జగన్మోహన్ రెడ్డి దోపిడీకి సంబంధించి మరో కొత్త అధ్యాయం వెలుగులోకివచ్చిందని, ప్రజలను వివిధరకాల పన్నుల రూపంలో బాదుతూ, తనఖజానా నింపుకోవడం అనే ప్రక్రి యను ఆయన యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడని, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! జగన్మోహన్ రెడ్డి అవినీతి కంపెనీల్లో ఒకటైన భారతిసిమెంట్స్ ఆయన తండ్రి పదవిలోఉన్నప్పుడు పుట్టుకొచ్చింది. క్విడ్ ప్రోకోలో భాగంగా జగన్ అవినీతి చరిత్రలోంచి పుట్టుకొచ్చిన మురికి కంపెనీ భారతి సిమెంట్స్ సంస్థ. ఆ కంపెనీనీ అడ్డంపెట్టుకొని వేలాదికోట్లను జగన్ దోచుకుంటున్నాడు. భారతి సిమెంట్స్ కు దోచిపెట్టడం కోసం, సొంతకంపెనీకి మేలుచేయడం కోసం సిండికేట్లు ఏర్పాటుచేసి, సిమెంట్ ధరలు పెంచేసిన జగన్మోహన్ రెడ్డి, వందల, వేలకోట్లను ఆ కంపెనీకి దోచిపెడుతున్నాడు. ఒక పక్కన రాష్ట్రంలోఇసుకదోపిడీ, మరోపక్కన కనీసం రూ.350లు పెట్టినా నాణ్యమైన సిమెంట్ దొరికే పరిస్థితి లేదు. భవననిర్మాణ కార్మికులు రోడ్డునపడినా, కరోనా దెబ్బకు వారంతా ఉపాధికోల్పోయినా, నిర్మాణరంగం రాష్ట్రంలో కుదేలైనా అవేమీ పట్టించుకోకుండా, తనస్వార్ధంకోసం జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ధరలు పెంచాడు. పేదవాడిపై కనీసకనికరం కూడా లేకుండా, వారుఇల్లుకట్టుకునే అవకాశం లేకుండాచేసి, వారి సొంతింటికలను చిధ్రంచేశాడు. కరోనాకుముందు కృత్రిమ ఇసుక కొరత సృష్టించిన ముఖ్యమంత్రి, తన జేట్యాక్స్ కోసం సిమెంట్ కంపెనీలు ధరలుపెంచేలా చేశాడు. భారతి సిమెంట్స్ కుదోచిపెట్టడం కోసమే జగన్ సిమెంట్ వ్యవస్థను సిండికేట్ చేసి, ధరలు పెంచేలా చేశాడు. క్విడ్ ప్రోకో లో దోచుకున్న సొమ్ముతో పెట్టిన భారతి సిమెంట్స్ సంస్థ కుచెందిన 51శాతం వాటాను 2010లో వైక్యాట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి అమ్మేశారు. 49శాతం వాటానుమాత్రం జగన్ తనకిందే ఉంచుకు న్నాడు. భారతి సిమెంట్స్ లో 51శాతం వాటాఉన్న వైక్యాట్ కంపెనీ వారు విడుదలచేసిన ఫైనాన్షియల్ రిపోర్ట్-2020లో చూస్తే, పేజ్ నెం-5లోచివరి పేరాగ్రాఫ్ లో, ‘ధరలపెరుగుదల వల్ల రికార్డుస్థాయిలో లాభాలు వచ్చాయి’ అని రాశారు.

bharati 17012021 1

రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించడంకోసం పేదవాడి నడ్డి విరవడం అనేది జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. వైక్యాట్ కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్టులో రాసిన మాటలను జగన్ కాదనగలడా? ధరలుపెంచి పేదవాడిని నాశనంచేసి, సిగ్గులేకుండా లాభాలు వచ్చాయని చెప్పుకుంటారా? లాభాలంటే మామూలు లాభాలుకాదు, ఈరోజు భారతి సిమెంట్స్ ఉత్పాధన సామర్థ్యం సంవత్సరానికి 5మిలియన్ టన్నులు. అంటే దాదాపు పదికోట్ల సిమెంట్ బస్తాలు. బస్తాకి కనీసంగా రూ.100వరకు ధరపెంచితే, జగన్ రెడ్డికి రూ.వెయ్యికోట్ల వరకు లాభం వస్తుంది. ఉత్పత్తి అయ్యే సగంబస్తాలపై ధరపెంచినా రూ.500కోట్లవరకు లాభం వస్తుంది. ఇంతభారీమొత్తంలో దోపిడీకి సిద్ధపడే, నేడు జగన్ రెడ్డి సిమెంట్ ధరలపెంపునకు శ్రీకారం చుట్టా డు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో 2016 లో సిమెంట్ ధరలు పెరుగుతుంటే, ఆయన సిమెంట్ కంపెనీలను హెచ్చరించారు. యనమల రామకృష్ణుడు నేత్రత్వంలో కేబినెట్ సబ్ కమిటీ నియమించి, సిమెంట్ ధరలు పెంచకుండా తయారీ కంపెనీ లను కట్టడిచేయడం జరిగింది. సిమెంట్ ధరలు తగ్గించి, రాష్ట్రంలో నిర్మాణ రంగం ఊపందుకునేలాచేసి, భవననిర్మాణ రంగ కార్మికుల ను, పేదలను ఆదుకున్నారు. చంద్రబాబునాయుడు చేసిన విధంగా జగన్ ఎందుకు చేయలేక పోతున్నాడు. జే-ట్యాక్స్ రూపంలో కంపెనీల నుంచి మామూళ్లు వసూలుచేస్తున్న వ్యక్తికి సిమెంట్ ధరలు తగ్గించే ధైర్యం, సత్తా ఎక్కడినుంచి వస్తాయి? భారతి సిమెంట్స్ కు లాభాలు రావడం కోసం సిమెంట్ ధరలు తగ్గించేప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చేయడం లేదు. ఆయన మాత్రం లాభాలు గడిస్తూ, తన బినామీల కంపెనీలు బాగుపడాలి. మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్లకు చెందిన కంపెనీలకు మాత్రం తక్కువధరకు సిమెంట్ అందా లి. బహిరంగ మార్కెట్లో మాత్రం సిమెంట్ బ్యాగ్ ధర రూ.350 నుంచి రూ.400వరకు అమ్మాలి. సామాన్యడు ఎన్నికష్టాలు పడినా, పేదలు ఇళ్లుకట్టుకున్నా కట్టుకోకపోయినా అవేవీ జగన్ కు పట్టవు. ఈ వ్యవహరంలో ముఖ్యమంత్రికి సహకరించడానికి ఆయన క్విడ్ ప్రోకో వ్యవహారానికి చెందిన వ్యక్తే పార్టనర్ గా ఉన్నా డు. అతనే ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్. ఈడీ నమోదుచేసిన అనేక కేసుల్లో శ్రీనివాసన్ ముద్దాయి కూడా.

ఇండియా సిమెంట్స్ కిందే రాశి, కోరమండల్ అనే సంస్థలు కూడా ఉన్నాయి. గతంలో కూడా శ్రీనివాసన్ సిమెంట్ ధరలు పెంచేసి, దోచుకోవాలని చూస్తే, బిల్డర్స్ అందరూ కలిసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియావారికి ఫిర్యాదుచేయడం జరిగింది. ఆరోజున శ్రీనివాసన్ కు రూ.187కోట్లవరకు జరిమానా విధించడం జరిగింది. గతంలో రూ.187కోట్లజరిమానా కట్టిన పెద్దమనుషులతోకలిసి, జగన్ సిమెంట్ కంపెనీలన్నింటినీ ఏకంచేసి, సిమెంట్ ధరలు పెంచే శాడు. తన అవినీతి సొమ్ముకోసం, కళ్లుమూసుకొని, సామాన్యుడి ని ఇబ్బందిపెడుతున్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో సం బరాలుచేసుకుంటున్నాడు. జగన్ కు దమ్ము, ధైర్యంఉంటే, పెరుగు తున్న సిమెంట్ ధరలపై, చంద్రబాబునాయుడి మాదిరే కేబినెట్ సబ్ కమిటీ వేయాలి. సిమెంట్ కంపెనీల యజమానులను తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించి వారిని హెచ్చరించాలి. రేపటినుంచి ఆంధ్రప్రదేశ్ లో సిమెంట్ ధరలు తగ్గాలని వారిని హెచ్చరించే దమ్ము జగన్ కు ఉందా? తన భారతి సిమెంట్స్ ధరలు తగ్గించే ధైర్యం ఆయనకు ఉందా? ముఖ్యమంత్రి ముందు ఆపనిచేస్తే, తరువాత ఆయన సంగతేంటో చూస్తాం. సిమెంట్ ధరలు ఎలా తగ్గించారో, కంపెనీలను ఎలా దారికి తేవాలో చంద్రబాబునాయుడు చేసి చూపించాడు. జగన్ కు అంత ధైర్యం లేదు కాబట్టే, తన అవినీతి మురికిలోనుంచి పుట్టిన భారతిసిమెంట్స్ కు లాభాలు చేకూర్చడం కోసం కొన్నికోట్లమందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ప్రజలు ఇప్పటికైనా జగన్ సాగిస్తున్న సిమెంట్ మాఫియా గురించి ఆలో చించాలి. వైక్యాట్ కంపెనీవారు రికార్డుస్థాయిలో లాభాలు వచ్చాయ ని చెబుతుంటే, వారి ప్రకటన కాదనే దమ్ము వైసీపీనేతలకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యమంత్రి పైకి కల్లబొల్లి మాటలు చెబుతూ, రూపాయి పేదలకు ఇస్తూ, పదిరూపాయలను వారి నుంచి దోచుకుంటున్నాడు. ఇవన్నీ ప్రజలు అర్థంచేసుకొని, ముఖ్యమంత్రిని తరిమితరిమికొట్టడం ఖాయమని స్పష్టంచేస్తున్నా. భారతిసిమెంట్స్ సహా అన్ని సిమెంట్ కంపెనీలతో ముఖ్యమంత్రి తక్షణమే చర్చలుజరిపి, సిమెంట్ ధరలు తగ్గేలాచేయాలని, నిర్మాణ రంగాన్నిఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం పై జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. ఆయన పదవీ కలాం మర్చి 31తో ముగియనుంది. ఈ లోపే కొత్త ఎన్నికల కమీషనర్ నియామకం పై కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, జగన్ మొహన్ రెడ్డి ప్రభుత్వానికి చిన్న పాటి యుద్ధమే జరుగుతుంది. దాదపుగా ఏడాది కాలంగా, ఇరు వర్గాల మధ్య సఖ్యత లేదు. రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ను రాష్ట్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతుంది. ప్రతి చిన్న దానికి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్ట్ కు వెళ్లి, ఆయన హక్కులు సాధించుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపధ్యంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు, స్థానిక సంస్థల ఎన్నికలు జరపకూడదు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. అందుకే ఆయన ఎన్నికలు అని చెప్పిన ప్రతి సారి, ప్రభుత్వం తప్పించుకుంటుంది. తాజాగా రేపు మరోసారి ఈ విషయం పై కోర్టు క్లారిటీ ఇవ్వనుంది. ఇక ఇది ఇలా ఉంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో రెండు నెలల్లో రిటైర్ అవ్వుతూ ఉండటంతో, ఆయన స్థానంలో కొత్త వారిని నియమించి, అప్పుడు ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం ప్లాన్ గా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత వరకు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ప్రభుత్వం చేయటం లేదు. ఇక కోర్టులు ఏమి చెప్తాయి అనే దాని పై ఈ రెండు నెలలు ఉంటాయి.

sec 17012021 2

అయితే నిమ్మగడ్డ తరువాత, ఎవరిని నియమించాలి అని అనుకున్నప్పుడు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లను పరిగణలోకి తీసుకోగా, మొన్నే చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయిన నీలం సాహనీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. జగన్ కూడా ఆమె వైపే మొగ్గు చూపినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె రిటైర్డ్ అయిన వెంటనే, ఆమకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తున్నారని, ఆమె ప్రమాణ స్వీకరం కూడా చేస్తారని చెప్పి కూడా, ఆ కార్యక్రమం వాయిదా పడిందని అంటున్నారు. నీలం సాహనీ ని, ఎన్నికల కమీషనర్ గా నియమిస్తారని, అందుకే ప్రభుత్వ సలహదారు పదవి ఆమె ఇంకా తీసుకోలేదని అంటున్నారు. నీలం సహానీ పని తీరు పై జగన్ మోహన్ రెడ్డికి నమ్మకం ఉందని, అందుకే ఆమెను రెండు సార్లు కేంద్రంతో మాట్లాడి పొడిగింపు కూడా ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇలా తమకు అనుకూలమైన వారిని అక్కడ పెట్టిన తరువాతే ఎన్నికలకు వెళ్ళే అవకాసం ఉంది. మరో పక్క జస్టిస్ కనకరాజ్ విషయంలో కూడా ఏదో ఒక న్యాయం చేయాలని జగన్ చూస్తున్నట్టు సమాచారం. మరి వస్తున్న వార్తలు నిజమో కాదో, తెలియాలి అంటే, మరో రెండు నెలలు ఆగాల్సిందే.

హైందవ దేవాలయాలపై జరిగిన ఘటనలకు సంబంధించి, కొందరిని అరెస్ట్ చేసినట్టుచెప్పిన, రాష్ట్ర డీజీపీ రెండురోజుల వ్యవధిలోనే హిందూ మతంపై జరుగుతున్న ఘటనలను ఉటంకిస్తూ, కొన్నిపార్టీల ప్రమేయం ఉందనడం ఏపీ ప్రజలతో పాటు, తాముకూడా ఆశ్చర్యపోయా మని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఒకపార్టీ ప్రతినిధిగా తాను పార్టీలప్రస్తావనచేస్తే, ఎవరూ పెద్దగా స్పందించరన్న రామయ్య, డీజీపీ స్థాయిలో ఉన్నవ్యక్తి, తనకు పదవి ఇచ్చినపార్టీ రుణంతీసుకోవడంకోసం ఈరకంగా దిగజారి వ్యాఖ్యలు చేయడాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. డీజీపీ ఎవరి దర్యాప్తునుఆధారం చేసుకొని మీడియావారితో మాట్లాడాడో చెప్పాలన్న రామయ్య, హైందవమతంపై ఘటనలకు సంబంధించి ప్రభుత్వం నియమించిన సీఐడీ, లేదా సిట్ లలో ఏ దర్యాప్తుసంస్థ సమాచారంతో మాట్లాడారాలేక సజ్జల రామకృష్ణా రెడ్డి ఇచ్చిన సమాచారంతో డీజీపీ మాట్లాడారా అని టీడీపీనేత నిగ్గదీశారు. సీఐడీ, సిట్ లనుంచి సమాచారం లేకుండా, ఎవరిని కాపాడటానికి డీజీపీ ఈ విధంగా తొందరపడి మాట్లాడారో చెప్పాలన్నారు. ఏపీ పోలీస్ మాన్యువల్ ప్రకారం, చట్టంప్రకారమే, విధులు నిర్వహిస్తున్నాడో లేక జగన్మోహన్ రెడ్డి సంతృప్తికోసం పనిచేస్తున్నాడో డీజీపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వెనక ఎవరున్నారో, అతనితో చేయిచేయి కలిపి తిరుగుతున్న రాజకీయ నేతలెవరో డీజీపీకి తెలుసునా అని రామయ్య ప్రశ్నించారు. ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన మాటలు నేరపూరితమా...లేక సోషల్ మీడియా ప్రచారం చేయడం నేరమో సవాంగ్ స్పష్టం చేయాలన్నారు.

praveen 16012021 2

రాష్ట్రంలో హిందూ దేవాలయాల పై ఘటనలు తానే చేసానని, విగ్రహాలను ధ్వంసం చేశానని, హిందూదేవతల విగ్రహలు మొత్తం ఫేక్ అని, అనేక మందిని క్రైస్తవమతంలోకి మార్చానని, తనకింద 3,642 మంది పాస్టర్లు పనిచేస్తున్నారని, 699 హిందూ గ్రామాలను, క్రైస్తవ గ్రామాలుగా మార్చేశానని చెప్పిన ప్రవీణ్ చక్రవర్తి మాటలను డీజీపీ ఎందుకు మీడియా ముఖంగా వెల్లడించలేదని రామయ్య నిగ్గదీశారు. ప్రవీణ్ చక్రవర్తి అనేవ్యక్తి మాటలు నిజమా కాదా...అతని లక్ష్యమేం టి? అతను క్రైస్తవ మత వ్యాప్తి కోసం అమెరికాలో ఎవరితో మాట్లాడాడు... అతన్ని, అతనిచర్యలను ప్రోత్సహిస్తున్న రాజకీయ నేతలెవరు అనేఅంశాలపై డీజీపీ ఎందుకు విచారణ జరపడం లేదన్నారు? తనకు తానుగా విగ్రహాలను ధ్వంసంచేశానని చెప్పిన ప్రవీణ్ చక్రవర్తి హైందవమతంపై జరుగుతున్న ఘటనలలో డీజీపీకి నేరస్తుడిలా కనిపించలేదా అని రామయ్య ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తనకు బాగా తెలుసుననిచెబుతూ, తానుసాగిస్తున్న దురాగతాలను తననోటితోనే చెప్పిన ప్రవీణ్ చక్రవర్తిని మీడియాముందు ప్రవేశపెట్టి, డీజీపీ ఎందుకు మాట్లాడ లేదన్నారు. అధికారపార్టీ వారితో ప్రవీణ్ కు పరిచయాలున్నా, వాటిని ఖాతరుచేయకుండా అతన్ని అరెస్ట్ చేశామని డీజీపీ ఎందుకు చెప్పలేదన్నారు? ప్రవీణ్ చక్రవర్తి 699 గ్రామాలను క్రైస్తవం లోకి మార్చానని చెబుతున్నా, హైందవ దేవుళ్ల విగ్రహాలను ధ్వం సం చేశానని చెబుతున్నా, అతని గురించి, ముఖ్యమంత్రి, డీజీపీ ఎందుకు ఆలోచించడంలేదని రామయ్య మండిపడ్డారు. సోషల్ మీడియాలో ప్రచారంచేసినవారి వివరాలు వెల్లడిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన డీజీపీ, ఒకనోటోరియస్ పాస్టర్ విషయంలో మాత్రం ఎందుకు ఉపేక్షించారన్నారు.

 

సొంత పార్టీ నేతల పై డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ రాష్ట్రంలో ఏ మంత్రి కూడా నాలాగా ఇబ్బందులు పడటం లేదని, ఆవేదన వ్యక్తం చేసారు. ఇన్ని ఒత్తిడులు తట్టుకోలేకపోతున్నానని, రాజకీయాలు నుంచి తప్పుకోమంటారా చెప్పండి అంటూ సొంత పార్టీ నేతల పైనే కె.నారాయణస్వామి ఫైర్ అయ్యారు. అయితే మంత్రి ఆవేదనకు సొంత పార్టీ నేతల వైఖరే కారణం అని తెలుస్తుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా అంటే రాజకీయంగా మాహామహులు ఉన్న జిల్లా. ముఖ్యంగా జగన్ బాంధవు, మంత్రి పెద్దిరెడ్డి హావా మాములుగా ఉండదు అక్కడ. ఆయన ఏమి చెప్తే అదే వేదం అనే విధంగా చిత్తూరు జిల్లా ఉంటుంది. అయితే ఇవి పక్కన పెడితే, మిగతా అధికార పార్టీ నాయకులు, కొంత ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అదే విషయాన్ని కె.నారాయణస్వామి కూడా చెప్పారు. చిత్తూరు జిల్లాల్లో ఉన్న గ్రూప్ రాజకీయాల వాళ్ళ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు. సొంత పార్టీ నేతల ముందే ఈ విషయం చెప్పటం గమనార్హం. ప్రతిపక్ష నేతల పై ఒత్తిడి తీసుకురావటంలో కె.నారాయణస్వామి ఫెయిల్ అయ్యారు అంటూ, కొంత మంది వైసిపీ నేతలు చేసిన వ్యాఖ్యలు, డిప్యూటీ సియం కె.నారాయణస్వామి ఆవేదనకు గురి అవ్వటానికి కారణం అయ్యాయి.

narayanaswamy 17012021 2

సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్తూరు జిల్లాలో కూడా జల్లికట్టు తరతరాలుగా నిర్వహిస్తూ వస్తున్నారు. పక్కనే ఉన్న తమిళనాడు ప్రభావం, చిత్తూరు జిల్లా పై గట్టిగానే ఉంటుంది. తరతరాలుగా చేస్తున్న ఈ జల్లికట్టుకు ఈ సారి అనుమతి లేదని ప్రభుత్వం చెప్పటంతో, స్థానిక వైసీపీ నేతలు, ఆ ఆగ్రహాన్ని డిప్యూటీ సియం మీద చూపించారు. అధికారంలో ఉండి కూడా పండుగ నిర్వహించుకోలేక పొతే కష్టం అని, వాపోయారు. అయితే ఈ సందర్భంలో కలుగ చేసుకున్న కె.నారాయణస్వామి, అందరిలా నేను ఉండలేనని అన్నారు. ఈ విషయం పై పోలీసులతో, ఎస్పీతో మాట్లాడానని, ఇప్పటికే ఇక్కడ చుట్టు పక్కలా, తమిళనాడులో జల్లికట్టు జరుగుతున్న విషయం చెప్పినా, అటు వైపు నుంచి స్పందన రాలేదని, ఇంకా ఏమి చేయాలనీ ఆవేదన వ్యక్తం చేసారు. అంతే కాదు, కొంత మంది ప్రతిపక్ష నాయకులను ఊరి నుండి తరిమేయాలని అంటున్నారని, ఇది ఎలా సాధ్యం అని, ఏమైనా చట్టాలు ఉన్నాయా అని ఆవేదన వ్యక్తం చేసారు. అయితే మంత్రి బహిరంగంగా ఇలా ఆవేదన వ్యక్తం చేయటం చూసిన వాళ్ళు, ఆయన ఎంత ఆవేదనకు లోనవుతున్నారో అర్ధం అవుతుందని వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read