దేవాలయాల పై జరుగుతున్న వరుస ఘటనల్లో, తెలుగుదేశం ప్రమేయం ఉంది అంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబు మండి పడ్డారు. సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి, జగన్ డైరెక్ట్ చేస్తే, డీజీపీ ఇక్కడకు వచ్చి యాక్షన్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ రోజు తిరుపతి నియజకవర్గ సమీక్షలో చంద్రబాబు పాల్గున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. దేవాలయాల పై జరుగుతున్న ఘటనల వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారని, వాటిని బయట పెట్టిన టిడిపి వారి పై కేసు పెట్టటం ఏమిటి అని చంద్రబాబు అన్నారు. కర్నూల్ ఘటనలో వైసీపీ నేత ప్రమేయం ఉందని తెలియదా అని చంద్రబాబు అన్నారు. మేము రామతీర్ధం వెళ్తే, నా మీద, మన నాయకుల మీద కేసులు పెట్టారని, మరి అంతకు ముందు వెళ్లి రెచ్చగొట్టి వచ్చిన విజయసాయి రెడ్డి పై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో పూజారులపై ఛర్నాకోలతో హింసించింది ఎవరని చంద్రబాబు అన్నారు. సిసి కెమెరాలు పెట్టేశాం, కమిటీలు వేసేశాం అని డీజీపీ తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. అన్యమత ప్రచారాలు జరుగుతుంటే, బలవంతపు మతమార్పిళ్లు చేస్తుంటే ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. చివరకు తిరుమలలో కూడా అన్యమత ప్రచారం చేసే దాకా వెళ్ళారని చంద్రబాబు అన్నారు. ఇవి ప్రశ్నిస్తుంటే తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు.

dgp 16012021 2

అబ్ధుల్ సలాం కోసం తామే పోరాడాం అని, దళితుల పై దాడులు జరుగుతుంటే తామే పోరాడామని, మేము ధర్మం కోసం మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చిన్నట్టు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేవాలయాల పై జరుగుతున్న ఘటనలకు రాజకీయాలతో సంబంధం లేదు, కుట్ర లేదు, ఇవన్నీ జంతువులు, పిచ్చి వాళ్ళు చేస్తున్నారని చెప్పిన డీజీపీ, కేవలం రెండు రోజుల్లో ఎందుకు మాట మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. భక్తుల మనోభోవాలతో ఆటలు ఆడుకుంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రులను ఏమి చేసారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి మతమార్పిళ్లను ప్రోత్సహిస్తూ, నాటకాలు ఆడుతున్నారని, ఇప్పుడు ఇంకో నాటకం మొదలు పెట్టారని అన్నారు. గోపూజ డ్రామా అంటూ మొదలు పెట్టారని, గతంలో గంగలో మునిగిన డ్రామా ప్రజలు ఇంకా మర్చిపోలేదని చంద్రబాబు అన్నారు. సొంత బాబాయ్ కేసు తేల్చలేక టిడిపి చేసింది అన్నారు. కోడి కత్తి టిడిపి చేసింది అన్నారు. ఇప్పుడు రామతీర్ధం కూడా టిడిపి అంటున్నారు. వీళ్ళకు పట్టుకోవటం చేతకాక, టిడిపి పైన నిందలు వేస్తున్నారని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పనులు, తీవ్ర వివాదాలకు దారి తీస్తున్నా ప్రభుత్వం మాత్రం, ఏ మాత్రం మారటం లేదు సరి కదా, వివాదాలు సృష్టించే పనులు ఇంకా ఇంకా చేస్తూనే ఉంది. విజయనగరం జిల్లాలో గజపతి రాజులు గురించి, చెప్పాల్సిన పని లేదు. ఆ కుటుంబం త్యాగాల ముందు, ఇందిరా గాంధీ లాంటి నేత కూడా గౌరవంగా తల వంచి నమస్కారం పెట్టారంటే, ఆ కుటుంబం ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి గజపతి రాజుల కుటుంబం పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, వాళ్ళను అవమాన పరుస్తూ, కించ పరుస్తూనే ఉన్నారు. ముందుగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మెన్ గా ఉన్న అశోక్ గజపతి రాజు గారిని, రాత్రికి రాత్రి చెప్పా పెట్టకుండా పీకేసి, ఎక్కడ నుంచో గజపతి వారసులు అంటూ, ఒక మహిళను తీసుకుని వచ్చారు. ఇదంతా విజయసాయి రెడ్డి డైరెక్షన్ లో జరుగుతుందని, అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. అప్పటి నుంచి ఆ మహిళను చైర్ పర్సన్ గా పెట్టి, అశోక్ గజపతి రాజుని సాధిస్తూనే ఉన్నారు. అయితే దీని వెనుక భోములు కొట్టేసి స్కెచ్ ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇది పక్కన పెడితే, మొన్న రామతీర్ధం ఘటన ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలుసు. ఏకంగా రాములోరి తలకే రక్షణ కరువైంది. అయితే చంద్రబాబు రామతీర్ధం రావటంతో, ప్రభుత్వంలో వణుకు మొదలైంది.

ashok 16012021 2

చంద్రబాబు ఎక్కడ మైలేజి కొట్టేస్తారో అని, విజయసాయి రెడ్డి ఆ రోజు వచ్చిన చేసిన హడావిడి అందరూ చూసారు. అయితే చంద్రబాబుతో పాటు, అశోక్ గజపతి రాజు కూడా అక్కడకు వచ్చారు. అయితే రామతీర్ధం ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు ఉన్నారు కాబట్టి, ఈ ఘటనకు ఆయనే బాధ్యలు అంటూ, ప్రభుత్వం ఆయన్ను ధర్మకర్తగా తొలగించింది. అయితే ఇప్పటి వరకు జరిగిన దేవాలయాల ఘటనల్లో ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటే సమాధానం లేదు. అయితే ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారికి మరో అవమానం జరిగింది. రామతీర్ధంలో కొత్త విగ్రహనికి, అశోక్ గజపతి రాజు, ఇచ్చిన విరాళాన్ని ప్రభుత్వం వెనక్కు తిప్పి పంపించింది. అయితే దీని పై అశోక్ గజపతి రాజు తీవ్ర ఆవేదనతో స్పందించారు. రాముడి కోసం భక్తితో ఇచ్చిన కానుకను తిరస్కరించారని, చూడబోతే వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది అంటూ అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేసారు. భక్తితో ఇచ్చిన విరాళం, దేవాలయంలో ఏదో ఒక పనికి ఉపయోగించు కోవాలి కానీ, ఇలా తిరస్కరించి పంపటం ఏమి పద్ధతో ప్రభుత్వానికే తెలియాలి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ అనే పార్టీ వోట్ షేర్, నోటా కంటే తక్కువ. ఇంకా చెప్పాలి అంటే, కాంగ్రెస్ కు ఎక్కువ వోట్ షేర్ ఉంది. అయినా బీజేపీ నేతలు చేసే హడావిడి మాత్రం అంతా ఇంతా కాదు. ఊపేస్తాం, కుమ్మేస్తాం అని హడావిడి చేస్తూ ఉంటారు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, సహజంగా వీళ్ళ మాటకు కొంత వైటేజి ఉంటుంది. తెలంగాణాలో గెలిచారు అంటే, అక్కడ బీజేపీకి క్యాడర్ ఉంది, నాయకులు ఉన్నారు. అన్నిటికీ మించి అక్కడ, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై, బీజేపీ పోరాడుతుంది. కేసీఆర్ కు చుక్కలు చూపిస్తున్నారు. కాబట్టి, ప్రజలు బీజేపీని ప్రత్యామ్న్యాయం అనుకుంటూ ఉండవచ్చు. మన ఏపిలో మాత్రం, బీజేపీ, వైసీపీకి ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది. వైసీపీకి ఇబ్బంది కలిగించే పనులు ఏమి చేయరు. వాళ్ళ టార్గెట్ మొత్తం టిడిపినే. అందుకే ఇక్కడ ప్రజలు బీజేపీని విశ్వసించారు. అన్నిటికీ ముంచి బీజేపీ చేసిన మోసం ప్రజలు అంత తేలికగా మర్చిపోరు. విభజన హామీలు గురించి బీజేపీ ప్రస్తావనే లేదు. అవేమీ మాట్లాడకుండా, కేవలం టిడిపిని టార్గెట్ చేయటం, మత పరమైన అజెండా తీసుకోవటంతో, బీజేపీ గత ఎన్నికల్లో ఎక్కడ ఉందో, ఇప్పుడు అక్కడే ఉంది. అయితే వీళ్ళు చేసే హడావిడి మాత్రం అంతా ఇంతా కాదు. బీజేపీ మైండ్ గేమ్ అంటూ, కొత్త రాజకీయ మొదలు పెట్టింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళను తమ వైపుకు తిప్పుకుంటాం అంటూ, హడావిడి చేస్తున్నారు.

somu 16012021 2

ఇందులో భాగంగా నిన్న తెలుగుదేశం పార్టీ ఏపి శాఖ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, అలాగే మరో సీనియర్ నేత పడాల అరుణను, సోము వీర్రాజు కలుస్తున్నారు అంటూ హడావిడి చేసారు. మైండ్ గేమ్ లో భాగంగా, బీజేపీ ఈ ప్లాన్ వేసిందని గ్రహించిన టిడిపి నేతలు వెంటనే రియాక్ట్ అయ్యారు. కళా వెంకట్రావ్ మాట్లాడుతూ, సోము వీర్రాజు వ్యాఖ్యలకు ఖండించారు. తానే కాదు, తన వారసులు కూడా ఎప్పటికీ టిడిపిలోనే ఉంటాం అని తేల్చి చెప్పారు. ఇక పడాల అరుణ కూడా అదే చెప్పుకొచ్చారు. దీంతో సోము వీర్రాజు నాలిక కరుచుకున్నారు. వెంటనే ప్రకటన విడుదల చేసి, నేను ఎవరినీ కలవటం లేదు, అని పత్రికా ప్రకటనలో వచ్చిన తప్పు అని కవర్ చేసేసారు. ఈ రోజు ముద్రగడను కలుస్తున్నానని చెప్పారు. అయితే, ఇంత పచ్చి తప్పులతో ఒక పార్టీ ప్రెస్ నోట్ ఎందుకు విడుదల చేస్తుంది ? ముద్రగడతో భేటీకి హైప్ రావటం కోసం, ఇలా చేసారా ? లేక మైండ్ గేమ్ లో భాగంగా ఇలా చేసారో కానీ, సోము వీర్రాజు ఆత్రంతో, బీజీపీ మరోసారి అభాసుపాలైంది. వెంటనే కళా వెంకట్రావ్, పడాల అరుణ ఖండించటంతో, ఎలా కవర్ చేసుకోవాలో తెలియక, ప్రెస్ నోట్ లో వచ్చిన తప్పు అని కవర్ చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ సంస్థలు టార్గెట్ అవుతున్న విషయం చూస్తున్నాం. ముఖ్యంగా కోర్టులు, ఎన్నికల కమిషన్, శాసనమండలి చైర్మెన్ లాంటి వాళ్ళు కూడా టార్గెట్ అయ్యారు. అయితే ఈ మూడిటిలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ని మాత్రం, ప్రభుత్వం విపరీతంగా టార్గెట్ చేసింది. ఆయన ప్రతి చిన్న దానికి కోర్టుకు వెళ్లి, సాధించుకోవాల్సిన పరిస్థితి. చివరకు ఖర్చులు కోసం డబ్బులు ఇవ్వటం లేదని, కోర్టులో పిటీషన్ వేసారు అంటే, ఎన్నికల కమీషనర్ ని ప్రభుత్వం ఎలా టార్గెట్ చేసిందో తెలుస్తుంది. ఇక ఆయన్ను కులం పేరుతో మంత్రులు, ముఖ్యమంత్రి దూషించటం కూడా చూసాం. ఇక మరో పరాకాష్ట ఏమిటి అంటే, ఆయన్ను ఏకంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చి మరీ తప్పించటం. ఇది నిజంగా షాకింగ్ నిర్ణయం అనే చెప్పాలి. ఒక ఎన్నికల కమీషనర్ ని తప్పించాలి అంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు. హైకోర్టు జడ్జిని ఎలా తప్పిస్తారో, అలా తప్పించాలి. మన దేశ చరిత్రలో ఎప్పుడూ అలా జరగలేదు. అయితే మన రాష్ట్రంలో ఏదైనా సాద్యం కాబట్టి ఇక్కడ జరిగింది. ఆర్డినెన్స్ తెచ్చి, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డను ప్రభుత్వం తొలగించింది. అయితే ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు, సుప్రీం కోర్టులో పోరాడి, మళ్ళీ పదవిలోకి వచ్చారు. తరువాత కూడా ఆయనకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం అందటం లేదు. ఇవన్నీ చూసో ఏమో కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది.

ramesh 16012021 2

కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చింది. రాష్ట్రాల్లో ఎన్నికల అధికారుల పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అని కేంద్రం ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకోవటం కుదరదు అని చెప్పింది. ఎన్నికలా అధికారులు పట్ల చర్యలు అంటూ, రాష్ట్రాలు, ఆయా అధికారులను ఇబ్బంది పెట్టటం, సౌకర్యాలు తగ్గించటం, బద్రత కుదించటం, లాంటి చర్యలు చేస్తే సహించం అని తేల్చి చెప్పింది. అన్ని రాష్ట్రాలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు సజావుగా జరపటానికి ఎన్నికల అధికారులు ఉన్నారని, ఇలా ఎన్నికల అధికారులను వేధించటం, ఒక భయానక వాతావరణాన్ని కల్పిస్తాయని, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, అధికారుల విధుల పై ఈ ప్రభుత్వం కనిపిస్తుందని పేర్కొంది. ఇలా వేధింపుల పరిస్థితి ఉంటే, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు పని చేయటానికి ముందుకు రారని తేల్చి చెప్పింది. అయితే ఉన్నట్టు ఉండి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు ఇవ్వటం వెనుక, ఏపిలో జరుగుతున్న సంఘటనలు కారణం అయి ఉండవచ్చనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read