స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అధికార పార్టీ వేస్తున్న పిల్లి మొగ్గలు, ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే భయమో, లేక ఎన్నికలు అంటే భయమో కానీ, మొన్నటి దాక ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతూ, మాట మార్చి, మడం తిప్పేస్తున్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ, మాట మార్చిన తెలుగుదేశం పార్టీ నేతల లిస్టు విడుదల చేసింది. గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు లిస్టుని విడుదల చేసారు. జగన్ మోహన్ రెడ్డి (నాడు) :క-రో-నా ప్రాణాంతకం కాదు. (15.03.2020) క-రో-నాకు పారాసిటమల్, బ్లీచింగ్ పౌడర్ చాలు. స్థానిక సంస్థల ద్వారానే క-రో-నా నియంత్రణ సాధ్యం (15.03.2020) ముఖ్యమంత్రి నేనా? నువ్వా? ఆదేశాలన్నీ ఆయనే ఇస్తే నేనెందుకు? క-రో-నా వైరస్ ఓ సాకు. చంద్రబాబు సామాజిక వర్గం కాబట్టే ఎన్నికలు వాయిదా వేశారు. వైకాపా ఘన విజయమని తెలిసే వాయిదా వేశారు. క-రో-నా ఎక్కడుందని (16.03.2020). జగన్ మోహన్ రెడ్డి (నేడు) : ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుమారుడు క-రో-నా కు భయపడి హైదరాబాద్ లో వాళ్ల ఇంట్లోనే దాక్కుంటే, ఆయన కోవర్టులు మాత్రం సామన్య ప్రజలు బతికితే ఎంత, చస్తే ఎంత అని ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇస్తున్నారు. (11.01.2021). విజయసాయిరెడ్డి (నాడు) : క-రో-నా వైరస్ కన్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్.ఈ.సి) రమేష్ కుమార్ అంత్యంత ప్రమాదకారి. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వచ్చిందని ఎన్నికలు వాయిదా వేయటం హేయమైన చర్య (15.03.2020). విజయసాయిరెడ్డి (నేడు) : స్థానిక ఎన్నికలు ప్రభుత్వం అనుకున్న విధంగానే న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాతనే నిర్వహిస్తాం. 19.12.2020. బొత్స సత్యనారాయణ(నాడు) : ఎన్నికలు ఆపడం నిబంధనలకు విరుద్ధం. జగన్ మహానాయకుడు. విచక్షణారహితంగా ఎన్నికల నిర్వహణను వాయిదా వేశారు. (16.03.2020). బొత్స సత్యనారాయణ (నేడు) : ఎస్.ఈ.సి. రమేష్ కుమార్ ఎన్నికలకు ఎందుకు ఆత్రుత పడుతున్నారో అర్ధం కావడం లేదు. ఎస్.ఈ.సి తీరు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేలా ఉంది.

jagan 16012021 2

అంబటి రాంబాబు (నాడు) : రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడింది క-రో-నా వైరస్ వల్ల కాదు. క్యాస్టు వైరస్ వల్లే. క-రో-నా 2 వ దశలోకి వెళ్లేలోపు ఎన్నికలు నిర్వహించాలి. (16.03.2020). అంబటి రాంబాబు (నేడు) : ఎవరి మేలు కోసం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. మొండిగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం ప్రజాస్వామ్యంలో అన్యాయమైన ప్రక్రియ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (నాడు) : ఎన్నికలు నిర్వహించాలి. సచివాలయం వ్యవస్థ ద్వారా క-రో-నాను నియంత్రించవచ్చు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (నేడు) : ఒక వ్యక్తి మెప్పుకోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తన ఆధిక్యతను చూపేందుకు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ తో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం జరగదు. పేర్ని నాని (నాడు) : ఎన్నికల సంఘానికి బాబు వైరస్. కుట్రలో భాగమే స్థానిక ఎన్నికల వాయిదా. పేర్ని నాని (నేడు): టీకా ప్రక్రియ పూర్తయితేనే ఎన్నికలు. ఎన్నికలు వాయిదా వేయడానికి అవసరమైన అన్ని మార్గాలు ఎంచుకుంటాం. ఎస్.ఈ.సి వ్యవహార శైలి ప్రజాస్వామ్య చరిత్రలో దుర్మార్గమైన చర్య. ఆదిమూలపు సురేష్ (నాడు) : క-రో-నా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేశారు. దీనిపై పున:సమీక్షించాలి. ఆదిమూలపు సురేష్ (నేడు): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి కార్యక్రమం యదావిధిగా జరుగుతుంది. అనిల్ కుమార్ యాదవ్ (నాడు) : క-రో-నా సాకుతో ఎన్నికల నిలుపుదల పెద్ద కుట్ర. అనిల్ కుమార్ యాదవ్ (నేడు) : ఎన్నికల పేరుతో సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. కొడాలి నాని (నాడు) : రమేష్ కుమార్ బొచ్చు కూడా పీకలేడు. (13.04.2020). కొడాలి నాని (నేడు) : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేసింది. నైతిక భాద్యత వహిస్తూ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలకు నెల రోజులు ముందు, జరిగిన ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాలను ఊపేసింది. జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేక కేసు కావటంతో, పెద్ద సంచలనం అయ్యింది. అయితే ఇది చేసింది చంద్రబాబు అంటూ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పటం మొదలు పెట్టారు. అయితే అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉండటంతో, అప్పటికే జరిగిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దొరికిన కొన్ని ఆధారాలతో, ఇది జగన్ చేపించారు అంటూ తెలుగుదేశం కూడా ఎదురు దాడి చేయటంతో, ఎన్నికల ప్రచారం అయ్యే వరకు వివేక కేసు గురించి మాట్లాడకుండా, జగన్ హైకోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అయితే ఆ సమయంలో సిబిఐ విచారణ కోరిన జగన్, తాను ఎన్నికల్లో గెలవగానే, దీంట్లో సిబిఐ విచారణ అవసరం లేదని పిటీషన్ వెనక్కు తీసుకోవటం, మరో సంచలనం. అయితే వివేక కూతురు మాత్రం వదల్లేదు. హైకోర్టుకు వెళ్ళింది. సిబిఐ విచారణ సాధించుకుని వచ్చారు. సిబిఐ అధికారులు రెండు విడతలుగా ఈ కేసు పై విచారణ కూడా చేసారు. కొంత మంది ప్రముఖల పాత్ర పై స్పష్టమైన ఆధారాలు లభించినట్టు కూడా తెలిసింది. అయితే ఎందుకో కానీ సిబిఐ గత రెండు మూడు నెలలుగా ఈ కేసు విషయంలో మళ్ళీ మూడో విడత విచారణ మొదలు పెట్టలేదు.

viveka 16012021 2

ఇది ఇలా ఉంటే, ఇప్పుడు వివేక కేసు విషయంలో మరో సంచలనం బయటకు వచ్చే అవకాసం కనిపిస్తుంది. వివేక కేసులో అతి పెద్ద కుట్ర కోణం దాగి ఉందని, తన వద్ద దీనికి సంబంధించి స్పష్టమైన సమాచారం ఉందని, దీని పై త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి, అన్ని విషయాలు ప్రజలకు తెలిసేలా చెప్తానని, కేరళకు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్‌ పుతెన్‌ పురక్కల్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పటం, ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే వివేక కూతురు, సునితా రెడ్డితో కూడా ఈయన భేటీ అయ్యారు. ఆయనే ఈ విషయం మీడియాకు చెప్పారు. మూడు రోజులు క్రితం ఆమెతో కలిసి, ఈ కేసు విషయం పై ఆమెతో చర్చించినట్టు, సిబిఐ విచారణలో వారికి ఎలా సహకరించాలి, ఎలాంటి ఆధారాలు వారికి ఇవ్వాలి అనే విషయం పై ఆమెతో చర్చించినట్టు చెప్పారు. ఈయన కేరళలో జరిగిన సిస్టర్‌ అభయ కేసులో పోరాడి సిబిఐకి అనేక సాక్ష్యాలు ఇవ్వటంతో సక్సెస్ అయ్యారనే పేరు ఉంది. చివరకు ఈయన చెప్పిన విషయాలనే సిబిఐ కోర్టు నిర్ధారించింది. మరి వివేక కేసులో ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు, రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే ఎందుకో కానీ ప్రభుత్వం, ఎన్నికలు అంటేనే భయపడిపోతుంది. అమ్మో క-రో-నా అంటూ తప్పించుకుంటుంది. పుట్టిన రోజు వేడుకులు, అమ్మ ఒడిలు, గో పూజలు, ఇళ్ళ పట్టాలకు వేల మందిని పోగేస్తే రాని క-రో-నా, ఎన్నికలు పెడితే వచ్చేస్తుందని ప్రభుత్వం వాదిస్తుంది. అంతే కాదు, ప్రజలకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. కేవలం ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మాత్రమే, వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే ప్రజలకు వ్యాక్సిన్ వేయాలంటూ మరోసాకును ప్రభుత్వం చెప్తూ, ఎన్నికలు వాయిదా అంటుంది. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలు అంటే సై అంటుంది, ప్రతిపక్షం వద్దు అంటుంది. మన రాష్ట్రంలో మాత్రం, ఎన్నికలు వద్దు అని చెప్పటానికి అధికార పక్షం సాకులు వెతుకుంటుంటే, ప్రతిపక్షం ఎన్నికలు కావాలి అంటుంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యుల్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సింగల్ బెంచ్ కు వెళ్ళటం, అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చి, ఎన్నికల షెడ్యుల్ ని రద్దు చేయటం, వైసీపీ శ్రేణులకు కోర్టులు అంటే ఎంతో గౌరవం రావటం అన్నీ వెంట వంటనే జరిగిపోయాయి. అయితే సింగల్ బెంచ్ తీర్పు పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ కు వెళ్ళింది.

nimmagadda 15012021 2

రాష్ట్ర ఎన్నికల సంఘం పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు, షెడ్యుల్ 23 నుంచి ఉంది కాబట్టి, ఈ కేసును 18కి రెగ్యులర్ బెంచ్ కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. అయితే మరో పక్క రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం, చేసుకోవాల్సిన పనులు చేసుకుంటూ పోతుంది. కీలకమైన మరో ముఖ్యమైన తుది ఎన్నికల జాబితాను ఎన్నికల సంఘం రెడీ చేసింది. ఇది రొటీన్ గా జరిగే కార్యక్రమం అయినా, 23 నుంచి షెడ్యుల్ ఉండటంతో, 18 తీర్పు తరువాత, అనుకూలంగా తీర్పు వస్తే, ఈ జాబితా రెడీగా ఉంటే, ఎన్నికల కమిషన్ కు పని తేలిక అయిపోతుంది. ఇక ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఎన్నికల జాబితా ప్రకారం, 2021 జనవరి 15 సమయానికి, రాష్ట్రంలో 4,04,41,378 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,99,66,737 పురుష ఓటర్లు కాగా, 2,04,71,506 మంది మహిళా ఓటర్లు. కొత్తగా 4,25,860 మంది ఓటర్లుగా నమోదు అయ్యారు. ఇప్పుడు ఎన్నికల తుది జాబితా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ చేయటంతో, ఇక అందరి చూపు 18న హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తీర్పు పైనే ఆధారపడి ఉంది. మరి కోర్టు ఏమి తీర్పు ఇస్తుందో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవంగ్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టిన డీజీపీ, మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టటం అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. సహజంగా 24 గంటల్లో డీజీపీ ప్రెస్ మీట్ పెట్టారు అంటూ, అది ఎంతో ముఖ్యమైన అంశం అయి ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయమే అయినా, ఒకే అంశం పై, నిన్న, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన డీజీపీ గారు, పరస్పర విరుద్ధంగా ఒకే అంశం గురించి చెప్పుకొచ్చారు. నిన్న దేవాలయాల పై జరుగుతున్న ఘటనల్లో ఎలాంటి కుట్ర కోణం లేదని, 44 ముఖ్య కేసుల్లో, 29 తెల్చేసాం అని చెప్పుకొచ్చారు. వీటిల్లో పిచ్చి వాళ్ళు, జంతువులు, మూడ నమ్మకం ఉన్న వాళ్ళు, కావాలని చేసిన వాళ్ళు, మందు బాబులు, స్థల వివాదం ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారని చెప్పుకొచ్చారు. కొన్ని సంఘటనల్లో ఎప్పుడో జరిగినవి, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే నిన్నటితో ఈ అంశం పై ఎలాంటి కుట్ర కోణం లేదు అనే విషయం మీడియాలో వచ్చింది. అయితే ఈ రోజు డీజీపీ గారు మళ్ళీ ఈ రోజు ఇదే అంశం పై ప్రెస్ ముందుకు వచ్చారు. 9 సంఘటనల్లో రాజకీయ పార్టీల ప్రమేయం ఉన్నట్టు చెప్పారు. ఇందులో 17 మంది టిడిపి వాళ్ళు ఉన్నారని, 4 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారని, వారిలో 15 మందిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారీలో ఉన్నారని చెప్పారు.

dgp 15012021 2

అయితే ఇంత వరకు బాగానే ఉంది. నిజంగా ఆలయాల ధ్వంసం వెనుక, టిడిపి, బీజేపీ, ఏ పార్టీ వాళ్ళ కుట్ర ఉన్న శిక్షించి వాళ్ళకు తగిన శాస్తి చేయాల్సిందే. అయితే డీజీపే గారి ప్రెస్ మీట్ తరువాత, దీనికి సంబందించిన పూర్తి వివరాలు ఇచ్చారు. ఇందులో ఎక్కడా టిడిపి వాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేసినట్టు లేదు. ఎప్పుడో ధ్వంసం అయితే, వేరే కారణాల వల్ల ధ్వంసం అయితే, టిడిపికి చెందిన వాళ్ళు, అది ఇప్పుడు జరిగింది అంటూ, సోషల్ మీడియాలో ఫాల్స్ ప్రచారం చేసారు అనేది, కొన్ని కేసులు వివరాలు. ఇంకోటి రెండు వర్గాల మధ్య గొడవ. ఇలా ఎక్కడా టిడిపి వాళ్ళు కావాలని విగ్రహాలు ధ్వంసం చేసినట్టు లేదు. అయితే, డీజీపీ గారి ప్రెస్ నోట్ ఒకలా ఉంటే, వైసీపీ మాత్రం తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ, తెలుగుదేశం నేతలు విరుచుకు పడుతున్నారు. సోషల్ మీడియాలో ఘటన గురించి పోస్ట్ చేస్తే, అది విగ్రహాల ధ్వంసం కేసు ఎలా అవుతుంది అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. నిన్న ఇవేమీ చెప్పకుండా, ఏమి లేదు అని చెప్పిన డీజీపీ, ఈ రోజు ఎందుకు ఇలా చెప్పారు అంటూ, టిడిపి ప్రశ్నిస్తుంది. మొత్తానికి, 24 గంటల్లో డీజీపీ గారు పెట్టిన ప్రెస్ మీట్ తో, మళ్ళీ రాజకీయ విమర్శలు మొదలయ్యాయి.

Advertisements

Latest Articles

Most Read