ఏలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అన్ని కేసుల్లో బెయిల్ రావటంతో, ఆయన ఈ రోజు విడుదల కానున్నారు. ఈ నేపధ్యంలో, 66 రోజులు తరువాత వస్తున్న తమ నేతకు, భారీ స్వాగతం పలకటానికి, తెలుగుదేశం కార్యకర్తలు, చింతమనేని అభిమానులు సిద్ధం అయ్యారు. వైసీపీ పెట్టిన అక్రమ కేసులు తట్టుకుని, వైసిపీ పై పోరాటానికి సిద్ధం అవుతున్న, తమ నేతకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధం అయ్యాయి. అయితే, పోలీసులు మాత్రం, వీరి ఆశల పై నీళ్ళు చల్లారు. తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా అంతటా, శనివారం నుంచి నవంబర్ 30 వరకు, పోలీస్ ఆక్ట్ 30 అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ ఆక్ట్ అమల్లో ఉంటే, సభలు కాని, ర్యాలీలు కాని, బహిరంగ నినాదాలు కాని నిషిద్దం అని, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ తెలిపారు.

eluru 16112019 2

ఈ ఆక్ట్ అమలులో ఉండగా ఎవరైనా, అవి ఉల్లంఘిస్తే, వారి పై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, దీని పై తెలుగుదేశం శ్రేణులు భగ్గు మంటున్నాయి. మేము ఏమి ఆందోళనలు, అల్లర్లు చెయ్యటానికి రావటం లేదని, అన్యాయంగా ఇరికించి, రెండు నెలలు జైల్లో ఉంచిన మా నేత పోరాట పటిమకు, అండదండలు ఇవ్వటానికి వస్తున్నామని, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, చింతమనేనికి ఘన స్వాగతం పలుకుతామని అంటున్నాయి. గతంలో జగన్ మోహన్ రెడ్డి, అవినీతి చేసిన కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ పై వస్తేనే, అంత హడావిడి చేసారని, ఇక్కడ చిన్న చిన్న కేసులు పెట్టి, జైల్లో ఉంచిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. అయితే పోలీసులు మాత్రం, ఇవేమీ కుదరవని, ఆక్ట్ ప్రకారం నడవాల్సిందే అని అంటున్నారు. మరి, టిడిపి శ్రేణులు వెనక్కు తగ్గుతాయో లేదో చూడాలి.

eluru 16112019 3

మరో పక్క శనివారం చింతమనేని ప్రభాకర్‌ పై పలు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన నాలుగు కేసులలో ఏలూరు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు 18 కేసుల్లో చింతమనేనికి బెయిల్ మంజూరు అయ్యింది. 66 రోజుల తరువాత, ఆయన బయటకు రానున్నారు. ఆయన పై దాడి కేసు, ఎస్సీ, ఎస్టీ కేసులు లాంటివి పెట్టి, 66 రోజులు జిలో ఉంచారు. ఈ క్రమంలో శనివారం, నాలుగు కేసుల్లో, ఏలూరు న్యాయస్థానం జిల్లా న్యాయమూర్తి కె.సునీత బైలు ఇస్తూ, శుక్రవారం చింతమనేనికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు. రూ. 50 వేల పూచీకత్తు చొప్పున ఇద్దరు షురిటీ దారులు శనివారం సమర్పించాక ఆయన విడుదలకు కానున్నారు. శనివారం మూడు గంటల ప్రాంతంలో చింతమనేని విడుదల కానున్నారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఉపాధి హామీ పధకం సమర్ధవంతంగా ఉపయోగించుకుని, అన్ని పనులూ చేసుకుంటూ, రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు పని కల్పిస్తూ, సమర్ధవంతంగా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు. అప్పట్లో దేశంలోనే నెంబర్ వన్ గా, ఈ కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఘనత సాధించింది. అయితే ఎన్నికల ముందు దాదపుగా రెండు మూడు నెలలు చేసిన పనికి, కేంద్రం నుంచి నిధులు రాలేదు. ఈ నిధులు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, రెండు నెలలకు వచ్చాయి. దాదపుగా 1845 కోట్లు కేంద్రం, రాష్ట్రానికి విడుదల చేసింది. అయితే కేంద్ర వాటికి తోడుగా, మరో 461 కోట్లు రాష్ట్రం తరుపున విడుదల చేసి, పంచాయతీలకు విడుదల చెయ్యాల్సి ఉంది. అయితే, కేంద్రం ఇచ్చిన 1845 కోట్లు కాని, రాష్ట్ర వాటా కాని, ఇప్పటి వరకు, లబ్దిదారులకు చేరలేదు. అయితే ఆ 1845 కోట్లు ఎందుకు విడుదల చెయ్యటం లేదు అనేది, ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.

highcourt 15112019 2

ఆ మధ్య కాలంలో, ఈ విషయం పై గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసారు. చంద్రబాబు కూడా కేంద్ర మంత్రికి లేఖ రాసారు. కేంద్రం ఇచ్చిన 1845 కోట్లు, వేరే వాటికి మళ్ళించారని, చట్ట ప్రకారం, కేంద్రం విడుదల చేసిన మూడు రోజుల్లో ఆ నిధులు ఇవ్వాలని అన్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, ఈ నిధులు ఇవ్వలేదు. ఈ విషయం పై, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా, కృష్ణా జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై, హైకోర్ట్ లో వాదనలు జరిగాయి. కేంద్రం ఇచ్చిన ఆ 1845 కోట్లు, పంచాయతీలకు ఎందుకు బదిలీ చెయ్యలేదు, కారణం ఏమిట్ చెప్పండి, అంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ నిలదీసింది.

highcourt 15112019 3 style=

దీనికి బాధ్యులు ఎవరో చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ఇచ్చిన నిధుల్ని ప్రభుత్వం వేరే అవసరాలకు వినియోగించిందని, పిటీషన్ దారులు, కోర్ట్ కు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌, జూలై, ఆగస్టు నెలల్లో రూ.1845 కోట్లను, రాష్ట్రానికి విడుదల చేసిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం, మరో రూ.461 కోట్లు జత చేసి మూడు రోజుల్లోగా గ్రామ పంచాయతీలకు విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఇవ్వలేదని కోర్ట్ కు తెలిపారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్ట్, వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి చెప్పి, రెండు వారాలకు వాయిదా వేసింది.

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే, చింతమనేని ప్రభాకర్ ని, ఎన్నికలు అయిన తరువాత, ముప్పు తిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు చింతమనేని పై 18 కేసులు పెట్టారు. ఈ కేసులు అన్నీ, ఏవో మర్డర్ కేసులో, లేక వేల కోట్లు అవినీతి చేసిన కేసులో కాదు. కొట్టాడంటూ, తిట్టాడంటూ, దాడి కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టటం, ఆ కేసులో అరెస్ట్ చూపించటం, దాంట్లో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టటం, దాంట్లో అరెస్ట్ చూపించటం, ఇలా చింతమనేనికి చుక్కలు చూపించారు పోలీసులు. సహజంగా, ఇలా వేధించటం ఎప్పుడూ జరగదు. అన్ని కేసులు ఒకేసారి పెట్టి, కోర్ట్ లో చూపించే అవకాసం ఉంటుంది. కాని, చింతమనేని కావాలని టార్గెట్ చేసారని తెలుగుదేశం పార్టీ అంటుంది. జరిగిన పరిణామాలు కూడా, దానికి బలం చేకూరుస్తూ, ఇవి రాజకీయ కక్ష సాధింపు గానే కనిపిస్తుంది.

chintamananei 15112019 2

అయితే, ఇప్పటి వరకు చింతమనేని, పై 18 కేసులు పెట్టి, అరెస్ట్ చూపిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు చింతమనేని 66 రోజులు జైలులో ఉన్నారు. అయితే ఈ రోజు విచారణకు రావటం, ఏలూరు కోర్ట్ చింతమనేనికి బెయిల్ ఇచ్చింది. మొత్తం 18 కేసుల్లో బెయిల్ లభించింది. అయితే ఈ రోజు సమయం అయిపోవటం, కోర్ట్ ఆర్డర్స్ రాకపోవటంతో, చింతమనేని, ఈ రోజు విడుదల అయ్యే అవకాసం లేదని జైలు అధికారులు అంటున్నారు. రేపు చింతమనేని విడుదల అయ్యే అవకాసం ఉంది. రేపు మధ్యాహ్నం సమయానికి, చింతమనేని జైలు నుంచి విడుదల అయ్యే అవకాసం ఉన్నట్టు, తెలుస్తుంది. అయితే ఈ లోపు ఏమైనా మరో కేసు పెట్టి, చింతమనేని అరెస్ట్ చూపిస్తారా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి.

chintamananei 15112019 3

అన్నీ బాగుంటే, చింతమనేని 66 రోజుల తరువాత బయటకు వస్తారు. సెప్టెంబర్ 11న చింతమనేని అరెస్ట్ అయ్యారు. చింతమనేనిని రేపు విడుదల చేసే అవకాశం ఉండటంతో, జైలు వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చెయ్యనున్నారు. చింతమనేనికి భారీ స్వాగతం పలకటానికి, తెలుగుదేశం శ్రేణులు సిద్ధం అవుతున్నాయి. మరో పక్క, ఇప్పటికే చింతమనేనికి అండగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. చింతమనేని జైల్లో, అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలు పరామర్శించారు. అలాగే కుటుంబ సభ్యులను కూడా కలిసి ధైర్యం చెప్పారు. మాజీ మంత్రి నారా లోకేష్ కూడా చింతమనేని వెళ్లి కాలిసారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రేపు చింతమనేని విడుదల పై ఆయన అనుచరులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న ప్రెస్ మీట్ లో ఒకేసారి తెలుగుదేశం పార్టీ పై, చంద్రబాబు పై, లోకేష్ పై విమర్శలు చేసి హీట్ పెంచిన గన్నవరం ఎమ్మేల్యే వంశీ, ఈ రోజు మరి కొంత డోస్ పెంచి, టిడిపి పై విరుచుకుపడ్డారు. ఆడు, ఈడు అంటూ, చాలా పరుష పదజాలంతో మాట్లడారు. నిన్న రాత్రి కూడా ఒక టీవీ షోలో, వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పై విరుచుకు పడ్డారు. ఇరువురి నేతలూ ఒకరి పై ఒకరు బూతులతో తిట్టుకున్నారు. ఈ రోజు విజయవాడ సీపీకి, తన పై మార్ఫింగ్ చేస్తున్నారు అంటూ కంప్లైంట్ ఇచ్చిన వంశీ, తరువాత మీడియాతో మాట్లాడుతూ, తీవ్ర విమర్శలు చేసారు. అయితే వంశీ ఇలా విరుచుకు పడటం పై, ఒక వ్యూహం కనిపిస్తుంది. ఇలా పౌరుషంగా మాట్లాడి, పార్టీ నుంచి సస్పండ్ అయ్యేలా చేసుకుంటే, తన ఎమ్మెల్యే పదవి సేఫ్ అని, వంశీ పై అనర్హత వేటు వేసే అవకాశం ఉండదు అని, అందుకే జగన్ ఆదేశాల ప్రకారం, వంశీ ఈ వ్యూహం పన్నారా అనే అనుమానం కలుగుతుంది. అయితే వంశీ మాత్రం, తనను టిడిపి నేతలు తిడుతున్నారు కాబట్టే, నేను ఇలా తిడుతున్నా అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

vamsi 15112019 2

అయితే వంశీ ఇలా విరుచుకు పడటం, సాక్షాత్తు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకి కనీస విలువ కూడా ఇవ్వకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండటంతో, తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని, వెంటనే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తరువాత జరిగే పరిణామాలు అనవసరం అని, చంద్రబాబుని కూడా విలువ ఇవ్వకుండా, రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీ పై, కనీస కృతజ్ఞత లేకుండా విమర్శలు చేస్తుంటే, చూస్తూ ఊరుకో అవసరం లేదని, అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలని తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.

vamsi 15112019 3

అయితే, మరో పక్క, తెలుగుదేశం పార్టీ నిర్ణయంతో, చేజేతులా వంశీ పై అనర్హత వేటు వేసే అవకాసం పోయింది అనే వాదన కూడా వినిపిస్తుంది. ఒకసారి పార్టీ నుంచి సస్పండ్ చేస్తే, అనర్హత వేటు వెయ్యమని స్పీకర్ ని కోరే అవకాసం లేదనే వాదన వినిపిస్తుంది. సస్పెండ్ చెయ్యకుండా, తెలుగుదేశం పార్టీ, స్పీకర్ కు అనర్హత వేటు వెయ్యమని ఫిర్యాదు చేసి ఉంటే, వంశీ ఇరుకున పడేవారని అంటున్నారు. ఇప్పుడు వంశీ తటస్థ ఎమ్మేల్యగా కొనసాగటానికి వీలు ఉటుంది అని,వైసిపీకి మద్దతుగా కొనసాగుతారని, అంటున్నారు. తెలుగుదేశం పార్టీనే ఈ అవకాశం ఇచ్చినట్టు అయ్యింది అనే వాదన వినిపిస్తుంది. మరి ఈ విషయం ఎంత వరకు నిజం ? వంశీ అనర్హత వేటు నుంచి బయట పడినట్టేనా ? తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఎలా ఉంది ? చూద్దాం, ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Advertisements

Latest Articles

Most Read