ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. మొదటి నుంచి అమరావతి పై విషం చిమ్ముతున్న వైసీపీ, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, అమరావతి పై విషం చిమ్మటం ఆపలేదు. ఇందులో భాగంగానే, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, చట్టంలో లోని అంశం ఒకటి తీసుకుని వచ్చి, హడావిడి చేసారు. దీని పై ఇష్టం తమ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిఐడిని ఉపయోగించి, కేసులు పెట్టారు. అయితే ఈ రోజు హైకోర్టులో ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ పై, సంచలన తీర్పు ఇచ్చింది. రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ, వాదిస్తున్న వచ్చిన ప్రభుత్వానికి, అలాగే ఇటీవల సిఐడి కేసులు కూడా కొట్టివేస్తె, కొద్ది సేపటి క్రితం హైకోర్టు చారిత్రాత్మిక తీర్పుని ఇచ్చింది. రాజధానికి సంబంధించి, కిలారు రాజేష్ అనే వ్యక్తి, గుంటూరులో ఉన్న కొంత మంది, విజయవాడలో ఉన్న మరి కొంత మంది, రాజధాని అమరావతిలో భూములు ముందుగానే కొనుగోలు చేసారని, సిఐడి కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఒక వ్యక్తీ ఫిర్యాదు చేసారని, సిఐడి కేసు నమోదు చేసింది. అప్పట్లో అరెస్ట్ కూడా చేయాలని చూసినా, హైకోర్టు అరెస్ట్ ల పై స్టే ఇచ్చింది. అమరావతి పరిధిలో రాజధాని వస్తుందని, ముందే తెలిసి వీళ్ళు ముందే భూములు కొనుగోలు చేసారని ఆరోపణ మోపారు. అయితే దీని పై వీళ్ళు కోర్టుకు వెళ్లారు. ఈ భూములు తాము ఎప్పుడో కొనుగోలు చేసామని, అదీ కాక, రాజధాని వెలుపల భూములు కొనుగోలు చేసినా, దీనికి సంబంధం ఏమిటి అని కోర్టుని ఆశ్రయించారు.

hc 19012021 2

దీని పై హైకోర్టులో విచారణ జరిగింది. కొద్ది సేపటి క్రితం, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ, సిఐడి చేసిన ఆరోపణలు హైకోర్టు కొట్టివేసింది. ఆ కేసుని కూడా క్వాష్ చేస్తూ తీర్పుని ఇచ్చింది. చట్ట ప్రకారం, ఎవరైనా అమ్మిని వాళ్ళు, కొనుగోలు చేసిన వాళ్ళు, ఏమైనా ఆరోపణలు చేసినా, అది పరిగణలోకి తీసుకోవాలని, ఎవరో బయట వ్యక్తి ఫిర్యాదు చేస్తే, దీన్ని ఎలా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారని వాదించారు. పైగా ఐపీసికి, ఈ ఆక్ట్ వర్తించదని వాదించారు. కొన్న వాళ్ళు ఫిర్యాదు చేయాలి, లేదా అమ్మిన వాళ్ళు ఫిర్యాదు చేయాలి కానీ, ఈ బయట వ్యక్తులు ఎందుకు ఫిర్యాదు చేస్తారు అంటూ కోర్టు ముందు వాదించారు. భారత శిక్షా స్మృతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదని వాదించారు. రాజధాని వస్తుందని తెలిసిన తరువాత, పత్రికల్లో వచ్చిన తరువాత, ఎవరైనా కొనుక్కోవచ్చని వాదించారు. ఇది రాజకీయ కక్ష అంటూ కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు అమ్మిన వాళ్ళు ఒక్కరు కూడా కేసు పెట్టలేదని, వాపోయారు. పిటీషనర్ తరుపు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఈ కేసుని కొట్టేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఇక వైసీపీ ప్రభుత్వం ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆరోపణలు చేయటం ఆపి, అమరావతిని అభివృద్ధి చేస్తారో లేదో.

అందరి పై విరుచుకుపడే రోజా, తనను ఎవరూ పట్టించుకోవటం లేదు అంటూ, కన్నీళ్లు పెట్టుకోవటం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అందరికీ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఇబ్బందులు ఉంటే, నాకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు ఉన్నాయని వాపోయారు. ఈ రోజు తిరుపతిలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ చైర్మెన్ గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో తెలుగుదేశం నేతల పై ఇచ్చిన ఫిర్యాదులను కమిటీ పరిశీలించింది. అయితే ఇదే సమావేశానికి రోజా కూడా హాజరు అయ్యి, తన ఎమ్మెల్యే పదవికి అవమానం జరుగుతుంది అంటూ, ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేసారు. అధికారులు ఎవరూ తనను ఎమ్మెల్యేగా చూడటం లేదని వాపోయారు. నిబంధనులు పాటించకుండా, కనీస ప్రోటోకాల్ పాటించకుండా, తనను ఇబ్బంది పెడుతున్నారని రోజా ఆరోపణ. ప్రధానంగా ఈ సమస్యలు చెప్తూ రోజా కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ, వార్తలు రావటంతో, రోజా సొంత పార్టీలో పడుతున్న ఇబ్బందులు పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. సహజంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ గ్రూపులు ఎక్కువ. మొత్తం పెద్దిరెడ్డి చెప్పినట్టు జరగాల్సిందే. ఇక మరో పక్క ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా ఉన్నారు.

roja 18012021 2

ఇలా వీరి అందరి మధ్య రోజా ఇబ్బందులు పడుతుందా అనే చర్చ జరుగుతుంది. ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ లో, ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని, మహిళా ఎమ్మెల్యేని కావాలని ఏడిపిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేయటం జరిగింది. ఆమె ప్రధానంగా ప్రోటోకాల్ విషయంలో ఫిర్యాదు చేసారు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అధికారులు తనను పిలవటం లేదని కలెక్టర్ పై ఫిర్యాదు చేసారు. ఇక దీనితో పాటు, సొంత పార్టీ నేతలు, మంత్రులు కూడా తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసారు. టిటిడిలో పని చేసే ఉద్యోగులుకు, తన నియోజకవర్గంలో ఉన్న ఏపీపీఐసి ల్యాండ్ ని ఇళ్ళ స్థలాలుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, అయితే దాని కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా తనను పిలవలేదని ఆమె అవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యేగా కాకపోయినా, ఏపీపీఐసి చైర్మెన్ హోదాలో కూడా తనని పిలవలేదని అన్నారు. అయితే అన్ని అంశాలు పరిశీలించిన కాకాని, సియం జగన్ దృష్టికి తీసుకుని వెళ్తామని, కలెక్టర్ తో మాట్లాడామని, ఇక ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు , నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, జిల్లా ఎస్పీ పై తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. ఎస్పీ భాస్కర్ భూషన్‍కు వార్నింగ్ ఇచ్చారు. ఆయన మాటల్లోనే "ఇటువంటి పోస్టింగ్ పెడితే, ఆ పోలీస్ డిపార్టుమెంటుకు చెందిన జిల్లా అధికారి, ఆయనకు ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫోన్ చేసారని, కేసు రిజిస్టర్ చేయవద్దు అని చెప్పేది ఏమిటి నాకు అర్ధం కావటం లేదు ? ఏమనుకుంటున్నాడు ఆయన ? ఎవరనుకుంటున్నాడు ? ఏ గవర్నమెంట్ అనుకుంటున్నాడు ? నాకు అర్ధం కావటం లేదు. బాగుండదు, పద్దతి కాదు, తమాషాలు పడొద్దు, దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాం. చేయండి. ముందు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయండి. డీఎస్పీ వచ్చి ఎంక్వయిరీ చేస్తాడు. ఫాల్స్ కేసు అయితే తీస్తాడు. లేకపోతే కేసు రిజస్టర్ చేసి లోపల వేస్తారు. అంతే కదా ? కేసు రిజిస్టర్ చేయవద్దు అని చెప్పటానికి నువ్వు ఎవరివి ? జిల్లా అధికారివి ? నీకేమి సంబంధం ? 13 జిల్లాల్లో ఇదే జరుగుతుందా ? ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు. ఎస్పీ అనుమతి లేనిదే పెట్టకూడదా ? ఎక్కడ నుంచి వచ్చావు నువ్వు ? ఎవరు నేర్పించారు నీకు రూల్స్ ? ఎస్సీ ఎస్టీ కేసు ఇచ్చిన తరువాత కేసు రిజస్టర్ చేస్తారు. డీఎస్పీ వచ్చి ఎంక్వయిరీ చేస్తాడు. అంతే కదా ? నీకు ఏమి అధికారం ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయవద్దు అని చెప్పటానికి ? బాగుండదు. ఉన్నన్ని రోజులు జాగ్రత్త. ఇంకో నెల ఉంటావో, రెండు నెలలు ఉంటావో, ఉన్నన్ని రోజులు శుద్ధంగా ఉండి, చివరి రోజులో అయినా మంచి పేరు తెచ్చుకునో పో. తమాషాలు పడుతున్నాడు. ఏమనుకుంటున్నాడో ఏమో. ఎవరు అనుకుంటున్నాడో.

prasanna 180120212

ఎక్కడి నుంచో వచ్చాడు. మన కర్మకు వచ్చాడు ఈ జిల్లాకి. ఏమి పనులు ఇవి ? అందరి మీదే ఇది జరుగుతుంది. జగన్ గారి మీద అయితే ఇష్టం వచ్చినట్టు బాషతో రాస్తున్నారు. ఇన్ని జరుగుతా ఉంటే ఏమి చేస్తున్నారు మీరు అంతా ? ఎవరు కాపాడుతారు నిన్ను ? ఏమైనా విజయవాడలో ఉన్న డీజీపీ కాపాడుతాడు అనుకుంటున్నావా ? బాగుండదు చెప్తున్నా. మీడియాకు చెప్తున్నా. ఎంత దూరం రాసుకుంటారో రాసుకోండి. ఓపెన్ గా, చెప్తున్నా. నువ్వు తెలుగుదేశం పార్టీ అజేంట్ వా ? మా ప్రభుత్వం తరుపున ఈ జిల్లా ఆధికారిగా వచ్చిన వ్యక్తీవా అని నేను అడుగుతున్న ? ఎవడో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి ఫోన్ చేస్తే, మమ్మల్ని ఇబ్బంది పెడతావా ? ఎన్ని రోజులు ఉంటావు, నువ్వు ఈ నెల్లూరు జిల్లాలో, తరువాత నీ బ్రతుకు ఏమిటి ? వేరే జిల్లాకు పోతావ్ . నువ్వు ఎవరు అసలు ? కేసు పెట్టొద్దు అనటానికి నువ్వు ఎవరు ? బెదిరిస్తావా ? జైల్లో వేయిస్తాను అన్నావు అంటా, కింద పోలీస్ వారిని. నీకుందా దమ్ము ? రా నీకు దమ్ము ఉంటే అరెస్ట్ చేపించు. ఎవరి గవర్నమెంట్ అనుకుంటున్నావ్ ? జాగ్రత్తగా ఉండు, నాతొ పెట్టుకోమాక ?" అంటూ జిల్లా ఎస్పీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి పోలీస్ సంఘం వారు, ఇప్పుడు కూడా మీసాలు మెలేసి, ప్రెస్ మీట్లు పెడతారేమో చూడాలి. ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/Qc_qgcWLPHQ

రెండు రోజుల క్రితం, గిద్దలూరు వైసిపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అందులో ఆయన సమస్య చెప్పుకోవటానికి వచ్చిన జనసేన కార్యకర్తపై బూతులు వర్షం కురిపించారు. ప్రకాశం జిల్లా కొనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబుకు రోడ్ల తీరు సరిగా లేదని, ఒకసారి కారు దిగి వచ్చి చూడండి అంటూ జనసేన కార్యకర్త వెంగయ్య అడ్డుకోగా, జనసేన కార్యకర్త వెంగయ్యను బూతులతో తిట్టేసారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీరుపై జనసేన నేతల ఆగ్రహం వ్యక్తం చేయటం, ఇది మీడియాలో హైలైట్ అవ్వటం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేని ఏకవచనంతో సంబోదించారు కాబట్టి, ఎమ్మెల్యే తిట్టారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.అయితే ఈ రోజు వెంగయ్య ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచాలనం సృష్టిస్తుంది. వీడియో బయటకు ఎందుకు విడుదల చేసారు అంటూ, వైసీపీ నేతలు, జనసేన కార్యకర్త వెంగయ్య పై ఒత్తిడి తేవటం, నిన్న గిద్దలూరుకు సంబందించిన ఒక వైసీపీ నేత, ఆ గ్రామ పర్యటనకు వెళ్ళటంతో, గ్రామస్తులు ఆయనతో కూడా రోడ్డులు బాగు చేయకుండా ఎందుకు వచ్చారు అంటూ నిరసన తెలిపారు.

janasena 18012021 2

అయితే, వైసీపీ నేతల ఒత్తిడితోనే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నారని జనసేన నేతలు ఆరోపిస్తూ ఉండగా, మరో పక్క పోలీసులు మాత్రం, వెంగయ్య మద్యం సేవించి, మానసిక ఒత్తిడితోనే, అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారని, బంధవులు కూడా అదే చెప్పారని అంటున్నారు. జనసేన నేతలు మాత్రం, పోలీసులు వాదనతో ఏకీభవహించటం లేదు. జనసేన నేతలు మాత్రం, నిజాలు బయటకు రావాలని అంటున్నారు. ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. గ్రామాల్లో ఉన్న సమస్య తీర్చండి అంటూ, ఒక ఎమ్మెల్యేను అడగటం కూడా తప్పేనా అంటూ, పవన్ ప్రశ్నించారు. జనసేన కార్యకర్త వెంగయ్య మృతి బాధాకరం అని, అతని మరణానికి, అధికార వైసీపీ నేతలు బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. గ్రామాల్లో సమస్యలను అడగటమే తప్పా అని పవన్ ప్రశ్నించారు. ఈ ఘటన పై ఎమ్మెల్యేతో పాటుగా, అతని అనుచరులు పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read