అమరావతి రైతుల పై మళ్ళీ కేసులు పెట్టారు. గతంలో పొరుగు ఊరుల నుంచి మూడు రాజధానుల అంటూ, దీక్షలు, ధర్నాలు పేరుతో ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టిస్తున్నారు అంటూ, రెండు నెలల క్రిందట, అమరావతి రైతుల పైనే ఎదురు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే, ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. అయితే అప్పట్లో ఇది ఒక పెద్ద సంచలనం అయ్యింది. చివరకు కోర్టు చీవాట్లు పెట్టటంతో, ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. తాజాగా ఉద్దండరాయనిపాలెంలో, అమరావతి ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం అందించేందుకు, ప్రవాసాంధ్రులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఆ సమయంలో కార్యక్రమం ముగిసిన తరువాత, మహిళా రైతులు ఇంటింటింకీ వెళ్లి, అమరావతి ఉద్యమంలో ఇంకా పెద్ద ఎత్తున పాల్గునాలని ఉద్యమం చేసారు. ఈ సందర్భంగా, అదే ఊరిలో ఉన్న ఎంపీ నందిగామ సురేష్ ఇంటి వద్ద, జై అమరావతి అనే నినాదాలు చేసారని, ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసారని, తమను రెచ్చగొట్టారు అంటూ, మూడు రాజధానుల శిబిరం నుంచి, ఎంపీ మనుషులు వచ్చి, అమరావతి శిబిరం మీదకు వచ్చారు. వారం క్రితం ఈ విషయంలో పరస్పరం వాగ్వాదం జరిగి, అమరావతి రైతులు రాత్రంతా చలిలో కుర్చుని నిరసన తెలపటం, పోలీసులు చర్చలు చేయటం, చివరకు పోలీసులు హామీతో, నిరసన విరమించటం తెలిసిందే.

amaravati 11122020 2

అయితే ఆ సమయంలో తమను కులం పేరుతో దూషించారు అంటూ, మూడు రాజధానుల శిబిరంలో ఉన్న కొంత మంది, కేసులు నమోదు చేయటంతో, అప్పట్లోనే 5 గురు అమరావతి రైతుల పై కేసులు పెట్టారు. అయితే అప్పుడే ఎంపీ నందిగామ సురేష్ ని కూడా కులం పేరుతో దుషించారని, 19 మంది పైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసారు. దీనికి సంబంధించి కేసు నెంబర్ లు కూడా ఇవ్వటం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేసులు రైతుల పై నమోదు చేసారు. మొత్తంగా 24 మంది పై కేసులు నమోదు అయ్యాయి. అయితే రైతుల తరుపున కూడా ఎదురు కేసు పెట్టగా, ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. దాని పై కూడా కేసు నమోదు అయినట్టు సమాచారం. మొత్తంగా మూడు రాజధానుల శిబిరం వారు కావచ్చు, ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు అమరావతి రైతుల పై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో మరోసారి ప్రభుత్వం, అమరావతి రైతుల పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినట్టు అయ్యింది. అయితే ఇది కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు పెట్టారని, తమ పని తాము చేసుకుంటుంటే, తమ పైకి వచ్చి, ఎదురు తమ పై కేసులు పెట్టటం ఏమిటని రైతులు వాపోతున్నారు.

2014తో విభజనతో రోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, మొదటగా భరోసా ఇచ్చింది, రాజధాని అమరావతి. రాజధాని లేని రాష్ట్రం, ఆదయ వనరులు లేని రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఒక అడ్డ్రెస్, ఒక గుర్తింపు,మనకంటూ ఒక రాజధాని ఉండాలి అంటే కల సాకారం చేస్తూ, రాష్ట్రం మధ్యలో, కృష్ణా నది ఒడ్డున, అమరావతి అంకురార్పణం జరిగింది. అప్పటి నుంచి అమరావతి అనేది మనకు గర్వ కారణంగా మారింది. అమరావతి ప్రణాళికలు, గ్రౌండ్ అయిన పనులు చేసి, ఒక అద్భుతం మన ముందు సాక్షాత్కారిస్తుందని అందరూ అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని, 13 జిల్లాల ప్రజలకు ఉపాధి కేంద్రంగా తయారు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ నిర్మాణాలు మధ్యలో ఉండగా, ప్రజల తీర్పు వేరేలా వచ్చింది. మన కళ్ళ ముందు అమరావతి నాశనం అయిపోతుంది. ఏ నోటితో స్మశానం అన్నారో, నిజంగానే అది స్మశానంలా మారిపోతుంది. అయితే అమరావతి రైతుల పోరాటంతో, ఇంకా అమరావతి పై ఆశలు సజీవంగా ఉన్నాయి. అమరావతి అంటే మరణం లేనిది. ఇప్పటికి కాకపొతే ఏ నాటికైనా దాని వైభవం రాక మానదు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా ? ఈ రోజు ఢిల్లీలో కొత్తగా పార్లమెంట్ భవనం నిర్మాణం జరుగుతుంది. ఇది కూడా మన అమరావతి ప్రాజెక్ట్ లాంటిదే.

modi 10122020 2

అమరావతిలో పరిపాలన మొత్తం ఒక చోటు ఉండేలా, హౌసింగ్ మొత్తం పని చేసుకునే చోటుకు దగ్గరగా ఉండేలా ఎలా ప్లాన్ చేసారో, ఇప్పుడు ఢిల్లీలో కూడా సెంట్రల్ విస్టా అనే ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే, ఈ రోజు పార్లమెంట్ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదికి అభినందనలు తెలిపారు. మన దేశ చరిత్రలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుందని అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోటుకు చేర్చటం, ఎంతో ఉపయోగం అని చెప్తూ, చంద్రబాబు అమరావతిని తలుచుకుని భావోద్వేగానికి లోనయ్యారు. సెంట్రల్ విస్టా లాగే, అమరావతిలో సెంట్రల్ స్పైన్ ప్రాజెక్ట్ పేరుతొ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే హౌసింగ్ ప్రాజెక్ట్ లు 60 శాతం పైగా పూర్తయ్యాయి అని, సెక్రటేరియట్, హైకోర్టు పనులు మొదలయ్యాయని, అలాగే ఇక్కడ రాజ్ భవన్ కూడా వచ్చేలా ప్లాన్ చేసామని, అయితే ఇప్పుడు అమరావతిని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అమరావతి నిర్మాణం జరిగితే, దేశానికీ కూడా సంపదగా మారుతుందని అనుకున్నామని, అయితే అమరావతి అనేది దైవ నిర్ణయం అని, కాలమే దిక్సూచి చూపిస్తుంది అంటూ, చంద్రబాబు భావోద్వేగంతో ట్వీట్ చేసారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు దేశం కాదు, ప్రపంచం అంతా చూస్తుంది. ఆంధ్రర్పదేశ్ రాష్ట్రంలో వచ్చిన వింత వ్యాధి దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, 5 రోజులు క్రితం ప్రజలు వింత వ్యాధి బారిన పడిన, హాస్పిటల్ పాలు అయిన సంగతి తెలిసిందే. మూర్చతో పడిపోయి, నురగ కక్కుకుంటూ, ప్రజలు హాస్పిటల్ పాలు అయ్యారు. ఈ రోజుకి పరిస్థితి కొంచెం కుదుట పడింది. ఇప్పటి వరకు దాదాపుగా 600 మంది ఈ వ్యాధి బారిన పడగా, ముగ్గురు చనిపోయారు. అయితే ఇన్ని రోజులు అయినా ప్రభుత్వం, దీనికి గల కారణాలు చెప్పలేక పోయింది. మంచినీరు కారణంగానే ఇంత మంది జబ్బు బారిన పడి ఉంటారని చెప్తున్నా, ప్రభుత్వం మాత్రం నీటిలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన బృందాలు మాత్రం, నీటిలో సీసంతో పాటుగా, క్లోరిన్ అధికం అవ్వటం వలన, నీరు కలుషితం అయి ఉంటుందని ఇప్పుడిప్పుడే ఒక నిర్ధారణకు వస్తున్నారు. దీని పై ఈ రోజు, రేపటిలోగా, కేంద్ర బృందం తమ పరిశీలనలో అంశాలు చెప్పనుంది. అయితే ప్రాధమికంగా అందరూ నీరు కలుషితం పైనే ద్రుష్టి పెట్టారు. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలల్లో పరిస్థితి ఏమిటి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, మాజీ ఐఏఎస్ అధికారి రాసిన లేఖ, ఇప్పుడు సంచలనంగా మారింది.

jagan 10122020 2

మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ, జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. ఆ లేఖలో తీవ్ర హెచ్చరికలు జారీ చేసారు. ఏలూరు పరిస్థితి, విశాఖకు రాక ముందే మేల్కోవాలని హెచ్చరించారు. ఏలూరులో నీరు కలుషితం అయ్యి, సీసం కలిసిందని చెప్పినట్టే, విశాఖ నీటిలో కూడా సీసం కలిసిన ఆనవాళ్లు ఉన్నాయని మాజీ అధికారి ఈఏఎస్‌ శర్మ తెలిపారు. విశాఖపట్నం నగరంలో నీటి కాలుష్యం అధికంగా ఉందని, ఇక్కడ నీరు కూడా కలుషితం అవుతుందని, జాగ్రత్త పడాలని లేఖలో తెలిపారు. దీనికి సంబంధించి కొన్ని నివేదికలు కూడా ఆయన జత చేసారు. క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక కూడా ఇదే చెప్తుందని అన్నారు. విశాఖతో పాటుగా ఇతర నగరాలకు కూడా ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా పైపులైన్ల వ్యవస్థ, వాటికి ఉపయోగించే మెటీరియల్ కూడా ఈ కాలుష్యానికి కారణం అవుతున్నాయని అన్నారు. దీని పై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. మరి శర్మ గారు రాసిన లేఖ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందించి, ఇలనాటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూస్తుందో చూడాలి.

రాష్ట్రంలో ఏప్రభుత్వ హయాంలో మానవహక్కులు కాపాడ బడ్డాయో, ఎవరిపాలనలోప్రజలు తమహక్కులను స్వేచ్ఛగా వినియోగించుకున్నారో, జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా వైసీపీఎంపీ గోరంట్ల మాధవ్ తెలుసుకుంటే మంచిదని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు సూచించారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడిపై, పరిటాల రవీంద్ర, ఆయనకుటుంబంపై తప్పుడు ప్రచారం చేసిన మాధవ్ ఎప్పటిలానే అతని అలవాటు ప్రకారమే వ్యవహరించాడన్నారు. మాధవ్ ఎంపీకాకముందు అతని పరిస్థితేమిటో అందరికీ తెలుసు నని, పోలీస్ అధికారిగా ఉన్న సమయంలో ఏనాడూ ఆయన తన విధినిర్వహణను సక్రమంగా చేసిందిలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తొడలుకొట్టినవారికి, తగలబెట్టినవారికి, సభ్యతలేకుండా ఎదుటివారిని తూలనాడేవారికి ఏరికోరి మరీ ఎంపీ పదవులిచ్చా డనటానికి మాధవ్ ప్రత్యక్షఉదాహరణ అని మాణిక్యరావు స్పష్టం చేశారు. వైసీపీతరుపున పార్లమెంట్ కు ఎన్నికైనవారిలో 80శాతం మంది నేరప్రవృతి కలిగినవారేనని సాక్షాత్తూ పార్లమెంట్ కమిటీయే చెప్పడం జరిగిందన్నారు. మాధవ్ ఎక్కడున్నా తన నేర స్వభావాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు. ఆయనపై చిన్నారిని అత్యాచారం చేసినందుకు ఫోక్సో చట్టం కింద కేసుమోపబడిందని, రాష్ట్రవ్యాప్తంగా ఇంకాఅనేక కేసులు మాధవ్ పై ఉన్నాయన్నారు. అటువంటి వ్యక్తి చంద్రబాబునాయుడిగురించి, పరిటాలరవీంద్ర, ఆయన కుటుంబం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నా రు. మాధవ్ గురించి చెప్పాలంటే చాలానే ఉందన్న మాణిక్యరావు, 1983కి ముందు రాష్టప్రజల పరిస్థితి ఎలాఉందో, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి దీనస్థితిలో బతికారో ఇప్పటికీ ప్రజలెవరూ మర్చిపోలేదనే నిజాన్ని గోరంట్ల తెలుసుకోవా లన్నారు.

1983లో టీడీపీ అధికారంలోకి వచ్చాకే, నిజమైన టువంటి స్వేచ్ఛావిధానం రాష్ట్రంలో అమలైందని, ప్రజలంతా స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం జరిగిందన్నారు. రాయలసీమ ప్రాంతంలో పరిటాల నెత్తురు పారించాడంటున్న మాధవ్, టీడీపీ హాయాంలో రవీంద్ర అక్కడ నీళ్లుపారించాడనే నిజాన్ని తెలుసు కోలేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు నాయుడు బీసీలకు అన్యాయం చేశాడని నేరచరితుడైన మాధవ్ చెప్పడం సిగ్గుచేటన్నా రు. నేరచరితులు, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారి నోటివెంట మంచిమాటలు వస్తాయని ఆశించడం ప్రజల మూర్ఖత్వ మే అవుతుందన్నారు. టీడీపీ అంటేనే బీసీలపార్టీ అని, ఎందరు బీసీలను రాష్ట్ర, దేశస్థాయి నాయకులను తయారుచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. దేవేందర్ గౌడ్, కింజారపు ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు, కింజారపు అచ్చెన్నాయుడు వంటివారు టీడీపీలో ఎలాంటి స్థానాల్లో ఉన్నారో మాధవ్ కి తెలియదా అని మాణిక్యరావు నిలదీ శారు. బీసీల్లోని రౌడీలకు పదవులిచ్చిన వైసీపీప్రభుత్వం, వారి ప్రవర్తన చూసి సిగ్గుపడాల్సిన సమయం వచ్చిందన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి గోదావరి జలాలను ఆప్రాంతానికి తరలించిన చరిత్ర టీడీపీదని మాణిక్యరావు స్పష్టంచేశారు. సీమప్రాంతంలోని ఫ్యాక్షనిజాన్ని రూపుమాపి, అక్కడివారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా టీడీపీకే దక్కుతుందన్నారు.

Advertisements

Latest Articles

Most Read