రధసప్తమి అంటే మనప్రత్యక్ష దేవదేవుడు సూర్యుడు జన్మదినమును జరుపుకుంటాం. రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి ) వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు. సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.

అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి. సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు బలముగా వుంటాయి. కేన్సర్ రాకుండా కాపాడతాయి. ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.

అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు. శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది. సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.

ఈ మాఘమాసం లో రథసప్తమినాడు సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఏదో ఓ ఆదివారం నాడు పూజించినా సత్ఫలితం ఉంటుందని పెద్దలంటారు .రథసప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు చేసి , సూర్యోదయానంతరం దానాలు చేయాలి . ఈరోజు సూర్య భగవానుని యెదుట ముగ్గు వేసి ,ఆవుపిడకల పై ఆవుపాలతో పొంగలి చేసి ,చిక్కుడు ఆకులపై ఆ పోంగలిని ఉంచి ఆయనకు నివేదన ఇవ్వాలి. సూర్యోదయం కాక ముందే నిద్ర లేచి స్నాన, జప, దానాదులన్ని చేస్తే అనేక కోట్ల పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలనిచ్చును.ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. ఆమ్లగుణం గల రేగుపండూ, జిల్లేడు ఆకూ శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది. మేదని చల్లబరుస్తుంది. అందుకే ఆరోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనయినా విధిగా అలా స్నానం చేస్తారు. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.

’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు. రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు. శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.

ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి. ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.

నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష దేవుడు సూర్యనారాయణ మూర్తి జన్మదినం నే రథసప్తమి గా జరుపుకుంటున్నాము. భాస్కరునికి క్షీరాన్నం నైవేద్యం సమర్పించాలి. అందరికి రధసప్తమి శుభాకాంక్షలు....

గన్నవరంలోని, బాపులపాడు మండలం మల్లవల్లి, అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది... రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్ గా పరిగణించి, పరిశ్రమలు నెలకొల్పటం, మరో పక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసిన మెగా ఫుడ్‌పార్కు నెలకొల్పటంతో లేఔట్ కు, సీఆర్డీఏ అనుమతులు ఇచ్చింది. దీంతో, మెగా ఫుడ్ పార్కు ప్రాంతాన్ని, ఏపీఐఐసీ శరవేగంగా మౌలకి వసతులు కలిపిస్తుంది. ఇప్పటికే రోడ్ల నిర్మాణం ఒక కొలిక్కివచ్చింది. ఫుడ్‌పార్కు అవసరాలకోసం మొత్తం అయిదు రహదారుల్ని నిర్మిస్తున్నారు. ఉద్యానశాఖ మామిడి నర్సరీ కోసం ఉపయోగిస్తున్న వందెకరాలను కేటాయించారు. ఈ మెగా ఫుడ్‌పార్కు ప్రాజెక్ట్ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లను వెచ్చించనున్నాయి. ఇప్పటికే, రోడ్లు డ్రెయిన్ల నిర్మాణం దాదాపు పుర్తియ్యింది. ఈ 100 ఎకరాల్లో, ఆహార పరిశ్రమలకు ఫ్లాట్ల్ కేటాయింపుపై కసరత్తు పూర్తి చేశారు. ఆహార పరిశ్రమల పెట్టుబడి, వాటి సాయిని దృష్టిలో ఉంచుకుని ఫ్లాట్ల్ కేటాయిస్తారు.

అలాగే వివిధ రకాల పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం భూ కేటాయింపులు జరిపేందుకు సిద్ధంగా ఉంది. ఇందు కోసం, ఇండస్ట్రియల్ హబ్ కోసం, మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేసే పనిలో ఉంది, ఏపీఐఐసీ. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ఎల్ అం డ్ టీ సంస్థకు అప్పగించింది.

మల్లవల్లిలో ఫుడ్‌ పార్క్‌కు కేటాయించిన భూములు మినహాయిస్తే ప్రస్తుతం 1250 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ ఉంది. ఖనిజాలను శుద్ధి చేయటంలో దేశంలోనే పేరుగాంచిన ’ ఇందాని ’ గ్రూప్‌ సంస్థ మల్లవల్లిలో గోల్డ్‌ రిఫైనరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 30 ఎకరాల కోసం ప్రతిపాదించింది. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. కుమార్‌ - సింటెక్స్‌ సంస్థ కూడా భారీ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింటెక్స్‌ పేరుతో ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడే తయారు చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. ఇంకా అనేక సంస్థలు ఇటు వైపు చూస్తున్నాయి. త్వరలోనే వాటి నుంచి కన్ఫర్మేషన వచ్చే అవకాశం ఉంది.

మల్లవల్లిలో భూములు ఉండటం, మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీ చర్యలు చేపడుతుండటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లవల్లి సమీప ప్రాంతాలలో ఏపీఐఐసీ భారీ స్తాయిలో భూ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

జాతీయ మహిళా పార్లమెంటరీ (నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ) సదస్సు, ఫిబ్రవరి, 10, 11, 12 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అయిన ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో జరగున్నది. మ‌హిళా సాధికారిత, జాతీయ నిర్మాణ రంగంలో మహిళల ప్రాధాన్యత, అన్ని రంగాలలో మహిళ ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. సీఎం చంద్ర‌బాబు ప్రోత్సాహంతో గోదావరి, కృష్ణా నదుల సంగమం ప్రాంతం అయిన పవిత్ర సంగమం వేదికగా ఈ సదస్సు జరగనున్నది.

ఈ సదస్సుకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, లైబీరియన్ ప్రెసిడెంట్, బౌద్దమత గురువు దలైలామా, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్, లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్, శ్రీ శ్రీ రవి శంకర్, మనిషా కొయిరాల, తదితర దేశ, విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. అలాగే, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1400 మంది మహిళా శాసన, శాసనమండలి సభ్యులు, 93 మంది పార్లమెంటు సభ్యులు, వివిధ రంగాలకు చెందిన 300 మంది మహిళలు హాజరయ్యేవిధంగా ఆహ్వనాలు పంపనున్న‌ట్లు తెలిపారు. సుమారు 12వేల మంది జాతీయ, అంతర్జాతీయ మహిళా పార్లమెంటేరియన్లు, వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన మహిళా మణులు హాజరు కానున్నారని తెలిపారు.

మహారాష్ట్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరీంగ్ (యంఐటి) పూనేకు చెందిన సంస్థ సంయుక్త సహకారంతో సదస్సును నిర్వహిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

అమరావతిలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జరిగే మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు (నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ) హాజరయ్యే విద్యార్థినులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు విచ్చేసే విద్యార్థినులు, మహిళా అధ్యాపకులు తమ గుర్తింపు పత్రాలు చూపించి ఉచిత బస్సుల్లో ప్రయాణించవచ్చని చెప్పారు.

ఇక్కడ 3 రోజుల పాటు వివిధ గ్రూప్ డిస్కెషన్స్ జరుగుతాయని, ఇందులో భారతదేశంలో 35 వేల కాలేజీలకు చెందిన వారు ఆంధ్రప్రదేశ్లోని 100 కాలేజీలకు చెందిన విద్యారులు హాజరవుతున్నారన్నారు. మహిళలందరిని ఒక చోట చేర్చడం ఒక మంచి పరిణామమని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని చేయడం అభినందనీయమన్నారు.

తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని పేరే కాని, ఇప్పటి వరకు ఒక్క ఇంటర్నేషనల్ సర్వీస్ కూడా ఇక్కడ నుంచి లేదు. అయితే, త్వరలోనే ఈ కల తీరనుంది. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి, విదేశీ సర్వీసులు నడవనున్నాయి. మొదటగా ఏప్రిల్ నెల నుంచి, గల్ఫ్‌ దేశాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, ఖత్తర్‌, దుబాయి, అబుదాబి తదితర దేశాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. ప్రస్తుతం, తిరుపతి విమానాశ్రయానికి 7 విమానాలు నడుస్తున్నాయి.

గల్ఫ్‌ దేశాలకు నడపటానికి కారణం, కడప, చిత్తూరు, నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్‌ దేశాలకు, ఉపాధి కోసం వేలాదిగా వెళ్తూ ఉంటారు. వీళ్ళు చెన్నై ఎయిర్‌పోర్టు ను ఆశ్రయిస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత ప్రజల సౌలభ్యం దృష్ట్యా ప్రవాస భారతీయుల కోసం గల్ఫ్‌ దేశాలకు నుంచి సర్వీసులు నడపడానికి నిర్ణయించారు. అలాగే, తిరుమల శ్రీ వారి దర్శనం కోసం, వచ్చే భక్తులకి కూడా, ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అలాగే, త్వరలోనే, మరిన్ని దేశాలకు, విమానాలు నడుపుతామని, పౌర విమానయాన మంత్రి అశోకగజపతి రాజు వెల్లడించారు.

తిరుమల శ్రీవారి రూ.౩౦౦ దర్శన టిక్కెట్లను ఇకపై మరింత సులువుగా బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసంTTD ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు కేవలం TTD వెబ్ సైట్ లో మాత్రమే టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండేది. కాని, ఇకపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని ఏటీపీ కేంద్రాల్లో శ్రీవారి రూ.౩౦౦ దర్శన టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నామని TTD ఈవో సాంబశివరావు పేర్కొన్నారు.

తక్కువ చార్జీతో రూ.300 టిక్కెట్ ను బుక్ చేసుకోవచ్చని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో సుమారు  ఏటీపీ సెంటర్లు ఉన్నాయని, వీటితో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సైతం వారికి శాఖలు ఉన్నాయన్నారు. ఆయా  ఏటీపీ సెంటర్ల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్న సాంబశివరావు, ప్రైవేటు ఇంటర్నెట్ నిర్వాహకులు భక్తుల నుంచి ఎక్కువ సొమ్ము వసూలు చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read