రవాణా శాఖా మంత్రి పేర్ని నాని పై గత వారం, ఒక చిన్న పాటి అటాక్ జరిగిన విషయం తెలిసిందే. మంత్రి తల్లి గత వారం చనిపోయారు. ఆయన తల్లి కర్మ కాండ గత వారం జరిగింది. ఆ కార్యక్రమంలో ఒక వ్యక్తి వచ్చి, ఒక తాపీ తీసుకుని, మంత్రి పై అటాక్ చేసారు. అయితే మంత్రి పై హ-త్యా-య-త్నం అంటూ వార్తలు రావటంతో, వెంటనే పోలీసులు, అతను తాగి ఉన్నాడని చెప్పారు. కొన్ని వార్తా చానెల్స్ లో, మంత్రి పై అటాక్ చేసిన వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడు అని, తాపీ మేస్త్రి అని, ఇసుక లేక పనులు లేక పోవటంతో, సహనం కోల్పోయి ఇలా చేసాడని చెప్పారు. అయితే తెలుగుదేశం నేతలు కూడా ఇవే ఆరోపణలు చేసారు. స్థానిక నేత అయిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇవే వ్యాఖ్యలు చేసారు. దీంతో కేసు మళ్ళీ ట్విస్ట్ అయ్యింది. అటాక్ చేసిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్త అని, రవీంద్ర అనుచరుడు అంటూ ప్రచారం చేసారు. ఇంకేముంది, ఇది కాస్తా మళ్ళీ రాజకీయ టర్న్ తీసుకుంది. ఇంతటితో అయిపోలేదు. మళ్ళీ పోలీసులు మంత్రి రవీంద్రను టార్గెట్ చేసారు. అసలు మీకు ఆ సమాచారం ఎలా తెలుసు అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాకు పూర్తి సమాచారం చెప్పాలి అంటూ, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసు ఇచ్చారు. ఆయన దానికి సమాధానం ఇస్తూ, రిటెన్ గా పంపించారు.

perni 05122020 2

అయితే రెండు రోజులు క్రిందట పోలీసులు రవీంద్ర ఇంటికి వచ్చి, ఆయన స్టేషన్ కు రావాల్సిందిగా కోరారు. అసలు ఇందులో తనను ఎందుకు ఇరికిస్తున్నారని, మీడియాలో వచ్చింది చెప్పినా, ఇప్పటికే రిటెన్ గా ఇచ్చినా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ, రవీంద్ర పోలీసులు పై ఫైర్ అయ్యారు. తరువాత వస్తానని చెప్పటంతో, పోలీసులు వెళ్ళిపోయారు. అయితే ఈ వ్యవహారం ఇలా జరుగుతూ ఉండగానే, ఈ రోజు నారా లోకేష్ ఒక ట్వీట్ చేసారు. అటాక్ చేసిన వ్యక్తి మంత్రి తల్లి కర్మ కాండలో పాల్గున్న ఫోటోలు విడుదల చేసారు. దానికి సంబందించిన ఒక వార్త కూడా లోకేష్ ట్వీట్ చేసారు. ఆ ఫోటోలలో కేవలం పది మంది లోపే ఉన్నారు. మరి అతను తెలుగుదేశం వ్యక్తి అయితే, మంత్రి పక్కన ఎందుకు తిరుగుతున్నాడని, పోలీసులు, అనుచరులు ఎందుకు ఊరుకున్నారు అనేది ప్రశ్న. లోకేష్ కూడా ఇదే విషయం చెప్తూ, ఇది ఒక డ్రామాగా ట్వీట్ చేసారు. అనవసరంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్రను టార్గెట్ చేయటం ఆపి, ఇకనైనా ఈ నాటకం బయట పెట్టాలని లోకేష్ ట్వీట్ చేసారు. మరి ఈ విషయం పై, పేర్ని నాని ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తీసుకుంటున్న ఒంటెద్దు పోకడలతో, రాజ్యాంగ సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య రోజు రోజుకీ గ్యాప్ ఎక్కువ పెరిగిపోతుంది. శాసనమండలి పై కానీ, కోర్టు ల పై కానీ, ఎన్నికల కమిషన్ పై కానీ వైసీపీ వ్యవహరిస్తున్న తీరు, చాలా అభ్యంతరకరంగా మారుతుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి మధ్య వైరం రచ్చకు ఎక్కింది. ఇది ఇప్పటికే కోర్టుల వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టులో, ఇదే విషయం పై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు సార్లు ఎదురు దెబ్బ తగిలింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిలో మార్పు రావటం లేదు. హైకోర్టు మాట వినటం లేదు, సుప్రీం కోర్టు చెప్పినా అదే తీరు కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ పై, రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం కోరటం, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో కలిసి, వారి అభిప్రాయం తీసుకుని, మెజారిటీ అభిప్రాయం ప్రకారం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపటం, అదే విధంగా వివిధ రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షలు చేయటం, అన్నీ క్రోడీకరించి, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రొసీడింగ్స్ ఇచ్చి, హైకోర్టుకు తెలపటం జరిగింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇందుకు ఒప్పుకోవటం లేదు. ఇక మరో పక్క, అన్ని జిల్లాల కలెక్టర్లతో సంప్రదించాలి, వీడియో కాన్ఫరెన్స్ చేసుకోవాలి అని చెప్పినా, ప్రభుత్వం వైపు నుంచి అనుమతి ఇవ్వటం లేదు.

governor 05122020 2

ఇక అలాగే మంత్రి కొడాలి నాని, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ పై, వాడు వీడు అంటూ కామెంట్స్ చేయటంతో, ఈ విషయం పై ఇప్పటికే గవర్నర్ కు ఫిర్యాదు చేసారు, ఎన్నికల కమీషనర్. ఇవన్నీ జరుగుతూ ఉండగానే, ప్రభుత్వం హైకోర్టులో ఎన్నికలు జరపటానికి వీలు లేదని అఫిడవిట్ వేసింది. అయితే హైకోర్టులో ఉండగానే, ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో చేసిన తీర్మానంతో అందరూ అవాక్కయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణ పై కుదరదు అంటూ నిన్న ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీని పై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సీరియస్ అయ్యారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌కు ఈ విషయం పై ఫిర్యాదు చేసారు. ప్రభుత్వం చేసిన తీర్మానం రాజ్యంగ విరుద్ధం అని, ఆర్టికల్ 243కే ప్రకారం, ఎన్నికల కమీషన్ అధికారాలు ఎవరూ తీసేయలేరని, ప్రభుత్వ సమ్మతితోనే ఎన్నికలు నిర్వహించాలని తీర్మానం చేయటం, రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం అని పేర్కొన్నారు. ఆ ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని పేర్కొనారు. ఈ విషయం పై సుప్రీం కోర్టు న్యాయనిపుణులను అభిప్రాయం కూడా తీసుకుని, ఇలాంటి వాటిని తిరస్కరించాలని నిమ్మగడ్డ , గవర్నర్ కు ఫిర్యాదు చేసారు. మరి గవర్నర్ ఎలాంటి నిర్ణయం తెసుకుంటారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయం విషయంలోనే కాదు, పెట్టుబడులు విషయంలో కూడా రివర్స్ లో వెళ్తుంది. కేవలం అప్పుల్లో మాత్రమే పెంచుకుంటూ పోతుందని, జరుగుతున్న విషయాలు చూస్తే అర్ధం అవుతంది. గత చంద్రబాబు హయంలో, కంపెనీల పెట్టుబడుల వార్తలతో ఎప్పుడూ ఏదో ఒక వార్త ఉండేది. అయితే గత ఏడాదిన్నరగా ఏపి ఆ వార్తలే మర్చిపోయింది. గతంలో ముఖ్యంగా, పెద్ద పెద్ద కంపెనీలు తీసుకు రావటంలో, వివిధ పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి మరీ, ఏపి కంపెనీలు సాధించేది. మరీ ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు విషయంలో, అందరు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా వైపు చూస్తున్న పరిస్థితిలో, ఆంధ్రప్రదేశ్ వైపు విదేశీ పెట్టుబడులు వచ్చేలా చంద్రబాబు ప్రయత్నం చేసి, సక్సెస్ అయ్యారు. అలా వచ్చిందే, అనంతపురం జిల్లా రూపు రేఖలు మార్చేసే కియా పరిశ్రమ. 13 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, ఈ కంపెనీ పెట్టుబడులు పెట్టింది. ఇలా ఎన్నో విదేశీ కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. 2017-2018 మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చి, దేశంలోనే అయుదవ స్థానంలో నిలిచింది. అలాగే 2018-19 సంవత్సరానికి, ఏకంగా 19 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించి, నాలుగవ స్థానంలో నిలిచింది. అలా అనేక విదేశీ కంపెనీల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల్లో దూసుకుని వెళ్ళింది.

investments 05122020 2

2019లో అధికారం మారటం, ప్రభుత్వ విధానాలు మారటంతో, వచ్చిన కంపెనీలు కూడా వెనక్కు వెళ్ళాయి. లూలు లాంటి కంపెనీ అయితే, మేము ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడైనా పెట్టుబడి పెడతాం అని ప్రకటన కూడా విడుదల చేసింది. ఇలా పెట్టుబడుల్లో తిరోగమనం వైపు ఏపి అడుగులు వేసింది. అయితే ఇప్పుడు కేంద్రం విడుదల చేసిన లెక్కలు చూస్తూ , పెట్టుబడులు విషయంలో ఏపి స్థానం చూసి, మరింత బాధ పాడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు టాప్ రాష్ట్రాలతో పోటీ పడిన ఏపి, ఇప్పుడు కనీసం టాప్ 10లో కూడా నిలువలేక పోయింది. కేంద్రం విభాగం అయిన, డిపార్టుమెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ , విదేశీ పెట్టుబడుల లిస్టు విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ఏడాది వచ్చిన విదేశీ పెట్టుబడులు లిస్టు తీస్తే, 12వ స్థానం వచ్చింది. కేవలం రూ.1,798.81 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇది దేశంలో కేవలం 0.45%. పక్కన ఉన్న తెలంగాణా రూ.9,910 కోట్ల విదేశీ పెట్టుబడులు ఆకర్షించింది. నాలుగవ స్థానం నుంచి, 12వ స్థానానికి పడిపోయాం అంటే, ప్రభుత్వం తమ విధానాలు ఒకసారి సమీక్ష చేసుకోవాలి.

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన 3వ్యవసాయ బిల్లులపై జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ జరగాలి. 1) వ్యవసాయ మార్కెట్ బిల్లు (రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార ప్రోత్సాహక సులభతర బిల్లు), 2)కాంటాక్ట్ ఫార్మింగ్ బిల్లు (రైతు సాధికారాత, రక్షణ ధర హామీసేవల ఒప్పంద బిల్లు), 3)అత్యవసర సరుకుల బిల్లు(నిత్యావసర సరుకుల సవరణ బిల్లు)లపై దేశవ్యాప్తంగా రైతుల్లో, రైతు సంఘాల్లో ఉన్న అపోహలను తొలగించాలి. ఈ 3బిల్లులపై అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రప్రభుత్వాలు, వివిధ ప్రాంతాల రైతు సంఘాలు, రైతు ప్రతినిధులతో విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ (డిబేట్) జరపాలి. వారందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రైతాంగానికి మేలైన విధానాలను తీసుకురావాలి. సగటు భారతీయ రైతు అక్షరాస్యత, అవగాహనలతో పాటుగా సామాజికంగా స్థానిక రైతు నిస్సహాయతను కూడా పరిగణలోకి తీసుకుని చట్టాలను రూపొందించడం మనందరి బాధ్యత. బిల్లులను హడావుడిగా ప్రవేశపెట్టి, తొందరపడి నిర్ణయాలు తీసుకునేకన్నా సమగ్ర చర్చ ద్వారా ఏకాభిప్రాయం సాధనే సర్వత్రా మేలు. లేనిపక్షంలో ఇప్పటికే అప్పుల ఊబిలో కుంగిపోతున్న రైతన్నలపై మరింత భారం మోపే ప్రమాదం ఉంది. కనీస మద్దతు ధర పొందడం అనేది ఒక విధాన నిర్ణయంగానే కాకుండా రైతుకు చట్టబద్దమైన హక్కుగా ఉండాలి. ఎంఎస్ పి పొందడం అనేది కొందరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండరాదు. రైతు ప్రయోజనాలే మిన్నగా పాలకుల నిర్ణయాలు ఉండాలి. రైతు నిస్సహాయతను తమ లాభాల కోసం వాడుకునే వ్యవస్థలను, వ్యక్తులను ప్రోత్సహించరాదు.

ఆత్మవిశ్వాసం భారతీయ రైతన్నల ఆత్మగౌరవం. తమ కృషిపై, ప్రకృతిపై, ప్రభుత్వంపై మన రైతన్నల్లో తొణికిసలాడే విశ్వాసాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత. వారి స్వతంత్రతను, మనో నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కాపాడటం పాలకుల ధర్మం. రైతాంగ ప్రయోజన విధానాలతోనే వారి విశ్వాసాన్ని ఇనుమడింప చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంది. 73ఏళ్ల స్వాతంత్ర్య భారత చరిత్రలో రైతుల మేళ్ల కోసం వివిధ ప్రభుత్వాలు అనేక విధానాలు చేపట్టినా, వివిధ నిర్ణయాలు తీసుకున్నప్పటికి మన రైతులు, రైతుకూలీలు, వ్యవసాయ కార్మికుల ఆర్ధిక సామాజిక పురోగతి ఆశించిన స్థాయికి చేరకపోవడాన్ని ప్రభుత్వాలు గమనంలోకి తీసుకోవాలి. రైతులకు కావాల్సిన ఇన్ పుట్స్ అందుబాటులో ఉంచడంలో, వ్యవసాయ రుణాలు పొందడంలో, ఎంఎస్ పి పొందడంలో, విపత్తులలో నష్టపరిహారం పొందడంలో పకడ్బందీ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. లోక్ సభలో చర్చ సందర్భంగా వీటన్నింటిపై 3గురు ఎంపిలతోనే టిడిపి గళం బలంగా వినిపించినప్పటికీ, 22మంది ఎంపిలు ఉండి వైసిపి నోరు తెరవక పోవడం రైతుద్రోహం. టిడిపి ప్రభుత్వ హయాంలో రైతులకు మద్దతుధరకు అదనంగా బోనస్ కూడా చెల్లించి కొనుగోళ్లు చేశాం. కానీ ప్రస్తుతం వైసిపి పాలనలో రైతులకు బోనస్ లేకపోగా మద్దతు ధరే లభించక రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరం.

పంట కొనుగోళ్ల ధరల హెచ్చుతగ్గులపై ఎప్పటికప్పుడు తనిఖీలు, సమతుల్యతలు (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) ప్రభుత్వానికి ఉండాలి. దళారుల ఇష్టారాజ్యానికి పంట కొనుగోళ్లను వదిలేయరాదు. రైతులకు, కొనుగోలుదారులకు మధ్య సరైన వేదికగా మార్కెట్ యార్డులను పటిష్టం చేయాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలగరాదు. తమ ఉత్పత్తులకు సరైన ధర ఏమిటో ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసే అనుసందాన వేదికలుగా మార్కెట్ యార్డులను పటిష్టం చేయాలి. రైతు ప్రయోజన కేంద్రాలుగా వ్యవసాయ మార్కెట్ యార్డులను మరింత పటిష్టపర్చే చర్యలు చేపట్టాలి. రైతు లాభాలతో పాటుగా వినియోగదారుల ప్రయోజనాలను కూడా పరిరక్షించాలి. బహిరంగ మార్కెట్ లో నిత్యావసరాల ధరల నియంత్రణా వ్యవస్థను పటిష్టం చేయాలి. రైతు బజార్ల వ్యవస్థను ఆధునీకరణ చేయడం ద్వారా అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఉభయ తారకం అవుతుంది. పంట ఉత్పత్తుల నిల్వపై ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తే బ్లాక్ మార్కెట్ విక్రయాలకు దారితీస్తుంది, దళారుల బెడద పెరిగిపోతుంది. వీటన్నింటి దృష్ట్యా దేశవ్యాప్తంగా బ్లాక్ మార్కెట్ విక్రయాలకు, దళారుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసే వ్యవస్థను బలోపేతం చేయాలి. వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటిల వ్యవస్థను, రైతు బజార్ల వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలేతప్ప ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. రైతు పండించే ప్రతి పంటకు కనీస మద్దతు ధర దక్కాలి, పంటల కొనుగోళ్ళకు ప్రభుత్వ పరంగా పకడ్బందీ యంత్రాంగం ఉండేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే.. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. (నారా చంద్రబాబు నాయుడు)

Advertisements

Latest Articles

Most Read