రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ రోజు సంచలన ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది మార్చి 15వ తేదీన వాయిదా పడిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పట్లో పెద్ద ఎత్తున ఏకాగ్రీవాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులు నేపధ్యంలోనే ఎన్నికల కమిషన్, మళ్ళీ ఈ ప్రక్రియను ప్రారంభించే ముందు, కొన్ని వెసులుబాట్లు కల్పించింది. అప్పట్లో ఎవరైతే ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్ వేయలేకపోయారో అటువంటి వాళ్ళు, మళ్ళీ నామినేషన్ వేయటానికి అవకాసం కల్పిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ నేపధ్యంలోనే అప్పుడు నామినేషన్ వేయలేని వారు, రిటర్నింగ్ అధికారికి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి కానీ, పోలీసులకు చేసిన ఫిర్యాదులు కానీ, లేదా నామినేషన్ వేయకుండా అడ్డుకున్న సంఘటనలు గురించి, మీడియాలో వచ్చిన ఫోటోలు, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఆధారాలు కానీ జిల్లా ఎన్నికల అధికారికి తీసుకుని వచ్చి అందిస్తే, వారిని మళ్ళీ అభ్యర్ధిగాను, మళ్ళీ నామినేషన్ వేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుందని, ఈ రోజు విడుదల చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. రెండు రోజుల క్రితం కూడా పురపాలక సంఘాల ఎన్నికల విషయంలో కూడా, ఇటువంటి అవకాశాన్ని అభ్యర్ధులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది.

sec 18022021 2

మార్చ్ 14 వ తేదీతో పురపాలక సంఘాల కౌంటింగ్ పూర్తవుతుంది. ఆ వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కూడా ప్రారంభించాలని భావిస్తున్న తరుణంలోనే ఈ ఆదేశాలు ఇవ్వటంతో, మార్చి 14వ తేదీ లోపే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించిన రీ నోటిఫికేషన్ వచ్చే అవకాసం ఉందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ పరోక్షంగా చెప్పినట్టు అయ్యింది. ఈ రోజు నుంచి 20వ తేదీ లోపు కలెక్టర్ లు అందరూ కూడా దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలని, ఈ లోపు అభ్యర్దులు రిటర్నింగ్ అధికారికి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి కానీ, తమ వద్ద ఉన్న ఆధారాలతో, ఆధారాలు అందిస్తే, నామినేషన్ ను పరిగణలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషన్ కొద్ది సేపటి క్రితం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

మంగళగిరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై నారా.చంద్రబాబు గారిని కలసి గొట్టిపాటి.రవికుమార్, కుందుర్తి గ్రామ ప్రజలు చర్చించారు. ఈ సందర్భంగా, కుందుర్తి గ్రామ ప్రజలతో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, కుప్పంలో జరిగిన అరాచకం పై వివరించారు. "గతంలో మనం బలవంతపు ఏకగ్రీవాలపై హైకోర్ట్ నుండి అర్డర్ తీసుకొని రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ కు రాజ్యాంగం అధికారం ఇచ్చింది. అధికార యంత్రాగం సక్రమంగా పని చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాధారణంగా పంచాయితీ ఎన్నికలకు రాత్రి 7నుంచి 9 గంటల వరకు లెక్కిస్తారు. కానీ వైపీపీ ప్రభుత్వం కావాలని రాత్రి 12గంటలు చేయడం ఆ టైమ్ లో ప్రశ్నించిన వారిపై బెదిరించడం లేదా దా-డి చేయడం జరిగింది. పోలింగ్ బూత్ లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు టీడీపీ ఎజెంట్లకు నీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. వైసీపీ నాయకులు దుర్మార్గులు. సొంత బాబాయ్ ను చం-పి ఎవరు చం-పారని అంటున్నారు. ఆయన కుమార్తె సీబీఐ విచారణ కోరితే నీకు తెలియదని గమ్మునుండమని చెప్పారు. తరువాత ఆమె కోర్టుకు వెళ్లి సీబీఐ ఎంక్వైరీ వేయిస్తే ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కుప్పంలో గెలుపు కోసం దాదాపు రూ.20కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజల మనోభావాలతో వైసీపీ నాయకులకు అవసరం లేదు. ప్రజలను బెదిరిస్తే జరిగిపోతుందని వైసీపీ నాయకులు బావిస్తున్నారు. మీకు జరిగిన అన్యాయం పై ఎలక్షన్ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేయండి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. ఆ తరువాత కోర్టులకు వెళ్దాం. మీకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేద్దామన్నారు. ప్రజాస్వామ్యం కోసం, మన గ్రామం కోసం పోరాటం చేస్తే మన మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రజలు మనకు మెజార్టీ ఇచ్చారు..దానిని వైసీపీ నాయకులు రివర్స్ చేశారు. ఈ రోజు మీకు, మీ గ్రామానికి జరిగిన అన్యాయం భవిష్యత్తు లో వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత నాదన్నారు. పార్టీ కోసం సర్వశక్తుల వడ్డి పోరాటం చేసిన వ్యక్తులకు మంచి గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు."

చంద్రబాబునాయుడుతో ప్రకాశం జిల్లా కుందుర్తి పంచాయతీ ప్రజలు: "అద్దంకి నియోజకవర్గం, సంతమాగులూరు మండలం, కుందుర్తి గ్రామ పంచాయితీలో 12వార్డులకు గాను టీడీపీ 8వార్డులు గెలవడం జరిగింది. 8వార్డుల మీద టీడీపీ కి 272 ఓట్ల మోజార్టీ రావడం జరిగింది. చివరి రౌండ్ వరకు టీడీపీ 103 ఓట్ల మోజార్టీతో కొనసాగింది. సర్పంచ్ ఓట్ల లెక్కింపులోను తెదేపా అభ్యర్థి చావల. ముందంజలో ఉండటంతో అధికారపార్టీ విద్యుత్ సరఫరా నిలిపివేయించి అక్రమాలకు పాల్పడింది. ఎన్నికల అధికారుల(ఆర్వో)పై ఒత్తిడి తెచ్చి,109 చెల్లని ఓట్లుగా చెప్పి ఏకపక్షంగా వైసీపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. వాటిని ఎందుకు లెక్కించరని అడిగినందకు రాత్రి ఒంటిగంట వరకు మంచీనీళ్ళు ఇవ్వకుండా గదిలో బంధించి బెదిరించారు. మాకు అన్యాయం జరిగిందని రోడ్డుకెక్కినందుకు మహిళాలని చూడకుండా 200మంది పోలీసులు కొట్టారని వాపోయారు. గడచిన 20 మాసాలలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత మొదలైందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన దాడులు, అరాచకాలపై డీజీపీ సమాదానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. "

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ కొడాలి నాని, హైకోర్టులో పిటీషన్ వేసిన నేపధ్యంలో, ఈ రోజు హైకోర్టు లో విచరణ జరిగింది. విచారణలో భాగంగా మంత్రి కొడాలి నాని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మీడియాతో ఇతర విషయాలు మాట్లాడవచ్చు కానీ, ఎక్కడా ఎన్నికల కమిషన్ పై వ్యాఖ్యలు చేయకూడదు అంటూ తీర్పు ఇచ్చింది. గతంలో మీడియా సమావేశం పెట్టిన కొడాలి నాని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్నికల కమిషన్ మంత్రిని నేరుగా కానీ, వివరణ రూపంలో కానీ, తాను చేసిన వ్యాఖ్యల పై వివరణ ఇవ్వాలి అంటూ, నోటీస్ జారీ చేసింది. అయితే ఈ నేపధ్యంలో అదే రోజు, కొడాలి నాని తరుపు న్యాయవాది , రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వచ్చి, కొడాలి నాని వివరణ ఇచ్చారు. మంత్రికి ఎక్కడా ఎన్నికల కమిషన్ పై ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేసే ఉద్దేశం లేదని, నోటీస్ వెనక్కు తీసుకోవాలని కోరారు. వివరణ పై అసంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, కృష్ణా జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పరువుకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యల పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

kodali 180222021 2

అంతే కాకుండా, కొడాలి నాని మీడియాతో , ఈ నెల 21 వరకు మాట్లాడకూడదు అని ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపధ్యంలోనే కొడాలి నాని, హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేసారు. ఈ పిటీషన్ నేపధ్యంలోనే, విచారణలో భాగంగా, ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరుపు న్యాయవాది అశ్వినీ కుమార్ తో పాటు, కొడాలి నాని తరుపు న్యాయవాది తరుపున వాదనలు విన్నారు. వాదనలు సందర్భంగా, ఇరు వర్గాల నుంచి వీడియో ఫూటేజ్ తీసుకుని పరిశీలించిన ధర్మాసనం, పూర్తీ వీడియోలు ఇవ్వటంలో ఇద్దరూ విఫలం అయ్యారని, ఇద్దరి వాదనలు సంతృప్తిని ఇవ్వలేదని, ఈ విషయం పై లోతుగా తేల్చటానికి, మరో న్యాయవాదిని నియమిస్తామని చెప్పారు. దీంతో పూర్తి నివేదిక తెప్పించుకున్న ధర్మాసనం దీని పై ఈ రోజు కీలక తీర్పు ఇచ్చింది. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడవచ్చని, అయితే ఎన్నికల పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై, కమీషనర్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ, ఆదేశాలు జారీ చేసింది.

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు దేవుళ్లన్నా, గురువులన్నా గౌరవంలేదని, పెద్దవాడైన చంద్రబాబునాయుడిని ఏకవచనంతో సంబోధించడం అతనిలోని కుసంస్కారానికి నిదర్శనమని టీడీపీ నేత, మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పష్టంచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కుఫ్యాక్టరీకి చెందిన 7వేల ఎకరాలను జగన్ అమ్మేస్తానంటే, ఆ భూములు అమ్మే అధికారం, హక్కు జగన్ కు ఎక్కడివని టీడీపీ అధినేత ప్రశ్నిస్తే, సిగ్గులేకుండా వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన్ని తప్పుపడుతున్నాడన్నారు. ఎవరో ఇచ్చిన భూములనుఅమ్మేసే హక్కు, జగన్ కి, వెల్లంపల్లికి ఎక్కడినుంచి వస్తుందన్నారు. జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించిందే భూములు అమ్మకోవడానికని జలీల్ ఖాన్ తేల్చిచెప్పారు. బచ్చా అయిన వెల్లంపల్లి చంద్రబాబుపై విమర్శలు చేయడమే పెద్దపొరపాటన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పనిచేసే అధికారులను మార్చినతరువాత, దేవాలయాల్లోని హుండీలకన్నా వెల్లంపల్లి హుండీనే ఎక్కువగా నిండుతోందన్నారు . ఎన్నికలముందు వెల్లంపంల్లి ఎలా ఉండేవాడో, ఇప్పుడు ఎలా ఉన్నాడో ప్రజలే గమనించాలన్నారు. దేవాదాయశాఖా మంత్రి అంటే ప్రజలంతా గౌరవిస్తారని, అటువంటి గౌరవం పొందే అర్హత ఏమాత్రం లేని వ్యక్తి వెల్లంపల్లి అన్నారు. గతంలో గెలిచినప్పుడు, వెల్లంపల్లి శ్రీనివాస్ నావద్దకు వచ్చి, అన్నా నీదయవల్లే గెలిచానం టూ చెప్పడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటివాడో, వెల్లంపల్లికంటే తనకే బాగా తెలుసునన్న జలీల్ ఖాన్, శ్రీనివాస్ ప్లేటు జగన్ చేతిలో ఏదోఒకరోజు తిరగబడటం ఖాయమన్నారు. ఇప్పుడేదో కార్పొరేషన్ ఎన్నికల్లో వెల్లంపల్లి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు కానీ, వాటిలో అధికారపార్టీ వారు గెలవకపోతే, జగన్ చేతిలో శ్రీనివాస్ కు ఎలాంటి పరాభవం ఎదురవుతుందో మాటల్లో చెప్పలేమన్నారు. దుర్గమ్మసన్నిధిలోని స్క్రాప్ ని రూ. 15లక్షలకు వెల్లంపల్లి అమ్మేసుకున్నాడని, దానివిలువ దాదాపు రూ.కోటి50లక్షలవరకు ఉంటుందని జలీల్ ఖాన్ తెలిపారు.

అమ్మకాలకు సంబంధించి మంత్రి ఎటువంటి టెండర్లు పిలవలేదన్నారు. దేవాలయాల్లో ఈవోలను మార్చినందు కు వారినుంచి కూడా డబ్బులు వసూలుచేశాడన్నారు. ఈ విధంగా వెల్లంపల్లి చరిత్ర గురించి చెబితే, పుస్తకాలకు పుస్తకాలే ఉంటాయ న్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ఆపార్టీకోసం తాను ఎంతో కష్టపడ్డా నన్న జలీల్ ఖాన్, ఆతరువాత జగన్మోహన్ రెడ్డి పనితీరుచూసి విసిగిపోయి, నియోజకవర్గఅభివృద్ధికోసం టీడీపీలోకి రావడం జరిగిందన్నారు. వెల్లంపల్లి తన వర్గానికి కూడా న్యాయంచేయలేద ని, అందుకే గతఎన్నికల్లో అతని వర్గంవారంతా తనకు ఓట్లేశారని జలీల్ ఖాన్ చెప్పారు. వెల్లంపల్లిని చూస్తుంటే, ఎక్కడా మంత్రిలా కనిపించడని, అతన్ని చూస్తుంటే బఫూన్ లా కనిపిస్తాడన్నారు. గెలుపుఓటములు అనేవి సహజమని, వైసీపీప్రభుత్వం వచ్చాక విజయవాడలో చేసిన అభివృద్ధేమిటో వెల్లంపల్లి చెప్పాలన్నారు. విజయవాడలో ఫ్లైఓవర్లు, రోడ్లు వేసింది టీడీపీ ప్రభుత్వమేనన్నారు కేవలం పబ్లిసిటీ పిచ్చితోనే ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చిందన్నారు. రేషన పంపిణీకి ఉపయోగిస్తున్న ఆటోల యజమానులకు ప్రభుత్వం డబ్బులిస్తోందని, వాటిని నడిపే డ్రైవర్లు మాత్రం చాలీచాలనీజీతంతో గగ్గోలు పెడుతున్నారన్నారు. విజయవాడ నగరంలో 20, 30ఏళ్లనుంచి బతుకుతున్నవారికి ఈ ప్రభుత్వం ఎక్కడోగన్నవరం, మైలవరం సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ఇళ్లపట్టాలు ఇచ్చిందన్నారు. పనికిరాని స్థలాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటూ జనాన్ని మోసగించే పనిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆస్థలాల్లో ఇళ్లు కడతామంటూ, మరోకొత్త మోసానికి జగన్ ప్రభుత్వం తెరలే పబోతోందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇసుకధర ఎంతఉందో, ఇప్పుడెంత ఉందో వెల్లంపల్లికి తెలియదా అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. అమ్మఒడి సహా అనేకపథకాలు జగన్ దోపిడీకోసం సృష్టించినవేనన్నారు. అటు కేంద్రాన్ని ఒప్పించి, రాష్ట్రానికి నిధులు తీసుకురావడం చేతగాని జగన్, రూ.2లక్షలకోట్ల వరకు అప్పులభారాన్ని రాష్ట్రంపై వేశాడన్నారు. వెల్లంపల్లి మంత్రి అయినప్పటినుంచీ దేవాలయాలపై దాడులు, విగ్రహాలధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రజల గురించి ఆలోచించకుండా, ఉదయం లేచినదగ్గరనుంచీ టీడీపీపై నిందలేయడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందన్నారు.

బెల్లంముక్క అనే అధికారం వైసీపీచేతలో ఉందికాబట్టే, ఆపార్టీ కార్యకర్తలు, ప్రజలు వారిచుట్టూ తిరుగుతున్నారన్నారు. పోలీసులు లేకుండా వైసీపీనేతల, మంత్రుల ప్రజల్లోకి వెళితే, ప్రజలు వారిని కుక్కలనుకొట్టినట్లు కొడతారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో పేదల పరిస్థితి చాలాదారుణంగా ఉందని, అన్నివస్తువులు, నిత్యావసరాల పై ధరలు పెంచి, ప్రజాజీవనాన్ని జగన్ ప్రభుత్వం దారుణంగా దెబ్బ తీసిందన్నారు. జగన్ కు దమ్ము, ధైర్యముంటే విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ని కాపాడేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. స్థానిక ఎన్నికలు అయిపోయాక పోలీసుల తీరుపై నిరసనవ్యక్తంచేస్తూ జైల్ భరో కార్యక్రమం నిర్వహించేఆలోచనలో ఉన్నానని జలీల్ ఖాన్ తెలిపా రు. దేవాదాయశాఖమంత్రిగా పనిచేసినవారెవరూ తిరిగి రాజకీయాల్లో కొనసాగలేదని, వెల్లంపల్లికి దమ్ముంటే, టీడీపీ ప్రభు త్వం ఎక్కడ విగ్రహాలు తొలగించిందో ఆధారాలుచూపాలన్నారు. వెల్లంపల్లిని మంత్రిగా గౌరవించలేనని, అతని పనితీరు, చర్యలు చూస్తే, నాకు అలా అనిపించడంలేదన్నారు. విజయవాడ ఎంపీగా వైసీపీతరుపున పోటీచేసిన వ్యక్తి, వెల్లంపల్లి డబ్బులుతీసుకొని తనను మోసగించాడని చెప్పాడన్నారు. దేవాదాయశాఖ మంత్రిగా ఉండి దోపిడీలు, విగ్రహాల ధ్వంసాలు, దేవాలయాలపై దాడులు చేయించడం వెల్లంపల్లికే చెల్లిందన్నారు. టీడీపీ ప్రభుత్వం దసరా పండుగను రాష్ట్రపండుగగా ఘనంగా నిర్వహిస్తే, వెల్లంపల్లి అమ్మవారి దేవాలయంలోని ప్రతివస్తువుని అమ్ముకోవడానికే ప్రాధాన్యమిస్తున్నాడన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలంతా శ్రీనివాస్ ను ఎందుకు గెలిపించామా అని ఇప్పుడు బాధ పడుతున్నారన్నారు. వెల్లంపల్లి నిర్వాకాలకు సంబంధించి తనవద్ద ఆధారాలున్నాయని, మీడియావారు వస్తే, అవిచూపడానికి సిద్ధం గా ఉన్నానన్నారు. జగన్ పాలనచూస్తే నవ్వొస్తోందని, రాష్ట్ర రాజధాని ఏదని చదువుకునే విద్యార్థులను అడిగితే, ముఖ్యమంత్రి మూడురాజధానులను ప్రకటించాడు, వాటిలో ఏది రాజధానో తమకు తెలియదనే పరిస్థితిలో ఉన్నారన్నారు.

టీడీపీప్రభుత్వం వస్తే, విజయవాడలోని శ్రీనివాస్ మహల్ నుంచి సొరంగంద్వారా రోడ్డు మార్గం వేయిస్తానని చంద్రబాబుహామీ ఇచ్చారు. ప్రతిపక్షం ఇచ్చినహామీని నెరవేర్చే ఆలోచన వెల్లంపల్లికి ఉందా అని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. జగన్ ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నా, మూడు ప్లేట్లపైఆధారపడతాడని, ఒక ప్లేట్ విజయసాయిరెడ్డి అయితే, మరోప్లేట్ సజ్జల రామకృష్ణారెడ్డి అని, మూడో ప్లేట్ జగన్ అన్నారు. ఆమూడు ప్లేట్లలో ఏదితిరగబడినా వైసీపీఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు మూడుతుందన్నారు. పట్టణాలు, నగరాల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు భయపడరని, పోలీసులకు ఎలా సమాధానం చెప్పాలో తమకు తెలుసునన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి పతనం తప్పదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అమరావతికేంద్రంగా జరిగే నిర్మాణపనుల్లో దాదాపు లక్షమందికి పైగా కార్మికులు ఉండేవారని, ఇప్పుడు ఆప్రాంతాన్ని చూస్తుంటే బాధగా ఉందన్నారు. రాష్ట్రప్రజల కర్మకొద్దీ జగన్ ముఖ్య మంత్రయ్యాడన్నారు. తాను క్రియాశీలరాజకీయాల్లో లేననేది అవాస్తవమన్న జలీల్ ఖాన్, కార్పొరేషన్ ఎన్నికల్లో తనసత్తా ఏమిటో చూపడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తొలిసారి ఎమ్మెల్యే గా వెల్లంపల్లి గెలిచినప్పుడు, దర్గాస్థలంఆక్రమించాడని, తనకు తెలిస్తే ఊరుకోనని, వెంటనే దాన్ని వేరేవారికి అమ్మేశాడన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అధికారపార్టీ కార్యకర్తలకే న్యాయం జరగడం లేదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి తన అనుచరులకు అప్పగించాడన్నారు. వారిద్దరూ ముఖ్యమంత్రుల లెవల్లో ఫీలవుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Advertisements

Latest Articles

Most Read