స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకం ప్రతి రోజు ఏదో ఒకట చూస్తూనే ఉన్నాం. పోటీలో ఉండ కూడదు అని బెదిరింపు, పోటీలో నుంచుంటే ఉపసంహరించుకోవాలని బెదిరింపు, వేరే పార్టీకి ఓటు వేస్తె బెదిరింపు, సంక్షేమ కార్యక్ర్తమాలు తీసేస్తామని బెదిరింపు, అక్రమ కేసులు, అరెస్ట్ లు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టు అవుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తుంది సాంపుల్ మాత్రమే. గత ఏడాది క-రో-నా కారణంగా మొదలైన ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. అప్పట్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల సందర్భంగా బెదిరించి పెద్ద ఎత్తున ఏకాగ్రీవాలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నోటిఫికేషన్ వస్తూ ఉండటం, గతంలో బలవంతపు ఏకాగ్రీవాలు చేస్తే, తగిన ఆధారాలు చూపిస్తే, మళ్ళీ పోటీ చేయవచ్చు అంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో, అధికార పార్టీ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. అనుకున్నట్టు గానే, పెద్ద ఎత్తున అభ్యర్ధులు నిన్న ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేసారు. ఆ వస్తున్న ఫిర్యాదులు చేసి, ఎన్నికల కమిషన్ అధికారులు కూడా అవక్కవుతున్నారు. వస్తున్న ఫిర్యాదులు అన్నీ నిజమా కాదా అని, తేల్చే పనిలో పడ్డారు. అభ్యర్ధుల దగ్గర నుంచి తగిన ఆధారాలు తీసుకుంటున్నారు.

nominations 20022021 2

తాము నామినేషన్ వేయటానికి వస్తే బెదిరించారని కొందరు, నామినేషన్ వేసిన తరువాత ఉపసంహరించుకోవాలని బెదిరించారని మరి కొందరు, ఇలా ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధుల నుంచి ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా అరాచకాలు ఎక్కువ జరుగుతున్న చిత్తూరు జిల్లా నుంచి, 18 మంది అభ్యర్ధులు ఫిర్యాదు చేసారు. అలాగే విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్ధులే కాకుండా, మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు కూడా ఉన్నారు. తమ ఫిర్యాదులకు అప్పటి బెదిరించిన వీడియోలు, ఆడియో టేప్ లు, ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్ లు లాంటివి కూడా జత పరిచారు. ఈ ఫిర్యాదులకు ఈ రోజు దాకా గడువు ఉండటంతో, ఈ రోజు మరింత మంది వచ్చే అవకాసం ఉందని ఎన్నికల కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. తిరుపతి డివిజన్ పరిధిలో 50 వార్డులకు నామినేషన్లు సమర్పించేందు అవకాసం ఇవ్వాలని, గతంలో బలవంతంగా బెదిరించినట్టు, టిడిపి కూడా ఫిర్యాదు చేసింది. అలాగే గుంటూరు, ముఖ్యంగా మాచర్ల నుంచి కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి.

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్ నాగుల్ మీరా పై వైయస్సార్ పార్టీలో చేరుతున్నట్లు గత కొంత కాలంగా, వైసీపీ బ్యాచ్ సోషల్ మీడియా వేదికగా విపరీత ప్రచారం చేస్తుంది. దీంతో విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపధ్యం లో నాగుల్ మీరాపై ఇటువంటి వార్తలు వెలువడటంపై అటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. వైకాపాలో చేరితే ఆయన కిచ్చే పదవిపై కూడా ఇటు వైకాపా నాయకులు, కార్యకర్తల్లోను ఫేక్ ప్రచారం జరిగేలా ఫేక్ బ్యాచ్ ప్రచారం చేస్తుంది. అయితే వీట న్నింటికి నాగుల్ మీరా చెక్ పెట్టారు. ఫేక్ ప్రచారం చేస్తున్న వారికీ ఘాటుగా బదులు ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం వీడియో ద్వారా ఆయన ట్రోలర్స్ పై తీవ్రస్థాయి లో ఆగ్రహం వ్యక్తం చేసారు. కావాలనే కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పీఆర్పీ పార్టీ నుంచి తాను రాలేదని, పార్టీలు మారే మన స్తత్వం తనది కాదని, సిద్ధాంతాలున్న కమ్యూనిస్టుపార్టీ నుంచి వచ్చానని తాను విలువలు ఉన్న నాయకుడినంటూ వైకాపా నాయకులకు చురకలంటించారు. దీంతో ఎట్టకేలకు నాగుల్ మీరాపై సోషల్ మీడియా వేదికగా వస్తున్న ఊహగానాలకు చెక్ పడినట్లయ్యింది.

పశ్చిమగోదావారి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని వైసీపీ ప్రభుత్వం ఎలా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. బహుసా చంద్రబాబు కంటే, ఎక్కువ టార్గెట్ చేసారు అనటంలో సందేహం లేదు. మిగతా టిడిపి నాయకులతో పోల్చితే, చింతమనేని ఎక్కువ టార్గెట్ అయ్యారు. ఆయన దూకుడు స్వభావం, వైసీపీకి కలిసి వచ్చింది. ఒక కేసులో బెయిల్ వస్తే, ఇంకో కేసులో అరెస్ట్ చూపించటం, అందులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చూపించటం, ఇలా కొన్ని నెలలు చింతమనేనిని జైల్లోనే ఉంచారు. అయితే అవన్నీ ప్రేరేపిత కేసులు కావటంతో, చివరకు బెయిల్ రాక తప్పలేదు. అప్పటి నుంచి చింతమనేని తన ఫ్లో లో తాను వెళ్తూ, ప్రభుత్వ విధానాల పై పోరాడుతూ, నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే తాజాగా వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో, మొదటి విడతలోనే దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మొదటి విడత ఎన్నికలు, చివరకు వాయిదా పడటంతో, నాలుగో విడతలో దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మికంగా తీసుకున్న చింతమనేని, తన సత్తా ఏమిటో చటటానికి సిద్ధం అయ్యారు. అందుకు తగ్గట్టే ఆయన చేసే ప్రయత్నాలకు, ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తు, కోలాహలంగా ప్రచారం జరుగుతుంది.

chintamaneni 20022021 2

ఇలా చింతమనేని ప్రచారంలో దూసుకుని వెళ్లిపోతుంటే తమకు ఇబ్బంది అనుకున్నారో ఏమో కానీ, వైసీపీ పెద్దలు రంగంలోకి దిగారు. చింతమనేనిని మళ్ళీ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే ప్లాన్ వేసారు. ఇందులో భాగంగా, చింతమనేని ప్రచారం ముగించుకుని వెళ్ళిన తరువాత, టిడిపి, వైసీపీ నేతలు కొట్టుకుంటే, అక్కడ లేని చింతమనేని పై నిందలు మోపి కేసు పెట్టారు. చింతమనేని ప్రచారంలో ఉండగా, ఆయన కార్ వెంట పడి, ఎలా అరెస్ట్ చేసారో మొన్న సోషల్ మీడియాలో చూసాం. అయితే చింతమనేని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించే ప్లాన్ వేయగా అది బెడిసికొట్టింది. చింతమనేనిని జడ్జి ముందు ప్రవేశపెట్టి పోలీసులు రిమాండ్ అడిగారు. అయితే ఆధారాలు చూపించమని జడ్జి అడగగా, పోలీసులు ఆధారాలు చూపించటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో సరైన ఆధారాలు లేకుండా ఎలా రిమాండ్ కు పంపిస్తాం అని, వెంటనే ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేయాలని జడ్జి చెప్పటంతో, అరెస్ట్ కుట్రకు ప్లాన్ చేసిన పెద్దలు అవాక్కయ్యారు. అయితే తరువాత చింతామనేని తనను అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పే దాకా, ఇక్కడ నుంచి వెళ్ళను అని స్టేషన్ లో భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఇంటికి తరలించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను 2014 ముందు అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒకలా మోసం చేస్తే, 2014 తరువాత ఇప్పటి కేంద్ర ప్రభుత్వం మరో రకంగా మోసం చేస్తుంది. ఆ మోసం చేసిన దానిలో అప్పట్లోనూ, ఇప్పుడు పావులు ఆయా పార్టీలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులే. ప్రత్యెక హోదా ఇవ్వమని రాజ్యసభలో అడిగింది బీజేపీ నేతలే. చట్టంలో పెట్టించింది బీజేపీ నేతలే. తరువాత ప్రత్యెక హోదా లేదు ఏమి లేదు అని చెప్పింది కూడా ఇదే బీజేపీ నేతలు. అలాగే అనెక్ విభజన హామీల పై ఇదే రకమైన వాదన చేసి, ప్రజలను మభ్య పెట్టి, పబ్బం గడుపుకున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ నోటాతో పోటీ పడుతుంది, ఎలాగూ ఇక్కడ రాదు కదా అనుకున్నారో ఏమో కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా లైట్ తీసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. అదే ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు పోరాటం. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ప్రైవేటీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా, మేము కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకం అని పోరాటం చేస్తుంది. బీజేపీ మినహా అన్ని రాజాకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పోరాటం చేస్తున్నారు.

somu 20022021 2

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ ఇప్పుడు రాష్ట్రంలో ఒక సెంటిమెంట్ గా మారింది. ఈ తరుణంలో రాజకీయంగా వెనుకబడి పోతున్నాం అనుకున్నారో ఏమో కానీ బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. ప్రైవేటీకరణ ఆపేస్తాం, కేంద్రంతో సంప్రదిస్తాం అంటూ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోము వీర్రాజు, జీవీఎల్ లాంటి నేతలు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసారు. అక్కడ ఏమి అయ్యిందో, వారు ఏమి చెప్పారో కానీ, మూడు రోజులు తరువాత ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చి, ప్లేట్ తిప్పెసారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం ఎవరు చేస్తున్నారు అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి, కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం పై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేస్తున్నామని కేంద్రం ఎక్కడ చెప్పింది అంటూ, ఎదురు దాడి మొదలు పెట్టారు. సోము వీర్రాజు, జీవీఎల్ ఇదే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే కేంద్రం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవటం, ఈ విషయం పై కేంద్రం అధికారికంగా ట్వీట్ చేయటం అందరికీ తెలిసిందే. అయినా సరే తమకు తెలిసిన ఎదురు దాడితో, ఏపి బీజేపీ కొత్తగా మరో ప్రచారం మొదలు పెట్టింది.

Advertisements

Latest Articles

Most Read