తన సొంత అజెండా అమలుకాలేదన్న దుగ్ధతో, ప్రజాస్వామ్య విలువలకు తిలోద కాలివ్వడమేకాకుండా, తన చర్యలను సమర్థించుకునేక్రమంలో నైతికవిలువలని, ప్రజాస్వామ్యమని జగన్మోహన్‌రెడ్డి పెద్దపెద్దమాటలు మాట్లాడటం విచిత్రంగా ఉందని టీడీపీసీనియర్‌నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవా రం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ సాక్షిగా జగన్‌చేసిన అసత్యప్రసంగాన్ని తప్పుపట్టారు. ప్రజలమాటను పెద్దల సభ పట్టించుకోలేదంటున్న జగన్మోహన్‌రెడ్డి, రాజధానిని తరలిస్తానని మేనిఫెస్టోలో చెప్పడంగానీ, నవరత్నాల్లో హామీఇవ్వడంగానీ చేయలేదన్నారు. అలాంటప్పుడు ఆ అంశం ఆయన వ్యక్తిగతం అవుతుందిగానీ, ప్రజాభిప్రాయం ఎలా అవుతుందన్నారు. విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డిల నాయకత్వంలో మండలిలో మంత్రులు ప్రవర్తించిన తీరు జగన్‌కు కనిపించలేదా అని దేవినేని ప్రశ్నించారు. మైనారిటీ నేత, ఛైర్మన్‌ను ఉద్దేశించి దుర్భాషలాడటం, ఆయన తల్లిదండ్రులను, మతాన్ని దూషించడం జగన్‌ చెవికి ఎక్కకకపోవడం విచారకరమన్నారు. బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా ఛైర్మన్‌పోడియం వద్దకెళ్లి అనరానిమాటలంటే, దానిగురించి జగన్‌ నోటి నుంచి ఒక్కమాటకూడా రాలేదన్నారు.

మండలి ప్రసారాలను ఎందుకు ఆపేశారో.. ఫోన్లు పనిచేయకుండా జామర్లు ఎందుకువాడారో చెప్పాలన్నారు. తన పంతం నెగ్గలేద న్న అక్కసుతో, రూ.30కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగంలేకుండాపోయిందని విజయసా యిని, బొత్సను జగన్‌ తిట్టినట్టు వార్తలు కూడా వచ్చాయన్నారు. సంతలో పశువులని కొన్నట్లు, తన అవినీతి సంపదను ఎమ్మెల్సీ కొనుగోలుకు వెదజల్లాడన్నారు. గతంలో ఎవరైనా తనపార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసిరావాలంటూ శ్రీరంగనీతులు చెప్పిన జగన్‌, ఇప్పుడెలాంటి పనులు చేస్తున్నాడని దేవినేని నిలదీశారు. దేవుడిస్క్రిప్ట్‌ ప్రకారమే టీడీపీకి 23స్థానాలు వచ్చాయన్న ముఖ్యమంత్రి, ఆ 23మందిని ఎదుర్కోలేక దేవుడిస్క్రిప్ట్‌కి వ్యతిరేకంగా పాలన చేస్తున్నాడన్నారు. శాసనమండలి రద్దు తనచేతుల్లో లేదని తెలిసీ కూడా ఆదిశగా అడుగులువేస్తున్నాడన్నా రు.శుక్రవారం కోర్టుకు హాజరవ్వడం కోసమే అసెంబ్లీకి సెలవు ప్రకటించాడన్నారు. మైనారిటీ నాయకుడు శాసనమండలి స్పీకర్‌గా కూర్చోవడాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపో తున్నాడని, అందుకోసమే దానిరద్దుకి యత్నిస్తున్నాడన్నారు. 40ఏళ్ల అనుభవాన్ని ఎగతాళిచేస్తున్న మంత్రులందరికీ, రూల్‌-71తో దిమ్మదిరిగేలా చేయడం చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. కొడాలినాని బూతులుమాట్లాడినప్పుడు ఖండించిఉంటే, ద్వారంపూడి నోరెత్తేవాడు కాదని, ఆయన్ని చూసి తణుకుఎమ్మెల్యే హద్దులుమీరాడన్నారు. మంత్రులు , ఎమ్మెల్యేలతో దాడి చేయించడం, బూతులు తిట్టించడం ద్వారా, జగన్‌లోని పైశాచిక ఆనందం తృప్తి పడుతోందని ఉమా దుయ్యబట్టారు.

మండలిస్పీకర్‌ వ్యాఖ్యలను అసెంబ్లీ లో చూపించడంతోనే జగన్‌ తెలివిఏపాటిదో అర్థమైందన్నారు. 25మంది రైతులు, రైతుకూలీలు చనిపోయినప్పుడు స్పందించని జగన్‌మనసు, మండలిలో బిల్లు ఆమోదం పొందకపోవడంతో చలించిందని దేవినేని ఎద్దేవాచేశారు. విజయసాయి, వై.వీ.సుబ్బా రెడ్డి, సజ్జలసాయంతో సోమవారంనాటికి ఎంతమందిని వీలైతే, అంతమంది టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టే పనిలో జగన్‌ ఉన్నాడన్నారు. శాసనమండలి నిర్వహణకు రూ.60కోట్లు ఖర్చవుతాయంటున్న ముఖ్యమంత్రి, తనపార్టీ కార్యకర్తలకు వాలంటీర్ల ముసుగులో నెలకు రూ.200కోట్లు ఎందుకు ఖర్చుచేస్తున్నాడో సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్‌చేశారు. వైసీపీకార్యకర్తలకే ఏటా రూ.2,400కోట్ల ప్రజాధనాన్ని జగన్‌ అప్పనంగా దోచిపెడుతున్నాడని, దాతలు నిర్మించిన భవనాలకు పార్టీ రంగులేయడానికి రూ.1200కోట్లు ఖర్చుచేశారన్నారు. ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లడానికి ప్రతివారం రూ.60లక్షలు ఖర్చవుతుందని, ఏడాదికి రూ.30కోట్లు అక్రమాస్తులకేసుల్లో కోర్టుకు వెళ్లడానికే అవుతున్న విషయం జగన్‌కు తెలియదా అని ఉమా నిలదీశారు. సజ్జల సహా, అనేకమంది సాక్షివేగుల్ని ప్రభుత్వకార్యాలయాల్లో నియమించి ఏటా రూ.1000 కోట్లు దోచిపెడుతున్నారన్నారు. తన ఇంటి కిటికీలు మార్చడానికి రూ.80లక్షలు, రోడ్లు వేయడానికి, రంగులకు రూ.40కోట్ల ప్రజాధనాన్ని వాడుకున్నారన్నారు. జగన్మోహ న్‌రెడ్డి తలకిందులుగా తపస్సుచేసినా మండలిని రద్దుచేయలేడని ఉమా తేల్చిచెప్పారు. సెలెక్ట్‌ కమిటీ ప్రజాభిప్రాయం సేకరించాక, నివేదికను అసెంబ్లీకి అందచేస్తుందన్నారు. ఒకవేళ సీబీఐ, ఈడీకేసుల్లో శిక్షపడి జైలుకువెళితే, తనను బయటకు తీసుకురావడానికే ముందస్తుగా ప్రజలసొమ్ముతో జగన్‌, ఢిల్లీ న్యాయవాది ముకుల్‌రోహత్గీని నియమించు కున్నాడన్నారు. విజయసాయి బెయిల్‌ను రద్దుచేయమని కోర్టుని ఆశ్రయిస్తామని దేవినేని స్పష్టంచేశారు. జగన్‌ మండలిరద్దు వంటి తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుంటే కోర్టులను ఆశ్రయించైనా సరే, ఆయన్ని అడ్డుకుంటామన్నారు.

ఈ రోజు శుక్రవారం కావటంతో, జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల పై హైదరాబాద్ లో ఉన్న నాంపల్లి సిబిఐ కోర్ట్ లో, విచారణ జరిగింది. అయితే, ఈ రోజు కూడా జగన్ మోహన్ రెడ్డి, తను హాజరు కాకుండా, అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి, అబ్సెంట్ పిటీషన్ ధాఖలు చేసారు. దీంతో, జగన్ మోహన్ రెడ్డికి, ఈ ఒక్క వారానికి, సిబిఐ కోర్ట్ మినహాయింపు వచ్చింది. మరో పక్క, ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డితో పాటుగా, మిగతా వారు కూడా ఈ విచారణకు హాజరు అయ్యారు. అయితే, ఈ రోజు, కోర్ట్ ఒక కీలక తీర్పు ఇచ్చింది. గత నెల 10న, జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ కోర్ట్ కు హాజరయిన సందర్భంలో, ఈడీ కేసుల్లో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని, తన బదులుగా, జగతీ పబ్లికేషన్స్ ప్రతినిధి వస్తారని, చెప్పారు. అయితే ఈ పిటీషన్ పై ఈడీ తన వాదనలు వినిపిస్తూ, జగన్ మోహన్ రెడ్డికి మినహాయింపు ఇవ్వకూడదు అంటూ వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్ట్, తీర్పుని, ఈ రోజు అంటే, జనవరి 24కు వాయిదా వేసింది.

jagan 24012020 2

ఈ తరుణంలో, ఈ రోజు కోర్ట్ ఏమి తీర్పు ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. జగన్ మోహన్ రెడ్డి , ఈడీ కేసుల్లో తనకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలి అని వేసిన పిటీషన్ పై, ఈ రోజు కోర్ట్ స్పందిస్తూ, ఆ పిటీషన్ కొట్టేసింది. ప్రతి శుక్రవారం ఈడీ కేసుల్లో విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పింది. దీంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. అయితే ఇది జగన్ మోహన్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బగానే చెప్పచ్చు. ఇప్పటి వరకు, ప్రతి శుక్రవారం, సిబిఐ కేసులు మీదే జగన్ విచారణకు వెళ్తున్నారు. అయితే దీని పై కూడా కోర్ట్ మొన్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలా అయితే, కేసులు ఎప్పటికి పూర్తవుతాయి, మీరు రావల్సిందే అని చెప్పటంతో, జగన్ మోహన్ రెడ్డి, గత నెల 10న కోర్ట్ కు హాజరు అయ్యారు.

jagan 24012020 3

ఇప్పుడు, ప్రతి శుక్రవారం, ఈడీ కేసుల్లో కూడా జగన్, కోర్ట్ కు వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబిఐ కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న జగన్, ఇప్పుడు ఈడీ కేసుల్లో కూడా కోర్ట్ కు వెళ్ళాలి. దీంతో, ఇది పెద్ద ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ రోజు కోర్ట్ తీర్పు ఇవ్వటంతో, వచ్చే వాయిదాకి జగన్ రావాల్సి ఉంటుందని చెప్తున్నారు. అయితే జగన్ లాయర్లు, వచ్చే వారినికి కూడా అబసేంట్ పిటీషన్ వెయ్యటానికి చూస్తున్నారని తెలుస్తుంది. అయితే, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, ఇలా సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో కోర్ట్ కు వెళ్ళటం, జగన్ ఇమేజ్ కు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ కు కూడా మచ్చ అనే చెప్పాలి. మరో పక్క, రాజకీయంగా కూడా వైసీపీకి ఈ పరిణామం, పంటి కింద రాయలా కొనసాగుతూనే ఉంది.

ఇప్పటికే మండలిలో జరిగిన పరిణామాల పై, వైసీపీ ప్రభుత్వం కిందా మీదా పడుతుంది. తన మాట వినని మండలిని రద్దు చేస్తాను అంటూ, జగన్ ఇప్పటికే చెప్పారు కూడా. మూడు రాజధానుల బిల్లు, సెలెక్ట్ కమిటీకి వెళ్ళటంతో, ఈ ప్రక్రియ మూడు నెలలు అవుతుందని, అయితే అంతకంటే ముందుగానే, ఈ రిపోర్ట్ తెప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. అయితే, ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాసం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు కమిటీకి పంపటం కూడా పూర్తీ కాలేదు. అక్కడ నుంచి కమిటీ వెయ్యాలి. అక్కడ నుంచి మూడు నెలలు పట్టే అవకాసం ఉంది. దీని పై నిన్న మండలి చైర్మెన్ మాట్లాడారు. మండలిలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని సెలక్ట్ కమిటీకి పంపడం సాంకేతికంగా పూర్తి కాలేదని మండలి చైర్మన్‌షరీఫ్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ మధ్యలోనే నిల్చిపోయిందన్నారు. ప్రక్రియ పూర్తయితేనే బిల్లులు సెలక్ట్ కమిటీకి చేరతాయన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో షరీఫ్ పర్యటించారు. తణుకులో తనను కలసిన విలేకరులతో మాట్లాడారు.

chairman 2401220 2

మండలి రద్దు దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై వ్యాఖ్యానించేందుకు షరీఫ్ నిరాకరించారు. అది ప్రభుత్వ ఇష్టమంటూ పేర్కొన్నారు. అలాగే బుధవారం మండలిలో చర్చ సందర్భంగా కొందరు మంత్రులు తనపై దుర్భాషలాడారంటూ వస్తున్న వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. ఎవరెవరో ఏదేదో అన్నారు.. అయితే ఎవరేం అన్నారో తనకు తెలీదన్నారు. సహజంగా ఉద్రేకపడ్డ సమయంలో కోపమొస్తుంది.. అలాంటి సమయంలో కొన్ని పదాలు నోటినుండి వెలువడతాయి. అంతమాత్రాన వాటిని ఉద్దేశపూర్వకంగా వినియోగించినట్లు కాదంటూ పేర్కొన్నారు. మూడు రాజధానుల అంశంపై తాను వ్యాఖ్యానించేది లేదన్నారు. బిల్లుల్లో కొన్ని పొరపాట్లున్నందున పరిశీలించాల్సిందిగా కోరేందుకే సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

chairman 2401220 3

ఇందుకు తన విచక్షణాధికారాన్ని వినియోగించానన్నారు. అయితే సాంకేతికంగా ప్రక్రియ పూర్తికాలేదన్నారు. నరసాపురంలో సత్కారం.. ఓ ప్రవేటు కార్యక్ర మంలో పాల్గొనేందుకు గురువారం నరసాపురం పట్టణానికి విచ్చేసిన రాష్ట్ర శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ను అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు సత్కరించారు. స్థానిక మున్సిపల్ అతిథిగృహంలో మండలి చైర్మన్ షరీఫ్ ను నాయకులు పూలమాలలతో ముంచెత్తారు. ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల అభీష్టానికి ఆశలకు విలువ నివ్వడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను కాపాడిన మండలి చైర్మన్ షరీఫ్ ధర్మానికి బాసటగా నిలిచారని కొని యాడారు. కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులు కొప్పాడ రవి, ఆరేటి మృత్యుంజయ, నెక్కంటి క్రాంతికుమార్, బొమ్మిడి రవిశ్రీనివాస్, పొన్నాల నాగబాబు, కొల్లు పెద్దిరాజు, కాగిత వెంకటేశ్వరరావు, భూపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇప్పుడున్న పరిస్థితిలో, ఒక కంపెనీ తీసుకు రావాలి అంటే, ఏ రాష్ట్రానికైనా, చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకుంటే, అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు పోటీ పడి, ఆ కంపెనీలను ఆకట్టుకునే స్థాయికి వచ్చాయి. కంపెనీల పెట్టుబడులు కోసం, రాయతీలు, కొత్త పాలసీలు, సమ్మిట్ లు, ఇలా అనేక ప్రయత్నాలు చేస్తే కాని, ఒక కంపెనీ రాష్ట్రాలకు వచ్చి పెట్టుబడులు పెట్టవు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి పెద్ద పెద్ద నగరాలకు ఇన్ఫ్రా ఎక్కువ ఉంటుంది, కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎక్కువ కంపెనీలు అటు వైపు మొగ్గు చూపుతాయి. మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు పెట్టుబడులు రావాలి అంటే, మనం ఎంతో శ్రమించాలి. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, మన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం అని, దీన్ని ఎలా అయినా బాగు చెయ్యాలి అనే ఉద్దేశంతో, పెట్టుబడులు కోసం, అనేక తిప్పలు పడ్డారు. కియా లాంటి కంపెనీని, అన్ని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చారు. శివ నాడర్ లాంటి వారిని, తన కార్ లో ఎయిర్ పోర్ట్ లో దింపి మర్యాదలు చేస్తే, హెచ్సీఎల్ లాంటి పెద్ద ఐటి కంపెనీ గన్నవరం వచ్చింది.

lulu 24012020 2

అలాగే హీరో హోండా కంపెనీ ఎలా వచ్చిందో, ఆ కంపెనీ సిఈఓ చెప్పారు. ఢిల్లీలో తనకు బ్రేక్ ఫాస్ట్ స్వయంగా చంద్రబాబు ఒడ్డించారని, ఆ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ లోనే, హీరో కంపెనీ, ఏపిలో పెట్టటానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ లాంటి పెద్ద సంస్థలు కూడా, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకొచ్చాయి. అయితే, అనూహ్యంగా, ప్రభుత్వం మారటంతో, ఈ కంపెనీలు వెనక్కు వెళ్ళిపోయాయి. అయితే ఇవి వెనక్కు వెళ్ళటం వెనుక, ఏపి ప్రభుత్వం వైఖరి ఉందంటే నమ్మగలరా ? స్వయంగా లూలు కంపెనీ, ఈ విషయం చెప్పింది. తమకు ఏపి ప్రభుత్వం భూములు రద్దు చేసిందని, ప్రపంచ స్థాయిలో తమ పేరు ప్రఖ్యాతలకు పోయే విధంగా, ఏపి ప్రభుత్వం వ్యవహరించిందని, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది లూలు గ్రూప్.

lulu 24012020 3

దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ, ఇప్పుడున్న పరిస్థితిలో, భవిష్యత్తులో మేము ఆంధ్రప్రదేశ్ లో రూపాయి పెట్టుబడి కూడా పెట్టం అని, కాని, వివిధ రాష్ట్రాల్లో మా పెట్టుబడులు పెట్టి, ఆ రాష్ట్రాల అభివ్రుద్దిలో తోడ్పడతాము అని చెప్పింది. దీంతో, మన రాష్ట్రంలో లూలు గ్రూప్ రూ.2,200 కోట్ల పెట్టుబడి వెనక్కు వెళ్ళిపోయింది. మొన్న బొత్సా కూడా, లూలు వెనక్కు వెళ్ళలేదు, మేము పంపించి వేసాం అని గర్వంగా చెప్పుకున్నారు కూడా. అయితే, ఇప్పుడు లూలు, చెప్పిన ప్రకారమే, మిగతా రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టి, ప్రాజెక్ట్ లు కడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో, ఒక పెద్ద కన్వేషన్ సెంటర్ కట్టటానికి ఒప్పందం కుదుర్చుకున్న లూలు, ఇప్పుడు బెంగుళూరులో కూడా 300 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. 80 ఏళ్ళ వయసులో కూడా యడ్యూరప్ప, దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లి, అక్కడ లూలు గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మన రాష్ట్రం నుంచి దావోస్ కు ప్రాతినిధ్యం లేదు. మన నుంచి వెళ్ళిపోయిన ప్రాజెక్ట్, ఇప్పుడు మన పక్క రాష్ట్రాలు అయిన తెలంగాణా, కర్ణాటకలో భారీ పెట్టుబడులు పెట్టింది.

Advertisements

Latest Articles

Most Read