ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక పరిస్థితి ఆందోళన కలిగిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పని చేసిన ఐవైఆర్ కృష్ణా రావు అభిప్రాయ పడ్డారు. ఆయన రెండు రోజుల క్రితం ట్వీట్ చేస్తూ, తనకు జరిగిన స్వీయ అనుభవం వివరించారు. తనకు ఈ నల పెన్షన్ వారం తరువాత వచ్చినందని, నెల ప్రారంభమైన ఏడు రోజుల తరువాత తనకు పెన్షన్ డబ్బులు పడ్డాయని అన్నారు. సహజంగా ఏ ప్రభుత్వానికి అయినా, ముందు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఇవ్వాల్సిన పెన్షన్లు, వడ్డీల చెల్లింపులు మొదటి వరసులో ఉంటాయని అన్నారు. సహజంగా ఇలాంటి చెల్లింపులు, ఒకటి రెండు రోజులు అటు ఇటూగా పడుతూ ఉంటాయని, కనీ ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. వారం పాటు పెన్షన్లు వెయ్యలేదు అంటూ, రాష్ట్రంలో ఉన్న ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, అర్ధం అవుతుంది అంటూ, తన ట్వీట్ లో తెలిపారు, ఐవైఆర్ కృష్ణా రావు. అంతే కాకుండా, రాష్ట్రం గురించి మరో సంచలన వ్యాఖ్య చేసారు.

వస్తున్న ఆదాయం గురించి ఆలోచించ కుండా, పెద్ద ఎత్తున వ్యయం చేస్తూ ఉంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా భంగపాటు తప్పదని, ఒక నాలుగు రోజులు వెనకా ముందు అంతే, అంటూ, రాష్ట్ర పరిస్థితి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే మరో ట్వీట్ చేస్తూ, ఆర్ధిక పరిస్థితి బాగుండాలి అంటే, వచ్చిన ఆదాయం సంక్షేమ పధకాలకు ఇచ్చి, తెచ్చిన అప్పులతో పెట్టుబడిగా పెట్టి, ఆదాయం వచ్చేలా చూడాలని, అంతే కానీ అప్పు తెచ్చి, పంచి పెడితే దివాళా తీస్తారు అంటూ, ఐవైఆర్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి పై పలువురు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు తెస్తూ, వాటిని ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగం చెయ్యకుండా, పంచిపెడుతూ ఓటు బ్యాంకు కోసం చూస్తూ, ఆర్ధిక పరిస్థితిని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు అంటూ, పలువురు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రోజు తెల్లవారు జామున, విజయవాడలోని ఏలూరు రోడ్డులోని, చల్లపల్లి బంగ్లావద్ద స్వర్ణ ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. స్వర్ణా ప్యాలెస్ ని, ఇటీవలే కవిడ్ కేర్ సెంటర్ గా మార్చారు. దీన్ని ఒక ప్రైవేటు హాస్పిటల్ కు కవిడ్ సెంటర్ గా మార్చారు. ఇందులో 40 గదులు ఉండగా, మొత్తం 30 మందికి చికిత్స చేస్తున్నారని, మరొక 10 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. అయితే ఆ మంటలకు ఊపిరి ఆడక, ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయినట్టు సమాచారం. మరొక ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. పేషెంట్లు ఎక్కువ అవ్వటంతో, హాస్పిటల్ లో బెడ్లు సరిపోక, ఖాళీగా ఉన్న హోటల్స్ ని తీసుకున్నారు. ఈ రోజు ఉదయం షార్ట్ సర్క్యూట్ ద్వారా, మంటలు వ్యాపించినట్టు భావిస్తున్నారు. ఘటన విజయవాడ సెంటర్ లో జరగటంతో, వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించారని, అలాగే సహాయక చర్యలు చేపడటానికి టైం దొరకటంతో, భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యిందని చెప్తున్నారు

ఘటనా స్థలంలో విజయవాడ పోలీస్ కమీషనర్ దగ్గర ఉండి సహాయక చర్యలు చేస్తున్నారు. ఘటన గ్రౌండ్ ఫ్లోర్ లో జరిగిందని, తరువాత మంటలు, ఫస్ట్ ఫ్ల్లోర్ లోకి వ్యాపించాయని చెప్తున్నారు. మంటలకు కిందకు రాలేక, ఊపిరి ఆడక, అక్కడ ఉన్న రోగులు హాహాకారాలు పెట్టారు. ఒక ఇద్దరు ధైర్యం చేసి, కిటికీలో నుంచి దూకారని, వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారని చెప్తున్నారు. మిగతా రోగులని, దగ్గరలో ఉన్న కవిడ్ సెంటర్లకి తరలించారు. ఇప్పటికి మంటలు అదుపులోకి వచ్చాయని, లోపలకు వెళ్లి ఎవరైనా ఇంకా చిక్కుకున్నారా అనే విషయం పై, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చూస్తున్నారు. మొత్తం 30 మంది రోగులు ఉన్న ఈ కవిడ్ కేర్ సెంటర్ లో, ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారని, ఇద్దరి పరిస్థితి ఆందోళనగా ఉందని, మిగతా వారి పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.

ఏపిలో కొత్త జిల్లాల ఏర్పాటు పైన అధ్యాయన కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాలుగా మార్చాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి సంబంధించి ఏపిలో 25 జిల్లాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం గత కెబినెట్ సమావేశంలో నిర్ణయించిన విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆరుగురు అధికారులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. వీరు కొత్త జిల్లాల ఏర్పాటుపైన పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని మానవ వనరుల వినియోగం, వివాదాలు లేకుండా జిల్లాల ఏర్పాటు అధికారుల విభజన వంటి అంశాలపైన నివేదిక ఇవ్వనుంది. అదే విధంగా నిధుల వినియోగం పైనా సూచనలు చేయనుంది. ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు మూడు నెలల కాలపరిమితిని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. గతనెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపైన సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.

ఆ మీటింగ్ లోనే ఒక కమిటీ ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ఏర్పాటుపైన నివేదిక కోరుతూ నిర్ణయించారు. ఈ కమిటిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్ పర్సన్‌గా సభ్యులుగా సీసీఎల్, సాధారణ పరిపాలనా కార్యదర్శి ప్రణాళికా శాఖ కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శితోపాటుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక అధికారిని సభ్యులుగా ఖరారు చేశారు. వీరు ఏపిలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలు ఏర్పాటు పైన ఏ రకంగా ముందుకెళ్ళాలి. ఏ అంశాలను పరిగణనలోనికి తీసుకోవాలి, ఆర్థిక.. మానవ వనరుల వినియోగం.. హద్దులు... అధికా రుల విభజన పైన నివేదిక సమర్పించనున్నారు. అయితే ఇప్పటికే జిల్లాల విభజన పై అన్ని వైపుల నుంచి, ముఖ్యంగా వైసిపీ నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. ధర్మాన ప్రసాద్ కూడా, జిల్లాల విభజన జాగ్రత్తగా చెయ్యాలని, లేకపోతె మొత్తం మునిగిపోతం అని అన్నారు. ఇక చాలా మంది మా ప్రాంతం ఇలా, మా ప్రాంతం అలా, ఈ పేరు పెట్టండి, ఆ పేరు పెట్టండి అంటూ, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ప్రభుత్వం, ఈ విషయాన్ని ఏ సమస్య లేకుండా పరిష్కరిస్తుందో లేదో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు దూసుకుపోతున్నాయి. మహరాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు తరువాత, చిన్న రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉంది. ప్రతి రోజు దాదాపుగా 10 వేలు కేసులు కంటే ఎక్కువ వస్తున్నాయి. గత 24 గంటల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 10,080 కేసులు వచ్చాయి. అలాగే రాష్ట్రంలో 97 మరణాలు సంభవించాయి. కరోనా కేసుల్లోనే కాదు, మరణాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 లక్షలు కేసులు దాటి, 2,17,040 కేసులు ఈ రోజుతో వచ్చాయి. అలాగే మరణాలు కూడా 2 వేలకు చేరువలో ఉన్నాయి. మొత్తం, 1939 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో అత్యధికంగా కర్నూల్ జిల్లాలో 1353 కేసులు వచ్చాయి. తరువాత తూర్పు గోదావరి జిల్లాలో 1310 కేసులు వచ్చాయి. అన్ని జిల్లాల కంటే తక్కువగా కృష్ణా జిల్లా 391 కేసులతో ఉంది. ఇక మరణాలు విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 14 మరణాలు సంభవించాయి.

ఇక మొత్తంగా కేసులు తీసుకుంటే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేసులు స్ప్రెడ్ అయ్యాయి. అత్యధింగా తూర్పు గోదావరి జిల్లాలో 30160 కేసులు ఉన్నాయి. ఇక తరువాత స్థానంలో కర్నూల్ జిల్లాలో 26032 కేసులు వచ్చాయి. తరువాత స్థానంలో అనంతపురంలో 23249 కేసులతో మూడవ స్థానంలో ఉంది. ఇక మరణాలు చూసుకుంటే, కర్నూల్ 238 మంరాలు, తూర్పు గోదావరి 218 కేసులతో, గుంటూరు జిల్లా 211 కేసులతో మూడవ స్థానంలో ఉంది. ఇక అలాగే రికవరీ రేటులో కూడా రాష్ట్రము, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తక్కువగానే ఉంది. మొత్తానికి కరోనా కట్టడిలో, ప్రభుత్వం విఫలం అయ్యిందా, మహరాష్ట్ర, తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు తరువాత, ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే, ప్రభుత్వం వైపే వేలు చూపిస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం, ఈ వాదన తోసిపుచ్చుతూ, దేశంలోనే మేము ఎక్కువ టెస్టులు చేస్తున్నామాని, దేశంలోనే టాప్ అని చెప్తుంటే, కేంద్రం ఇస్తున్న డేటాలో మాత్రం, తేడాగా ఉంది. ఏది ఏమైనా ఏపి ప్రభుత్వం, కొన్ని రోజులు రాజకీయాలు పక్కన పెట్టి, కరోనా పై దృష్టి పెడితే, మంచిది.

Advertisements

Latest Articles

Most Read