చీరాల నవాబ్ పేటకు చెందిన దంపతుల కరోనా పాజిటివ్ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారి కాంటాక్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. వారితో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో జిల్లాకు చెందినవారు సుమారు 280 మంది ఉన్నట్టు గుర్తించారు. ఒంగోలు రైల్వేస్టేషన్‌లో మరో 200 మంది, చీరాల రైల్వేస్టేషన్‌లో 80 మంది దిగినట్టు తెలుస్తోంది. వీరి గుర్తింపులో జాప్యం జరిగితే భారీ మూల్యం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్తల నేపథ్యంలో జిల్లాలో 5 వేల మందికి క్వారంటైన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రకాశం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. చీరాలలో ఇద్దరికి, ఒంగోలులో ఒక కేసు నిర్ధారణ కావడంతో మొత్తం జిల్లాలో మూడు కొవిడ్-19 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.

కేసులు నమోదైన ప్రాంతం నుంచి 300 మీటర్లు హై సెన్సిటివ్ జోన్​గా, మూడు కిలోమీట్లర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. చీరాల, వేటపాలెం మండల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. రాష్ట్రంలో కొవిడ్ - 19 కేసులపై వైద్యారోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ 16 శాంపిల్స్​ను పరీక్షించగా నెగిటివ్ వచ్చినట్లు వెల్లడించింది. ఈ రోజు విదేశాల నుంచి ఎవరూ రాలేదని పేర్కొంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 29,367 అని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 29,172 మందిని హోం క్వారంటైన్​లో ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 195 మంది ఆస్పత్రుల్లో ఉన్నారని తెలిపింది.

ఇప్పటి వరకు 433 శాంపిల్స్​ల్లో 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేసింది. రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​ నిర్ధారణ కాగా.. అతను హైదరాబాద్​లోని గాంధీ మెడికల్​ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటికే చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా నిర్ధారణ కేంద్రాలు ప్రారంభించిన ప్రభుత్వం... తాజాగా అనంతపురంలో మరో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. కరోనాకు సంబంధించి శనివారం 537 ఫోన్ కాల్స్ వచ్చాయని.. వాటిపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బులెటిన్​లో ప్రస్తావించింది.

రాష్ట్రంలో మరింత పటిష్టంగా లాక్​డౌన్ అమలు చేయాలని జగన్​ అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలను అధిక ధరలకు అమ్మితే వారిని జైలుకు పంపాలని అధికారులకు నిర్దేశించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించాలని,ఫిర్యాదు చేయాల్సిన కాల్ సెంటర్ నంబర్ కూడా పట్టికలో పొందుపరచాలని చెప్పారు. రేషన్​ దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా నిత్యావసరాలు కొనుగోలు సమయాన్ని కూడా మార్చారు. పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి 11 వరకు, మిగతా ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనుగోలుకు అనుమతినిచ్చారు. గ్రామ వాలంటీర్లు సర్వే పటిష్టంగా ఉండాలని... ప్రతి కుటుంబం వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సీఎం సూచించారు. అర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్న ఆయన, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, అదనపు సిబ్బందిని నియమించాలని తెలిపారు.

వ్యవసాయం, ఆక్వా రంగాల్లో సామాజిక దూరం పాటిస్తూ.. కార్యకలాపాలు కొనసాగించాలన్నారు. రైతులు, ఆక్వారైతులకు కనీస గిట్టుబాటు ధర అందేలా చూడాలని.. జగన్​ అధికారులను ఆదేశించారు. వలస కూలీలు, కార్మికులకు షెల్టర్లలో మెనూ ప్రకారం మంచి భోజనం పెట్టాలన్నారు. అత్యవసర సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. జ్వరం, పొడిదగ్గుతో ఎవరైనా బాధపడుతుంటే 104, 1902 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలపాలని సీఎం అదనపు ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్‌ తెలిపారు. దీనిపై గ్రామాలు, పట్టణాల్లోని వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. వ్యాయామం చేయడం సహా పౌష్టికాహారం తీసుకోవాలని హితవు పలికారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో నిత్యావసరాల వస్తువుల కొనుగోలు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. ఉదయం ఆరు గంటల నుంచి 11 లోపు మాత్రమే ఉపశమనం కల్పించింది. ఆ తర్వాత ఎవరూ బయట తిరగొద్దని మంత్రి ఆళ్ల నాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిత్యవసరాలు, కూరగాయలను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి... ధరలు తెలిపే బోర్డులను దుకాణాల వద్ద ఏర్పాటు చేయాలని యజమానులకు సూచించారు. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు వచ్చినా 1902 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని... అందుకే మళ్లీ రీ సర్వే చేసి అనుమానం ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా మమమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఇటీవల రాష్ట్రంలో రోజుకు రెండు కేసుల చొప్పున నమోదవుతుండగా... తాజాగా శనివారం ఒక్కరోజే ఆరు కొత్త పాజిటీవ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19కు ఎగబాకింది. తాజాగా నమోదైన ఈ ఆరు కేసుల్లో రెండు గుంటూరు జిల్లాకు చెందినవి కాగా.. మరో రెండు ప్రకాశం జిల్లాలో నమోద య్యా యి. వీటితోపాటు ఒక కేసు కృష్ణాజిల్లాలో, మరో కేసు కర్నూలు జిల్లాలోనిర్ధారణ అయ్యాయి. గుంటూరుకు చెందిన రెండు కేసులు కూడా ఇటీవలే కరోనా వ్యాధికి గురైన వ్యక్తితో కాంటాక్టు అయినవారు(కుటుంబసభ్యులు). ప్రకాశం జిల్లాలో తాజాగా నమోదైన రెండు కేసుల్లో మొదటి వ్యక్తి (60 సం.లు) ఈ నెల 18వ తేదీన ఒంగోలు నుంచి రైలులో ఢిల్లీ వెళ్లాడు. అక్కడి నుంచి ఈ నెల 18న జనశతాబ్ది ఎక్స్ ప్రెస్లో విజయవాడ మీదుగా ఒంగోలుకు తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ నెల 28వ తేదీన కరోనా లక్షణాలు కనపడటంతో హాస్పటల్ లో చేరగా..పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. అలాగే ఇతనితో కాంటాక్టు అయిన మహిళ కూడా కరోనాకు గురైంది. దీంతో మక్కా నుంచి కృష్ణాజిల్లాకు తిరిగొచ్చిన వ్యక్తికి కరోనా సోకింది. రాజస్థాన్ నుంచి కర్నూలు నుంచి వ్యక్తి కూడా కరోనాగా నిర్ధారణ అయింది.

రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు పెరుగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, రాష్ట్రంలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేలా చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) నుంచి అనుమతులు తీసుకుంది. ఈ సందర్భంలో ఐసీఎంఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు వైరస్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ట్ లేబొరేటరీ (వీఆర్డీఎల్) ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. అంతేకాకుండా ఈ వీఆర్టీఎల్ ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు, టెస్టింగ్ చేసే సిబ్బందికి శిక్షణను కూడా ఇప్పించింది. దీంతో పూణెలోనే సెంట్రల్ వైరాలజీ కేంద్రానికి శాంపిల్స్ పంపించి, వారిచ్చే నివేదిక కోసం ఎదురుచూసే ఇబ్బందులు తప్పాయి. దీంతో రాష్ట్రంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడ, రంగరాయ మెడికల్ కళాశాల కాకినాడ, శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్) తిరుపతి, అనంతపురం మెడికల్ కళాశాలల్లో ఈ వైరస్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ నాలుగు లేబొరేటరీలలో రోజుకు 240 నమూనాలను పరీక్షలు చేయవచ్చు.

అంటే ఒక్కోలేబొరేటరీలో షిప్పుకు 30 నమూనాల చొప్పున రెండు షిఫుల్లో 60 నమూనాలను పట్టించి, చెయ్యవచ్చు. అయితే అందుకు అనుగుణంగా టెస్ట్ లు మాత్రం, జరగటం లేదని, ప్రభుత్వం విడుదల చేస్తున్న బులిటెన్ చూస్తే అర్ధం అవుతుంది. కాగా రాష్ట్రంలో మరో రెండు కరోనా టెస్టింగ్, నిర్ధారణ ల్యాబ్స్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల అనుమానితల కోసం విశాఖలో, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల అనుమానితుల కోసం గుంటూరులో ఈ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 496 నమూనాలను అనుమానితుల నుంచి సేకరించారు. వీటిలో 19 పాజిటీవ్ కేసులు రాగా.. 412 నెగిటీవ్ రిపోర్టు వచ్చాయి. మరో 65 నమూనాలకు సంబంధించి నివేదికలు రావల్సి ఉంది.

వైరస్ పై పోరులో కఠిన నిర్ణయాలతో కష్టపడ్డ దేశప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్షమాపణలు తెలిపారు. ముఖ్యంగా పేదలు తనను మన్నించాలని కోరారు. అయితే.. కరోనా వైరస్తో పోరును చావు-బతుకుల పోరాటంగా అభివర్ణించిన మోదీ.. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు. 'మనసులో మాట' కార్యక్రమం ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ. వైరస్ను తొలినాళ్లల్లోనే అరికట్టాల్సిన ఆవ్యశ్యకత ఉందన్నారు. ఇందుకు భారతీయులు ఎంతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 'భయపడాల్సిన అవసరం లేదు..' కరోనా నుంచి కోలుకున్న ఓ హైదరాబాద్ వాసితో మోదీ సంభాషించారు. తనకు వైరస్ సోకినట్టు తెలిసిన తర్వాత.. కొంత భయపడ్డానని, కానీ వైద్యులు తనలో ధైర్యాన్ని నింపారని తెలిపారు ఆ వ్యక్తి. భయపడాల్సిన అవసరం లేదని.. కోలుకునే అవకాశాలే ఎక్కువని హైదరాబాద్వాసి ధీమాగా చెప్పారు.

తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ఆ హైదరాబాద్వాసిని మోదీ కోరారు. ఇది వైరల్ అయితే.. ప్రజల్లో అవగాహనతో పాటు ధైర్యం కూడా పెరుగుతుందన్నారు. వైద్యుల సూచనలు పాటించిన హైదరాబాద్​ వాసి.. కరోనాను జయించారని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వైరస్​ నుంచి కోలుకున్న ఆగ్రావాసితోనూ మోదీ మాట్లాడారు. ఆయన కుటుంబం మొత్తానికి వైరస్​ సోకింది. ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎలా ఎదురొన్నారని ఆ వ్యక్తిని మోదీ ప్రశ్నించారు. వైద్యులు తమను బాగా చూసుకున్నారని.. తమలో భరోసా నింపారని. అందరం ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నామని ఆ ఆగ్రావాసి వివరించారు. ఇలా వైరస్​ను జయించిన వారి కథలు.. దేశప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారాలని మోదీ ఆకాంక్షించారు.

కరోనాపై పోరాటంలో వైద్యులకు కేంద్రప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని స్పష్టంచేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్​కీ బాత్​లో భాగంగా పలువురు వైద్యులతో ఫోన్​లో సంభాషించారు. కరోనాతో యావత్ దేశం యుద్ధం చేస్తున్న సమయంలో వైద్యులందరూ సైనికుల్లాగా పోరాడుతున్నారని కొనియాడారు. రోగులకు వైద్యంతో పాటు మనోధైర్యాన్ని నింపేలా.. కౌన్సెలింగ్​ కూడా ఇవ్వాలని డాక్టర్లకు సూచించారు ప్రధాని. దిల్లీకి చెందిన డాక్టర్ నితీశ్​ గుప్తాతో ఫోన్​లో మాట్లాడారు మోదీ. ఈ సందర్భంగా.. ఇతర దేశాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్యను చూసి చాలా మంది భయపడుతున్నారని, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని ప్రధానికి వివరించారు డాక్టర్ గుప్తా.

Advertisements

Latest Articles

Most Read