ఒక్కొక్కరికీ ఒక్కో గుర్తింపు ఉంటుంది. అలాగే విజయసాయి రెడ్డికి కూడా, ఒక గుర్తింపు ఉంది. తన హోదాని మరిచి, ఆయన పెట్టి వెకిలి ట్వీట్లు చాలా చండాలంగా ఉంటాయి. ఒక్కోసారి, సభ్య సమాజంలో, ఇలాంటి వారు ఎందుకు ఉన్నారా అని అనుకునే వారు కూడా ఉన్నారు. మొన్న చంద్రబాబు పుట్టిన రోజు నాడు పెట్టిన ట్వీట్ కానీ, నిన్న పవన్ కళ్యాణ్ ని పావలా అంటూ, చిల్లరగా పెట్టిన ట్వీట్ కానీ, వెగుటు పుట్టిస్తుంది. ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి, ఆడవారిని కూడా టార్గెట్ చేసారు. టిడిపి ఎమ్మల్యే గంటా శ్రీనివాస్ భార్యని, చౌదరి మేడం అంటూ, జుబుక్సాకరంగా ట్వీట్ చేసారు. విశాఖలోని సింహాచలం దేవస్థానంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో, గంటా భార్యని, ‘గంటా సతీమణి చౌదరి మేడం' అంటూ హేళనగా ట్వీట్ చేసారు. సింహాచలం దేవస్థానంలో ఉద్యోగులను గంటా భార్య నియమించారు అంటూ, ట్వీట్ చేసారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమెను "చౌదరి మేడం" అంటూ సంబోధించటం ఏమి సంప్రదాయమో మరి. విజయసాయి రెడ్డి, ఇలా రోజు రోజుకీ ఎందుకు దిగజారి ట్వీట్లు పెడుతున్నారో అర్ధం కావటం లేదు. ఆయన ఇంకా మారడా అని సామాన్య ప్రజలు అడిగే పరిస్థితి వచ్చింది.

పోలవరంలో జరుగుతున్న తాజా సమస్యల పై, శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ, "పట్టుదలకు,నిబద్ధతకు,చిత్తశుద్దికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వేగం అద్దం పట్టింది ఆనాడు. కాంట్రాక్టర్లు కమిషనర్లపై శ్రద్ద ఈనాడు. అంచనాలు పెంచుకోవడం తప్ప ప్రాజెక్టులను పూర్తి చేసే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. దేశంలో అత్యంత పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి కాని పనులు చేస్తే రెండేళ్లల్లో కేవలం 0.89 శాతం, వ్యయం అంచనాలు మాత్రం అమాంతంగా రూ.3,222 కోట్లు పెంపు ఇది జాతీయ ప్రాజెక్టు పోలవరానికి పట్టిన గ్రహణం. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని మెఘాకు అప్పగించి మూడు నెలల్లోనే ఇసుక ధరల పేరుతో రూ.500 కోట్లు దోచిపెట్టారు. ఇప్పుడు మరో 1600 కోట్లు దోచిపెట్టేందుకు సిద్దపడ్డారు. మొత్తం మీద రూ.2,100 కోట్లు ప్రజాధనం దోపిడీకి కుట్ర పన్నారు. కాంట్రాక్టర్లు, కమీషన్లపై చూపుతున్న శ్రద్ధ రైతు ప్రయోజనాలపై చూపడం లేదు. జగన్ రెడ్డి అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి పోలవారన్ని తన ఆదాయానికి కల్పవృక్షంగా మార్చుకున్నారు గాని ప్రాజెక్టు పూర్తి మాత్రం గాలికివదిలేశారు. పోలవరాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవాలన్న ద్యాసలో కొంతైనా ప్రాజెక్టు పూర్తి మీద పెట్టి ఉంటే బాగుండేది."

polavaram 221042021 2

"ఇప్పుడు కూడా కేవలం దోచుకునేందుకే అంచనాలు పెంచుకున్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పోలవరం అప్పుడు పూర్తి అవుతుంది, ఇప్పుడు పూర్తి అవుతుందని ఆరంభ సూరత్వం పలికిన జగన్ రెడ్డి 2022 జూన్ నాటికి కూడా కష్టమే అవుతుందని మరో సారి మాట మార్చేందుకు సిద్ధంగా ఉండాలి. ఎటూ ఆయన మడమ తిప్పడం, మాట మార్చడం పూర్తిగా అలవాటై పోయింది. తెలుగుదేశం హయాంలో పోలవరం అంచనాలు దోచుకునేందుకు పెంచుకున్నారని ఊదరగొట్టిన జగన్ అండ్ కో భజన గనం నేడు ఏం చెబుతారు? రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులను నీరుగార్చారు. ఒక్క ప్రాజెక్టుకు రెండేళ్లల్లో తట్ట మట్టి ఎత్తలేదు, బొచ్చ కాంక్రీట్ వేయలేదు. జలవనరుల ప్రాజెక్టులు పూర్తి చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిన జగన్ రెడ్డి ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. " అని అన్నారు.

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల, ఈ మధ్య ఆక్టివ్ అయ్యారు. తెలంగాణాలో ఉద్యోగాల సమస్య పై, ఆమె దీక్ష కూడా చేసారు. అయితే దీక్ష సందర్భంగా, ఆమె జగన్ మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాని ఉద్దేశించి, మీరు మాకు ఎలాగూ కవరేజ్ ఇవ్వరు, పక్కకి తప్పుకోండి అంటూ, బహిరంగంగా స్టేజి పై, పక్కన విజయమ్మ ఉండగానే ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. షర్మిల బహిరంగంగా ఈ వ్యాఖ్యలు చేయటంతో, జగన్ మోహన్ రెడ్డికి, ఆమెకు మధ్య గ్యాప్ వచ్చింది నిజమే అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు షర్మిలకు, అమరావతి మహిళలు లేఖ రాసారు. తెలంగాణాలో దీక్ష చేసిన మీకు, ఆ సందర్భంగా గాయాలు కావటం, సాటి మహిళలుగా మాకు కూడా ఇబ్బంది అనిపించింది అంటూ, వాళ్ళు షర్మిలకు రాసిన లేఖలో తెలిపారు. మీరు తెలంగాణాలో చేస్తున్న పోరాటంలో ఎంత న్యాయం ఉందని మీరు అనుకుంటున్నారో, అలాగే మేము అమరావతి కోసం 491 రోజులుగా అదే విధంగా న్యాయం కోసం, ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు. మిమ్మల్ని తెలంగాణా పోలీసులు కేవలం, ఒక్క రోజు మాత్రమే అడ్డుకుని అవమానించి, గాయపరిచారని, మమ్మల్ని మాత్రం , ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి, ఏడాది కాలంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారని అన్నారు.

sharmila 21042021 2

అలాగే తెలంగాణాలో మీరు చేస్తున్న పోరాటానికి, అక్కడ మీ వదిన గారు భారతి గారి నిర్వహణలో ఉన్న సాక్షి ఏ విధంగా కవరేజ్ ఇవ్వటం లేదో, ఇక్కడ కూడా మాకు అమరావతి కోసం చేస్తున్న పోరాటానికి కూడా, ఇక్కడ సాక్షి మీడియా చూపించటం లేదని, మహిళలు అని కూడా చూడకుండా, మాకు కనీసం సాక్షిలో కవరేజ్ ఇవ్వక పోగా, వ్యతిరేకంగా కధనాలు రాస్తున్నారని షర్మిలకు తెలిపారు. ఈ విషయంలో, మీరు, మేము కూడా సాక్షి బాధితులమే అని తెలిపారు. అలాగే మీ పై తెలంగాణా ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై విజయమ్మ గారు ఆక్షేపించారు. అది వాస్తవం, తెలంగాణా ప్రభుత్వం తప్పు చేసింది, అలాగే ఇక్కడ మా పైన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దమనకాండను కూడా , విజయమ్మ గారి ఖండించాలని కోరారు. అప్పుడు తెలంగాణాలో మీరు చేస్తున్న పోరాటానికి విశ్వసనీయత వస్తుందని అన్నారు. మీరు తెలంగాణా కోడలిగా అక్కడ ఎలా పోరాటం చేస్తున్నారో, మేము కూడా ఇక్కడ ఆంధ్రా బిడ్డలుగా చేస్తున్నాం అని, మా బాధలు వినటానికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నామని, షర్మిలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు క-రో-నా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఏడాది జూన్, జూలై నెలల కాలంలో, రోజుకు పది వేల కేసులు వరుకు వచ్చేవి. ఇప్పుడు అదే స్థాయిలో ఈ రోజు కేసులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఒక్క రోజు కొత్తగా 9,716 కరోనా కేసులు వచ్చాయి. 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 60,208 ఉండగా, డిశ్చార్జయినవారు 9,18,985 మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా ఇప్పటి వరకు 9,86,703 పాజిటివ్ కేసులు ఉండగా, 7,510 మంది మృతి చెందారు. ఇక ఏపిలో ప్రభుత్వ పనితీరు పై, ప్రతిపక్షం టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగుదేశం నాయకులు కాకి గోవింద రెడ్డి మాట్లాడుతూ, "రాష్ట్రంలో క-రో-నా సెంకండ్ వేవ్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది. క-రో-నా-తో ఇప్పటి వరకు షుమారు 7000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సెక్రటరియేట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ప్రాణాలు కోల్పోయారు. క-రో-నా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాల్సిన భాధ్యత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఉంది. భారతదేశంలో ఓదార్పు పేరు చేబితే జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆనాడు పాదయాత్రలో అనేకమందిని ఓదార్చారు. మరి ఈ రోజు క-రో-నా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యలను ఓదార్చాల్సిన భాధ్యత మీపై లేదా? ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాకుండా ప్రభుత్వ ఉద్యోగులు క-రో-నా కట్టడి చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులవి ప్రాణాలు కావా? మీవే ప్రాణాలా అని మేం ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. క-రో-నా మహమ్మారి భారినపడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు."

"క-రో-నా మొదటి దశలో మద్యం షాపులు తెరిచి క-రో-నా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసింది. ప్రభుత్వం ఆదాయం చూసుకుంది కానీ ప్రజల ప్రాణాలను గాలికొదిలేసింది. ఈరోజు క-రో-నా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమని ప్రపంచ సంస్థలు, డాక్టర్లు చెబుతున్న క్రమంలో...ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటకు వచ్చి క-రో-నా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ప్రజలను ఓదార్చాలని డిమాండ్ చేస్తున్నాం. క-రో-నా వ్యాప్తికి కారణమౌతున్న మద్యం దుకాణాలను ప్రభుత్వం తక్షణమే మూసివేయాలి. జగన్ మోహన్ రెడ్డి, ఆయన మంత్రి వర్గం తక్షణమే బయటకు వచ్చి క-రో-నాపై ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల్ని మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయిన సంగతి అందరికీ తెలుసు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఈ రోజు ఫ్రంట్ లైన్ వర్కర్లకు జీతాలు ఇవ్వడం లేదు. అనేక మందిని ఉద్యోగాల నుండి తీసివేశారు. ఎవరిని ఎప్పుడు తీసేస్తారో, ఎప్పుడు తీసుకుంటారో తెలియని పరిస్థితి. టీకా ఎప్పుడు వస్తుందో తెలియదు. హాస్పిటల్ లో బెడ్ లు ఎక్కడున్నాయో తెలియదు. ఆక్సిజన్ ఎక్కడుందో తెలియని పరిస్థితులలో రాష్ట్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read