ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దేవాలయాల పై జరుగుతున్న వరుస ఘటనలు అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖ పై ఒత్తిడి పెరిగిపోతుంది. ముఖ్యమైన ఎన్నో ఘటనలలో, ఎవరు చేసారో తెలియకపోవటంతో, పోలీస్ శాఖ విమర్శలు ఎదుర్కుంటుంది. ఇక మరో పక్క ప్రభుత్వం పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి క్రీస్టియన్ కాబట్టి, హిందూ దేవాలయాల పై వరుస ఘటనలు జరుగుతున్నా, పట్టించుకోవటం లేదని, ప్రతిపక్షాలు మూకుమ్మడిగా విరుచుకు పడ్డాయి. ఇక రామాతీర్ధం ఘటన తరువాత, ఈ అంశం తారా స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం వద్ద సమాధానం లేదు, పోలీస్ శాఖ కూడా ఈ విషయానికి ఒక లాజికల్ కంక్లుజన్ ఇవ్వలేకపోయింది. దీంతో ప్రతిపక్షాలను తట్టుకోవాలి అంటే, ఒక్కటే మార్గం అని డిసైడ్ అయిన అధికార పక్షం ఎదురు దాడి మొదలు పెట్టింది. విజయసాయి రెడ్డి అయితే, రామతీర్ధం ఘటన, చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే జరిగిందని, వ్యాఖ్యలు చేసారు. అయితే అందరినీ సాక్ష్యాలు ఇవ్వమని ఉత్తరాలు రాసే డీజీపీ గారు మాత్రం, విజయసాయి రెడ్డిని సాక్ష్యాలు అడగలేదు అనుకోండి అది వేరే విషయం. ఇక తరువాత జగన్ మోహన్ రెడ్డి కూడా, ఆలయాల పై జరుగుతున్న వరుస ఘటనల వెనుక ప్రతిపక్షం ఉందని, ఒకటికి నాలుగు సార్లు చెప్పారు.

dgp 14012021 2

ఆలయాలు ధ్వంసం చేసిన వారే, వాటిని చూడటానికి వస్తున్నారని, రధాలు తగలబెట్టిన వాళ్ళే రధయాత్ర చేస్తున్నారని, ఇలా ప్రతిపక్షాలు చేస్తున్నాయని, ఎప్పుడు సంక్షేమ కార్యక్రమం మొదలు పెట్టినా, ఇలాగే జరుగుతున్నాయి అంటూ తేల్చి చెప్పారు. అయితే జగన్ ను ఆధారాలు అడగాలి అంటూ, డీజీపీకి టిడిపి లేఖ రాసింది. అయితే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఈ ఘటనలు అన్నీ ప్రతిపక్షం చేస్తుందని చేసిన ప్రచారం అంతా ఫేక్ అని, నిన్నటి డిజిపి ప్రెస్ మీట్ తో, తేలిపోయింది. నిన్న డీజీపీ మాట్లాడుతూ, ఈ ఘటనల వెనుక ఇప్పటి వరకు ఎలాంటి కుట్ర కోణం కనిపించలేదని చెప్పారు. 44 ముఖ్య ఘటనలలో, 29 తెల్చేసాం అని, అవి కొన్ని దొంగలు, కొన్ని మూఢ నమ్మకాలతో, ఒకటి రెండు పిచ్చి వాళ్ళు, ఒకటి రెండు అడవి జంతువులు, కొన్ని నిధి కోసం, ఇలా చేసినట్టు తమ విచారణలో తేలినట్టు చెప్పారు. అంతర్వేది, రామతీర్ధం సహా మిగత ఘటనల పై విచారణ జరుగుతుందని తెలిపారు. ఒక పక్క వైసీపీ నేతలు, ఇవన్నీ ప్రతిపక్షం చేస్తుందని చెప్తే, డీజీపీ మాత్రం, కుట్ర కోణం లేదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్విట్టర్ లో ఒక వ్యక్తి తాను పలానా ప్రశ్నలు అడగగా, ఆర్టిఐ నుంచి తనకు వచ్చిన సమాధానాలు గురించి, ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆయన పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం, ఆర్టీఐ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయట పడ్డాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ రెండేళ్ళలో పోలవరంలో చేసిన పనికి, చేస్తున్న ప్రచారానికి ఎక్కడా పొంతన లేదనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి గద్దెనెక్కిన దగ్గర నుంచి అక్టోబర్ 2020 వరకు పోలవరం పై చేసిన ఖర్చు కేవలం రూ.779 కోట్లు మాత్రమే. గత చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.11 వేల 749 కోట్లు. దీనికి కేంద్రం రీయింబర్స్ చేస్తూ వస్తుంది. ఇక జరిగిన పనులు విషయం చూస్తే, డ్యాం పనులు ఇప్పటి వరకు జరిగింది 72.29%. గతంలో జగన్ సమక్షంలో జరిగిన రివ్యూలోనే చంద్రబాబు హాయంలో 70 శాతం పనులు అయినట్టు చెప్పారు. అంటే ఈ 20 నెలల్లో పోలవరం పనులు జరిగింది కేవలం 2.29 % మాత్రమే అని ఈ ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వం చెప్తున్న దానికి, జరుగుతున్న పనులకు ఎక్కడా సంబంధం లేదు. ప్రచారం మాత్రం, చంద్రబాబు ఏమి చేయలేదు, మొత్తం మేమే చేసేసాం అని చెప్తున్నారు. కానీ వాస్తవం చూస్తే ఇలా ఉంది.

polavaram 13012021 2

పోలవరం ప్రాజెక్ట్ లో 55 వేల కోట్లు ఖర్చు పెడితే కానీ పూర్తీ అయ్యే పరిస్థితి లేదు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే, ఇలా అరకొర నిధులతో పనులు చేస్తూ, ప్రచారం చేస్తుందని, తెలుగుదేశం పార్టీ వాపోతుంది. ఒక పక్క ఆర్ అండ్ ఆర్ అలాగే ఉందని, ఆర్ అండ్ ఆర్ లో ఎలాంటి పనులు జరగటం లేదని, పునరావాసం కూడా పట్టించుకోవటం లేదని, ఇవన్నీ అడిగితే మాత్రం, నోరేసుకుని పడిపోతారని వాపోతున్నారు. బుగ్గన ప్రతి నెల ఢిల్లీ వెళ్లి, ఏ నెలకు ఆ నెల అప్పు తెచ్చుకోవటం, ఆ నెల గడిపేయటం పైనే దృష్టి పెట్టారని, కానీ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవటంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యారని వాపోతున్నారు. ఇక మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల కోట్లు అప్పు తెచ్చిందని, కానీ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ కి మాత్రం, కేవలం రూ.779 కోట్లు ఖర్చు పెట్టారని, తెచ్చిన డబ్బులు ఏమై పోతున్నాయని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ ఆర్టీఐ రిపోర్ట్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికైనా తీసుకొస్తున్న అప్పు, సంపద సృష్టించే ఇలాంటి ప్రాజెక్ట్ ల పై ఖర్చు చేస్తారని ఆశిద్దాం.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు కృష్ణా జిల్లా పరిటాలలో ప్రజల మధ్య భోగి వేడుకులు జరుపుకున్నారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యలు, ఇప్పటికీ ధాన్యం డబ్బులు ప్రభుత్వం జమ చేయకపోవటం, రైతులకు చేస్తున్న అనేక మోసాలకు వ్యతిరేకంగా, ఈ రోజు ప్రభుత్వం విడుదల చేసిన రైతు వ్యతిరేక జీవోలను చంద్రబాబు భోగి మంటల్లో వేసి తగలుబెట్టారు. ఉదయం 5 గంటలకే చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గున్నారు. తరువాత ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్బంగా చంద్రబాబు కొంత భావోద్వేగానికి గురయ్యారు. "నాకంటే గొప్పగా చేస్తాడని, ఒక్క చాన్స్ ఒక్క చాన్స్ అన్నాడని, పూనకం వచ్చినట్టు అతనికి ఓట్లు వేసి, ఇబ్బందులు పడుతున్నారు. నేనేమి తప్పు చేసానో, ఎందుకు ఓడిపోయానో ఇప్పటికీ తెలియటం లేదు. ప్రజలు సంతోషంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేయాలని అనుక్షణం తపించాను. అదే నేను చేసిన తప్పు అయితే, క్షమించండి" అంటూ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. తాను ప్రజలు జీవితాలు మారాలని, అనుక్షణం అనుకుని పని చేసి, అన్నీ చేసి పెడుతూ వెళ్లానని, నేను చేసిన తప్పు అదేనేమో అని చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న ఘటనల చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ కుట్రను చేదించలేకపోవటం, ప్రతిపక్షం ఈ అంశాన్ని తీసుకోవటంతో, మొత్తం వ్యవహారం పై ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతుంది. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్, బాధ్యతగా ప్రకటనలు ఇవ్వాల్సింది పోయి, ఈ ఘటనలు అన్నీ ప్రతిపక్షాలు చేస్తున్నాయని తేల్చి పడేసారు. అంతే కాదు, ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా, దాన్ని డైవర్ట్ చేయటానికి ఇవన్నీ చేస్తున్నారు అంటూ, ఏదో దగ్గరుండి చూసినట్టు చెప్పారు. దేవాలయాల పై ఘటనలు చేసి, మళ్ళీ వాళ్ళే దేవాలయాల వద్దకు వస్తున్నారని, రధాలు తగలబెట్టి రధయాత్రాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ముఖ్యమంత్రి వద్ద ఇంత స్పష్టమైన సమాచారం ఉండటం పై, తెలుగుదేశం పార్టీ అనుమానిస్తూ, ఏకంగా డీజీపీకి లేఖ రాసింది. తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబెర్ వర్ల రామయ్య, డీజీపీకి లేఖ రాసారు. ఆ లేఖ సారంశం ఏమిటి అంటే, "రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న ఘటనలు మీకు తెలిసిందే. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, నెల్లూరులో జనవరి 11న మాట్లాడుతూ, దేవాలయాల పై ఘటనలు చేస్తున్న వారు తనకు తెలుసని చెప్పారు."

dgp 13012021 2

"రధాలు తగలబెట్టిన వారి వివరాలు తెలుసు అని చెప్పారు. అంటే దీని ప్రకారం, ఆయను ఎవరు దేవాలయాల పై వరుస ఘటనలు చేస్తున్నారో తెలుసు. నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా మీడియాతో మాట్లడుతూ ఇదే విషయం చెప్పారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ సలహాదారుకు ఈ విష్యం తెలుసు అని అర్ధం అవుతుంది. ఈ నేపధ్యంలో, గతంలో మీరు, ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు, మీడియాలో వచ్చిన మాటలు చూసి, 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి, వివరాలు తెలపమని మీరు కోరినట్టే, బహిరంగ వేదిక పై దేవాలయాల పై ఘటనలు చేసిన వారు ఎవరో తెలుసు అని చెప్తున్న జగన్ కు కూడా, 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వాలని కోరుతున్నా. తద్వారా ఈ కేసులో మీకు మంచి పురోగతి ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే ఆధారాలతో, మీరు తొందరగా కేసు నమోదు చేస్తే, ప్రజలు హర్షిస్తారు" అంటూ వర్ల రామయ్య డీజీపీకి రాసిన లేఖలో తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read