ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రొసీడింగ్స్ ఇవ్వగా, ఎన్నికలు జరపకూడదు అంటూ ప్రభుత్వం హైకోర్టులలో పిటీషన్ వేసింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసి తీసుకున్న నిర్ణయం పై స్టే ఇవ్వాలని, క-రో-నా నేపధ్యంలో ఎన్నికలు జరపటం సాధ్య పడదు అని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ పిటీషన్ పై హైకోర్టు లో విచారణకు వచ్చింది. అటు ఎన్నికల కమిషన్ తరుపు వాదనలు, ఇటు వైపు ప్రభుత్వం తరుపు వాదనలు కూడా హైకోర్టు వింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయటం సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. దీంతో పాటుగా స్టే ఇవ్వటం కూడా సాధ్యం కాదని తెలిపింది. ఈ నెల 14వ తేదీకి కేసుని వాయిదా వేస్తూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో , నిర్వహించటం సాధ్యం కాదని, క-రో-నా వల్ల చాలా కేసులు వచ్చాయని, చాలా మంది మరణించారు అని, అలాగే రెవిన్యు, పోలీసులు యంత్రాంగం కూడా బిజీ గా ఉన్నారని, కోర్టులో వాదనలు వినిపించారు. అలాగే ఉద్యోగులు కూడా ఎక్కువ మంది వైరస్ బారిన పడి , ఇబ్బందులు పడుతున్నారని కోర్టుకు తెలిపింది.

hc 08122020 2

ప్రభుత్వం వైపు నుంచి వాదనలు విన్న తరువాత, ఎన్నికల కమిషన్ వైపు నుంచి అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలు, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల కమిషన్ ఒకసారి తేదీలు ప్రకటించిన తరువాత, అందులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవటం, రాష్ట్ర ప్రభుత్వానికి తగదు అని, రాజ్యాంగా బద్ధ సంస్థ, పైగా స్వయం ప్రతిపక్తి కలిగిన సంస్థ విధుల్లో జోక్యం చేసుకోవటం ప్రభుత్వానికి తగదు అని, ప్రభుత్వం జోక్యం కుదరదు అని తెలిపారు. అలాగే బీహార్, కేరళ, రాజస్తాన్ హైకోర్టులు స్థానిక సంస్థలు నిర్వహించాలని ఇచ్చిన తీర్పులను హైకోర్టు ముందు పెట్టారు. హైదరాబాద్ జీహెచ్ఏంసి ఎన్నికల్లో, బీహార ఎన్నికలు, ఉప ఎన్నికలు అన్నీ జరుగుతున్నాయని, అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపింది. అలాగే సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆరోగ్య అధికారులు అందరినీ సంప్రదించి, ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పటంతో, హైకోర్టు కూడా ఈ వాదనకు ఒప్పుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఎన్నికలు వాయిదా వేయటం కుదరదు అని చెప్పింది.

ఏలూరులో ప్రజలు ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ పాలు అవుతన్న సంఘటన జరిగి, ఇప్పటికి మూడు రోజులు అయినా, ఆ జబ్బు ఏమిటో, ఎందుకు వస్తుందో, అసలు ఏమి జరుగుతుందో, ప్రభుత్వం చెప్పలేక పోతుంది. నీళ్ళు బాగున్నాయి అంటారు, డ్రైనేజి వ్యవస్థ బాగుంది అంటారు, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది అంటారు, కానీ కారణం ఏమిటో మాత్రం చెప్పలేక పోతున్నారు. కొన్ని ప్రభుత్వ అనుకూల చానల్స్ ఒక అడుగు ముందుకు వేసి, ఏమి లేదు, ఇది మాస్ హిస్టీరియా అని తెల్చేసాయి. అంటే ప్రజలే ఒకరిని చూసి ఒకరు, ఇలా ఫిట్స్ వచ్చి పడిపోతున్నారని చెప్తున్నాయి. అయితే ఇప్పటికీ కారణం ఏమిటో తెలియకపోవటం, అలాగే రోజు రోజుకీ బాధితులు పెరిగిపోతూ ఉండటం, ఒక మరణం కూడా సంభవించటంతో, డబ్ల్యూహెచ్ఓ కూడా రంగంలో దిగింది. డబ్ల్యూహెచ్ఓ నుంచి డాక్టర్ భవాని అనే ప్రతినిధి, ఏలూరు వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందతున్న వారి దగ్గరకు వెళ్లి వివరాలు సేకరించారు. అలాగే అక్కడ ఉన్న అధికారులు, కలెక్టర్, వైద్య అధికారులతో సమీక్ష చేసారు. కేసులు వివరాలు, ప్రజలు ఏ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు, ఇప్పటి వరకు చేసిన రిపోర్ట్స్ ఏమిటి, వాటి ఫలితాలు ఏమిటి అనేదాని పై పూర్తిగా సమీక్ష చేసారు.

eluru 07122020 2

నీళ్ళలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పటంతో, కూరగాయల్ని కూడా టెస్ట్ చేయాలని ఆమె ఆదేశించారు. అంతే కాదు, వస్తున్నా పేషెంట్ల పై కూడా కొన్ని రకాల టెస్ట్ లు చేయాలనీ సూచించారు. ఏలూరు మొత్తం ఫాగింగ్ చేయాలని, గవర్నమెంట్ హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్‌ను పెట్టాలని ఆదేశించారు. ఇక మరో పక్క మూడు రోజులు అయినా ఈ వ్యాధి తగ్గలేదు. మూడో రోజు కూడా వంద మందికి పైగా హాస్పిటల్ లో చేరారు. మొత్తంగా ఇప్పటి వరకు 450 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటికే ఎయిమ్స్ నుంచి కూడా ఒక బృందం వచ్చింది. అయితే ఇప్పుడ ఢిల్లీ నుంచి కేంద్రం ఒక బృందాన్ని పంపిస్తుంది. ఇక మరో పక్క ఈ ఘటన నేషనల్ మీడియాలోనే కాదు, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా హైలైట్ అయ్యింది. అయితే డాక్టర్లు మాత్రం, నీటి కాలుష్యం వల్లనే ఇలా జరిగిందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ, నీటిలో ఎక్కవగా బ్లీచింగ్ ఏమైనా కలిసిందా అనే దాని పై కూడా ఆరా తీస్తున్నారు. బ్లీచింగ్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే, ఇలాంటి లక్ష్యణాలు ఉండే అవకాసం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ విషయం పై ఇప్పటికీ క్లారిటీ లేదు. మొత్తం మిస్టరీగానే ఉంది.

దేశ వ్యాప్తంగా మళ్ళీ జమిలీ ఎన్నికల వార్తల గురించి చర్చ మొదలైంది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, గతంలో రెండో సారి ఎన్నికలు గెలవగానే, జమిలీ ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీని పై అప్పట్లో సమీక్షలు కూడా జరిగాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, క-రో-నా రావటంతో, మొత్తం ప్రక్రియకు బ్రేక్ పడినట్టు అయ్యింది. దీంతో ఇక ఇప్పట్లో జమిలీ ఎన్నికలు జరగవని అందరూ అనుకున్నారు. అయితే నెల రోజుల క్రితం, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, త్వరలోనే జమిలీ ఎన్నికలు వస్తున్నాయని, సంకేతాలు ఇచ్చారు. మరో ఏడాది, రెండేళ్ళ లోపే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, సిద్ధంగా ఉండాలని అన్నారు. సహజంగా చంద్రబాబు స్థాయి నేతలు, దేశానికి సంబందించిన కీలక అంశాల పై ఏవో గాలిగా మాట్లాడరు. వారి వద్ద పక్కా సమాచారం ఉంటే కానీ, ఇలాంటివి బహిరంగంగా చెప్పరు. అయితే చంద్రబాబు అప్పట్లో చేసిన వ్యాఖ్యలను, అధికార వైసీపీ ఖండించింది. చంద్రబాబు తప్పుడు సమాచారం చెప్తున్నారని, తన క్యాడర్ ని కాపాడుకోవటానికి, నాయకులు వెళ్ళిపోకుండా ఉండటానికి, చంద్రబాబు అలా అంటున్నారని, జమిలీ ఎన్నికలు లేవు ఏమి లేవు, 5 ఏళ్ళ వరకు ఎన్నికలు వచ్చే పనిలేదని వైసీపీ నాయకులు చెప్పారు.

ktr 0712220 2

అయితే ఇది ఇలా ఉండగా, ఏకంగా ప్రధాని మోడీ నోటి నుంచే, గత వారం ఈ మాట వచ్చింది. జమిలీ ఎన్నికల పై చర్చ జరగాలని, ఒక్కో చోట ఒక్కో సారి ఎన్నికల వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో పడుతున్నాయని అన్నారు. ఒక్కో ఎన్నికకు ఒక్కో ఓటర్ జాబితా వల్ల అనవసర వ్యయం పరుగుతుందని, దీని పై దేశ వ్యాప్త చర్చ జరగాలని ప్రధాని మోడీ అన్నారు. అయితే ఈ చర్చ జరుగుతూ ఉండగానే, ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెప్పారు. తమ పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో, కేంద్రం జమిలీ ఎన్నికలకు వెళ్తుందనే సంకేతాలు ఉన్నాయని, అందరం అలెర్ట్ గా ఉండాలని, జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ మాటలకు షాక్ అయ్యారు. టీఆర్ఎస్ కూడా ఇప్పటి నుంచి ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. గతంలో చంద్రబాబుని హేళన చేసిన వైసీపీ నేతలు, పక్క రాష్ట్రంలో తమ మిత్రుడు చెప్పిన మాటల పై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేసిన పనికి, మిగతా అన్ని రాష్ట్రాల విషయంలో కూడా అలెర్ట్ అవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్రాలు చేస్తున్న అతితో, దేశానికి ఇబ్బందులు వస్తున్నాయని, దేశం పరువు పోయే పరిస్థితి, దేశానికి పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని, కేంద్రం గ్రహించింది. 2019లో అధికారంలోకి రాగానే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మొదటి పని, గతంలో చంద్రబాబు హయాంలో చేసుకున్న సోలార్ - విండ్ ఉత్పత్తి కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు సమీక్ష చేయటం. అయితే ఇలా ఎప్పుడు జరగలేదని, ఒక కంపెనీ పెట్టే సమయంలో ఎన్నో అలోచించి పెట్టుబడి పెడతాం అని, ప్రభుత్వాలు మారిన ప్రతి సారి, ఒప్పందాలు సమీక్షిస్తాం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే ఎలా అంటూ, పెట్టుబడి దారులు ఎదురు తిరిగారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడి దారులు, ఈ విషయంలో తీవ్ర అభ్యంతరం చెప్పారు. తమ దేశ రాయబారులు చేత, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసారు కూడా. జపాన్ లాంటి దేశాలు అయితే, ఒక రాష్ట్రం చేస్తున్న తప్పుకు, మీ దేశంలోనే పెట్టుబడులు పెట్టాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి అని కూడా కేంద్రానికి ఫిర్యాదు చేసాయి. మిగతా కొన్ని కంపెనీలు కోర్టుకు కూడా వెళ్ళాయి. ప్రభుత్వాలు మారిన ప్రతి సారీ, మేము ఒప్పందాలు సమీక్ష చేస్తాం అంటే అంతకంటే మూర్ఖపు పని ఇంకొకటి ఉండదు అంటూ కేంద్రం కూడా రాష్ట్రాలకు హెచ్చరించింది.

piyush 07122020 1

ఇక పెట్టుబడులు సదస్సుకు దావోస్ వెళ్ళిన సమయంలో, అక్కడ కొంత మంది పెట్టబడి దారులు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు ఈ ఒప్పందాల సమీక్షల వల్ల ఎలా నష్ట పోతుంది ఫిర్యాదు చేసారు. మొత్తానికి ఇవన్నీ చూసిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల వైఖరి విషయంలో, సరి కొత్త వ్యూహంతో ముందుకు వస్తుంది. తాజాగా అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం, అన్ని రాష్ట్రాలకు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వ ఒప్పందాలు సమీక్షించటం కుదరదు అని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పెట్టుబడిదారులకు హామీ ఇవ్వాలని, అన్ని రాష్ట్రాలకు ఒక ఎంవోయూ ముసాయిదా పంపించింది కేంద్రం. కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల పెట్టుబడులకు ఎంతో కృషి చేస్తుంటే, రాష్ట్రాల వైఖరితో నష్టం వస్తుందని తెలిపింది. ఒప్పందాలు సమీక్ష చేస్తాం అంటే, పెట్టుబడి దారులు ఎలా వస్తారని ప్రశ్నించింది. ఈ కొత్త ఎంవోయూతో, ఒక కాలం పరిధి వరకు విధానాలను మార్చుకోవటానికి వీలు ఉండదు. అలాగే గత ప్రభుత్వాలు పెట్టుబడి దారులకు ఇచ్చిన హామీలు, కొత్తగా వచ్చే ప్రభుత్వాలు మార్చటానికి ఉండదు. మొత్తానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు చేయకుండా, గట్టి ఏర్పాటు చేస్తుంది.

Advertisements

Latest Articles

Most Read