పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఎంత వల్గర్ గా మాట్లాడారో మనం చూశాం. ఇతను ఇప్పుడెక్కడ ఉన్నాడు..? డీజీపీ ఇంట్లో ఉన్నాడా, లేక జగన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా? ఎందుకీ రాయల్ ట్రీట్ మెంట్..? మా ఇళ్లపైకి రాత్రిళ్లు వందలాది పోలీసులను పంపి, గోడలు దూకించి అరెస్ట్ లు చేయిస్తారా..? ముందస్తు నోటీసులు కూడా ఇవ్వరా..? మేం సంఘ విద్రోహ శక్తులమా..? మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా..? మేం ఎవరినైనా చంపేశామా..? దేవినేని ఉమా మహేశ్వర రావును అనేక పోలీస్ స్టేషన్లను మార్చిమార్చి తిప్పారు. ఆయన ఏం చేశారో ఇంతవరకు చెప్పలేదు. పోలీసుల్లో కొందరికి కనీసం సిగ్గనిపించడం లేదా..? ఒక బూతుల మంత్రి, రౌడీ మంత్రి ఏం మాట్లాడారో చూశాం. ఇంటికొచ్చి కొడతానని దేవినేని ఉమామహేశ్వరరావుని ఒక మంత్రి అంటాడా...? నాపై కూడా దుర్భాషలు మాట్లాడాడు. ఏంటి నీ అహంభావం..? ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. ఉన్మాది సపోర్ట్ చేస్తున్నంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా..? ఇన్నాళ్లూ ప్రజా సేవలో ఉండి మీ దగ్గర దెబ్బలు తినడానికి మేం ఇక్కడ ఉన్నామా...? ప్రజలకు సేవ చేయడానికి మేం ఉన్నాముగాని, మీ దగ్గర దెబ్బలు తినడానికి కాదు. అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వెళతాడా...? పోలీసులు తలుపులు తీసి అతని దౌర్జన్యాలకు సహకరిస్తారా..? సిగ్గులేదా మీకు...? ఇది డెకాయిట్ విధానం కాదా...? డీజీపీ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎస్పీని ఇష్టారాజ్యంగా మాట్లాడితే, ఆయనపై ఎలాంటి కేసు పెట్టరా అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించాడు. తన ఇంట్లో తలుపులు తీసిన పోలీసులను ప్రశ్నించాడని, జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు పెట్టారు, మరి జిల్లా ఎస్పీని నిందించిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ఎందుకు కేసులు పెట్టరని ఆయనే నిలదీశాడు. దీనికి డీజీపీ దీనికి సమాధానం చెప్పాలి.

డీజీపీ, హోం మినిస్టర్, ముఖ్యమంత్రి ఒకే మతం వారు ఉంటే ఏమౌతుంది...? నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. మీరంతా కలిసి కుట్రపన్ని పద్ధతి లేని రాజకీయాలు చేస్తారా...? ప్రజాజీవితం అంటే మీ ఇష్టం కాదు. మీ ఇంట్లో ఉంటే అది మీ ఇష్టం. ప్రజలకు సేవ చేసేప్పుడు ప్రజాజీవితం ఇది. దేవాలయాలపై 150 దాడులు జరిగాయి. దాడులు చేసిన వారిపై కేసులు పెట్టకుండా, వారిని పట్టుకోవడం చేతకాక, లాలూచీపడి, చివరకు ప్రశ్నించిన మాపై కేసులు పెడతారా...? ఎవరిని బెదిరిస్తారు...? మీరేమైనా మోనార్క్ అనుకుంటున్నారా...? అందరినీ సమానంగా చూడాలి. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వెనుక ఉన్నదెవరు..? అతని వెనుక ఎవరి బంధువులు ఉన్నారు..? కడపలో బ్యాంక్ అకౌంట్ అతనికి ఎందుకు ఉంది..? రహస్యంగా ఆయనను ఎందుకు విచారిస్తున్నారో సమాధానం చెప్పాలి. వీడియోలు, రికార్డులు లేవా సాక్ష్యంగా...? ఒక మతంపై కక్షగట్టినట్లు మీరు బిహేవ్ చేస్తుంటే, మేము అడగటం తప్పా...? టీడీపీ సెక్యులర్ పార్టీ అని చెప్పాం. అదే సమయంలో రాముడి తల తీసేసినా, దేవాలయాలపై దాడులు జరిగినా, విగ్రహాల విధ్వంసం జరిగినా మేం ప్రశ్నించకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా...? నిన్న కూడా సీఎం జగన్ క్రిస్టియన్లతో నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టించి నన్ను క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. క్రిస్టియన్ మతాన్ని రోడ్డుకు ఈడ్చినది ఎవరు..? పదవి కోసం మతాన్ని రోడ్డుకు ఈడ్చింది ఎవరు..? బలవంతపు మతమార్పిళ్లు బైబిల్ లో ఉందా..? దీనికి సమాధానం చెప్పాలి. ప్రజాజీవితంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇష్టారాజ్యంగా చేయడం కరెక్ట్ కాదు.

ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చినతీర్పుని టీడీపీ స్వాగతిస్తోం దని, తీర్పువెలువడనప్పటినుంచీ ముఖ్యమంత్రికి వణుకు మొద లైందని, ఆయన ముఖంకళ తప్పిందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు "స్థానికఎన్నికలు నిర్వహించే సత్తా, ధైర్యంలేని ముఖ్యమంత్రికి లేవని తేలిపోయింది కాబట్టి, ఆయనతక్షణమే తనపదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. సింగిల్ జడ్జి తీర్పు వెలువడినప్పుడు నిమ్మగడ్డను రాజీనామా చేయాలని కోరిన వ్యక్తి కి, నిజంగా నైతికవిలువలుంటే, ఆయన తక్షణమే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికినైతిక విలువలున్నాయని ఎవరూ అనుకోవడం లేదు. హైకోర్టు తీర్పుని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్వాగతించాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని ఆయనచెప్పారు. ముఖ్యమంత్రేమో గడపగడపకు పరిగెత్తుతూ, గవర్నర్ ని కలుస్తూ, ఎన్నికల నిర్వహణకు వెనకడుగు వేస్తూ, పారిపోతున్నారు. అంజాద్ బాషా సమర్థుడిలా కనిపిస్తున్నాడు కాబట్టి, అతనికి ముఖ్యమంత్రి పీఠం అప్పగించండి. ఎందరో పెద్దపెద్దరెడ్లు గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కోర్టుతీర్పులను గౌరవించారు. ఈయనే నవ్విపోదు రుగాక, నాకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు రమేశ్ కుమార్ కు మార్గం సుగమైంది కాబట్టి, ఆయన డీజీపీ సవాంగ్ ను తొలగించాలి. అడుగుడుగునా అధికారపార్టీకి వత్తాసుపలుకుతున్నాడు కాబట్టి, పోలీస్ బాస్ గా, ఎన్నికల నిర్వ హణకు సవాంగ్ సమర్థుడు కాడని స్పష్టంచేస్తున్నాను. డీజీపీగా సవాంగ్ ను నేడే తొలగించి, ఎన్నికలయ్యేవరకు ఆయన రాష్ట్రంలో ఉండకుండా చూడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. "

"గతంలో ఎన్నికల కమిషన్లు చీఫ్ సెక్రటరీని తొలగించిన దాఖలాలు ఉన్నాయి. గతఎన్నికలకు ముందు చీఫ్ సెక్రటరీగా ఉన్న పునేఠా, ఇంటిలిజెన్స్ డీజీలను తొలగించడం జరిగింది. ఇప్పుడు డీజీపీగా ఉన్న సవాంగ్ తొలినుంచీ టీడీపీపై వ్యతిరేకతతోనే ఉన్నారు. తొలినుంచీ ఆయన టీడీపీవారిపై ఒకలా, వైసీపీవారితో మరోలా వ్యవహరిస్తున్నారని ఆయనచేష్టలతోనే అర్థమవుతోంది. దేవాలయాలను పడగొట్టారంటూప్రెస్ మీటు పెట్టినప్పుడే, డీజీపీ ఎంతలా ప్రభుత్వానికి వత్తాసుపలుకుతున్నారో అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఛలో ఆత్మకూరు కార్యక్రమం తలపెట్టినప్పుడు, ఆయన వ్యవహారశైలిని కోర్టులుకూడా తప్పు పట్టాయి. డీజీపీ సవాంగ్ విషయం ఒక ఫిట్ కేసు. ఎన్నికల వ్యవహారం పూర్తయ్యేవరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్, డీజీపీని తొలగించాలని కోరుతున్నాను. కోర్టులతో అనేకసార్లు చీవాట్లు తిని, స్వామిభక్తి పరాయణుడిగా ప్రవర్తిస్తున్నడీజీపీ ఉంటే, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని స్పష్టంచేస్తున్నాను. చంద్రబాబునాయు డు రామతీర్థం వెళితే, అక్కడ ఆయన్ని 151కింద అరెస్ట్ చేస్తామని నోటీసులిస్తారా? ఆచర్యను కోర్టుతప్పుపట్టి, పకపకా నవ్వింది వాస్త వం కాదా? 69ఏళ్ల వయసున్న కళా వెంకట్రావుని అంతరాత్రివేళ, హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుచూశాక, డీజీపీ ఎన్నికలను నిష్ప క్షపాతంగా జరుపుతాడంటే ప్రజలు నమ్ముతారా? ఎన్నికలు సజా వుగా, సక్రమంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తానని మీడియాసాక్షిగా చెప్పగలిగేధైర్యం సవాంగ్ కు ఉందా? కళా వెంకట్రావుని అరెస్ట్ చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశాక, ఆయన్ని అసలు తాము అరెస్ట్ చేయలేదని సజ్జల చెబుతాడా? నిన్నటివరకు సాక్షిపేపర్లు ఏరుకున్న వ్యక్తితో నీతిపన్నాలు చెప్పించుకోవాల్సిన ఖర్మ చంద్ర బాబునాయుడి గారికి పట్టడం విధికాక మరేమిటి? ఎంపీ విజయసాయిరెడ్డిపై దాడిఘటనలో కళావెంకట్రావుని అరెస్ట్ చేసినట్లు సాక్షిపత్రికలోనే రాశారు. అరెస్ట్ చేశాకే బెయిల్ ఇస్తారనే ఇంగితంకూడా లేని వ్యక్తి , ప్రభుత్వసలహాదారా? ప్రజలసొమ్ముని దారుణంగా తినేస్తూ, సిగ్గులేకుండా సలహాదారులమని చెప్పుకుం టారా? జైలుకువెళ్లొచ్చినవ్యక్తికి ఇటువంటి వారే సలహాదారులుగా ఉంటారు మరి. సజ్జల చెప్పింది చెప్పడంతప్ప, డీజీపీ తనకు తాను ఏనాడూ ఆలోచనతో, వివేకంతో మాట్లాడిందిలేదు." ఇటువంటి వివాదాస్పదమైన డైరెక్టర్ జనరల్ గతంలో ఏనాడూలేరు, ఇకముం దు ఉండబోరు. డీజీపీ తనకు తానుగా సెలవు పెట్టి, ఎన్నికల విధుల నుంచి తప్పుకుంటే మంచిది. లేకుంటే ఎన్నికల కమిషనర్ ఆయన్ని తొలగించాలి.

"గతంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను బదిలీచేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఆదేశిస్తే, ప్రభుత్వం ఆ పనిచేయలేదు. అలానే కొందరు డీఎస్పీలు, సర్కిల్ ఇన్ స్పెక్టర్లను బదిలీచేయాలని కూడా ఆదేశించారు. అవేవీ జరగలేదు కాబట్టి, ఎన్నికల కమిషనర్ తక్షణ మే ఆనాడు తానుఇచ్చిన ఆదేశాలు తక్షణమే అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. అదేవిధంగా ఎన్నికలవేళ ఎక్కడైతే కొందరు పోలీస్ అధికారులు, అధికారపార్టికి కొమ్ముకాసి, అత్యుత్సాహంగా పనిచేశారో, వారందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎక్కడైతే గతంలో అధికంగా ఏకగ్రీవాలయ్యాయో, ఆపరిధిలోని పోలీస్ అధికారులను రేంజ్ దాటి బదిలీచేయాలని సూచిస్తున్నాను. వారు ఆరేంజ్ లో ఉంటే న్యాయం జరగదు. పోలీస్ అధికారుల పోస్టింగులన్నీ కూడా సజ్జల ఆధ్వర్యం లో జరుగుతాయని డిపార్ట్ మెంట్ మొత్తానికి తెలుసు. కాబట్టి ఎన్నికలు సజావుగా,నిష్పక్షపాతంగా సాగాలనే ఆలోచన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఉంటే , ఆయన తక్షణమే తాను చెప్పినవాటిపై ఆలోచించి, అమలుచేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ముఖ్యమంత్రి రాజీనామా చేయడంతోపాటు, డీజీపీ తొలగింపు, జిల్లాలఎస్పీలు, కలెక్టర్లు, కొందరు పోలీసు అధికారులను తక్షణమే బదిలీచేయాలి. గతంలో జరిగిన బలవంతపు ఏకగ్రీవాలను రద్దుచేసి, తాజాగా తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఎస్ఈసీని కోరుతున్నాము. అధికారబలంతో గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దుచేయకపోతే, ఆప్రభావం ఎన్నికలపై పడుతుందని ఎస్ఈసీకి స్పష్టంచేస్తున్నాను. నైతిక విలువలనేవి నిజంగా ముఖ్యమంత్రికి ఉంటే, తనకుతానుగా ఆయనే పదవినుంచి దిగిపోవాలి. అదే న్యాయం కూడా."

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొద్ది సేపటి క్రితం, స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు, ఎన్నికల కమిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు పై స్పందించిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు , షెడ్యుల్ ప్రకారం జరగుతాయని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. వచ్చే నెల 5వ తదీ, 9వ తేదీ, 13వ తదీ, 17వ తేదీ, ఈ నాలుగు తేదీల్లో ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఎన్నికల నోటిఫికేషన్ లు వరుసగా వెలువడతాయని తెలియ చేసారు. ఎన్నికలకు సహకరిస్తామని కోర్టుకు చెప్పినట్టు చెప్పారు. త్వరలోనే చీఫ్ సెక్రటరీ, డీజీపీతో సమావేశం ఏర్పాటు చేసి, దీని పై ముందుకు వెళ్తామని తెలిపారు. మరో పక్క ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు పూజలు నిర్వహించారు. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యుల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించటం, హైకోర్టు కొద్ది సేపటి క్రితం దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చిన నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి కొద్ది సేపట్లో ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఇందులో ఈ విషయం చెప్పే అవకాసం ఉంది.

nimmagadda 21012021 2

అయితే ఇప్పటికే కొంత మంది మంత్రులు, తమ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, సుప్రీం కోర్టుకు వెళ్తామని ప్రకటించారు. దీని పై సాయంత్రంలోగా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో సింగల్ బెంచ్, ఎన్నికల షెడ్యుల్ ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు పై, ఆ రోజే రాష్ట్ర ఎన్నికల కమిషన్ , డివిజన్ బెంచ్ లో అపీల్ చేసింది. ఎన్నికల్ కమిషన్ పిటీషన్ పై , డివిజనల్ బెంచ్ రెండు రోజుల పాటు వాదనలు వింది. వాదనలు విన్న అనంతరం, డివిజినల్ బెంచ్, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం, 36 పేజీల తీర్పుని ఇచ్చింది. ఎన్నికల షెడ్యుల్ కొట్టివేస్తే సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని , కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం, స్థానిక ఎన్నికలు జరపటం అనేది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ విధి అని స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం , ఎన్నికల కమిషన్ కు సహకరించాలి అని చెప్పిన ఆదేశాలను కూడా, ఈ తీర్పులో పొందు పరిచింది. ఎన్నికలకు సంబందించిన సహాయ సహకారాలు, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందించాలని పేర్కొంది.

రాష్ట్రంలో వైసిపి అరాచకాలు, జగన్ రెడ్డి ఉన్మాది పరిపాలనపై తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన తెలియజేస్తోంది. డీజీపీని కూడా హెచ్చరిస్తున్నా... కళా వెంకట్రావు గారు చేసిన తప్పేంటి...? రామతీర్థంలో రాముడి తల నరికివేస్తే.. నేను ముందుగా ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చా. అది కూడా దుర్ఘటన జరిగిన 5వ రోజున. 29న రామతీర్థం ఘటన జరిగింది. నేను 2న పర్యటనకు ప్రోగ్రామ్ ఇచ్చాను. ముఖ్యమంత్రి 30న అక్కడకు వెళ్లారు. దేవాలయాలపై దాడులను అరికట్టాలనే ఆలోచన ఉంటే, ఆరోజే సీఎం ఎందుకు రామతీర్థం వెళ్లలేదు..? మంత్రులు కూడా ఆ రోజే ఎందుకు వెళ్లలేదు..? నేను 2వ తేదీన వెళితే, అప్పుడు ఏ-2ని ఏ చట్టం కింద అక్కడకు డీజీపీ అనుమతించారు..? రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయా..? ప్రతిపక్ష నేత అక్కడకు వెళితే ఇదేనా మీరు చేసేది..? మీకు లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయాలన్న ధ్యాస లేదు. విజయసాయిరెడ్డి కరుడుగట్టిన నేరస్థుడు. అలాంటి వ్యక్తికి గులాంగిరీ చేస్తూ, ముందస్తు అనుమతితో వచ్చిన నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారా..? ఇదేనా శాంతిభద్రతలను కాపాడటం...? డీజీపీ సమాధానం చెప్పాలి. అనుమతితో వచ్చిన నన్ను అడుగడుగునా అడ్డుకుంటారా..? నా పర్యటనకు అడ్డంగా లారీలను పెడతారా..? ఏమనుకుంటున్నారు మీరు..? నేరస్థులను అనుమతించి మా ప్రోగ్రామ్ ను అడ్డుకుంటారా...? పోలీసులు ఉంది ప్రతిపక్షాలను అణచివేయడానికి కాదు, శాంతిభద్రతలను కాపాడటానికి ఉన్నారు... ప్రజల్లో తీవ్రమైన ఆవేశం వస్తే, పోలీసులు కూడా వెనక్కి తగ్గక తప్పదు. నిన్న విజయనగరం జిల్లాలో అదే జరిగింది. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి...? మీ ఇష్టారాజ్యాంగా చేసి ప్రతిపక్షాలను అణగతొక్కుతామంటే కుదరదు. కోర్టులు, ప్రజలు చీవాట్లు పెట్టినా మీకు లెక్కలేదు. ఏ రూల్ కింద ఆయనను అరెస్ట్ చేశారు? రాముడి తల నరికివేస్తే, నరికేశారని చెప్పడం తప్పా..? అది చూడటానికి వెళితే, మాపై సెక్షన్లు 307, 327, 427, 506, 323, 120ఏ, డెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసులు పెడతారా...?

ఇది ఇండియన్ పీనల్ కోడా, జగన్ పీనల్ కోడా మీరు అమలు చేసేది..? అంబేద్కర్ రాజ్యాంగమా, రాజారెడ్డి రాజ్యాంగమా మీరు అమలుచేసేది...? దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి. ఇంత దారుణంగా చేసి, ఇంతమందిని చంపిన తర్వాతైనా మానసికంగా మార్పు రాలేదా అని అడుగుతున్నా. పోలీసు సంఘాలను బెదిరించి మాపై స్టేట్ మెంట్లు ఇప్పిస్తారా...? నిన్న తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు పర్మిషన్ ఇచ్చి నేడు క్యాన్సిల్ చేస్తారా..? మా వాళ్లను అరెస్ట్ చేస్తారా..? ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా, డీజీపీ ఏం చేస్తున్నారు...? ధర్మపరిరక్షణ యాత్ర చేసే హక్కు మాకు లేదా అని అడుగుతున్నా. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఏం తమాషానా ఇది..? చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జగన్ రెడ్డి క్రిష్టియన్ అనేది వాస్తవం. నాపై క్రిష్టియన్ సంఘాలతో నాకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు ఇప్పిస్తారా? రాష్ట్రంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కుట్ర జరుగుతోంది. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి. ప్రవీణ్ చక్రవర్తి ఎక్కడ ఉన్నాడో చెప్పాలి. అలాంటి వారికి వంత పాడుతున్నారు. ప్రజలకు సెంటిమెంట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడైనా కళా వెంకట్రావుపై ఏదైనా వివాదం ఉందా..? నేను డీజీపీని అడుగుతున్నా. ఆయన వివాదరహితుడు. చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర వాసులంతా శాంతికాముకులు. అలాంటి ప్రదేశంలో రాత్రి 9.35కు కళా వెంకట్రావును అరెస్ట్ చేస్తారా..? ఆయనకు బీపీ ఉంటే, ట్యాబ్లెట్ వేసుకుంటానంటే కూడా కనీసం పర్మిషన్ ఇవ్వరా? పోలీసులను ఇష్టారాజ్యంగా వినియోగిస్తానంటే మీ ఆటలు సాగవు. మమ్మల్నందరినీ, ప్రజలందరినీ జైల్లో పెట్టి మీ ఆటలు సాగించుకోండి.

Advertisements

Latest Articles

Most Read