ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోతో ఉపయోగం లేదా ? లేదా ఆ జీవోలో పెట్టిన కంటెంట్ వల్ల ఉపయోగం లేదా ? ఏది ఏమైనా, ప్రభుత్వం ఇచ్చిన జీవోకి విలువలేదని, బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఏకంగా సిబిఐ చెప్పింది అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకి పడేసారు. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీలను మీడియా ముందే చించి పడేసారు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. మరి ఇంత సంచలనం సృష్టిస్తూ, ఏకంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోనే ఫేక్ అని ఆరోపణలు చేస్తుంటే, ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుంది ? ప్రభుత్వం పెద్దలు ఏమి సమాధానం చెప్తారు ? గొప్పగా చెప్పుకుని, మీడియాకు ఫోటోలు విడుదల చేసిన జగన్ మోహన్ రెడ్డి ఏమి చెప్తారు ? ఈ ప్రశ్నలకు, జవాబులు ప్రభుత్వం ఏమి చెప్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటి అంటే, 2017లో కర్నూల్ లో సుగాలి ప్రీతిబాయి అనే విద్యార్థిని హత్యాచారం కేసు సంచలనంగా మారింది. అప్పటి ప్రభుత్వం విచారణ వద్దని, తమకు సిబిఐ విచారణ కావాలి అంటూ, అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ కుటుంబం ఆందోళన చేస్తూనే ఉంది. ఆమె తల్లి విశ్రాంతి లేకుండా పోరాటం చేస్తున్నారు. సుగాలి ప్రీతి తల్లి పోరాటానికి , పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలికారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఆమె ఆందోళన కొనసాగింది. అయితే 8 నెలల క్రితం కర్నూల్ పర్యటనకు వెళ్ళిన జగన్ మోహన్ రెడ్డి వద్దకు, ఆమె తల్లి వచ్చి నిరసన తెలిపారు. జరిగిన విషయం చెప్పారు. తమకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై నమ్మకం లేదని, సిబిఐ విచారణ కావాలని కోరారు.

cbi 06122020 2

దీంతో ఈ ఇష్యూ హైలైట్ అయిన విషయం కావటం,మీడియాలో తరుచూ వచ్చే అంశం కావటంతో, జగన్ మొహన్ రెడ్డి కూడా, తమకు రాజకీయంగా కూడా కలిసి వస్తుందని అనుకున్నారో ఏమో కానీ, సిబిఐ విచారణకు ఇస్తాం అని ప్రకటన చేసారు. తరువాత జీవో కూడా ఇచ్చారు. సిబిఐ విచారణకు ఆదేశిస్తూ జీవో కూడా ఇచ్చారు. ఇంకేముంది జగన్ మోహన్ రెడ్డి మీడియా, పేపర్ లు, సోషల్ మీడియా బ్యాచ్ మొత్తం, దుమ్ము లేపారు. సరే తప్పేముంది, చేసారు , ప్రచారం చేసుకుంటున్నారు, ఆమెకు న్యాయం జరిగితే చాలు కదా అని అందరూ అనుకున్నారు. అయితే 8 నెలలు తరువాత సుగాలి ప్రీతి తల్లి, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయం చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి జీవో ఇచ్చి ఇన్నాళ్ళు అయినా, సిబిఐ విచారణ జరగటం లేదని, ఢిల్లీలో సిబిఐ ఆఫీస్ కు వెళ్ళగా, వాళ్ళు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యామని అన్నారు. అక్కడ అధికారులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎందుకు పనికిరదాని చెప్పారని, దీంతో విచారణ చేయలేం అని చెప్పారని అన్నారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి, జగన్ మోహన్ రెడ్డి ఒక ఫేక్ జీవో ఇచ్చారని చెప్పి, ఆ జీవో కాగితాలు ప్రెస్ ముందే చింపేసారు. తమ పోరాటం కొనసాగుతుందని, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. మరి ప్రభుత్వం, ఈ వ్యాఖ్యల పై ఎలా స్పందిస్తుందో చూడాలి.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో, వింత వ్యాధి వచ్చి ప్రజలు మూర్చ వచ్చి పడిపోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపుగా 300 మందికి పైగా, ఇలా వింత వ్యాధితో బాధపడుతూ, హాస్పిటల్ పాలు అయ్యారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఇందులో ఊపిరి పీల్చుకునే అంశం, ఎవరికీ ఏమి కాలేదు. వెంటనే కోలుకుంటున్నారు. కొంత మందికి సీరియస్ గా ఉంటే, వారిని విజయవాడ తరలించారు. అయితే ప్రభుత్వం మాత్రం పరిస్థితి అంతా అదుపులోని ఉందని, ఏమి ఇబ్బంది లేదని ప్రకటించింది. సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఉండే నియోజకవర్గంలో ఇలా కావటం పై, ప్రతిపక్షాలు ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే మరో కీలక అంశం ఏమిటి అంటే, ఈ వింత వ్యాధి అసలు ఎందుకు వచ్చింది ? గాలి కాలుష్యం వల్ల వచ్చిందా ? లేదా నీరు కాలుష్యం వల్ల వచ్చిందా ? దోమ ఏమైనా కుట్టిందా ? లేదా ఏమైనా వైరస్ వచ్చిందా ? వీటి పై ఇప్పటికీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. దాదాపుగా 24 గంటలు గడుస్తున్నా, ప్రభుత్వం ఏమి చెప్పలేక పోతుంది. వివిధ రకాల పరీక్షలు చేసామని, వాటిల్లో ఏమి లేదని, మరిన్ని పరీక్షలు చేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితి కారణం, అధ్వాన పారిశుధ్య పరిస్థితి అని, అక్కడ లోకల్ గా ఉండే నాయకులు అంటున్నారు. సరైన విధంగా నీళ్ళ ట్యాంకులు శుభ్రం చేయకపోవటం వల్లే అని అంటున్నారు.

ln 06122020 2

ఇది ఇలా ఉంటే ఈ రోజు ఉదయం మాజీ మంత్రి నారా లోకేష్, ఏలూరు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. హాస్పిటల్ కు వెళ్లి, వాళ్ళకు అసలు ఏమి జరిగిందో తెలుసుకున్నారు. వారికి ధైర్యం చెప్పి, అవసరం అనుకుంటే మెరుగైన వైద్యం ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని, ప్రైవేటు హాస్పిటల్ లో చేర్పిస్తామని, వారికి భరోసా ఇచ్చారు. హాస్పిటల్ లో పరామర్శించిన తరువాత, లోకేష్ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు. ఏలూరు దక్షణపు వీధిలో నారా లోకేష్ పర్యటన చేసారు. అయితే అక్కడ ప్రజలు, చుట్టు పక్కల ఉన్న పారిశుధ్యం చూపించటంతో, అవాక్కయ్యారు లోకేష్. ఎక్కడ చూసినా చెత్త, మురుగు నీరుతో పేరుకు పోయి ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న మీడియాకు ఇక్కడ పరిస్థితి చూపించారు. ఇప్పటికీ ఇక్కడ పరిస్థితి మెరుగు పరచటానికి ఎవరూ రాలేదని, ఎక్కడ చెత్త అక్కడే ఉందని అన్నారు. పారిశుధ్య లోపం కారణంగానే, ప్రజలకు ఈ రోజు ఈ ఇబ్బందులు వచ్చాయని అన్నారు. నీళ్ళ ట్యాంకర్ వల్ల అని కొంత మంది, అలాగే నాసిరకం క్లోరిన్ వాడటం వలన ఈ ఘటన జరిగిందని కొంత మంది అంటున్నారని, ప్రభుత్వం ఈ విషయం పై పూర్తి దర్యాప్తు జరపాలని, గాలి ముఖ్యమంత్రి కిందకు దిగి రావాలని లోకేష్ అన్నారు.

అంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్న తీరు పై పలువురు అభ్యంతరం చెప్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకునే వీడియోలు, అసెంబ్లీలో వేసుకుని, సంబర పడుతున్న అధికార పక్షం తీరు పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. కోట్లు ఖర్చు చేసి అసెంబ్లీ నడుపుతూ ఉంటారని, అలాంటి చోట ప్రజా సమస్యలు కాకుండా, వ్యక్తిగత అజెండాను అమలు చేయటం పై, అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఈ కోవలోనే గుజరాతీ కంపెనీ అముల్ కు, రాష్ట్రంలో పాల సేకరణ ఇవ్వటం గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో, హెరిటేజ్ పై వ్యాఖ్యలు చేసింది అధికార పక్షం. జగన్ మోహన్ రెడ్డి అయితే, ఏకంగా ఓక ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉంటే షేర్ రేటు పెరుగుతుంది అని, లేకపోతే తగ్గిపోతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే అసెంబ్లీలో అంటే చెప్పారని అనుకోవచ్చు. అది తీసుకుని వచ్చి ఏపి సియం సోషల్ మీడియా హ్యాండ్లెస్ లో వేసారు. దీంతో అందరూ ఆశ్చర్య పోయారు. అసలు హెరిటేజ్ అనే ఒక సంస్థ గురించి చర్చించి, దాని గురించి అసెంబ్లీలో చర్చ చేయటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. హెరిటేజ్ కి 12 రాష్ట్రాల్లో మార్కెట్ ఉంది. 11 రాష్ట్రాల్లో పాల సేకరణ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో సేకరణ మహా అయితే ఒక 10 శాతం ఉంటుంది. అది రేపటి నుంచి ప్రజలు తక్కువ రేటు అని ఇవ్వకపోతే, వేరే రాష్ట్రాల్లో వ్యాపారం పెంచుకుంటారు.

heritage 05122020 2

హెరిటేజ్ కి పోయేది ఏమి ఉండదు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 20కు పైగా సహకార డైరీలు ఉన్నాయి. వాటికి, మాత్రం చాలా నష్టం జారిగే అవకాసం ఉంది. ఇది ఇలా ఉంటే, అసెంబ్లీలో జగన్ చేసిన ఆరోపణల పై హెరిటేజ్ ఘాటుగా స్పందించింది. హెరిటేజ్ అనేది స్టాక్ మార్కెట్ లో లిస్టు అయిన కంపెనీ అని, గత 25 ఏళ్ళుగా హెరిటేజ్ కంపెనీ అంచెలు అంచెలుగా ఎదుగుతూ వచ్చిందని, స్టాక్ మార్కెట్ లో పెరగటం, తగ్గటం అనేది, కంపెనీ పని తీరుతో పాటుగా, పెట్టుబడిదారుల నమ్మకం పై, మారుతూ ఉంటుందని, దీనికి అధికారంలో ఉండటానికి సంబంధం లేదని తెలుసుకోవాలని తెలిపింది. షేర్ వేల్యూ రిగ్గింగ్ అనేది జరగదని, అది స్టాక్ మార్కెట్ నియంత్రణలో ఉండే అంశం అని, తెలుసుకోవాలని పేర్కొంది. అడ్డగోలుగా తమ షేర్ వేల్యూ పెంచుకోవలానే ఆలోచన తాము ఎప్పుడూ చేయం అని, విలువలతో ఇన్నాళ్ళు మార్కెట్ లో ఉన్నాం అని, మీ రాజకీయాల కోసం తమ పై , ఇలాంటి ఆరోపణలు చేయవద్దు అని కోరింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. ఆ రోడ్డు ఈ రోడ్డు అని లేదు. నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు దాదాపుగా అన్నీ ఇలాగే ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాల వారు నరకం చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని వాపోతున్నారు. ఇక మరో పక్క రాష్ట్రంలో రోడ్డుల అభివృద్ది పేరుతొ ప్రభుత్వం సెస్ బాదుడు బాదుతుంది. అయినా రోడ్డులు పరిస్థితిలో మార్పు లేదు. రోడ్డుల మీద ప్రయాణాలు చేయాలి అంటేనే, కూసాలు కదిలిపోతున్నాయి. కొత్త రోడ్డుల సంగతి తరువాత, ముందు ఉన్న రోడ్డులు బాగు చేయండని ప్రజలు కోరుకుంటున్నారు. అంతే కాదు, ఈ రోజు ఒక పత్రికలో ఒక వార్తా వచ్చింది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. సహజంగా ఎమ్మెల్యేలు అందరూ అదే రోజు తమ ఊరికి వెళ్ళిపోతారు. అయితే ఈ రోడ్డుల్లో, రాత్రి సమయంలో ప్రయాణం చేయలేం అని, ఉదయం వెళ్దామని అనేక మంది ఎమ్మెల్యేలు చెప్పినట్టు, వార్త వచ్చింది. ఇది రాష్ట్రంలో రోడ్డుల పరిస్థితి. అయితే ఈ రోడ్డుల పరిస్థితి పై బీజేపీ ఆందోళన చేస్తాం అంటూ ఈ రోజు కొన్ని చోట్ల ఆందోళన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డులను అధ్వానంగా చేసిందని, వెంటనే రోడ్డులను బాగు చేయాలనీ, ఈ రోడ్డులు బాగు చేయటానికి టెండర్లు పిలిచినా, ఎవరూ ముందుకు రావటం లేదు అంటూ, బీజేపీ నిరసన తెలిపింది.

road 05122020 2

అయితే ఈ ఆందోళన కృష్ణా జిల్లా మైలవరంలో కొద్దిగా ఉద్రిక్తతకు దారి తీసింది. మైలవరం మండలం వెల్వడం గ్రామంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. వెల్వడం - నూజివీడు రోడ్డు సరిగ్గా లేదు అంటూ, రోడ్డు పై కూర్చుని బీజేపీ నేతలు ఆందోళన చేసారు. అయితే ఎలాంటి అనుమతి తీసుకోకుండా, ఆందోళన చేస్తున్నారని, ఈ నిరసనకు అనుమతి లేదని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంటూ, పోలీసులు వచ్చి అభ్యంతరం చెప్పారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మైలవరం ఎస్ఐ, కేంద్రంలో అధికారంలో ఉంది మీరే కదా, కేంద్రంతో చెప్పి, రోడ్డులు బాగుచేయించవచ్చు కదా అంటూ, వ్యాఖ్యలు చేసారు. దీంతో బీజేపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆ మాటలు చెప్పటానికి నువ్వు ఎవరు అంటూ, ఎస్‌ఐ పై బీజేపీ నేతలు ధ్వజమేట్టారు. ఎస్ఐ క్షమాపణ చెప్పాలి అంటూ నినాదాలు చేసారు. దీంతో ఈ వివాదం పెద్దది అవుతుందని గ్రహించి, రంగంలోకి దిగిన సిఐ, నేతలతో మాట్లాడి, పరిస్థితి చక్క దిద్దారు.

Advertisements

Latest Articles

Most Read