ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల పేర్లు ఎలా ప్రజల నోట్లో నానుతూ ఉంటాయో, అలాగే కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా నానుతూ ఉంటాయి. అవి వాళ్ళు చేసే పనులు బట్టి, ప్రజలు వారిని గుర్తిస్తూ ఉంటారు. అది మంచి అయినా, చెడు అయినా. ఈ కోవలోనే, రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండగా, అధికారులని అడ్డు పెట్టుకుని, అడ్డగోలుగా దోచేశారు అంటూ, సిబిఐ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి చనిపోవటంతో, ఆ కేసుల్లో ప్రధముడిగా జగన్ ఉన్నారు. అయితే ఇవన్నీ విచారణ దశలో ఉన్నాయి. ఇవి పక్కన పడితే, ఆ సమయంలో అనేక మంది అధికారులు కూడా జైలుకు వెళ్ళారు. దాదపుగా ఒక 10 మంది పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాత్రం, ప్రజలకు గుర్తుండి పోయింది. ఆమె నెంబర్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ కావటం, చిన్న వయసులోనే ఐఏఎస్ అవ్వటం, తరువాత వివిధ కారణాలతో జైలు పాలు అవ్వటం, ఆ సమయంలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యి, నడవలేని పరిస్థితిలో ఉన్న ఫోటోలు బయటకు రావటం, ఇవన్నీ ప్రజలు చూసారు. ఒక మంచి స్థానంలో ఉండాల్సిన ఐఏఎస్ ఆఫీసర్, ఇలా అయ్యారని, బాధ పడ్డారు. అయితే అదంతా గతం, ఇప్పుడు తాజాగా ఆమె ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచారు. రాష్ట్ర విభజన సమయంలో ఆమె తెలంగాణా రాష్ట్రానికి ఐఏఎస్ గా కేటాయించబడ్డారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, తనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని, తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేయాలని అనుకుంటున్నా అంటూ క్యాట్ లో దాఖలు చేసారు.

jagan 121222020 2

గత 5 ఏళ్ళ చంద్రబాబు హయాంలో ఆమె తెలంగాణా నుంచి పని చేయటానికి ఇష్ట పడ్డారు కానీ, ఇప్పుడు మాత్రం తాను ఏపి అని, అందుకే ఏపి వెళ్ళిపోతానని కోరారు. అయితే ఈ విషయం కేంద్రం కోర్టులోకి వెళ్ళింది. దాదాపుగా ఏడాదికి పైగా ఈ అంశం నలుగుతుంది. కేంద్రం అప్పట్లో ఒప్పుకోలేదనే వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, ఆయన పక్కన శ్రీలక్ష్మి కూడా కనిపించారు. పలు సందర్భాల్లో విజయసాయి, ఆమెను కేంద్రం హోం మంత్రి అమిత్ షా వద్దకు తీసుకువెళ్ళి, ఆమెను ఏపి క్యాడర్ కు ఇవ్వమని కోరారు. తెలంగాణా సియం కేసీఆర్ కూడా ఆమెను రిలీవ్ చేయటానికి ఒప్పుకున్నా, కేంద్రం ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆమెకు పర్మిషన్ వచ్చింది. నిన్నటితో తెలంగాణా నుంచి రిలీవ్ అయిపోయి, ఏపిలో చేరిపోయారు. ఆమె ప్రస్తుతం జిఏడిలో రిపోర్ట్ అయ్యారు. మొత్తానికి ఆమె జగన్ నాయకత్వంలో పని చేయాలనే కోరిక తీరింది. జగన్ చేసిన లాబీయింగ్ పని చేసింది. ఆమెకు వచ్చే వారం పోస్టింగ్ ఇస్తారని, ఆమెను సిఎంఓలోకి తీసుకుని, మంచి పోస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. శ్రీలక్ష్మి ఇప్పటికే, సిబిఐ కోర్టులో తన పై వేసిన అభియోగాలు కొట్టేయాలని పిటీషన్ కూడా వేసారు.

మన దేశంలో సినిమా, రాజకీయాలు వేరు వేరు కాదు.ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో, సినిమా, రాజకీలు పెన వేసుకుని ఉంటాయి. అయితే సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో చాలా కొద్ది మంది మాత్రమే సూపర్ సక్సెస్ అయ్యారు. మొదటిగా తమిళనాడులో ఎంజేఆర్ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి సూపర్ హిట్ అయ్యారు. ఆ తరువాత జయలలిత కూడా ఇలాగే సక్సెస్ అయ్యారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టటమే ఒక సంచలనం అయ్యింది. ఎంజేఆర్ లాగా ఎన్టీఆర్ కేవలం రాష్ట్రానికే పరిమితం అవ్వలేదు. దేశ రాజకీయాలను కూడా శాసించారు. ఒక సంచలనం అంటే వీరి పేర్లే చెప్పాలి. ఇక చిరంజీవి పార్టీ పెట్టినా సక్సెస్ కాలేక రాజకీయాలు నుంచి కూడా తప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో లాగుతున్నారు. ఇప్పుడు తమిళనాడులో సూపర్ స్టార్ట్ రజినీకాంత్ కూడా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆయన రాజకీయ ఎంట్రీ పై కొన్ని సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది. ఎట్టకేలకు ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెడుతూ, తాను కొత్త పార్టీ పెడుతున్నట్టు రజిని ప్రకటించారు. డిసెంబర్ 31న పార్టీ పేరు ప్రకటిస్తారని చెప్తున్నారు. ఆ రోజున పార్టీ పేరు, జెండా, పార్టీ గుర్తు ఇలా అన్ని విషయాలు చెప్పనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా వీటి అన్నిటి పై పార్టీ నేతలతో ఆయన చర్చిస్తున్నారు.

rajini 12122020 2

పార్టీ విధి విధానాల రూపకల్పనలో ఉన్నారు. ఈ సందర్భంగా తన పార్టీ చిహ్నం గురించి చర్చిస్తూ, తన పార్టీ గుర్తు సామాన్యుడి గుర్తులాగా ఉండాలని, రజినీ అభిప్రాయ పడుతూ, సైకిల్ గుర్తు ఎలా ఉంటుంది అని పార్టీ నేతలను అభిప్రాయం అడిగారు. అయితే ఇప్పటికే ఈ గుర్తు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఉందని, భవిష్యత్తులో ఈ విషయం పై అభ్యంతరాలు, ఇబ్బందులు రావచ్చని చెప్పగా, సైకిల్ అనేది సామాన్యుడికి దగ్గర అయ్యేది అని, సైకిల్ గుర్తు పెట్టటం కుదరదు అంటున్నారు కాబట్టి, సైకిల్ వెనుక పాల క్యాన్ కూడా ఉండేలా, (సైకిల్ తో పాల క్యాన్ కూడా ఉండేలా) గుర్తుని ఫైనల్ చేసారని తెలుస్తుంది. రాజినీ నటించిన సూపర్ హిట్ సినిమా అన్నామ‌లైలో కూడా, రజినీకాంత్ ఈ గెట్ అప్ లో ఉంటారని, అది అందరికీ గుర్తుంటుందని, ఆ గుర్తుని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే పార్టీ జెండా కూడా మూడు రంగులు ఉండేలా చూసుకుంటున్నారని సమాచారం. ఈ మొత్తం వివరాలు త్వరలోనే అధికారికంగా రజినీ చెప్పనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నిధుల కోసం, మిషిన్ బిల్డ్ ఏపి పేరిట, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో ఉన్న విలువైన ఆస్తుల అమ్మకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఇలా రాష్ట్ర సంపద అయిన, ప్రభుత్వ ఆస్తులు అమ్మి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవాలని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్, దీని పై ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఆయనతో పాటు, మరో తొమ్మిది మంది కూడా, మొత్తం 10 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసారు. ఈ పిటీషన్ల పై గత మూడు నెలలుగా, రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ రోజు కూడా హైకోర్టులో ధర్మాసనం ముందు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా పిటీషనర్ తరుపు న్యాయవాదులు, అదే విధంగా ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించారు. అయితే ఈ వాదనల నేపధ్యంలోనే, హైకోర్టు ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఆర్ధిక ఎమర్జెన్సీ ఏమైనా నడుస్తుందా ఏంటి అంటూ, హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో ఆస్తులు అమ్మి మరీ, ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా అని ప్రశ్నించింది.

hc 11122020 1

అయితే ఇదే సందర్భంలో, హైకోర్టు కొంచెం వెటకారంగా, క-రో-నా కాలంలో, అత్యధిక ధరలకు, పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేసి, మందు బాబులు, రాష్ట్ర ఖజానాలో డబ్బులు నింపటానికి పాటుపడ్డారని, వాళ్లకు కృతఙ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది అంటూ వ్యంగ్యంగా వ్యఖ్యానించింది. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మాట్లాడుతూ, తాము ఎందుకు భూములు అమ్మి, డబ్బు సమకూర్చుకోవాలని అనుకుంటున్నామో చెప్పారు. తమ ప్రభుత్వం, ఈ దేశంలోనే ఎవరూ చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని, ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అందుకే అవసరం అని చెప్పగా, మీరు ఎంత బాగా అమలు చేస్తున్నారో అందరికీ తెలుసు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రభుత్వం వేసిన కౌంటర్లు అన్నీ కూడా, పిటీషనర్లకు అందచేలయని హైకోర్టు ఆదేశించింది. వాదనలు పూర్తయిన అనంతరం, కౌంటర్లను వారికి అందచేయాలని చెప్తూ, ఈ కేసుని ఈ నెల 17కు వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపి చీఫ్ సెక్రటరీకి ఈ రోజు మరో లేఖ రాసారు. నీలం సాహ్నీతో పాటుగా, పంచాయతీ రాజు, గ్రామీణభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా లేఖ రాసారు. ఈ లేఖలో ప్రాధనంగా, ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రొసీడింగ్స్ పైన స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. అయితే హైకోర్ట్, దీని పై స్టే ఇవ్వటానికి నిరాకరించింది. నిమ్మగడ్డ ఈ రోజు రాసిన లేఖలో ఈ అంశాలు అన్నీ కూడా ప్రస్తావిస్తూ, ఫిబ్రవరిలో నిర్వహించ తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలకు సహకరించాలి అంటూ, ఆయన లేఖలో చీఫ్ సెక్రటరీని కోరారు. అదే విధంగా, రాష్ట్రంలో ఓటర్ల జాబితా గురించి కూడా ప్రస్తావిస్తూ, 2021 ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను జనవరి నాటికల్లా పూర్తి చేయాలని, దీంతో ఫిబ్రవరి నాటికి ఎన్నికలు పూర్తి చేయటనికి, ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి, ఆ లేఖలో పేర్కోన్నారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్, గత నెలలో చీఫ్ సెక్రటరీకి ఒక లేఖ రాసారు. ఈ నేపధ్యంలోనే, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన రెండో లేఖ అని చెప్పుకోవాలి. మొదట రాసిన లేఖకు ప్రభుత్వం సిద్ధంగా లేదనే సంకేతాలు ఇచ్చింది. అంతే కాదు, ఈ విషయం పై కోర్టుకు కూడా వెళ్ళింది. అయితే కోర్టు ఈ కేసు పై విచారణ చేస్తుంది. ఇంకా విచారణ దశలోనే ఈ పిటీషన్ ఉంది.

nimmagadda 1122020 2

అయితే ఇప్పటికే తాము ఎన్నికలు ఆపమని చెప్పలేం అంటూ కోర్టు తేల్చేసింది కూడా. హైకోర్టు ఇప్పటికే స్టే ఇవ్వటానికి నిరాకరించటం, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ రెండో లేఖ రాయటంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్కు వెళ్తుందా, లేదా ఎన్నికలకు రెడీ అవుతుందా అనేది చూడాలి. ఒక పక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్నంత కాలం, ఎన్నికలు నిర్వహించ కూడదు అనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టుకు వెళ్ళటం తప్ప వేరే దారి లేదని పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో పక్క ఎన్నికల నిర్వహణ తేదీ తమను అడిగి చేయాలి అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసారు. ఇది ఒర్దినన్స్ రూపంలో వచ్చే అవకాసం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఇది రాజ్యాంగ విరుద్ధం అని గవర్నర్ కు ఫిర్యాదు వెళ్ళింది. దీని పై ఎలాంటి పరిణామాలు జరుగుతాయో కూడా చూడాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read