విశాఖపట్నం వాల్తేరు క్లబ్ కు సంబంధించి, ఈ రోజు హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. కొంత మంది విశాఖ వాల్తేరు క్లబ్ పై కన్నేసారని, గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అది ప్రభుత్వానిదా, ప్రైవేటుదా అంటూ వివాదం గత కొన్ని నేలలుగా నడుస్తుంది. గతంలో 1964లో వాల్టర్ క్లబ్ కు ఉన్న పట్టాకు సంబంధించి, కావాలని ఇప్పుడు వివాదం తెచ్చారని, ఆ భూములు కొట్టేసే ప్లాన్ వేసారని, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని పై ప్రభుత్వం ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారం పై విచారణ చేయాలని ఆదేశించింది. అయితే ఈ కేసు హైకోర్టుకు చేరింది. దీని పై ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఈ మొత్తం అంశం పై, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై కోర్టుకు వెళ్ళారు. అయితే ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ అంశం పై స్టే విధించింది. సిట్ విచారణ పై కూడా స్టే విధించింది. వాల్తేరు క్లబ్  వివాదం పై, సిట్ ఎటువంటి చర్యలు ఇక ఈ వ్యవహారంలో ముందుకు వెళ్ళకూడదు అని, మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు, ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని, ఇది సివిల్ వివాదం కాబట్టి, సిట్ జోక్యం చేసుకోకూ డదు అని, తదుపరి విచారణ పై స్టే విధించింది.

అమరావతి ఉద్యమం సమయంలో, కృష్ణాయపాలెంలోని, పదకొండు మంది రైతులు పై, పెట్టిన ఎస్సీ, ఎస్టీ కేసుని కొట్టివేస్తూ, కొద్ది సేపటి క్రితం హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలోకి, మూడు రాజధానుల ఉద్యమం పేరుతో బయట నుంచి వస్తున్నారని, అమరావతి ప్రాంత రైతులు ముందు నుంచి ఆందోళన చేస్తూ వచ్చారు. అయితే, అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు అయిన నేపధ్యంలో, బయట వాళ్ళు ఎవరైనా అమరావతి గ్రామాల్లోకి వస్తే, వెంటనే తమకు తెలియచేయాలి అంటూ, పోలీసులు, అక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ సందర్భంగానే, కొంత మంది కృష్ణాయపాలెంకి చెందిన, ఎస్సీ, బీసీ సామాజికవర్గానికి చెందిన రైతులు, పోలీసుల నోటీసులు దృష్టిలో పెట్టుకుని, వేరే గ్రామాల నుంచి ఆటల్లో తోలుకుని మూడు రాజధానుల శిబిరానికి తీసుకుని వస్తున్న వారిని ఆడ్డుకున్నారు. మీరు ఎందుకు వస్తున్నారు, మా గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య వస్తుంది, బయట వాళ్ళు వస్తే సమాచారం ఇవ్వండి అని పోలీసులు తమకు చెప్పారని వారిని అడ్డుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన వ్యక్తీ, తమ వారిని ఆడుకున్నారు అంటూ కేసు పెట్టగా, పోలీసులు అత్యుత్సాహంతో, వారి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసారు.

hc 20012021 2

అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఎస్సీలుగా ఉన్న వారి పైన కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసే దాకా వ్యవహారం వెళ్ళింది. అయితే కేసు పెట్టిన వ్యక్తి, తాను ఎస్సీ ఎస్టీ కేసు కింద కేసు పెట్టమని చెప్పలేదని, ఈ కేసుని వెనక్కు తీసుకుంటున్నా అని చెప్పినా, పోలీసులు మాత్రం కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు. అయితే ఇదే సందర్భంలో రైతులకు బేడీలు కూడా వేసారు. మొత్తంగా ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే అప్పట్లోనే రైతులకు బెయిల్ వచ్చింది. ఆ సందర్భంలోనే హైకోర్టు పోలీసులు పై అక్షింతలు వేసింది. అయితే ఇప్పుడు ఈ కేసు తదుపరి విచారణ రాగా, ఈ కేసు చెల్లదు అంటూ, హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. రైతులు పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టటానికి వీలు లేదు అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు ఎలా పని చేస్తున్నారో చెప్పటానికి, ఇది ఒక ఉదహరణ అని అమరావతి జేఏసి, విపక్షాలు వాపోతున్నాయి. ఎన్ని సార్లు హైకోర్టులో ఎదురు దెబ్బలు తగిలినా, చేసిన తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నారని వాపోయారు.

గత ఎన్నికల్లో చేసిన ఫేక్ ప్రచారాల్లో, ఇన్సైడర్ ట్రేడింగ్, పింక్‌ డైమండ్‌ ప్రధమైనవి. అయితే నిన్నే హైకోర్టులో ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు, ఏమి లేదు అంటూ కేసు కొట్టేసి, ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే నిన్నే పింక్‌ డైమండ్‌ కూడా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నిజానికి ఇది విజయసాయి రెడ్డికి అనుకూలమైన తీర్పు అయినా, కోర్టు వ్యాఖ్యలు చేస్తే చేసిన వ్యాఖ్యలు మాత్రం, పింక్‌ డైమండ్‌ పై చేసిన ఫేక్ ప్రచారాన్ని కూడా తిప్పి కొట్టినట్టు అయ్యింది. పోయిన ఎన్నికలకు ముందు, తమకు అనుకూలమైన రమణ దీక్షితులు చేత, అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ, తమ వ్యుహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి, తమ పై అసత్య ప్రచారం చేసారు అంటూ తెలుగుదేశం నేతలు తరుచూ వ్యాఖ్యానిస్తూనే ఉంటారు. అంటే ఈ అంశం అప్పటి ప్రభుత్వాన్ని ఎంతలా డ్యామేజ్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా వెంకటేశ్వర స్వామి పింక్‌ డైమండ్‌ పోయింది అని, దాన్ని విదేశాలకు తరలించారు అంటూ, రమణ దీక్షితులు ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేయటం, ఆ తరువాత విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, పింక్‌ డైమండ్‌ చంద్రబాబు ఇంట్లో ఉంది అంటూ ఆరోపణలు చేయటం, చంద్రబాబు ఇంట్లో శ్రీవారి నగలు కూడా ఉన్నాయి అంటూ, విష ప్రచారం చేసారు. అయితే అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం, ఈ ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోలేక పోవటంతో, ఇబ్బంది పడింది.

pink 20012021 2

కొంత మంది ప్రజలు, హిందువులు ఇది నిజం అని కూడా నమ్మారు. ఇక తరువాత ఎంత మంది వచ్చి, పింక్ డైమెండ్ లేదు అని చెప్పినా ప్రజల్లోకి వెళ్ళలేదు. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి పింక్‌ డైమండ్‌ గురించి ఎందుకు ఎంక్వయిరీ చేయటం లేదు అంటే సౌండ్ లేదు. రమణ దీక్షితులు పింక్‌ డైమండ్‌ గురించి ఎందుకు మాట్లాడటం లేదో తెలియదు. అయితే పింక్‌ డైమండ్‌ పై, విజయసాయి రెడ్డిని ప్రతి వాదిగా చేర్చి, పింక్‌ డైమండ్‌ విషయంలో విచారణ చేయాలి అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే దీని పై స్పందించిన హైకోర్టు విజయసాయి రెడ్డిని ఎందుకు ప్రతి వాదిగా చేర్చారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఇదే సమయంలో పింక్‌ డైమండ్‌ విషయంలో ఇంకా విచారణ అవసరం లేదని, ఇప్పటికే పింక్‌ డైమండ్‌ విషయం పై, ఇప్ప‌టికే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన‌ రెండు కమిటీలు విచారణ జరపగా, వాటి నివేదికలు కూడా వచ్చాయి కదా, మళ్ళీ విచారణ ఎందుకు అంటూ పిటీషన్ కొట్టేసింది. అంటే ఆ నివేదికలు ఫైనల్ అని హైకోర్టు అభిప్రాయం. దీంతో పింక్‌ డైమండ్‌ పై ఆ నివేదికలు ఫైనల్ అని చెప్పటంతో, గతంలో పింక్‌ డైమండ్‌ పై వీళ్ళు చేసిన ప్రచారం ఫేక్ అని తేలిపోయింది.

జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. గతంలో రాజశేఖర్ రెడ్డి ఉండగా, ఈ కంపెనీ పై అనేక ఆరోపణలు వచ్చాయి. కేసులు, జైళ్ళు, బెయిల్ దాకా ఈ క్విడ్ ప్రోకో విషయాలు వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావటంతో, మళ్ళీ భారతి సిమెంట్స్ పై ఆరోపణలు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతి సిమెంట్స్ , మిగతా సిమెంట్ కంపెనీలతో సిండికేట్ అయ్యి, కృత్రిమ కొరత సృష్టించి, దాదాపుగా బస్తాకు వంద రూపాయలు పెంచేసిందని తెలుగుదేశం ఆరోపిస్తుంది. నిజానికి సిమెంట్ ధరలు భారీగా పెరిగిన మాట వాస్తవమే. ఇక భారతి సిమెంట్ సామర్ధ్యం చుస్తే, బస్తాకు వంద రూపాయలు పెంచితే, వారికి వెయ్యి కోట్ల టర్న్ ఓవర్ పెరుగుతుందని, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఇదే విషయం భారతి సిమెంట్స్ వాటా టెక్ ఓవర్ చేసిన కంపెనీ కూడా, తన యాన్యుల్ రిపోర్ట్ లో తెలిపినట్టు, ధరలు పెరుగుదల వల్ల, తమకు లాభాలు వచ్చినట్టు, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రాజెక్ట్ లు అన్నిటికీ భారతి సిమెంట్స్ వాడేలా, ఆదేశాలు వెళ్లాయని కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలు పై భారతి సిమెంట్స్ వైపు నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ, వైసీపీ పార్టీ వైపు నుంచి కానీ ఎలాంటి వివరణ రాలేదు. అయితే ఈ రోజు ప్రముఖ జాతీయ పత్రికలో, ఇదే అంశం పై సంచలన కధనం వచ్చింది.

ie 20012021 2

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి తీసుకున్న ఆర్డర్ల మొత్తంలో, కేవలం జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ నుంచి మాత్రమే, 14 శాతం సిమెంట్ ఆర్డర్లు తీసుకున్నట్టు ఆ కధనం ప్రచురించింది. అంటే, 2,28,370.14 మెట్రిక్ టన్నుల సిమెంట్ ని ప్రభుత్వం, భారతి సిమెంట్స్ నుంచి కొనుగోలు చేసింది. ఏప్రిల్ 2020 నుంచి జనవరి 2021 వరకు, ప్రభుత్వం చేసిన సిమెంట్ కొనుగోళ్ళలో ఈ విషయం అర్ధమవుతుంది. తరువాత ఆర్డర్, జగన్ కేసుల్లో సహా నిందితుడిగా ఉన్న ఇండియా సిమెంట్స్ కు దక్కింది. ముఖ్యంగా భారతి సిమెంట్స్ డైరెక్టర్ గా ఉంటూ, అలాగే ఏపీ సిమెంట్ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్(APCMA) వైస్-ఛైర్మన్ ఉన్న రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇది జరిగిందని కధనం. ప్రభుత్వ ఇచ్చే సిమెంట్ ఆర్డర్లు, 23 కంపెనీల మధ్య ఈ అసోసియేషన్(APCMA) సర్దుబాటు చేస్తుంది. అంటే, మొత్తం ఆర్డర్ల లో సుమారు 4.35% ఒక్కో కంపెనీకి రావాలి. కానీ ఒక్క భారతి సిమెంటుకే ప్రభుత్వ ఆర్డర్లలో 14% కట్టబెట్టారు అనేది ఆ పత్రిక కధనం. అయితే ప్రభుత్వం మాత్రం, కొన్ని కంపెనీలు సప్లై చేయలేక పోతున్నాయి కాబట్టి, కొన్ని కంపెనీల దగ్గర నుంచి ఎక్కువ కొన్నామని చెప్తుంది.అందుకే భారతి సిమెంట్స్ నుంచి 14 శాతం కొన్నారట.

Advertisements

Latest Articles

Most Read