మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు రీజియన్ల వారీగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం పూట అధికారులతోనూ, రాత్రి వివిధ రాజకీయ పక్షాలతోనూ ఆయన సమావేశం కానున్నారు. ప్రత్యేకంగా గుర్తించబడిన కొన్ని ప్రాంతాల్లో, ఎన్నికల కోడ్ను సక్రమంగా అమలు చేసేందుకు స్వేచ్ఛా, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం కోరనున్నారు. ఈనెల 27, 28, మార్చి 1వ తేదీన ఆయన పర్యటన వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఫిబ్రవరి 27వ తేదీన తిరుపతిలో చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన అధికారులతోనూ, రాజకీయ పక్షాలతోనూ ఆయన సమావేశం కానున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 3.15 నిమిషాల నుండి 5.30 గంటల వరకూ అధికారుల తోనూ, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో రాజకీయ పక్షాలతోనూ భేటీ కానున్నారు. అక్కడే బసచేసి మరుసటిరోజు అనగా ఫిబ్రవరి 28న విజయవాడకు చేరుకోనున్నారు. అక్కడ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులతో మధ్యా హ్నం 3.15 నుండి 5.30 వరకూ సమీక్ష నిర్వహించి, సాయంత్రం రాజకీయ పక్షాల నేతలతో సమావేశం కానున్నారు. ఇక మార్చి 1వ తేదీన విశాఖ చేరుకుని అక్కడ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల
అధికారులతో సమావేశంకానున్నారు.

రాత్రికి రాజకీయ పక్షాలతో సమావేశం నిర్వహించనున్నారు. అధికారులతో సమీక్షలో భాగంగా మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అలాగే ఎన్నికల నియమావళి అమలు, ఫోటో గుర్తింపు కార్డులు, అత్యధికంగా ఓటర్లు పాల్గొనేలా చేయడం వంటి అనేక రకాల అంశాలపై ఆయన కూలంకుశంగా చర్చించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. పర్యటన కొనసాగేదిలా.. హైదరాబాద్ నుండి ఈ నెల 27న మధ్యాహ్నం 1.15 గంటలకు విమానంలో బయలుదేరి 2.15 గంటలకు తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా సమావేశానికి హాజరవుతారు. ఆరాత్రికి అక్కడే బసచేసి మరుసటి రోజు అనగా 28వ తేదీ మధ్యాహ్నం 12.20కు రేణిగుంట విమానాశ్రయం నుండి విమానంలో బయలుదేరి 1.20 గంటలకు గన్నవరం విమానా శ్రయానికి చేరుకుంటారు. విజయవాడలో ఏర్పాటుచేసిన అధికారులు, రాజకీయ పక్షాలనేతల సమావేశంలో పాల్గొంటారు. ఆ రాత్రికి అక్కడే బసచేస్తారు. మార్చి 1వ తేదీన గన్నవరం విమానశ్రయం నుండి బయలుదేరి మధ్యామ్నం 1.20 గంటలకు విశాఖ చేరుకుని అక్కడ సమావేశాల్లో పాల్గొంటారు. అదేరోజు రాత్రి 10.45కు విమానంలో బయలుదేరి 12.15కు హైదరాబాద్ చేరుకుంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి, మొదటి ఏడాదిలోనే దెబ్బ పడింది, సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, పరిపాలనలో జరుగుతున్న లోటుపాట్లు ఎత్తి చూపటంతో. తమ పై విమర్శలు చేస్తే, ప్రతిపక్షాల పైనే ఎదురు తిరిగే అధికార పార్టీ నేతలు, సొంత పార్టీ నేతలను వదిలిపెడతారా ? లేదు కదా. కానీ రఘురామరాజు మాత్రం, వన్ మ్యాన్ ఆర్మీ లాగా, సొంత ప్రభుత్వం పై పోరాడుతూనే ఉన్నారు. రచ్చబండలు పేరుతో, ప్రభుత్వాన్ని చాకిరేవు పెడుతున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు ను ఇబ్బంది పెట్టటానికి, ఎప్పుడు దొరుకుతారా అని, అధికార పార్టీ నేతలు ఎదురు చూస్తున్న క్రమంలో, రఘురామకృష్ణం రాజు, తన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ రోజు ఆయన తన నియోజకవర్గంలో పర్యటన చేద్దామని అనుకున్నారు. అయితే, అధికార పార్టీకి చెందిన మంత్రి, కొంత మంది నాయకులు, తన పర్యటనను అడ్డుకుంటానికి స్కెచ్ వేసారని, ఈ క్రమంలో ఏదైనా ఘర్షణ జరిగితే, తన పై కేసు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు.

rrr 260222021 2

దీనికి సంబంధించి, జరిగిన విషయం చెప్పటానికి సియం ఆఫీస్ కు ఫోన్ చేసానని, జగన్ తో మాట్లాడాలని చెప్పినా, గత 24 గంటలుగా తనకు వీలు పడలేదని, ఒక ఎంపీ 24 గంటలుగా ప్రయత్నం చేసినా, సియం అందుబాటులోకి రాలేదు అంటూ, జగన్ వైఖరి పై రఘురామరాజు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న, ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడానికి ప్రయత్నం చేసినా వీలు పడలేదని రఘురామరాజు అన్నారు. ఎంపీగా ఉన్న తనను, తన నియోజకవర్గానికి వెళ్ళనివ్వటం లేదని, ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి ఉంటుందని రఘురామరాజు అన్నారు. తన పై అక్రమ కేసులు పెడుతున్న వారిలో, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి రంగనాథరాజు ఉన్నారని, ఐజికి ఫోన్ చేసి మరీ, ఎలాగైనా తన పై కేసు పెట్టాలని ఒత్తిడి తెస్తున్నారని రఘురామ రాజు అన్నారు. ఒక ఎంపీ పై ఇంత కుట్ర పన్నుతుంటే, మా ముఖ్యమంత్రికి తెలియదు ఏమో అని, ఆయనకు ఫోన్ చేసి చెప్దాం అంటే, రెండు రోజులు నుంచి ఆయనతో మాట్లాడటం కుదరటం లేదని రఘురామరాజు అన్నారు.

జగన్మోహన్ రెడ్డి తన అబద్ధాల చిట్టాకు, సంక్షేమ క్యాలెండర్ అనే పేరుపెడితే, మంత్రులేమో అబద్ధాలతోఊదరగొడుతూ, దేశంలో ఎక్కడా ఇటువంటి పథకాలు అమలుకావడంలేదని చెప్పడం సిగ్గుచేటని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహంవ్యక్తంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోనిపార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. సంక్షేమ క్యాలెండర్ పేరులో మంత్రులు సిగ్గులేకుండా, ప్రజలు ఏమనుకుంటారోనన్న ఆలోచన లేకుండా అబద్ధాలమీద అబద్ధాలు చెబుతున్నారని మర్రెడ్డి మండిపడ్డారు. గోరంత సాయం చేస్తూ, కొండంతప్రచారం చేసుకునే ముఖ్యమంత్రి, మంత్రులను ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. జగన్ అబద్ధాల ప్రచారమనేది సాక్షి మీడియాతోసహా, బ్లూమీడియా మొత్తం భారీస్థాయిలో ఊదర గొడుతోందన్నారు. అమ్మఒడి పథకం పేరుతో రూ.14వేలిస్తున్న జగన్ , అయ్యబుడ్డిద్వారా రూ.36వేలుకాజేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాడో, పన్నులు ఎలా పెంచాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. సంవత్సరానికి రూ.5వేలకోట్లు లిక్కర్ వ్యాపారంలో దోచుకుంటున్న ముఖ్యమంత్రి ఎటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అమలుచేస్తున్నాడో చెప్పాలన్నా రు. సిమెంట్ కంపెనీలను సిండికేట్ చేసిన జగన్, తద్వారా ఎంత ఆర్జిస్తున్నాడో చెప్పాలన్నారు. మద్యంరేట్లను ఇష్టానుసారం పెంచిన జగన్, అన్నాక్యాంటీన్లను తొలగించడంతోపాటు, నిరుద్యోగ భృతిని రద్దుచేశాడన్నారు. విదేశీవిద్యకు ఇచ్చే చెల్లింపులను కూడా తొలగించాడన్నారు. టీడీపీప్రభుత్వం అమలుచేసిన 36సంక్షేమ పథకాలను రద్దుచేసిన జగన్, కొత్తగా సంక్షేమపథకాల క్యాలెండర్ విడుదలచేస్తున్నానంటూ డబ్బాలు కొట్టుకునే పని మొదలుపెట్టా డని మర్రెడ్డి ఎద్దేవాచేశారు.

జగన్ కు తానొక బహిరంగ సవాల్ విసురుతున్నానన్న శ్రీనివాస రెడ్డి, రాష్ట్రంలో 5కోట్లమంది జనాభాఉంటే, 5కోట్ల1లక్షమందికి తన సంక్షేమక్యాలెండర్ అమలుచేయబోతున్నట్టు ముఖ్యమంత్రి నేడు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడన్నారు. ఆయన ప్రకటనలకు, వాస్తవానికి ఎక్కడైనా పొంతనకుదురుతుందా అని టీడీపీనేత ప్రశ్నించారు. జగన్ ప్రకటనలు నమ్మడానికి ఏమాత్రమైనా అవకాశ ముందా అని శ్రీనివాసరెడ్డి నిలదీశారు. విద్యారుణాలు, 2019 రబీ, 2020ఖరీఫ్, 2020 రబీకిరుణాలు ఇస్తాననడం విడ్డూరంగా ఉంద న్నారు. అయిపోయిన 2019 రబీకి ఇప్పుడు రుణం ఇస్తున్నట్లు, తద్వారా కోటి20లక్షల మంది రైతాంగానికి మేలుచేస్తున్నట్లు ప్రకటనల్లో చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెబుతుంటే, మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా,ప్రజలు నిలదీస్తారనే ఇంగితంలేకుండా బాకాలు ఊదడం ఎంతమాత్రం మం చిదికాదన్నారు. ఎన్నికలువచ్చినప్పుడే, జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంక్షేమం గుర్తుకొస్తుందన్నారు. ప్రభుత్వ ఖజానాలోని సొమ్ముని, తన సొంతఖజానాకు బదిలీచేసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి పథకా లు అమలుచేస్తున్నాడుతప్ప, ప్రజల మేలుకోసం కాదని శ్రీనివాస రెడ్డి తేల్చిచెప్పారు. అమ్మఒడికి ఇచ్చిన సొమ్ముని తల్లులు వివిధ రూపాల్లో దుర్వినియోగంచేస్తుంటే, విద్యార్థుల చదువులుఎలా కొనసాగుతాయన్నారు. అమ్మఒడిద్వారా జగన్ ఇచ్చే రూ.14వేల సొమ్ము, 80శాతానికి పైగా తిరిగి సారాకొట్లద్వారా జగన్ సొంత ఖజానాకే చేరుతున్నాయన్నారు. ప్రభుత్వ ధనాన్ని లూఠీచేయడా నికి, అవినీతిపరుడిననే ముద్ర పోగోట్టుకోవడానికే, జగన్ ప్రభుత్వ సొమ్ముని పథకాలపేరుతో సొంతఖజానాకు చేర్చుకుంటున్నాడన్నా రు. ఇళ్లపట్టాల పంపిణీపేరుతో తక్కువధరకు భూములుకొని, వాటిని ఎక్కవధరకుప్రభుత్వానికి అంటగట్టిన జగన్, వాహనమిత్ర పేరుతో డ్రైవర్లకు రూ.10వేలుఇచ్చినట్లేఇచ్చి, తెల్లారగానే పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశాడన్నారు. అంతటితోఆగకుండా, ఆర్టీవో అధికారులతో తప్పుడుకేసులుపెట్టించి, వాహనదారులనుంచి పదికి పది అదనంగా వసూలుచేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిం దన్నారు. 2019, 2020లో రైతులు తీసుకున్నరుణాలకు సున్నా వడ్డీని ఇంతవరకు చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో 15లక్షలమంది కౌలు రైతులుంటే, వారికిసున్నావడ్డీ పథకంతోపాటు, రుణ సౌకర్యమే లేకుండా పోయిందన్నారు.

కౌలురైతుల సంఖ్యను లక్షకు కుదించి, వారికి ఎటువంటిరుణం అందకుండాచేశాడన్నారు ఒక రైతుకు రెండేళ్లకు ఇచ్చేమొత్తాన్ని ఒకక్యాలెండర్ లో ప్రకటించి, వారికి మేలుచేస్తున్నట్లు జగన్ చెప్పుకుంటున్నాడన్నారు. నిత్యా వసరాల ధరలు విపరీతంగా పెంచిన జగన్, బ్లాక్ మార్కెట్ ను అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నాడన్నారు. ఇసుకలేక ఉపాధిదొరక్క కార్మికులు రోడ్డునపడితే, వారి సంక్షేమ నిధిసొమ్ము నికూడా జగన్ దిగమింగాడన్నారు. వడ్డీలేని డ్వాక్రారుణాలు పొంద డానికి రాష్ట్రంలో ఎన్నిడ్వాక్రా గ్రూపులు అర్హత సాధిస్తున్నాయో, ఇచ్చేసొమ్ముకి ఎన్ని కొర్రీలు పెడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. దర్జీలకు, రజకులకు, నాయీబ్రాహ్మణులకు గతంలో టీడీపీ ప్రభుత్వం చేయూత, ఆదరణ పథకాల పేరుతో రూ.లక్షవరకు ఇస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూ.10వేలు చేతిలో పెట్టి సంక్షేమపథకాలు ఇచ్చానని చెప్పుకుంటున్నాడన్నారు. విదేశాలకువెళ్లి చదువుకునే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ విద్యార్థు లకు చంద్రబాబుప్రభుత్వం రూ.10లక్షలవరకు రుణమిస్తే, దాన్ని జగన్ రద్దుచేశాడన్నారు. జీవోనెం-77పేరుతో విద్యార్థులకు ఇవ్వా ల్సిన ఫీజురీయింబర్స్ మెంట్ ను కూడా ముఖ్యమంత్రి తొలగించా డన్నారు. ఈవిధంగా అనేకపథకాలు రద్దుచేయడం, ఉన్నవాటికి కోతలు పెట్టడం, లబ్ధిదారులసంఖ్యను కుదించడం చేసిన ముఖ్య మంత్రి, ఇప్పుడు ఉన్నజనాభాకంటే ఎక్కువమందికి సంక్షేమ పథ కాలు అమలుచేస్తానని చెప్పడం మోసగించడం కాక మరేమిటని శ్రీనివాసరెడ్డి నిలదీశారు. చేసేదేదో, చేయగలిగింది ఏదో ప్రజలకు స్పష్టంగా చెప్పకుండా, లబ్ధిదారుల సంఖ్యను ఎక్కువగా చూపు తూ, ప్రజలను మోసగించే చర్యలకు జగన్ ఇప్పటికైనా స్వస్తి పలికి తే మంచిదన్నారు. ఆరోగ్యశ్రీ, ఆసరా, గృహనిర్మాణం, ఆదరణ, విదేశీ విద్య, రేషన్ సరుకుల పంపిణీ వంటి అనేక పథకాలను చంద్ర బాబునాయుడుఎలా అమలుచేశాడో ఒక్కసారి వైసీపీ ప్రభుత్వం ఆలోచనచేస్తే మంచిదన్నారు. సంక్షేమపథకాల క్యాలెండర్ పేరుతో ప్రజలనుమోసగించే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని టీడీపీనే త హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిది పిల్లి.మాణిక్యరావు, విష్ణు వర్ధన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. ఆయన మాటల్లో... "బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తనపై జరిగిన దాడిని టీడీపీ కి అంటకట్టాలని ప్రయత్నించడం తన చేతకాని తనానికి నిదర్శనం. అంతేకాక స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి పై దాడి జరిగినట్టు అబద్ధపు ప్రచారాన్ని చేయాలనుకోవడం తన అవివేకానికి నిదర్శనం. ఈ రాష్ట్రంలో దేశంలో నిజమైన లౌకిక వాద, ప్రజాస్వామిక పార్టీ తెలుగుదేశం పార్టీ. బిజెపి పార్టీ ఈ రాష్ట్రములో తను ఎదగడం కోసం ఆ పార్టీ ఎలాంటి పద్దతులను అవలంబిస్తుందో మేము ప్రస్తుతం ప్రస్తావించదలుచుకోలేదు. భౌతిక దాడులు, కుట్రపూరిత రాజకీయాలు, విధ్వంసకర నిర్ణయాలు ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతమో అందరికి తెలిసిందే. కొలికపూడి శ్రీనివాస్ అమరావతి పరిరక్షణ జేఏసీ కన్వీనర్. అమరావతి ఉద్యమాన్ని అవమానకర రీతిలో మీరు మాట్లాడుతూ... తను దళితుడానే చులకన భావనతో వ్యంగంగా వ్యవహారించడమే కాకుండా ఒక పార్టీకి బానిసని అనటం శ్రీనివాస్ తట్టుకోలేకపోయారు.

vishnu 25022021 2

తన ఆత్మగౌరవం పబ్లిక్ గా చరకు గురౌతుంటే, తట్టుకోలేక శ్రీనివాస్ ఆ చర్యకు పూనుకొని ఉండవచ్చు. అది పూర్తిగా నీ ఆధిపత్య,వికార వ్యక్తిత్వానికీ....శ్రీనివాస్ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దీనిలో నువ్వు తెలుగుదేశం పార్టీనీ నిందించడం నీ చేతకాని తనానికి నిదర్శనం. నీవు ఏ ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నావో.. ఏ ఉద్యమాలను అవమానిస్తున్నావో... ఏ పార్టీలో ఉండి, ఏ పార్టీ కోసం పని చేస్తున్నావో... నీ నీచపు రాజకీయ సంస్కృతిని... నీ వ్యక్తిగత వ్యవహార శైలి ప్రజలకు అర్థం అవుతుంది. అందుకే నీపై కొలికపూడి శ్రీనివాస్ అలాంటి చర్యలకు పాల్పడి ఉండవచ్చు. అయినా అలాంటి చర్యలను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమర్ధించదు. కాబట్టి తెలుగుదేశం పై నిందలు వేయాలనే నీ ఆలోచన మానుకొని ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తావని, అధికార పార్టీ కుల తత్వం పోకడలను తొలగించుకుంటావని నీకు సూచన చేస్తున్నాము." అంటూ విష్ణు వర్ధన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read