తిరుపతి ఉప ఎన్నిక అనేది, మన దేశ ప్రజాస్వామ్యాన్ని చూసి నవ్వుకునేలా చేసింది. ఎన్నికల ప్రక్రియ అంటే అపహాస్యం అయ్యేలా చేసింది. నవ్వులుపాలు అయ్యేలా చేసింది. అయినా స్పందించాల్సిన రాజ్యాంగ వ్యవస్థలు మౌనంగా ఉండిపోయాయి. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా, చోద్యం చూస్తూ ఉండి పోయారు. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన రోజు, ఎన్ని వీడియో దొంగ ఓట్లకు సంబంధించి వచ్చాయో అందరూ చూసారు. ముఖ్యంగా ఒక మంత్రికి సంబంధించిన కళ్యాణమండపంలో వారిని దించటం వీడియోల రూపంలో బయటకు వచ్చింది. ఇలా అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో తెలియదు కానీ, దొంగ ఓట్లు అయితే విపరీతంగా పడ్డాయని చూసిన వారికి అర్ధం అవుతుంది. ఈ తతంగం పై ప్రతిపక్ష పార్టీలు, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసాయి. ఎన్నిక రద్దు చేయాలని కోరాయి. అయితే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. వారు ఇక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి, మైక్రో అబ్సర్వర్, సీఈసి ఇచ్చే నివేదికల పైన ఆధార పడి నిర్ణయం తీసుకుంటారు. ఈ పాటికే వారు రిపోర్ట్ ఇచ్చే ఉంటారు. అయితే ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవటంతో, ఇక ఈసీ ఎన్నిక రద్దు పై ఎలాంటి నిర్ణయం తీసుకోదు అనే వాతవరణమే ఉంది. అందుకే కాబోలు రాజకీయ పార్టీలు, ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాయి.

భారత దేశంలో క-రో-నా విలయతాండవం చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విపరీతంగా కేసులు వస్తున్నాయి. రోజుకి పది వేల కేసులు వరుకు వస్తున్నాయి. వైరస్ వేగంగా, ఎప్పటి కంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 20 శాతం పైగా ఉంది. ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాలో, 40 శాతం పైన పాజిటివిటీ రేటు ఉంది. అయితే ఇవన్నీ చూస్తున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక నియంత్రణలు ప్రజల మీద ఇంపోజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే, ముఖ్యంగా పిల్లలు క-రో-నా బారిన విపరీతంగా పడటంతో, పదవ తరగతి పరీక్షలు రద్దు చేయటం, వాయిదా వేయటం చేసారు. అయితే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, యదావిధిగా పరీక్షలు ఉంటాయని చెప్తుంది.  పదవ తరగతి, ఇంటర్ కలిపి, 15 లక్షల వరకు పిల్లలు ఉంటారు. వీరందరూ, పరీక్షలు రాయటనికి బయటకు వస్తే, ఈ సమయంలో ఎంత ముప్పో ప్రభుత్వానికి తెలియదా ? ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇంత పట్టుదలగా ఉన్నారో అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా మళ్ళీ సమీక్ష చేసి, పరీక్షలు రద్దు చేయక పొతే, ఇది అతి పెద్ద తప్పుగా మారక మానదు. ప్రభుత్వం అర్ధం చేసుకుంటుంది ఏమో చూద్దాం.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ దారులకు షాక్ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. పెన్షన్ లబ్దిదారుల విషయంలో, జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తెసుకుంటూ, ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో లబ్దిదారులు కాని వారు కూడా, పెన్షన్ తీసుకుంటున్నారని, అలాంటి వారిని ఏరి పారేయటానికి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. బోగస్ పెన్షన్ దారులు ఎక్కువగా ఉన్నారని, తమకు వస్తున్న ఫిర్యాదులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా కుల వృత్తుల పెన్షన్ లు, మెడికల్ కారణాలు చెప్పి పెన్షన్ తీసుకునే వారి విషయంలో, ఒంటరి మహిళల పెన్షన్ లో నిజమైన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనలు ఇస్తూ, ఉత్తర్వులు ఇచ్చింది. ఇక నుంచి పెన్షన్ పొందాలి అంటే, కుల వృత్తి వారి జీవనాధారం అయి ఉండాలని స్పష్టం చేసింది. దీనికి అవసరమైన పత్రాలు అన్నీ, ఎక్సైజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వాలంటీర్ల సహాయంతో, ఈ దరఖాస్తులు పరిశీలించి, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ 21 రోజుల్లో తీసుకోవాలని నిర్ణయం చేసింది. అయితే ఈ నిర్ణయంతో, నిజమైన లబ్దిదారులు కూడా నష్టపోయే అవకాసం ఉందని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

వివేక కేసు గత రెండేళ్ళుగా తేలటం లేదు. సొంత కుటుంబ సభ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఆ కుటుంబానికి న్యాయం జరగటం లేదు. ఆడ కూతురు ఢిల్లీ వీధుల్లో నాకు న్యాయం చేయండి అని, అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కేసు విషయంలో, గత వారం కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. ముఖ్యంగా అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు , సిబిఐకి రాసిన లేఖ కలకం రేపింది. ఆయన తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సిబిఐకి లేఖ రాసారు. ఎన్ని సార్లు అడిగినా సిబిఐ స్పందించటం లేదని అన్నారు. అయితే ఏబి వ్యాఖ్యల పై ఏపి పోలీసులు ఫైర్ అయ్యారు. డీఐజి పాలరాజు మాట్లాడుతూ, ఏబి పై ఫైర్ అయ్యారు. ఆధారాలు ఉంటే తమకు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. అలాగే అనేక విమర్శలు చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఆయన మాట్లాడుతూ, జగన్ కుటుంబ సభ్యులను , ఏబి ఇరికించే ప్రయత్నం చేసారని, వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసారు అంటూ, ఆయన చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఒక పక్క వివేక కుమార్తే, అనేక మంది కుటుంబ సభ్యుల పై కూడా ఆరోపణలు చేస్తుంటే, అంత పెద్ద ఆఫీసర్, దర్యాప్తు పై ప్రభావం చూపేలా, జగన్ కుటుంబాన్ని ఇరికించే ప్రయత్నం చేసారు అనటం, వారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టా ? ఇప్పటికే సిబిఐ విచారణ నత్తనడకన నడుస్తుందని ఆరోపణలు వస్తుంటే, పోలీసులు ఇలా ఎందుకు అంటున్నారో మరి.

Advertisements

Latest Articles

Most Read