డబ్బేప్రధానంగా వ్యవహరిస్తున్న సమాజంలో, ఆస్తిని, కన్న వాళ్లను కాదనుకున్న ఒకజంట నేడు టీడీపీ కార్యాలయానికి వచ్చిందని, జ్ఞానేందర్ (బీసీ-గౌడ) అనూష (ఎస్సీ-మాల)లవి వేర్వేరు కులాలైనా వారిద్దరూ ప్రేమించుకొని, 2016లో పెళ్లిచేసుకున్నారని, ఆనాటినుంచి ఇరువురివైపు తల్లిదండ్రులు, వారికుటుంబసభ్యులు వారిని పట్టించుకోకపోయినా, జ్ఞానేందర్ ఏదోఒకపనిచేసుకుంటూ, తనభార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడని, వారికి మూడేళ్ల కూతురు కూడా ఉందని, కుటుంబసభ్యుల వేధింపులు తట్టుకోలేక వారు ఆగస్ట్ 2019లో ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించా రని, ఆయన అపాయింట్ మెంట్ లభించకపోవడంతో, జగన్మోహన్ రెడ్డి తల్లిగారైన విజయమ్మనుకలిసి వారి సమస్య చెప్పుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. కులాంతరవివాహం చేసుకున్నవారికి తాను అన్నివిధాలా అండగాఉంటానని, అటువంటివారిని తగినవిధంగా ఆదుకుంటా నని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిఉన్నాడన్నారు. జ్ఞానేందర్ దంపతులు విజయమ్మగారిని కలిశాక, ఆమె వారిగురిం చి, మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు చెప్పడం జరిగిందన్నారు. అదలా ఉంటే, జ్ఞానేందర్ బాబాయిలు, బంధువు లు అతన్నిబెదిరించి, అతనిభార్య అయిన అనూషపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అనూషపై రకరకాల తప్పుడు కేసులుపెట్టించిన జ్ఞానేందర్ బాబాయిలు ఆమెను ఒకానొక సంద ర్భంలో జైలుకు కూడా పంపించారన్నారు. తనకు వచ్చే స్థిరచరాస్తు లను కూడా కాదనుకొని జ్ఞానేందర్ , అనూషతోనే జీవించడానికి సిద్ధపడిపోయాడన్నారు. జ్ఞానేందర్ బంధువుల్లో కొందరు పోలీస్ అధికారులు ఉన్నారని, వారంతా వారి పలుకుబడితో అనూషను బెదిరించడానికి, జ్ఞానేందర్ నుంచి ఆమెను విడదీయడానికి శతవిధాలా ప్రయత్నించారన్నారు. విజయమ్మ ఆదేశాలతో జ్ఞానేందర్ దంప తులకు న్యాయంచేస్తానని, వాసిరెడ్డి పద్మ 27-08-2019న ఒక సమావేశంలో విలేకరులతో చెప్పిందని అశోక్ బాబు తెలిపారు. వాసిరెడ్డి పద్మను కలిసిన అనంతరం, జ్ఞానేందర్ దంప తులు మంత్రి పేర్నినానిని కలిసి, తమకు న్యాయం చేయమని కోరినా వారికి ఎటువంటి న్యాయంజరగలేదన్నారు. కులాంతర వివాహంచేసుకొని, ఇన్నికష్టాలను ఎదిరించివారు నిలబడినా కూడా, ఇప్పటికీ ఆస్తిలో హక్కుకోసం జ్ఞానేందర్ తిరిగివస్తాడనే దురాలోచనతోఅతన్ని, అతనిభార్యను వెంటాడుతూనే ఉన్నారన్నా రు.

జ్ఞానేందర్ బాబాయి అయిన సుబ్రహ్మణ్యం సీఐగా పనిచేస్తున్నారని, మరోబంధువైన వెలివెల సత్యనారాయణ రామ గుండం పోలీస్ కమిషనర్ గా ఉన్నారని, వారి పలుకుబడితో, ఆ దంపతులు ఎక్కడికెళ్లినా బిక్కుబిక్కుమంటూ బతకాల్సిన దుస్థితు లే ఎదుర్కొన్నారన్నారు. నెలకో ఉద్యోగం, సంవత్సరానికో ఊరు తిరుగుతూ, ఆదంపతులు నానా అవస్థలు పడుతున్నా, విజయమ్మ, మంత్రి పేర్నినాని, వాసిరెడ్డి పద్మలు వారికి ఎటువంటి న్యాయం చేయకపోవడం దురదృష్టకరమని అశోక్ బాబు వాపోయా రు. ఇటువంటి పరిస్థితుల్లో జ్ఞానేందర్ దంపతులు, నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిగారిని కలిసి తమగోడు వెళ్లబోసుకు న్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ దంపతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే వారి రక్షణకోసం డీజీపికి లేఖరాస్తానని తగినవిధంగా ఆర్థికసాయం చేస్తామని కూడా మాజీముఖ్యమంత్రి గారుహామీ ఇచ్చారన్నారు. జ్ఞానేందర్ కేవలం పదోతరగతి మాత్రమే చదివాడని, అతని చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడని, అనూషను పెళ్లిచేసుకున్నాక, పెళ్లి సర్టిఫికెట్ కూడా రాకుండా దాన్ని జ్ఞానేందర్ బాబాయి చింపేయడం జరిగింద న్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సదరు దంపతులు నానా అవస్థ లు పడుతూ, దినదినగండంగా బతుకుతుంటే, మంత్రి పేర్నినాని వారిని ఆదుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఆ దంపతులకు న్యాయం చేయాలని కోరుతూ, తాము అవసరమైతే డీజీపీని, మంత్రి పేర్ని నానీని కలవడానికి తాముసిద్ధంగా ఉన్నామని అశోక్ బాబు స్పష్టం చేశారు. జ్ఞానేందర్ తాతగారు రాజమహేంద్రవరం, వక్కల గడ్డ ప్రాంతాల్లో ఎప్పుడో భూములు కొన్నాడని, వాటిలో అతనికి హక్కుఉందని, ఆ భూములు అతనికి ఇవ్వకుండా కొట్టేయాలన్న అక్కసుతోనే జ్ఞానేందర్ బాబాయిలు అతనిపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరుఏమీ చేయాలని చూసినా, జ్ఞానేందర్ కు, అతని భార్యాపిల్లలకు తాము అండగా ఉంటామని ఎమ్మెల్సీ అశోక్ బాబు తేల్చిచెప్పారు.

గత రాత్రి జీవీఎంసీ కమీషనర్ గా ఉన్న గుమ్మళ్ళ సృజనని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఆమె స్థానంలో నాగలక్ష్మిని అపాయింట్ చేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే, చీఫ్ సెక్రటరీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ కి ముందే, జీవీఎంసి కమీషనర్ గా ఉన్న సృజన 15 రోజులు సెలవు పెట్టి, వెళ్ళటం జరిగింది. అయితే అత్యవసరంగా ఆమె సెలవులో ఉన్న సమయంలో కూడా ఈ ఉత్తర్వులు ఇవ్వటం వెనుక ప్రధానంగా, కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవీఏంసి పరిధిలోని రిజర్వేషన్ల విషయంలో కొన్ని ఫిర్యాదులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వెళ్ళటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే జీవీఎంసి కమీషనర్ కి, స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటు వంటి కలెక్టర్ కు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కొన్ని రిజర్వేషన్ల విషయంలో, కొంత వరకు నియమ నిబంధనలు పాటించలేదు, కొందరికి రిజర్వేషన్లు కావాలని ఇచ్చారని, కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే చర్చ జరుగుతుంది. మరోకటి ఏమిటి అంటే, వార్డులు డివిజన్ విషయంలో కానీ, ఓటర్ నమోదు విషయంలో కూడా, కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం పై, విశాఖకు చెందిన వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసారు.

gvmc 17022021 2

ఈ విషయంలోనే రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఆమెను బదిలీ చేయాలనే నిర్ణయం తీసుకుని, ఆమెను బదిలీ చేయాలనే ఆదేశాలు ఇచ్చినట్టు, తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారనే వాదన వినిపిస్తుంది. అయితే అంతకు ముందే ఆమె సెలవు పెట్టినప్పటికీ, ఆమెను ఎందుకు బదిలీ చేసారనే విషయం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే దీని పై ఆమె ఇప్పటి వరకు ఈ బదిలీ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే గత మూడేళ్ళుగా ఇక్కడే పని చేస్తున్న సృజనను నిబంధనలు ప్రకారం బదిలీ చేయాలని, ఎలాగూ ఎస్ఈసి బదిలీ చేస్తుందని గ్రహించి, ముందే ఆమెను సెలవు పై పంపించి, ఇంచార్జ్ ను నియమించారని, ఎన్నికలు అయిన తరువాత మళ్ళీ సృజనను అక్కడే ఉంచాలని, ఒక ప్రముఖ నాయకుడు వేసిన పాచిక పారలేదని, ఇంచార్జ్ కుదరదని, ఫుల్ టైం కమీషనర్ ను నియమించాలని ఎస్ఈసి ఆదేశాలు ఇచ్చారని ఒక ప్రముఖ పత్రికలో వార్త వచ్చింది. ఇప్పుడు ఫుల్ టైం కమీషనర్ ను నియమించారు కాబట్టి, మళ్ళీ ఎన్నికలు అయిపోగానే,అధికారి సృజనను మళ్ళీ ఇక్కడకు తీసుకు వస్తే అనేక సాంకేతిక ఇబ్బందులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ఆ ప్రముఖ నాయకుడు పాచికను, ఎన్నికల కమిషన్ చిత్తు చేసిందని చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడో దశకు చేరుకున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో మూడో దశ సందర్భంగా, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలకు ఓటింగ్, ఈ మూడో దశలో జరగబోతుంది. ఈ మూడో దశలో ఓటింగ్ కు సంబంధించి, అత్యంత కీలకమైన తీర్పును ఇచ్చింది. మరో 24 గంటల్లో ఎన్నికలు, ఓటింగ్ జరగనున్న సమయంలో, ఇది అత్యంత కీలకమైన తీర్పు అనే చెప్పాలి. గత రెండు దశల్లో కూడా ఒక పార్టీ తరుపున మద్దతుతో ఎన్నిక అయితే, ఎన్నిక జరిగినట్టు డిక్లేర్ చేసిన తరువాత, మరో పార్టీ మద్దతుతో గెలిచినట్టు రీకౌంటింగ్ లో ప్రకటించిన దాని పై, కొంత మంది హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టుని ఆశ్రయించిన వారి తరుపున, మాజీ అడ్వొకేట్ జెనెరల్, సీనియర్ న్యాయవాది, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ వాదనలు నేపధ్యంలోనే హైకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులును ఈ రోజు జారీ చేసింది. ఈ నెల 13న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కొన్ని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో జరిగే ఓట్ల లేక్కుంపు మొత్తం కూడా వీడియో చిత్రీకరణ చేయాలని సూచించింది. అయితే 15వ తేదీన సమస్యాత్మక గ్రామాలు , అత్యంత సమస్యాత్మక గ్రామాలు మాత్రమే వీడియో షూటింగ్ చేయాలని చెప్పి, ఎన్నికల కమిషన్ మరో ఆదేశాలు జారీ చేసింది.

hc 16022021 2

ఈ రోజు ఆదేశాల నేపధ్యంలో, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని, నిజాయతీగా జరగాలని, కౌంటింగ్ సమయంలో జరుగుతున్న అవకతవకలను దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ నేపధ్యంలోనే, హైకోర్టు కొద్ది సేపటి క్రితం కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 13 వ తేదీన, అలాగే 15వ తేదీన ఎన్నికల కమిషన్ ఏ ఆదేశాలు అయితే ఇచ్చిందో, ఆ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాలని, స్పష్టం చేసింది. దీంతో పాటు ఒక గ్రామానికి సంబందించిన ఒక ఓటర్ ఎవరైనా సరే, తమ గ్రామానికి సంబందించిన ఓట్ల లెక్కింపు వీడియో షూట్ చేయాలని అధికారులకు విజ్ఞాపన పత్రం ఇస్తే, కచ్చితంగా వీడియో షూట్ చేయాల్సిందే అని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన పంచాయతీ ఎన్నికల సమరం అత్యంత కీలకమైనది అని, అందుకని ప్రతి దశలోనే కూడా పారదర్శకంగా జరగాలని, ఇలా జరగాలని అంటే ఎన్నికల మొదలైన దగ్గర నుంచి, కౌంటింగ్ వరకు వీడియో షూట్ చేయాలని, టెక్నాలజీ సాకులు చెప్పటానికి వీలు లేదని స్పష్టం చేసింది. అందువల్ల రేపు అత్యంత కీలకమైన మూడో దశ పోలింగ్ జరుగుతుంది, ఈ నేపధ్యంలోనే వీడియో షూట్ చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మలుపు తిప్పబోతున్నాయని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు విభజన హామీల పై స్పష్టత లేదు. గట్టిగా అడిగిన చంద్రబాబుని రాజకీయంగా దెబ్బ కొట్టి పక్కన పడేసారు. మెడలు వంచేసి సాధిస్తా అని చెప్పిన జగన్, ఏమి చేస్తున్నారో ప్రజలు చూసారు. ఇక ఏపి ప్రజలు కూడా, తమ రాష్ట్రం గురించి పట్టించుకునే స్థాయిలో లేరు. అన్నీ కలిసి వచ్చిన అంశాలు అని అనుకున్నారో ఏమో కానీ, ఆంధ్రుల పోరాటానికి ప్రతీక అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచి, రాష్ట్రంలో అందోళన మొదలైంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తూ, ముందు ఉంది. టిడిపి నేత పల్లా, దీక్ష కూడా చేసారు. ఇక తాము ఎక్కడ వెనుకబడిపోతామో అని విజయసాయి రెడ్డి చేత పాదయాత్ర ప్లాన్ చేస్తుంది వైసీపీ. అయితే ముందు ఉండి కేంద్రంతో పోరాడాల్సిన వైసీపీ, ఢిల్లీలో ఏమి మాట్లాడకుండా, ఇక్కడ హడావిడి చేస్తున్నారు. అయితే అసలు కేంద్రం ఏపికి ఏది కావాలి అంటే, కావలసిన దాని కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది అని ప్రచారం చేసిన బీజేపీ నేతలు ఈ విషయంలో వెనుకబడ్డారు. ఇది కేంద్రం నిర్ణయం కావటం , ఎప్పటిలాగే చంద్రబాబు మీద ఎదురు దాడి చేసి తప్పించుకోవటం ఈ విషయంలో బీజేపీ కుదరలేదు.

somu 170222021 2

అందుకే ఉద్యమంలోకి రాకుండా, మేము ఢిల్లీ వెళ్లి, కేంద్రాన్ని ఒప్పిస్తాం అంటూ, సోము వీర్రాజు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇప్పటి వరకు అమిత్ షా అప్పాయింట్మెంట్ దొరకలేదు. ప్రధాని మోడీ అప్పాయింట్మెంట్ దొరికే అవకాశమే లేదు. అందుకే నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డాని కలిసి, ఏదో హడావిడి చేయాలని భావించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని నడ్డాతో చెప్తూ ఉండగా, ఈ విషయం తనకు చెప్పవద్దు అంటూ నడ్డా సున్నితంగా తిరస్కరించారు. పార్టీకి సంబందించిన విషయాలు మాట్లాడాలని, ప్రభుత్వానికి సంబందించిన విషయాలు, ఆయా కేంద్ర మంత్రుల వద్దే ప్రస్తావించాలని నడ్డా చెప్పటంతో, సోము వీర్రాజు షాక్ అయ్యారు. మరో సారి, ఇది ఏపి ప్రజల సెంటిమెంట్ అదీ ఇదీ అని చెప్తూ ఉండగా, తాను ఈ విషయంలో ఏమి చెయలేను అని, ప్రభుత్వ విషయాల్లో తన జోక్యం ఉండదు అని, పార్టీ విషయాలు మాత్రమే చెప్పాలని మరోసారి స్పష్టం చేసారు. దీంతో సోము వీర్రాజు అండ్ టీం, ఈ రోజు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. గత మూడు రోజులుగా దొరకని అపాయింట్మెంట్ ఈ రోజు అయినా దొరికితే, కనీసం మీడియాలో చెప్పుకోవటానికి అయినా బీజేపీ నేతలకు ఉంటుంది.

Advertisements

Latest Articles

Most Read