుల వద్ద కురాకుండా పోతాడా ఈ ముఖ్యమంత్రి? కార్మికసంఘాలప్రతినిధు లను ఎయిర్ పోర్టుకు పిలిపించి, అక్కడ మాట్లాడమేంటి? ముఖ్య మంత్రి హోదాలో ఉన్న మూర్ఖుడు, ప్లాంట్ నుకాపాడకుండా, ప్లాంట్ పరిధిలోని 7వేలఎకరాలు అమ్మేస్తే సరిపోతుందని సలహాలిస్తాడా? ఇదేనా ముఖ్యమంత్రిగా ఉన్నవాడు చెప్పాల్సింది? ఇదేం పద్ధతో ఆయనే చెప్పాలి. ముఖ్యమంత్రికి నిజంగా స్టీల్ ప్లాంట్ ను కాపాడాలనే ఆలోచనేఉంటే, తక్షణమే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని తాముసూచించాము. అన్నిపార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి తాముసిద్ధమంటూ ఏకవాక్యంతో తీర్మా నం చేస్తాయని, ఆతీర్మానాన్ని తీసుకొని ఢిల్లీవెళ్లి పోరాడాలని కూడా తాముచెప్పడం జరిగింది. ఆపనిచేయడానికి కూడా ముఖ్యమంత్రి కి తీరికలేదా? రాష్ట్రఎంపీలను తీసుకొని ఢిల్లీ వెళ్లాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై లేదా? ప్రధాని ముందు గట్టిగా మాట్లడటానికి జగన్ కు భయమా....బొక్కలో వేస్తారని భయపడుతున్నాడా? ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? ప్రధానమంత్రి విశాఖస్టీల్ ప్లాంట్ తో పాటు, భారతదేశంలోని కర్మాగారాలన్నింటినీ ప్రైవేటైజేషన్ చేస్తున్నామని మొన్ననే చెప్పారు. కేంద్రప్రభుత్వమంటే వ్యాపారసంస్థకాదు, మా లక్షం సంక్షేమం, అభివృద్ధేనని చెప్పిన ప్రధాని ప్రైవేటైజేషన్ చేస్తాన నడం ఏమిటి? అదానీకో, మరొకరికో అన్నింటినీ అప్పగిస్తారా?

భారతదేశంలోని కర్మాగారాలనుఅమ్మేస్తారా? ఇదేమి పరిపాలన? ప్రధానమంత్రి వ్యాఖ్యలపై సమాధానంచెప్పాల్సిన బాధ్యత ముఖ్య మంత్రి జగన్ కులేదా? బీజేపీ నాయకలు ప్రధానివ్యాఖ్యలపై మాట్ల డరా? సోమువీర్రాజు గారుఢిల్లీ వెళ్లి కూడా ప్రధానిని ఎందుకు కలవ లేకపోయారు? అమిత్ షానుకలిస్తే, స్టీల్ ప్లాంట్ గురించి మీకెందుకు, మీరు వెళ్లండి అని బీజేపీవారితో అన్నారంట. అది నిజమోకాదో, బీజేపీవారే సమాధానంచెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఎందరో పోరాడి సాధించుకున్నది విశాఖ్ స్టీల్ ప్లాంట్. దొంగోడు వచ్చి విశాఖపట్నంలోమకాంవేసి, ఖాళీస్థలాలుఆక్రమిం చుకుంటుంటే, దేవాలయాలభూములను కాజేస్తుంటే, విశాఖ వాసులుచూస్తూ కూర్చుంటారా? మనప్రాంతాన్ని మనం కాపాడుకో వడానికి అందరంకలిసి దొంగలను తరిమికొట్టాలని కోరుతున్నా. విశాఖపట్నానికి ఏం తీసుకొచ్చారో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలి. రైల్వేజోన్, ప్రత్యేకహోదా ఏమైంది. మున్సిపల్, కార్పొరేష న్ ఎన్నికల్లో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ల గూబగుయ్ మనేలా విశాఖ, ఉత్తరాంధ్ర ప్రజలు సమాధానంచెప్పాలి. రెండేళ్లపాటు అమరావతినిసర్వనాశనంచేసిన వారికి ఎన్నికలురాగానే అక్కడ అభివృద్ధిచేయాలని గుర్తుకొచ్చింది. ఇంకెన్నాళ్లు చెబుతారు ఇలా దొంగమాటలు. శ్మశానమని, ఎడారని చెప్పిన మాటలు ప్రజలు మర్చిపోలేదు. విశాఖస్టీల్ ప్లాంట్ కోసం దీక్షలుచేస్తున్న కార్మికులు ఎవరూ కూడా దొంగోడు విజయసాయిరెడ్డి మాటలు నమ్మకండి. ఉత్తరాంధ్ర వైసీపీనేతలు, మంత్రులుకూడా విశాఖస్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రివద్దకు వెళ్లాలి. వారంతా ఆయన చేసేది తప్పని గట్టిగాచెప్పాలి. తుమ్మితే ఊడిపోయే పదవులకోసం ప్రజలను మోసగించకండి, రాష్ట్రసంపదను స్వాహ చేయకండి. సాక్ష్యాధారాలతోసహా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారాన్ని, జగన్ మోసాన్ని బయటపెట్టిన పట్టాభిగారికి ధన్యవాదాలు తెలుపుకుం టున్నాను. 5 వతేదీన జరిగే బంద్ లో టీడీపీతో పాటు, అన్నిపార్టీల వారు పాల్గొనితీరడమనేది ఆయాపార్టీలు, ప్రజలందరి బాధ్యత. బంద్ లోప్రజలంతా పాల్గొని విజయవంతంచేయాలని కోరుతున్నా.

విశాఖ ఉక్కుప్రైవేటీకరణకు సంబంధించి జగన్ ఆయన ప్రభుత్వం సాగించిన కుట్రలను, తెరవెనుకసాగిస్తున్న బాగోతాన్ని టీడీపీ నేతలు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మరియు శ్రీ పల్లా శ్రీనివాసరావు తదితరులు నేడు మీడియాముఖంగా బహిర్గతం చేశారు. ఆ వివరాలు... "కొమ్మారెడ్డి పట్టాభిరామ్ : రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించి చేయాల్సిందంతా చేసి, పచ్చి అబద్ధాలతో ఏవిధంగా ప్రజలను మోసగించడానికి కట్టుకథలు చెబుతున్నారో, మోసపూరితమాటలతో ఇంకారాష్ట్రప్రజలను మభ్యపెట్టే కార్య క్రమాలను ఎలాసాగిస్తున్నారో ఆధారాలతోసహా నేడు మీడియావారి సమక్షంలో వివరించబోతున్నాము. ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఇంతనీచానికి ఒడిగట్టి, రాష్ట్రసంపదైన విశాఖఉక్కు కర్మాగారాన్ని తనఅవినీతికోసం తాకట్టుపెట్టగలడా అనిచూస్తే, మాకేఆశ్చర్యంకలిగింది. ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయినమొదటినెల (జూన్ 2019) నుంచీ ఏరకంగా విశాఖఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకుట్రలో భాగస్వామి అయ్యాడో ప్రజలముందుంచుతున్నాను. జూన్ 22 - 2019నపోస్కో కంపెనీ ప్రతినిధులతోప్రత్యేకంగా సమావేశమై, విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రకు జగన్ రెడ్డి తెరలేపడం జరిగింది. ఆసమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఈ ఒప్పందంలో పోస్కో కంపెనీవారితో, తనవాటాలపై ముఖ్యమంత్రి ఒకఒప్పందానికి రావడం జరిగింది. ఇది జరిగిన తరువాతనే, జూలై 2019లో పోస్కోకంపెనీవారు, కేంద్ర ఉక్కుశాఖాకార్యదర్శి బినయ్ కుమార్ గారినికలిసి, విశాఖ ఉక్కు కర్మాగారం వాటాల కొనుగోలుకు సంబంధించి, ప్రతిపాదనను అందించడం జరిగింది. సెప్టెంబర్ 2019లో విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా కేంద్రఉక్కుశాఖామంత్రి ధర్మేంద్రప్రదాన్ గారితో సమావేశ మయ్యారు. ఈ సమావేశం తరువాత మరుసటినెల అక్టోబర్ 2019లో, పోస్కోకంపెనీకి ఆర్ఐఎన్ఎల్ (విశాఖ స్టీల్ ప్లాంట్) కు మధ్యనఒప్పందంపై సంతకాలుజరిగాయి. నవంబర్8, 2019న కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ రాష్ట్ర పర్యటనకువచ్చి అమరావతిలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. సమావేశమైన తరువాతి రోజు, విశాఖపట్నంవెళ్లిన కేంద్రమంత్రి విశాఖ ఉక్కుఫ్యాక్టరీకి సంబంధించి ప్రైవేట్ పార్టనర్ షిప్ ఎంతోఅవసరమని మాట్లాడతారు. వైసీపీఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్టాండింగ్ కమిటీఆన్ స్టీల్ లో సభ్యుడిగా ఉన్నారు. సదరు కమిటీ డిసెంబర్ 6, 2019న విడుదలచేసిన నివేదికలో, విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ పరిధిలో జరుగుతున్న అనేక అభివృద్ధికార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది.

ఆప్రాజెక్టులు అన్నీపూర్తయితే విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిలో పడుతుందని చాలాస్పష్టంగా, వైసీపీ ఎంపీ వేమిరెడ్డిప్రభాకర్ రెడ్డి సభ్యుడిగా ఉన్న స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ నివేదికలో చెప్పడం జరిగింది. రూ.2,500కోట్లతో జరుగు తున్న ప్రాజెక్టులన్నీ పూర్తయితే, ఆర్ఐఎన్ఎల్ (విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ) కష్టాలన్నీ తీరిపోతాయని స్పష్టంగా చెప్పడం జరిగింది. స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ విభాగం తననివేదిక సమర్పించాక, రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిబ్రవరి -2020లో అడిగిన ప్రశ్నకు (ప్రశ్ననెం-474) సమాధానంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధిం చిన ఒప్పందం జరిగిపోయిందన్నారు. ఆరోజే స్పష్టంగా కేంద్రమంత్రి ప్రైవేటీకరణ తాలూకాఒప్పందం జరిగిపోయిందని చెబితే, సంవ త్సరం క్రితమే తనకుతెలిసిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు తొక్కిపెట్టారు? ప్రజలముందు వాస్తవాలు ఉంచకుండా, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాటంచేయకుండా, ఎందుకు మౌనంగా ఉన్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. వేమిరెడ్డిప్రభాకర్ రెడ్డి సభ్యుడిగా ఉన్న స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ విభాగమేమో, రూ.2,500కోట్లతో జరుగుతున్న ప్రాజెక్టులు పూర్తయితే, విశాఖ ఉక్కుఫ్యాక్టరీ గాడిలో పడుతుందని నివేదిక ఇస్తుంది. ఆ తరువాత పార్లమెంట్లోనేమో కేంద్రమంత్రి ఒప్పందం జరిగిపోయిందని చెబితే, అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమీ తెలియనట్లు మౌనంగా ఉంటారు. స్టాండింగ్ కమిటీఆన్ ఇండస్ట్రీస్, (పెట్టబడుల ఉపసంహరణకు సంబంధించిన కమిటీ) లో వైసీపీ ఎంపీ వై.ఎస్. అవినాశ్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. మార్చి3, 2020న అవినాశ్ రెడ్డి సభ్యుడిగా ఉన్న కమిటీ పెట్టుబుడుల ఉపసంహరణకు సంబంధించిన నివేదికను విడుదలచేస్తుంది. ఆసమయంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ విశాఖఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకుతాలూకా ఒప్పందం జరిగిపోయిందనే అంశాన్ని, పెట్టుబడుల ఉపసంహరణ కమిటీలో సభ్యుడైన అవినాశ్ రెడ్డి ఎందుకు లేవనెత్తలేదు? అవినా శ్ రెడ్డి ఎందుకు నోరూమూసుకొని కూర్చున్నాడు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి బాధ్యతగల ఎంపీగాఉన్నవ్యక్తి ఎందుకు ప్రశ్నించ లేదు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అవినాశ్ రెడ్డి కీలకమైన కమిటీల్లో ఉండికూడా, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరెత్తకుండా కూర్చోవడానికి కారణం జగన్ రెడ్డి ఆదేశాలే. ఆర్ఐఎన్ ఎల్ కు , పోస్కోకు మధ్యన ఒకవర్కింగ్ గ్రూపు ఏర్పాటుచేయాలని ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆగస్ట్ 2020లో ఆదేశాలిచ్చారు. కేంద్రమంత్రి ఆదేశించినప్పుడు కూడా వైసీపీఎంపీలు మాట్లాడలేదు.

అక్టోబర్ 26న ఆర్ఐఎన్ఎల్ కి, పోస్కోకి మధ్యన జాయింట్ వర్కింగ్ గ్రూపు అనేది ఏర్పాటైంది. అదిఏర్పాటైన రెండురోజుల్లోనే పోస్కోప్రతినిధులు మరలా ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పోస్కో ప్రతినిధులు, విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు సంబంధించిన కీలకఘట్టాలకు ఒక రోజు ముందో, ఒకరోజు తర్వాతో జగన్ తోగానీ, విజయసాయితో గానీ సమావేశమయ్యారు. ఏకుట్రలో భాగంగా ఏ1, ఏ2లు పోస్కో వారితో సమావేశాలు జరిపారోచెప్పాలి. డిసెంబర్ 17-2020న విజయసాయిరెడ్డి, మరలా ఢిల్లీలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రదాన్ ను కలిశారు. ఆ తరువాత జనవరి 25-2021కి సెంట్రల్ కేబినెట్ కమిటీ ఆన్ఎకనామిక్ఎఫైర్స్, నూటికినూరుశాతం పెట్టుబడుల ఉపసం హరణ ప్రక్రియకు ఆమోదం తెలుపుతుంది. జూన్ లో పోస్కో వారు ముఖ్యమంత్రినికలుస్తారు. జూలైలోప్రపోజల్ ఇస్తారు, సెప్టెంబర్ లో విజయసాయిరెడ్డి వెళ్లి ధర్మేంద్రప్రధాన్ ను కలుస్తాడు. అక్టోబర్ లో ఎంవోయూ (ఒప్పందం) అయిపోతుంది. డిసెంబర్ లో స్టాండింగ్ కమిటీవారు రిపోర్ట్ ఇస్తారు, నవంబర్8న ముఖ్యమంత్రిని ధర్మేంద్రప్రధాన్ గారు విజయవాడలో కలుస్తారు, ఆమరుసటి రోజే కేంద్రమంత్రి విశాఖకువచ్చి ప్రైవేట్ ఈక్వీటీలగురించి మాట్లాడతారు, అక్టోబర్ లో వర్కింగ్ గ్రూప్ ఏర్పాటైతే, రెండ్రోజుల్లోనే పోస్కో ప్రతినిధులు వెళ్లి జగన్ రెడ్డిని కలుస్తారు. నవంబర్ లో మరలా విజయసాయిరెడ్డి వెళ్లి ధర్మేంద్రప్రదాన్ ను కలుస్తారు, జవనరిలో మొత్తం క్లియరెన్స్ వస్తుంది. జగన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏవిధంగా అమ్మకానికిపెట్టాడో, ఏవిధంగా కుట్రలోభాగస్వామి అయ్యాడో మొత్తం చరిత్రంతా ఇదీ. తేదీలు, ఆధారాలతో సహా తమ పార్టీ మొత్తంవ్యవహారాన్ని బయటపెట్టింది. దీనిపైముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతాడో చెప్పాలి. చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఆర్ ఐఎన్ఎల్ కు సొంతఇనుపఖనిజ గనులుకేటాయించడానికి కృషిచే శారు. విశాఖపట్నలో జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్ లో ఆర్ ఐఎన్ఎల్, ఏపీఎండీసీ (ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) మధ్యన ఇదే అంశంపై ఒప్పందం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలోని కుకునూరు ఐరన్ ఓర్ గనులను ఆర్ఐ ఎన్ఎల్ కు కట్టబెట్టడానికి నాటిముఖ్యమంత్రి సమక్షంలోనే ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. ఆర్ఐఎన్ఎల్ ను కాపాడటానికి చంద్రబాబు కృషిచేసింది నిజంకాదా?

ఆనాడు ఒప్పందం జరిగినప్పుడు ఆర్ఐఎన్ఎల్ సీఎండీగాఉన్న మదుసూధన్ , కుకునూరు ఐరన్ ఓర్ గనులను కేటాయించి, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడటానికి ముందుకొచ్చిన చంద్రబాబునాయుడిగారికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ కుకునూరు గనుల కేటాయింపువ్యవహారం నీతి అయో గ్ వద్ద ఇప్పటికీ పెండింగ్ లోఉంది. ఫిబ్రవరి 2021న, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సభ్యుడిగాఉన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ స్టీల్ వారు ఇచ్చిన నివేదికలో, కుకునూరు ఐరన్ఓర్ గనులను అప్పగిస్తే, ఆర్ఐఎన్ఎల్ కుఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పడం జరిగింది. వైసీపీఎంపీ వేమిరెడ్డి సభ్యుడిగా ఉన్న కమిటీ నే, కుకునూరు ఐరన్ ఓర్ గనులను కేటాయిస్తే, సమస్య తీరిపోతు దని చెప్పినా ముఖ్యమంత్రి ఆదిశగా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేలేకపోయారు. ప్రధానమంత్రికి లేఖ రాశానంటున్న జగన్ , ఆ లేఖలో ఈఅంశాన్ని ఎందుకుప్రస్తావించలేదు. ఇటీవలే నీతి అయోగ్ తో సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వారివద్ద విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు? కుకునూరు ఐరన్ ఓర్ కేటాయింపుల వ్యవహారం గురించి నీతి అయోగ్ వద్ద జగన్ రెడ్డి ఎందుకు ప్రస్తావించలేదు? ఎందుకంటే ఆయనకు ఆర్ఐఎన్ఎల్ (విశాఖస్టీల్ ఫ్లాంట్) నాశనం కావాలి. దాన్ని తన రాజకీయాలకు వాడుకోవాలి. అందుకే ఇంతజరుగుతున్నా తనకేమీ తెలియనట్లు జగన్ రెడ్డి నటించాడు, ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు. పోస్కోతో ఒప్పందాలు జరిగాక, దానికి ముందో , వెనకో వారు విజయసాయిరెడ్డితోనో,జగన్ రెడ్డితోనో సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి ధర్మేంద్రప్రధాన్ గారిని కలిసి, మేముపోస్కోవారి తో మాట్లాడుకున్నాము, మీరు ఒప్పందాలు కానివ్వండని చెప్పాకే ఒప్పందాలు జరిగాయి. నవంబర్ 8న ధర్మేంద్రప్రధాన్ గారు తాడేప ల్లిలో ముఖ్యమంత్రిని కలిశారా లేదా....తరువాతిరోజు విశాఖకు వచ్చి ప్రైవేటైజేషన్ అవసరమవుతుందని చెప్పారా లేదా?

అక్టోబర్ 26,2020న పోస్కో, ఆర్ఐఎన్ఎల్ మధ్య వర్కింగ్ గ్రూపు ఏర్పాటైం దా లేదా? తరువాత వెంటనే పోస్కోవారు జగన్ రెడ్డిని ఎందుకు కలిశారు? మనిద్దరి వర్కింగ్ గ్రూపుఏమిటో చర్చించుకుందామని చెప్పివారు ముఖ్యమంత్రిని కలిశారా? ఇలా అనేక విషయాలున్నా యి.వాటి వెనుక ఎవరెవరున్నారో ప్రజలకు తెలియాలి. జగన్ రెడ్డి, రాష్ట్రభవిష్యత్ ను తాకట్టుపెట్టి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడా నికి సిద్ధమయ్యాడనడంలో సందేహమేలేదు. చంద్రబాబునాయుడు గారు, ఆర్ఐఎన్ఎల్ ను కాపాడటానికి కుకునూరు ఐరన్ ఓర్ గను లను కేటాయించడానికి, ఏపీఎండీసీకి,ఆర్ఐఎన్ఎల్ కుమధ్యన ఒప్పందం చేశారా లేదా? ఆ వ్యవహారం నీతిఅయోగ్ వద్ద పెండింగ్ లోఉంటే, నీతి అయోగ్ సమావేశంలో జగన్ రెడ్డి, ఆవిషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? ప్రధానమంత్రికి జగన్ రాసిన లేఖలో ఏముంది? కుకునూరు ఐరన్ఓర్ గనులనుకేటాయించాలని ఎందుకు లేఖలోప్రస్తావించలేదు? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, నీతి అయోగ్ సమావేశంలో నోరెత్తాలికదా? చెక్కభజన చేయడానికి సమావేశానికి వెళ్లాడా ఈముఖ్యమంత్రి? ఎందుకు నీతి అయోగ్ వారిని ప్రశ్నించలేదు? ఆర్ఐఎన్ఎల్ ను చంద్రబాబునాయుడు గారుకాపాడే ప్రయత్నంచేస్తే, జగన్ దాన్ని చంపేసేప్రయత్నాలు చేస్తున్నాడు. హుద్ హుద్ సమయంలో కొన్నిగంటల వ్యవధిలోనే చంద్రబాబుగారు, ఆర్ఐఎన్ఎల్ కు విద్యుత్ సరఫరాను పునరుద్ధరింపచేశారు. చంద్రబాబునాయుడుగారు బాగుచేయాలని చూస్తుంటే, ఈయనేమో అన్నీ ధ్వంసంచేయడానికి ప్రయత్ని స్తున్నాడు. ఎందుకంటే, ముఖ్యమత్రికి కళ్లుమూసినా, తెరిచినా స్టీల్ ప్లాంట్ కుచెందిన ఏడువేల ఎకరాలే గుర్తుకొస్తున్నాయి.

సరెండర్ అయ్యాడుకాబట్టే, ఈముఖ్యమంత్రి రాష్ట్రంగురించి మాట్లాడటంలేదు? ఇటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి రాష్ట్ర చరిత్రలోనేలేడు. జగన్ రెడ్డి ఆశీర్వాదంతో, ఆర్ఐఎన్ఎల్ కు , పోస్కోకు మధ్యజరిగినఒప్పందంప్రకారం, మొదటిదశలో 1167 ఎకరాలను ఇచ్చేటట్టు, అదిచాలకపోతే, తరువాత మరింత భూమి ఇచ్చేలా ఒప్పుకున్నారు. అమరావతి అంకురార్పణలో భాగంగా సింగపూర్ ప్రభుత్వసహాయసహాకారాలు రూపాయిఖర్చులేకుండా నాటిముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పొందగలిగారు. జగన్ రెడ్డే మో, విశాఖస్టీల్ ప్లాంట్ భూములను, పోస్కోకు ధారాదత్తం చేసి, వాటికి సంబంధించి ఏవైనా వివాదాలుతలెత్తితే, సింగపూర్ వెళ్లి న్యాయపోరాటంచేసేలా ఒప్పందాలుచేసుకున్నారు. మన రాష్ట్రంలోని ఆస్తులకుసంబంధించి వివాదాలుతలెత్తితే, వాటిని పరిష్కరించుకోవడానికి దేశంలోని న్యాయస్థానాలుసరిపోవా? సింగపూర్ వరకువెళ్లి, పోరాడాలా? ఇదా జగన్ చేస్తున్న ఘనకార్యం. ఈవిధంగా చేయాల్సిన కుట్రలన్నీచేసి, ఆర్ఐఎన్ఎల్ ను పోస్కోకు అప్పగించిన తొలిముద్దాయి జగన్ రెడ్డి. ఆయన చేసిన కుట్రంతా ప్రజలముందుపెట్టాము. దమ్ము,ధైర్యముంటే, ఆయనే ప్రజలముందుకువచ్చి సమాధానంచెప్పాలి. ఆధారాలులేకుండా, తెలుగుదేశం నాయకులమని ఏదిపడితే అది తాము మాట్లాడటంలేదు. దొంగపేపర్, దొంగఛానల్ చేతిలో ఉన్నాయికదాఅని వాళ్లలా బురదజల్లే అలవాటుమాకు లేదు. ఏదైనాన్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఆధారాలతోనే మాట్లాడతాము. మాపై ఎన్నిదాడులు చేసినా, ఎంతలా భయపెట్టాలనిచూసినా భయపడేదే లేదు. ఇప్పటికే రెండుసార్లు నాపై దాడిచేశారు. ఇప్పడు స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వాస్తవాలుచెప్పానని మూడోసారి దాడిచేయడానికి సిద్ధమవుతున్నారు. అయినా వెనకడుగువేసేది లేదు. మేమంతా కలిసికట్టుగా రాష్ట్రప్రజలకోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టంచేస్తున్నాము.

శ్రీకాకుళం జిల్లా పలాసమున్సిపాలిటీలో టీడీపీకిచెందిన నలుగురు కౌన్సిలర్లను, అత్యంతహేయంగా, నీచాతినీచంగా వైసీపీవారు తమ అభ్యర్థులని చెప్పి వారిని అధికారపార్టీలో చేర్చుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 4 వవార్డుకి చెందిన వావిళ్లపల్లి శ్రీనివాసరావు, 8వ వార్డుకి చెందిన రోణంకి మురళీకృష్ణ, 20వవార్డుసభ్యుడైన బమ్మిడి వెంకటలక్ష్మి, 29వవార్డుకి చెందిన సనపాలహరిలు గతమార్చిలోనే టీడీపీతరుపున నామినేషన్లు వేశారన్నారు. టీడీపీవారికి బీఫామ్ లుకూడా ఇచ్చిందన్నారు. పలాసమున్సిపాలిటీ టీడీపీ వశమయ్యే అవకాశాలు మెండుగాఉన్నాయన్న టీడీపీనేత, టీడీపీనుంచి వైసీపీలో చేరిన అభ్యర్థులకు చెందిన నాలుగువార్డుల్లో కచ్చితంగా టీడీపీయే గెలుస్తుందన్నారు. ప్రత్యేకించి 20, 29వార్డుల్లో టీడీపీ గెలుపుతథ్యమని, మిగిలిన రెండువార్డుల్లో వైసీపీ గట్టిపోటీ ఇస్తుంది తప్ప, గెలవలేదన్నారు. మున్సిపాలిటీ టీడీపీకి దక్కుతుందని తెలిసే, అధికారపార్టీ ఈ విధంగా పార్టీ మార్పిడులను ప్రోత్సహించిం దన్నారు. టీడీపీ తరుపున బీఫాములు తీసుకున్నవారికి వైసీపీ కండువాలు వేసినంతమాత్రాన వారు వైసీపీఅభ్యర్థులు అవుతారా అని అశోక్ బాబుప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలప్రకా రం, బీఫామ్ లు తీసుకొని నామినేషన్లు వేసినవారుచనిపోతేనే, వారిస్థానంలో కొత్తవారికి అవకాశం ఉంటుందన్నారు. నిన్నటి నుంచి సదరునలుగురు అభ్యర్థులు కనిపించడంలేదని, దానిపై ఈరోజు ఉదయం అలజడి మొదలైందన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలో వారు వైసీపీలో చేరినట్లు వార్తలొచ్చాయని వారికి ఏమిఆశచూపించి, ఎంతలాభయపెట్టి, అధికారపార్టీలో చేర్చుకున్నారో తెలియాల్సి ఉందన్నారు. పలాసమున్సిపాలిటీ ఓడి పోతే ఏమవుతుందని వైసీపీ ఇంతలా బరితెగించిందన్నారు. పంచా యతీ ఎన్నికల్లోకూడా టీడీపీ తరుపున గెలిచినఅభ్యర్థులకు అధికా రపార్టీ కండువాలు కప్పి, వారిని భయపెట్టారన్నారు.

ధైర్యం ఉంటే ఎన్నికల్లోపోటీ చేసిగెలవాలిగానీ,ఇటువంటి చీప్ ట్రిక్స్ కు పాల్పడ టం వైసీపీకి తగదన్నారు. టీడీపీ మద్ధతుదారులు ఓట్లువేయకుం డా, వైసీపీలోచేరినంతమాత్రాన సదరు నలుగురు అభ్యర్థులు ఎలా గెలుస్తారన్నారు. అభ్యర్థులు బంధువులు, వారిరక్తంపంచుకు పుట్టిన వారైనాసరే, సైకిల్ గుర్తుకు ఓటువేసేఎవడైనా సరే, ఫ్యాను గుర్తుకు వేయడన్నారు. అవసరమైతే నామినేషన్లు ముందు పార్టీ లుమార్చడం, గెలిచినవారిని భయపెట్టి పార్టీలోకి తీసుకోవడం వంటి చర్యలతోనే అధికారపార్టీ స్థానికఎన్నికల్లో గెలుపును సాధ్యం చేసుకుంటోందన్నారు. పలాస వ్యవహారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిష న్ దృష్టికి తీసుకెళ్లినట్లు, అశోక్ బాబు తెలిపారు. నామినేషన్ పత్రాల్లో టీడీపీతరుపున పోటీచేస్తున్నట్లు సదరుఅభ్యర్థులు ఇప్పటి కే ప్రకటించారని, వారురేపు ప్రచారంలో సైకిల్ పై తిరుగుతూ, వైసీపీ కండువాలు కప్పుకొని ప్రచారంచేస్తారా అని టీడీపీనేత ఎద్దేవాచేశా రు. ఈ విధంగా చేయడం వైసీపీకే చెల్లిందన్న అశోక్ బాబు, గుర్తుపై జరిగే ఎన్నికల్లో ప్రజలను మోసగించడం అధికారపార్టీవల్ల కాదన్నా రు. వైసీపీ దిగజారుడుతనం గురించి చెప్పడానికి మాటలుకూడా సరిపోవడంలేదన్నారు. ప్రజలకు తామేంచేశామో చెప్పుకొని, గెలిచే స్థితిలో వైసీపీలేనందునే, ఇటువంటి ఘటనలకు పాల్పడుతోంద న్నారు. గతంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లలో ఇటువంటి ఘటనలు జరిగేవని, కానీ నేడు వైసీపీప్రభుత్వంలో కొత్తగా చేస్తున్న, సరికొత్త ఘటనలను నేర్చుకోవడానికి ఆయారాష్ట్రాలవారే ఇక్కడకు వచ్చే ప రిస్థితి ఏర్పడిందన్నారు. ఎస్ఈసీ తక్షణమే పలాస వ్యవహారంపై స్పందించి, వైసీపీలో చేరిన నలుగురు అభ్యర్థుల నామినేషన్లు తక్ష ణమే రద్దుచేయాలని కోరబోతున్నాము. ఎస్ఈసీ జోక్యం చేసుకోక పోతే, ఈవ్యవహారం పలాసతో ఆగదన్నారు. నామినేషన్ ఫామ్ లో టీడీపీ తరుపున పోటీచేస్తాననిచెప్పినవారు, వైసీపీలో చేరితో, ఆ ఫామ్ కి ఉన్నచట్టబద్ధత ఏముంటుందన్నారు. వైసీపీ కండువాలు కప్పుకొని టీడీపీపై పోటీచేయడాన్ని తక్షణమే ఎస్ఈసీ నిలువరిం చాలన్నారు. ఇదేప్రహాసనం కొనసాగితే, అంతిమంగా ఓటర్ ఓడిపోతాడన్నారు.

Advertisements

Latest Articles

Most Read