దక్షిణాదిన ప్రముఖ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి రాజధాని అమరావతి ప్రాంతంలో 200 ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ భూమి, నీరుకొండ సమీపంలో కేటాయించారు. రెండు దశల్లో అప్పగించే ఈ భూమికి ఎకరం రూ.50 లక్షలుగా ధరగా ప్రభుత్వం నిర్ణయించింది.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటయ్యే ఈ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌, బిజినెస్‌, వైద్య కోర్సులను అందించనున్నారు. 52 వేల మంది విద్యను అభ్యసించనున్నారు. పదేళ్లలో మొత్తం రూ.4,400 కోట్ల పెట్టుబడితో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చెయ్యనున్నారు. వర్సిటీ ఏర్పాటు పూర్తయ్యేనాటికి 12 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. విశ్వవిద్యాలయ నిర్మాణానికి సంబంధించి భూమిపూజ కార్యక్రమాన్ని త్వరలో జరగనుంది.

అలాగే ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, అమరావతి కాంపస్ లో, ఫాకల్టీ పోస్ట్లు భర్తీకి కూడా వర్సిటీ అవకాశం ఇచ్చింది. హెచ్ఓడి, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు, దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు, ఇక్కడ క్లిక్ చెయ్యగలరు http://www.srmuniv.ac.in/srmap/dean-hods.html

చెన్నై క్యాంపస్‌కు దీటుగా అత్యాధునికతను చాటుకునే విధంగా క్యాంపస్ నిర్మాణానికి ఎస్‌ఆర్‌ఎం డిజైన్ లు సిద్ధం చేసేంది... ఆ డిజైన్ లు ఇవే..

srm university amaravati 1

srm university amaravati 1

srm university amaravati 1

ఆపత్కాలంలో ఆదుకొని ప్రాణాలు రక్షించే 108 అంబులెన్స్ వాహనాలు కొత్తరూపును సంతరించుకున్నాయి. అధునాతన లైఫ్‌సపోర్ట్ పరికరాలతో అవి మరింత మెరుగైన వైద్య సేవలందించనున్నాయి. దాదాపు మొబైల్ ఐసీయూగా రూపుదిద్దిన 108 వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలకి పంపిణీ చేసింది. జిల్లాకు 28 కొత్త వాహనాలను ప్రభుత్వం కేటాయించిది. విజయవాడ సిద్ధార్థా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో వీటిని ఉంచి, అన్ని జిల్లాలకి పంపిస్తున్నారు.

కొత్తగా వచ్చిన వాహనంలో ఈ క్రింది సదుపాయాలు ఉన్నాయి

    • రోగికి బీపీ, ఈసీజీ, పల్స్రేట్ ముందుగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మల్టీమీటర్ ద్వారా పరీక్షించవచ్చు
    • అలాగే విషద్రావణం తీసుకున్న వ్యక్తిని కాపాడేందుకు ప్రత్యేకంగా సెక్షన్ ఆపరేటర్ ఏర్పాటు చేశారు. దీంతో రోగిని ఆసుపత్రికి చేరిన వెంటనే డాక్టర్ల వైద్యం చేయడానికి వీలుంటుంది
    • పల్స్ ఆక్సీ మీటర్
    • ఇంకా ఐదు రకాల స్టక్టర్స్
    • అధునాతన వీల్ చైర్ నీడిల్ కట్టర్
    • మల్టీ మానిటర్
  • సెక్షన్ ఆపరేటర్
  • మ్యాన్యువల్ ఆక్సిజన్ సిలిండర్
  • బేబి వార్మింగ్ బ్లాంకెట్
  • ఆత్యవన సేవల్లో భాగం ఆక్సిజన్ కై రెండు ఫోర్టబుల్ సిలెండర్ల ఏర్పాటు చేయడం ద్వారా ఇద్దరు రోగులకు సేవలు అందించవచ్చు
  • స్పైరల్ నెక్ గార్డ్ లాంటివి ఈ వాహనంలో ఉన్నాయి
  • త్వరలో రోగుల అత్యవసర సేవల్లో భాగంగా గుండెజబ్బుకు సంబందించి (షాక్ ట్రీట్మెంట్) డిఫిబ్రిలేటర్ పరికరంతో పాటు కృత్రిమశ్వాశ అందించే వెంటిలేటర్ సౌకర్యం కల్పనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది

ఇక ఈ అంబులెన్స్‌లు తక్కువ సమయంలోనే ప్రజలను చేరుకొనేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్ లో కూడా, అంబులెన్స్‌ ఎక్కడ ఉందో ట్రాక్ చెయ్యవచ్చు.. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జిపిఎస్) అమర్చటం ద్వారా వాహనం ఎక్కడ ఉంది అనేది చూడవచ్చు., ఇక్కడ క్లిక్ చెయ్యండి.
http://gamyamtech.com/avlt/#/welcome

ఆర్కే బీచ్‌‌లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన జగన్‌‌ను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ ఉంది, రేపు CII సమ్మిట్ ఉంది, పర్మిషన్ లేదు అని పోలీసులు చెప్పారు.

"రెండేళ్లు.. రెండే రెండేళ్లలో సీఎం అవుతా.. మీ అంతు చూస్తా.. మీ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటా ఎవర్నీ మరిచిపోన"ని పోలీసులకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆయన పక్కనే ఉన్న మరో వైసీపీ నేత "గుర్తు పెట్టుకుని మరీ మిమ్మల్ని పట్టుకుంటామన్నట్లు"గా వార్నింగ్ ఇచ్చారు.!

ఇంకో సందర్భంలో ఒక పోలీస్ జగన్ ను తాకగా, "యాయ్... నువ్వు కాబోయే ముఖ్యమంత్రిని పట్టుకున్తున్నావ్" అని అనటంతో, పోలీసులు అవాక్కయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళు, జగన్ మానసిక స్థితి సరిగ్గా లేదేమో అని గుసగుసలాడారు 

వైద్యం... ఈ రోజుల్లో ఎంతో విలువైనది... ముఖ్యమైనది... అంతకు మించి ఖర్చు తో కూడుకున్నది. పాలు నుంచి ఆహారం వరకు అన్ని వస్తువుల్లో కలీలు, కలుషిత వాతావరణం నేపథ్యంలో ప్రాణాంతక వ్యాధులు ప్రజల్ని కకావికలం చేస్తున్నాయి.

మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు, ఏదన్నా జబ్బు చేస్తే, వణికిపోయే పరిస్థితులున్నాయి. అందుకు వైద్య ఖర్చులే ప్రధాన కారణం. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వైద్య భరోసా పథకాలు కల్పించాక పేద ప్రజలు, ఉద్యోగులు. కొంతవరకు నిశ్చింతగా ఉన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్య భరోసా కార్డు వెంట తీసుకుని వెంటనే చూపించుకునేందుకు వెళ్లిపోతున్నారు. అదే మధ్యతరగతి కుటుంబాల విషయానికి వస్తే నగదు చేతిలో ఉంటేనే వైద్య భరోసా, లేదంటే వారి పరిస్థితి ఆందోళనకరమే.

అందరికీ వైద్యంలో భాగంగా ఎగువ తరగతి కుటుంబాలకు కూడా వైద్య భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరే రాష్ట్రంలో లేని విధంగా వారికి వైద్యపరమైన బీమా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేటు బీమా పాలసీల పాటు ఇప్పటికే ప్రభుత్వం అమలుచేస్తున్న వైద్య బీమా పథకాలతో పోల్చితే ఆరోగ్య రక్ష పథకంలో ఎన్నో అదనపు ప్రయోజనాలున్నాయి. పథకంలో ఎందుకు చేరడం, ఎలా చేరాలి ? వైద్య భరోసా ఏంటి? అదనపు ప్రయోజనాలు ఏంటనే విషయాలు తెలుసుకుందాం

అసలు ఏంటి ఈ ఆరోగ్య రక్ష పధకం ?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం కోసం ప్రవేశపెట్టిన "డా. ఎన్.టి.ఆర్.వైద్య సేవ", "ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం", "పాత్రికేయుల ఆరోగ్య సంరక్షణా పథకం" తో పాటుగా ఆ మూడు పథకాలలో లబ్దిపొందలేని వారి కోసం ఆరోగ్య రక్షను ప్రవేశపెట్టారు.

ఆరోగ్య రక్ష పథకం ద్వారా సంవత్సరానికి మీ కుటుంబములోని పిల్లల నుండి పెద్దల వరకు ఒకొక్కరికి కేవలం రూ.1200/-మాత్రమే చెల్లించి దరఖాస్తు చేసుకొని హిల్త్ కార్డును పొందవచ్చు. హిల్త్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు సంవత్సరమునకు రూ.2 లక్షల వరకు వైద్య సహాయము పొందవచ్చు.

ప్రైవేటు బీమా పధకాలతో పోలిస్తే ఎన్నో ప్రయోజనాలు. ఇవి తప్పుకుండా తెలుసుకోండి....

  • ప్రైవేటు బీమా కంపెనీల్లో ప్రీమియం ఎక్కువగా ఉంటుంది
  • ప్రైవేటు బీమాలో వయస్సు పరిమితులు కూడా ఉంటాయి. వైద్యని ధ్రువీకరణతోనే ప్రీమియంలోకి చేర్చకుంటారు
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఆరోగ్య బీమా కల్పించాలంటే ప్రీమియం ఎంతో ఎక్కువగా ఉంటుంది.
  • ఆరోగ్యరక్ష పధకంలో ఇలాంటి ఆంక్షలు ఉండవు. వయస్సు, వ్యాధి తీవ్రత పరిగణనలోకి రావు
  • ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కింద కుటుంబమంతటికి ఏడాదికి రూ.2.5 లక్షల వైద్య బీమా ఉంటే ఆరోగ్య రక్షలో చేరిన ప్రతి వ్యక్తికి రూ.2 లక్షల వైద్య బీమా ఉంది.
  • ప్రైవేటు బీమా కంపెనీల్లో గుండె, కిడ్నీ సంభందిత వ్యాధులకు బీమా కల్పించవు. ఆరోగ్యరక్షలో ఆ వ్యాధులకు కూడా ధీమా ఉంది
  • రక్తపోటు, మధుమేహం వ్యాధులకు చికిత్స కూడా ఇందులో కవర్ అవుతుంది
  • ప్రైవేటు వైద్య బీమా సౌకర్యం వినియోగించుకోవాలంటే ఏడాదికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ ఆరోగ్యరక్షలో రూ.2 లక్షల నగదు ఖర్చయ్యే వరకు ఎన్నిసార్లయినా వైద్య సేవలు పొందవచ్చు
  • ఆరోగ్య రక్ష పధకంలో సభ్యులుగా ఉన్నవారు ఎటువంటి డబ్బు చెల్లించే అవసరం లేకుండా నెట్వర్క్ ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్షారణ పరీక్షలు, మందులు, వైద్యంతో పాటు భోజనం ఉచితంగా పొందవచ్చు.
  • డిశ్చార్జ్ అయ్యే సమయంలో 11 రోజులకు సరిపడా మందులను ఉచితంగా పొందవచ్చ మిగిలిన బీమా పధకాల్లో ఈ సౌకర్యం లేదు.
  • ఆసుపత్రి నుంచి వెళ్లిన అనంతరం కూడా 138 రకాల వ్యాధులకు ఏడాది పాటు మందులు పొందవచ్చు
  • ప్రైవేట్ వైద్య బీమాలో చేరితే ప్రీమియం చెల్లింపుల నుంచి కంపెనీతో సంప్రదింపులకు కొన్ని ఇబ్బందులున్నాయి. అదే ప్రభుత్వ బీమా పధకం కావడంతో మండలస్థాయిలో సంప్రదింపులు సులభంగా చేసుకోవచ్చు
  • మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రల వద్ద ఆరోగ్య రక్ష పధకంతో పాటు వాటి ప్రయోజనాలు, నెట్వర్కు ఆస్పత్రుల పూర్తి సమాచారం అందుబాటులో ఉంది.
  • జ్వరం నుంచి దీర్ఘకాలిక వ్యాధులకు శస్త్రచికిత్పల వరకు బీమా పరిధిలోకి వచ్చే నగదుతో అన్ని రకాల సేవలు పొందవచ్చు

    ఆరోగ్య రక్ష పథకంలో ఎలా చేరాలి ?
    ముందుగా పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదుచేసుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు ఇక్కడ దరఖాస్తు చేసుకోగలరు.
    ఈ క్రింద లింక్ క్లిక్ చెయ్యండి, పూర్తి వివరాలు ఉన్నాయి.

ఎన్.టి.ఆర్ ఆరోగ్య రక్ష హెల్త్ ఇన్సురన్స్ పధకంలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ?

ఆరోగ్య రక్ష పథకంలో ఎప్పుడు లోపు చేరాలి ?
జవనరి 9 నుంచి ఆరోగ్య రక్షలో అర్హుల నమోదు ప్రారంభమైంది. ఫిబ్రవరి 28 వరకు నమోదు చేసుకోవచ్చు. ఏప్రిల్ నుంచి పధకం అమల్లోకి వస్తుంది.

ఎన్ని హాస్పిటల్స్ లో ఆరోగ్య రక్ష పథకం పని చేస్తుంది ?
ఆరోగ్య రక్ష పథకం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని 410 ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో అమల్లో ఉంటుంది. 1044 రకాల వ్యాధులకు చికిత్సను అందిస్తారు. సెమీ ప్రైవేట్ వార్డు(ఏసీ) వైద్యం అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటుంది.

ఆరోగ్య రక్ష పథకం మీద సందేహాలు వస్తే ?
104 లేదా 8333817469 నెంబర్లలో సంప్రదించవచ్చు

ప్రతిష్టాత్మక భాగస్వామ్య సదస్సు, CII సమ్మిట్ కు రెండోసారి ఆతిథ్యం ఇచ్చేందుకు, నవ్యాంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధాని విశాఖపట్నం సిద్ధమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సు కోసం తూర్పు తీరంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విశాఖపట్నం రెడీ అవుతుంది. గత ఏడాది జనవరిలో సదస్సును నిర్వహించిన ఎపిఐఐసి గ్రౌండ్స్‌లోనే ఈసారి కూడా 27, 28 తేదీల్లో సదస్సును నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా, 22 సార్లు ఈ భాగస్వామ్య సదస్సు జరిగితే, అందులో 5 సార్లు చంద్రబాబు నాయకత్వంలో జరిగాయి.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకి దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రత్దినిధులు, ఆర్ధిక నిపుణులు పాల్గుంటారు. 50 దేశాల ప్రతినిధులతో సహా దేశ విదేశాలకు చెందిన 2000 మంది ఇన్వెస్టర్లు, పారిశ్రామిక, వాణిజ్యరంగాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 15 మంది కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన 30 మంది మంత్రులు సదస్సులో పాల్గొంటున్నారు. ఈ సదస్సులో రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు .. ప్రాధాన్య రంగాలైన ఆటోమొబైల్‌ అండ్‌ ఆటోమొబైల్‌ కాంపోనెంట్స్‌, టెక్స్‌టైల్స్‌-అపెరల్‌ పార్కులు, బయోటెక్నాలజీ, ఏరోస్పే్‌స-డిఫెన్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, పెట్రోలియం- పెట్రోకెమికల్స్‌ లో భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉపాధి కల్పనను పరిశ్రమల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార, పారిశ్రామిక అవకాశాలను షోకస్‌ చేయడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సాధారణంగా భాగస్వామ్య సదస్సుల్లో లక్షల కోట్ల విలువైన ప్రతిపాదనలు రావడం ఆచరణలోకి వచ్చేసరికి అందులో 20-30 శాతం కూడా కార్యరూపం దాల్చకపోవడం రివాజుగా వస్తోంది. గతేడాది జనవరిలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా, 328 కంపెనీలు 4.62 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో, 8.72 లక్షల మందికి ఉపాధి అవకాశాల కోసం MoU కుదుర్చుకున్నారు. అందులో, 93 కంపెనీలు, ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి, మరో 43 కంపెనీలకు భూములు కేటాయింపు అయ్యింది, పని మొదలు పెట్టల్సి ఉంది. ఇలాంటి సదస్సుల్లో, MoU లు కుదుర్చుకున్న వాటిలో, 20-30 శాతం కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చెయ్యవు. అలాంటిది మనకు, పోయిన సారి 31 శాతం కార్యరూపం దాల్చాయి. మరో 10 శాతం క్షేత్ర స్థాయిలో మిషనారీ ఏర్పాటు, బిల్డింగ్ లు కట్టుకునే పనిలో ఉన్నారు. ఇంకా ఫాలో అప్స్ చేస్తున్నారు కాబట్టి, ఇది 50% దాటే అవకాశాలు ఉన్నాయి.

ఈ సారి పరిస్థితి ఇంకా ఆశాజనకంగా ఉన్నట్టు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. క్రిందటి సంవత్సరంతో పోలిస్తే, మౌలిక సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి... కరెంటు, నీళ్ళు, భూమికి కొరత లేకపోవటం, మంచి రవాణా కనెక్టివిటీ, ముడి సరకు లభ్యత అన్నీ కలిసి వచ్చే అంశాలే. ఈ ఏడాది, 8 లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలి అనేది లక్ష్యం.

More Articles ...

Advertisements

Latest Articles

Most Read