అనంతపురం జిల్లాలో పవన విద్యుత్ (విండ్ మిల్ పవర్) వెలుగులు విరజిమ్మనున్నయి. ఇప్పటికే జిల్లాలో ఏర్పాటు చేసిన గాలిమరల ద్వారా మొత్తం 455.4 మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి జరిగింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఈ లక్ష్యం సాధించారు. అదనంగా మరో 750 నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు నెడ్ క్యాప్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది మార్చి నెలాఖరుకు లక్ష్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న విండ్ మిల్స్ పనులు పురోగతి దశలో ఉన్నాయని నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ కోడదరామయ్య తెలిపారు.

అనంతపురం జిల్లలో ఇప్పటివరకు స్కిరాన్ ఎనర్జీ, గ్రీన్ కోర్, టాటా పవర్, హీరో ఫీచర్స్ ఎనర్జీస్, ఎకొరాన్, అదానీ, ఆరంజ్ యాక్స్ప్రెస్ వంటి దాదాపు 12 కంపెనీలు గాలిమరలు ఏర్పాటు చేశాయి. వీటి ఆధారంగా పవన విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

కాగా జిల్లలో సౌర విధ్యుత్ వినియోగంపైనా ఆసక్తి పెరుగుతోంది. దీంతో పలు ప్రైవేటు సంస్థలు సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ వినియోగించుకుంటున్నాయి. నంబుల పూలకుంటలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయింది. దీని సామర్ధ్యం 1000 మెగావాట్లు. మరో 250 మెగావాట్ల ఉత్పత్తికి టిపిఎ ఖరారు చేయాల్సి ఉంది.

ఒక పవిత్ర కార్యం జరుగుతుంటే, రాక్షసులు అడ్డుపడటం మనం పురాణాల్లో చదువుకున్నాం... ఈ కలియుగంలో కూడా, అలాంటి రాక్షసులు, పవిత్ర కార్యాలకి అడ్డుపడుతూనే ఉన్నారు... మన దౌర్భాగ్యం, ఈ రాక్షసులు, అమరావతి పేరు పెట్టిన మొదలు, అమరావతిలో ఏ కార్యక్రమం జరిగినా, దాన్ని చెడగొట్టటానికే ప్రయత్నిస్తూ వస్తున్నారు. వీళ్ళకి అమరావతి అంటే ఇష్టం లేదు... ఎలాగైనా అమరావతిలో అశాంతి కలిగించాలి అన్నదే వాళ్ళ ధ్యేయం... అమరావతి శంకుస్థాపన మొదలు "నన్ను పిలవద్దు, నేను రాను" అన్న దగ్గర నుంచి మొదలైన వ్యతిరేకత, నేటి మహిళా పార్లమెంట్ పార్లమెంట్ లో, ఎలా అయినా అలజడి చేసి, అమరావతికి, రాష్ట్రానికి చెడ్డ పేరు తేవాలానే కుతంత్రాల వరకు, సాగుతూనే ఉంది.

అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు, అంగరంగ వైభవంగా, వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా మణులతో కళకళలాడుతూ, మహిళల ఎదుర్కుంటున్న సమస్యలు మీద వివిధ రంగాల పెద్దలు, సమీక్షలు చేస్తూ ముందుకు సాగుతున్న వేళ... కొంత మందికి కన్ను కుట్టుంది. ఇంత సక్సెస్ ఫుల్ గా, సదస్సు సాగుతూ, అమరావతికి, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంటే, ఆక్రోశం బయట పడి... తాతల కాలం నాటి నుంచి ఉన్న వారసత్వంగా వస్తున్న లక్షణం బయటపడింది. వాళ్ళు నవ్వకూడదు, వాళ్ళు సంతోషంగా ఉండకూడదు, అనే ఆ గుణం, వికృత రూపం దాల్చి.. ఎలా అయినా సరే, అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ అడ్డుకోవాలి అని పక్కా ప్లాన్ తో, రెండు రోజులు నుంచి, చేస్తున్న రెచ్చ గొట్టే ప్రయత్నంతో, బయలు దేరింది ఒక మహిళా మణి. అన్న కాని అన్న, అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు నాశనం చెయ్యటానికి వదిలిన బాణం ఈమె..

ఈమె చరిత్ర చాలా ఘనమైనది.. పవిత్రమైన అసెంబ్లీ లో, అసభ్య హావ భావాలు, తోటి మహిళలను బూతులు తిట్టటం, టీవీలో పెద్దలు కూడా చూడలేని గొప్ప కార్యక్రమాల్లో నటించటం, నన్ను రేప్ చేసి దమ్ము నీకుందా అని బహిరంగంగా మాట్లాడటం, నోటికి అద్దు అదుపు లేకుండా రెచ్చిపోవటం.. ఇవి ఆవిడ క్వాలిఫికేషన్స్... ఇలాంటి వాళ్ళు, ఆ పవిత్ర స్థలంలో, జరుగుతున్న పవిత్ర కార్యక్రమానికి వస్తే ? అక్కడ ఉన్న, వేల మంది వనితలకు అవమానం... ఈ కుతంత్రాలు పసి గట్టిన ఇంటలిజెన్స్, ఆమెను ఆ పవిత్ర స్థలానికి రాకుండా అడ్డుకుంది... సదస్సు ప్రిష్టతను, అక్కడ ఉన్న వేలాది అతివల గౌరవాన్ని కాపాడింది పోలీసు వ్యవస్థ...

ఒక పక్క ఆంధ్ర రాష్ట్రం మీద నిత్యం యుద్ధం చేసే, తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు వచ్చి అమరావతిని పొగుడుతూ, ఆంధ్ర రాష్ట్రం చల్లగా ఉండాలి అనే మాటలు విన్నాం... మరో పక్క బుట్టా రేణుక లాంటి వైయస్ఆర్ పార్టీ MP చేసిన ప్రసంగం చూసాం, మరి ఇలా సదస్సుని చెదగోట్టాలి అనే ఎజెండాతో, ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న మహిళను, అక్కడకు రానివ్వాకుండా, మంచి వాతావరణంలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుని చెడగొట్టకుండా, ముందు జాగ్రత్త తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులను, మహిళలు అందరూ మెచ్చుకుంటున్నారు.

ఆనాటి ఇంద్రుడి ఆమరావతిలా ప్రస్తుత నవ్యాంద్ర రాజధాని ఆమరావతి వైభవంతో వెలుగొందాలని కోరుకొంటున్నానని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అన్నారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో కవిత ప్రసంగిస్తూ, "గాంధీజీ పిలుపుతో ఇదే విజయవాడలో వందలాది మంది మహిళలు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఒంటిపై నగలిచ్చి జైళ్లకు కూడా వెళ్లారు" అని కవిత విజయవాడని కూడా పొగిడారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, చివర్లో జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణా ఆంటూ కవిత తన ప్రసంగాన్ని ముగించారు. కెసిఆర్ కుటుంబం, జై ఆంధ్రపదేశ్ అనటంతో, అక్కడ అందరూ సంతోషించారు. తెలుగువారు అందరూ కలిసి సోదర భావంతో మేలగటానికి, ఇలాంటివి ఉపకరిస్తాయి అని, అక్కడ ఉన్నవారు సంతోషించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక స్త్రీ, చరిత్రను లిఖిస్తుందని ఆనాడే గురజాడ అప్పారావు స్పష్టం చేశారన్నారు. మహిళా సాధికారత కోసం గురుజాడ అప్పారావు ఎనలేని సేవ చేశారని చెప్పారు. అమెరికా లాంటి మహిళా అధ్యక్షురాలు ఎన్నిక సాధ్యం కాలేదని అలాంటిది మనదేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి, ఇందిరాగాంధీ లాంటీ ఎందరో మహిళలు రాజకీయాల్లో పాలనా వ్యవహారాలలో రాణించారన్నారు. వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. భారతీయ సంస్కృతిలోని రామాయణ, మహాభారత కథలను కుటుంబంలోని పెద్దలు పిల్లలకు తెలియజేయడం ద్వారా చిన్న వయస్సునుంచే నాయకత్వ లక్షణాలను తెలుసుకొనే అవకాశం ఏర్పడిందన్నారు.

దేశంలో నిరాక్షరాస్యులైన చాలా మంది తెలుగు రాష్ట్రాల మహిళలు ఆర్థిక విషయాలలో ఆదర్శవంతంగా నిలిచారన్నారు. తాను సంపాదించిన డబ్బును అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెడుతూ పొదుపును పాటిస్తారని తెలిపారు. నేటి యువత, ముఖ్యంగా విద్యార్థినులు చదువులో రాణించాలని, చదువులేని మహిళల అనుభవాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రపంచీకరణ నేపధ్యంలో మహిళలు అన్ని రంగాలలో ముందుకుసాగాలని దీనికి నాంది కుటుంబం నుంచే మొదలు కావాలన్నారు. మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రతి ఇంటి నుంచి ప్రారంభం కావడం ద్వారా మహిళ సాధికారతను సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ వేదికలో మహిళలపై జరుగుతున్న హింస, వివక్షలపై చర్చ జరిగి ఒక తీర్మానం చేయాలని కోరారు. సారాకు వ్యతిరేకంగా ఉద్యమించిన రోశమ్మను ఆదర్భంగా తీసుకోవాలన్నారు.

మహిళా పార్లమెంట్ సదస్సుకు హజరయ్యే ముందు, ఆమె తొలుత కనకదుర్గమ్మను అమ్మవారిని దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని కవిత స్పష్టం చేశారు. తెలుగువారంతా అన్నదమ్ములులా కలిసి మెలిసి ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కు విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నీ అక్షరాలా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

మీరు మొదటిసారి ఇల్లు కొనబోతున్నారా..? అయితే మీకోసం కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. గృహ రుణం వడ్డీ చెల్లింపులపై గరిష్ఠంగా రూ.2.4 లక్షల సబ్సిడీ లభించనుంది. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉండి, గరిష్ఠంగా 20 ఏళ్ళు కాలపరిమితితో రుణం తీసుకునేవారికి ఈ సబ్సిడీ సదుపాయం లభించనుంది. రూ.6 లక్షల వరకు వార్షికాదాయం కలిగి ఉండి, 15 ఏళ్ళు కాలపరిమితితో రుణం తీసుకునేవారికి ఇప్పటికే ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే, రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు, 2022 నాటికి అందరికీ గృహాలు కల్పించాలన్న లక్ష్యాలకు ఊతమిచ్చేందుకు మరో రెండు సబ్సిడీ శ్లాబులను ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) కింద గత ఏడాది డిసెంబర్ 31న ప్రధాని మోదీ రెండు సబ్సిడీ పథకాలను ప్రకటించారు. ఆ పథకాల పూర్తి వివరాలు మాత్రం తాజాగా విడుదల అయ్యాయి. ఆదాయ శ్లాబుల వారీగా వడ్డీ సబ్సిడీ వివరాలు..

1. మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు తమ వార్షికాదాయం ఆధారంగా సబ్సిడీకి అర్హత పొందుతారు. మొదటి శ్లాబు ప్రకారం.. రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి, రుణ మొత్తంతో సంబంధం లేకుండా అసలు సొమ్ములో రూ.6 లక్షలపై 6.5 శాతం సబ్సిడీ లభిస్తుంది. అంటే, 20 ఏళ్ళు కాలపరిమితితో, 9 శాతం వార్షిక వడ్డీపై రూ.10 లక్షల రుణం తీసుకున్నారనుకుందాం. అందులో రూ.6 లక్షలకు 6.5 శాతం సబ్సిడీ పోను 2.5 శాతం వడ్డీనే చెల్లిస్తారు. మిగతా రూ.4 లక్షలకు మాత్రం 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
2. ఇక రెండో శ్లాబు విషయాకొస్తే.. రూ.12 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి తీసుకునే గృహ రుణంలో రూ.9 లక్షల అసలుపై 4 శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుంది.
3. మూడో శ్లాబులో ఏడాదికి రూ.18 లక్షల వరకు ఆదాయం ఆర్జించేవారు తీసుకునే హోమ్‌లోన్‌లో రూ.12 లక్షల అసలు సొమ్ముపై 3 శాతం వడ్డీ సబ్సిడీ ఇస్తారు.

ఈ మూడు శ్లాబుల్లోనూ 9 శాతం వడ్డీతో 20 ఏండ్ల కాలపరిమితితో గృహరుణం తీసుకునేవారికి నెలవారీ కిస్తీ (ఈఎంఐ) చెల్లింపులపై దాదాపు రూ.2.4 లక్షల వరకు ఆదా అవుతుంది. అంటే చెల్లించాల్సిన ఈఎంఐ రూ.2,200 వరకు తగ్గుతుంది. గృహ రుణంపై లభించే పన్ను రాయితీలకు, పీఎంఏవై ద్వారా లభించే వడ్డీ సబ్సిడీ అదనం. అంటే 30 శాతం ఆదాయం పన్ను శ్లాబులో ఉండేవారికి ఏటా రూ.61,800 వరకు ఆదా అవుతుంది.

వడ్డీ సబ్సిడీ పథకాల అమలుకు నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ), హడ్కో.. నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. ఈ పథకం కింద అల్పాదాయ విభాగంలో 18వేల మందికి సబ్సిడీ కల్పించారు. ఆదాయ పరిమితిని భారీగా పెంచిన నేపథ్యంలో ఈ పథకం ద్వారా వడ్డీ సబ్సిడీ పొందేవారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఎన్‌హెచ్‌బీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

రాష్ట్రంలో వివిధ రంగాల్లో 5 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు ఇండియన్ బ్యాంక్ ముందుకు వచ్చింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ బ్యాంక్ ఎండి మహేష్ కుమార్ జైన్ కలిశారు.

మౌలిక సదుపాయాలు, విద్య, పర్యా టకం, ఆతిధ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని తెలిపారు. బ్యాంక్ ప్రతిపాదనలను సిఎం స్వాగతించారు.

రాజధాని అమరావతిలో బ్యాంక్ జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సిఎం విజ్ఞప్తి చేశారు. దీనిపై బ్యాంక్ ఎండి సానుకూలంగా స్పందించారు. కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ కార్పొరేషన్, ఎస్సీ, బీసీ, మైనారటీ కార్పొరేషన్, రుణాలు తాము బ్యాంక్ ద్వారా అందచేస్తున్నామని, తాము ఇస్తున్న రుణాల్లో సగం వ్యవసాయ రుణాలే అని ముఖ్యమంత్రి తెలిపారు. కృష్ణా జిల్లాల్లో 100 మంది బ్యాంకింగ్ కరెస్పాండెంట్లు ఉన్నారని వివరించారు.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read