చంద్రబాబు మూడు రోజుల పాటు, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ నేపధ్యంలో, ఆయన ముందుగా దుగ్గిరాలలో ఉన్న చింతమనేని ఇంటికి వెళ్లి, ఆయనను, ఆయన కుటుంబ సభ్యులని పరామర్శించారు. అయితే చంద్రబాబు పర్యటన పై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. ఉదయమే, 20 మంది దాకా తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేసారు. అలాగే చంద్రబాబు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, రోడ్డు మార్గాన దుగ్గిరాల వస్తూ ఉండగా, ఆయనకు కలపర్రు టోల్‌గేట్ వద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి స్వాగతం పలికారు. ఈ సమయంలో, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవటం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కారు దిగి వచ్చి, పోలీసుల పై అసహనం వ్యక్తం చేసారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ పోలీసులని ప్రశ్నించారు. అయితే, పోలీసులు వెనక్కు తగ్గటంతో, చంద్రబాబు కార్యకర్తలతో కలిసి, ర్యాలీగా చింతమనేని ఇంటికి వెళ్లారు. తరువాత, అక్కడే మీడియాతో మాట్లాడుతూ, పోలీసుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

chintamaneni 1811200019 2

"పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతమైన జిల్లా. ఎప్పుడూ ఇలాంటి చర్యలు చూడలేదు. చింతమనేని ప్రభాకర్ ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టరు. అతని పై ఒత్తిడి తెచ్చారు. అనేక తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. 66 రోజులు జైల్లో పెట్టారు. నేను 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, 14 ఏళ్ళు సియంగా చేశా, అనేక సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నా, ఎన్నో ఆందోళనలు చేసా, కానీ ఎప్పుడు పోలీసులు ఇలా ప్రవర్తించలేదు. నేను వస్తున్నా కూడా, ఆంక్షలు విధించారు. మా పోరాటం, పోలీసులు పైన కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనుల పైన. అలాంటిది నేను వస్తున్నా అని తెలిసి, వచ్చిన కార్యకర్తలను కూడా అరెస్ట్ లు చేసి, వారిని ఇబ్బంది పెడుతున్నారు. వచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలో కూడా ఇలాగే చేసారు. కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. నాకు స్వాగతం పలకటానికి వస్తే తప్పా. నేను ఎన్నో సార్లు , ఈ 40 ఏళ్ళలో ఎన్నో పర్యటనలు చేసాను కాని, ఎప్పుడూ ఇలా లేదు. ఈ పోలీసులకు ఏమైందో ఏంటో అర్ధం కావటం లేదు. ఇదేమి పద్దతి అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

chintamaneni 1811200019 3

అలాగే చింతమనేనికి, ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. అన్నీ తప్పుడు కేసులు పెట్టారని, అనవసరంగా 13 ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని, తరువాత ఈ అధికారులే ఇబ్బంది పడతారాని, పోలీసులని చంద్రబాబు హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తే, ఎక్కడో ఒకచోట అధికారులు దొరికిపోతారని, మీకే తరువాత ఇబ్బందులు అని చంద్రబాబు హెచ్చరించారు. చింతమనేనికి ఇంత ప్రజా బలం ఉంటే, ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసారని, ఆయనకు స్వాగతం పలకటానికి వస్తే, అలా కుదరదు ఒక్కరే రావాలి, దొంగ చాటుగా రావాలని, సెక్షన్ 30 పెట్టారని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సుదీర్ఘ పోరాటాన్ని చేస్తున్న, చింతమనేని ధైర్యాన్ని మెచ్చుకుంటూ, ఇలాంటి వారితో పోరాడుతున్న చింతమనేని అభినందిస్తున్నానాని చంద్రబాబు అన్నారు.

విదేశీ పెట్టుబడి దారులకు, మరింతగా అండగా ఉండటం కోసం, వారికి రక్షణగా ఉండటం కోసం, కేంద్రం కొత్త చట్టం తేనుంది. దీనికి సంబంధించి లైవ్ మింట్ పత్రిక ఒక కధనాన్ని ఈ రోజు ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గ్రీన్ ఎనర్జీ పెట్టుబడిదారులకు పెట్టిన ఇబ్బందులు ద్రుష్టిలో పెట్టుకుని, కేంద్రం ఈ నిర్ణయం తీసుకునట్టు ఆ కధనం సారంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అధికారం చేతులు మారింది. గతంలో చంద్రబాబు హయంలో, సోలార్, విండ్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. కేంద్రం కూడా ఈ పాలసీని మెచ్చుకుంది. పెద్ద ఎత్తున పెట్టుబడి దారులు వచ్చి, మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారు. చాలా విదేశీ కంపెనీలు, ఈ పెట్టుబడులు పెట్టాయి. వాటిలో కొన్ని, Goldman Sachs, Brookfield, SoftBank, Canada Pension Plan Investment Board, Caisse de dépôt et placement du Québec, JERA Co. Inc., GIC Holdings Pte Ltd, Global Infrastructure Partners, CDC Group Plc, EverSource Capital, World Bank’s International Finance Corp.

livemint 18112019 3

అయితే ప్రభుత్వం మారగానే, చంద్రబాబు హయంలో చేసిన విద్యుత్ ఒప్పందాల పై సమీక్ష చేస్తామంటూ, జగన్ ప్రభుత్వం పూనుకుంది. ఈ విషయం పై, ఇన్వెస్టర్స్ నుంచి విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారిన ప్రతిసారి, ఇలా చేస్తారు అంటూ మండి పడ్డాయి. తమకు ఇలాంటి చర్యలు తీవ్ర నష్టం తెచ్చిపెడతాయని, జపాన్, ఫ్రాన్స్, కెనడా దేశాలు, తమ పెట్టుబడిదారులను కాపాడండి అంటూ, కేంద్రానికి కూడా లేఖలు రాసాయి. మరో పక్క ఈ కంపెనీలు కూడా కోర్ట్ కు వెళ్ళాయి. కోర్ట్ కూడా వీరిని అనుకూలంగా తీర్పు ఇచ్చి, ఆ ఉత్తర్వులు రద్దు చేసింది. తరువాత కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలతో, ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అన్ని ఒప్పందాలు సమీక్షంచం అని, అనుమానం ఉన్న వాటిని మాత్రమే, చూస్తామని చెప్పి, ఈ వివాదానికి తెర దించింది.

livemint 18112019 2

అయితే ఏపి ప్రభుత్వం చూపించిన దానికి, విదేశీ కంపెనీలు ఇబ్బంది పడ్డాయి. భవిషత్తులో ఇలా అయితే కష్టం అంటూ, కేంద్రానికి మోర పెట్టుకున్నాయి. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. భవిష్యత్తులో, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇలా ఇష్టం వచ్చినట్టు, సమీక్షలు చేసి, పెట్టుబడిదారులను, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఇబ్బంది పెట్టకుండా ఉండటానికి, ఒక చట్టం తీసుకువస్తున్నామని, చెప్పారు. పెట్టుబడిదారులకు, ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు రావని చెప్పారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, అక్టోబర్ లో జరిగిన ఒక సదస్సులో, మీకు అండగా ఉండటామని ప్రకటించగా, కొన్ని రోజుల క్రితం ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టే గ్లోబల్ ఇన్వెస్టర్స్ కు అండగా ఉంటామని చెప్పారు.

తెలుగుదేశం పార్టీ నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఈ రోజు తన అఫిషియల్ ఫేస్బుక్ పేజ్ లో పెట్టిన ఒక పోస్ట్, ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే జరిగితే, రాష్ట్ర రాజకీయాలను కుదిపే అంశం అవుతుంది. ఇది ఆయన పెట్టిన పోస్ట్. "బిగ్ బ్రేకింగ్ ఢిల్లీ..... జగన్ కు బెయిల్ రద్దు చేసే యోచనలో CBI...??? విజయ సాయి రెడ్డి లేవనెత్తిన విషయాన్ని సున్నితంగా తిరస్కరించిన కేంద్రం...!" అంటూ బొండా ఉమా పోస్ట్ చేసారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి, శుక్రవారం మినహయింపు పిటీషన్ పై, సిబిఐ ఇచ్చిన గట్టి కౌంటర్ చూసి, త్వరలోనే ఏదో జరగబోతుంది అంటూ, ప్రచారం జరుగుతుంది. సిబిఐ అంత స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వటం వెనుక, కేంద్ర హోం శాఖ ఉందని ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోర్ట్ కి రావాలని, అడిగినందుకే, ఇంత గట్టిగా సిబిఐ వాదించటం పై, చర్చ జరిగింది. ఆయన ఇప్పుడు సియంగా ఉన్నారని, సాక్షులని ప్రభావితం చేస్తారని సిబిఐ కోర్ట్ కు చెప్పటంతో, కోర్ట్ సిబిఐ వాదనతో ఏకీభవించింది.

bonda 17112019 2

అయితే, త్వరలొనే సిబిఐ బెయిల్ రద్దు పిటీషన్ కూడా వేస్తుందని, దీనికి సంబంధించి బలమైన ఆధారాలు కూడా సేకరించింది అంటూ, వార్తలు వస్తున్నాయి. అయితే, ఇవన్నీ రాజకీయ ఆరోపణలు అని, ఇప్పటికిప్పుడు జగన్ మోహన్ రెడ్డికి, ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ, వైసిపీ నేతలు అంటున్నారు. జగన్ ను ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, అంటున్నారు. ఈ ప్రచారం ఇలా కొనసాగుతూ ఉండగానే, ఈ రోజు బొండా ఉమా, ఢిల్లీ బిగ్ బ్రేకింగ్ అంటూ, జగన్ కు బెయిల్ రద్దు యోచనలో సిబిఐ ఉందని పోస్ట్ చేసారు. అయితే, ఇది రాజకీయంగా, ప్రచారం కోసం పెట్టిన పోస్టింగా, లేక నిజంగానే ఏదైనా జరుగుతుందా అనే చర్చ జరుగుతంది. సహజంగా బొండా ఉమా పేజ్ నుంచి ఇలాంటివి పోస్ట్ చెయ్యరు.

bonda 17112019 3

ఇవి ఎందుకు చేసారు ? బొండా ఉమాకు ఏమైనా సమాచారం ఉందా అనే విషయం పై చర్చ జరుగుతంది. మరో పక్క, నిన్న ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ లో, ఎక్కువ కాలంగా, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ ఉన్న వారికి, రద్దు చెయ్యాలని కేంద్ర హోం శాఖ ఆదేశించినట్టు వార్త ప్రసారం చేసారు. బొండా ఉమా, ఆ వార్త ఆధారంగా, ఇలా పోస్ట్ చేసారా అనే చర్చ కూడా జరుగుతుంది. మరో పక్క, ఈ రోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ చిదంబరానికి బెయిల్ ఇచ్చి, పార్లమెంట్ సమావేశాలకు హాజరు అయ్యేలా అవకాసం ఇవ్వాలని కోరిన సమయంలో, విజయసాయి రెడ్డి కల్పించుకుని, జగన్ కు ఆనాడు జరిగిన అన్యాయం అంటూ చెప్తుంటే, అమిత్ షా ఆ విషయం మీకు ఎందుకు, వాళ్ళు చెప్పారు, మేము నోట్ చేసుకున్నాం అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

66 రోజులు పాటు జైలులో ఉండి, గత శనివారం, 18 కేసుల్లో బెయిల్ తెచ్చుకుని, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విడుదల అయిన సంగాతి తెలిసిందే. అయితే చింతమనేని వచ్చిన రెండు రోజులకే మరో కేసు నమోదు అయ్యింది. అయితే ఇది ఎవరో ప్రైవేటు వ్యక్తులు పెట్టిన కేసు కాదు. నిబంధనలు ఉల్లంఘించారు అంటూ పోలీసులు పెట్టిన కేసు. చింతమనేని విడుదల తరువాత, పెద్ద ర్యాలీ తీస్తారని తెలిసి, దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, పోలీసులు జిల్లా అంతటా సెక్షన్ 30 అమలు చేసారు. ఈ నిబంధన ప్రకారం, ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు పెట్ట కూడదు. అయితే, చింతమనేని విడుదల అవుతున్నారని తెలుసుకుని, పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, టిడిపి కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికారు. దారి పొడవునా చింతమనేనికి ఘన స్వాగతం పలికారు. అయితే జిల్లాలో పోలీసు యాక్టు-30 అమలులో ఉండగా, చింతమనేని ర్యాలీ తీసారని, పోలీసులు అభియోగం మోపారు.

chintamaneni 18112019 2

చింతమనేని ర్యాలీ వస్తున్న సమయంలో, అక్కడ త్రీటౌన్‌ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎ్‌సఎస్‌ మూర్తి తన సిబ్బందితో శనివారపుపేటలో గస్తీ నిర్వహిస్తున్నారు. చింతమనేని ర్యాలీతో, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అలాగే, పోలీసు మోటారు వాహన చట్టాన్ని కూడా ఉల్లంఘించారని, లూరు త్రీటౌన్‌ పోలీసు స్టేషన్‌లో చింతమనేని పై కేసు నమోదు చేసారు. చింతమనేనితో పాటుగా, తెలుగుదేశం నేతలు, రవి, చలమోల అశోక్‌గౌడ్‌, దాసరి ఆంజనేయులు, వేంపాటి ప్రసాద్‌, సహా మరి కొందరి పై, కేసు నమోదు చేసారు. అయితే ఈ కేసు పై చింతమనేని అనుచరులు మాత్రం, వేరేగా స్పందిస్తున్నారు. పెద్ద ఎత్తున, ప్రజలు, కార్యకర్తలు వస్తే, వారికి అభివాదం తెలపటం కూడా తప్పా అని ప్రశ్నిస్తున్నారు.

chintamaneni 18112019 3

ఇక మరో పక్క, ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, చింతమనేని నివాసానికి రానున్నారు. నేటి నుంచి మూడు రోజల పాటు, పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి పై సమీక్ష చెయ్యనున్నారు. ఈ సమీక్ష తణుకులోని భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కల్యాణ మండపంలో జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా, చంద్రబాబు ఈ రోజు ఉదయం 12 గంటలకు, ఏలూరు సమీపంలోని దుగ్గిరాల గ్రామంలో, చింతమనేని ఇంటికి చంద్రబాబు రానున్నారు. అయితే చంద్రబాబు పర్యటన పై పోలీసులు ఆంక్షలు విధిస్తూ, కొంత మండి టిడిపి వారిని అదుపులోకి తీసుకున్నారని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 20 మందిని అరెస్ట్ చేసారని, వారిని వెంటనే విడుదల చెయ్యాలని టిడిపి అంటుంది.

Advertisements

Latest Articles

Most Read