ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ 13 జిల్లాల క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా చేసారు అంటూ, బులుగు మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ తిప్పి కొట్టింది. తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిని నేనే అంటూ, యలమంచలి ప్రవీణ్ అనే వ్యక్తి ఉదయం నుంచి టీవీల్లో చేస్తున్న హడావిడి పై స్పందిస్తూ, ప్రవీణ్ అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు , మద్దిరాల మ్యానీ ప్రకటన విడుదల చేసారు. ప్రవీణ్ అనే వ్యక్తికి అసలు పార్టీతో సంబంధమే లేదని, పరోక్షంగా కూడా పార్టీకి అతనికి లింక్ లేదని తేల్చి చెప్పారు. అసలు ప్రవీణ్ అనే వ్యక్తికీ సభ్యత్వం కూడా లేదని అన్నారు. దీని వెనుక వైసీపీ పార్టీ కుట్ర ఉందని, కావాలని ఇలా చేస్తున్నారని అన్నారు. మరోసారి ప్రవీణ్ ఇలా ప్రచారం చేసినా, టిడిపి ఫోటోలు వాడినా, అతని పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక పోతే, అసలు చంద్రబాబు ఎక్కడా క్రీస్టియన్ లను ఒక్క మాట అనలేదని, జగన్ మోహన్ రెడ్డి వైఖరిని మాత్రమే ప్రశ్నించారని గుర్తు చేసారు. ప్రవీణ్ అనే వ్యక్తి జూపూడికి దగ్గర వారని, జూపూడితో పాటే అతను వెళ్లిపోయాడని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అతనికి పార్టీకి సంబంధం లేదని, ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్, నిన్న హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, నిన్నే హైకోర్ట్ డివిజన్ బెంచ్ లో అపీల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయమే ఈ పిటీషన్ పై విచారణ జరగాల్సి ఉండగా, పిటీషన్ ను ఈ రోజు మధ్యానానికి వాయిదా వేసారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్, అనేక డాక్యుమెంట్లు సబ్మిట్ చేయటంతో, అవన్నీ స్క్రూటినీ చేయటానికి టైం పట్టటంతో, విచారణ నాలుగు గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యింది. అయితే విచారణ ప్రారంభం అయిన సందర్భంలో హైకోర్టు ధర్మాసనం, ఈ పిటీషన్ అత్యవసరంగా విచారణ చెయ్యాల్సిన అవసరం ఏమి ఉంది, 23న షెడ్యుల్ ఉంది కాబట్టి, 18న రెగ్యులర్ కోర్టులో ఈ పిటీషన్ వినటానికి అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించగా, దీని పై స్పందించిన ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది, ఎలెక్టోరియల్ రోల్స్ తయారు చేయాలని, 18 అయితే సమయం సరిపోదు అని చెప్పగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం, 15వ తారిఖు ఎలెక్టోరియల్ రోల్స్ పంపిస్తాం అని చెప్పిందని, సమాధానం చెప్పారు. మొత్తానికి ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు, ఈ కేసుని 18కి రెగ్యులర్ కోర్టులో మొదటి అంశంగా వాయిదా వేసింది. దీంతో మరో 5 రోజులు సస్పెన్స్ తప్పేలా లేదు.

ఆ జడ్జిది పలానా కులం... ఆ జడ్జిని చంద్రబాబు మ్యానేజ్ చేసాడు. ఈ జడ్జిని మరోరకంగా చేసారు. ఈ జడ్జి మాకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాడు, క-రో-నా వార్డులో పడేయాలి.. ఇలా వైసీపీలో పై స్థాయి ప్రజా ప్రతినిధుల నుంచి, కింద స్థాయి సోషల్ మీడియా బ్యాచ్ వరకు, అందరూ జడ్జిల పై చేసిన కామెంట్స్, చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. చివరకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి కూడా, ఇలాగే జడ్జిల పై, కోర్టుల పై కామెంట్స్ చేసారు. ఈ వైసీపీ బ్యాచ్ చేసిన అరాచకం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, ఏకంగా హైకోర్టు, వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చే దాకా వెళ్ళింది. చివరకు ఇది సిఐడి విచారణకు ఇవ్వగా, అక్కడ కూడా సరైన న్యాయం జరగకపోవటం, సిబిఐకి ఈ కేసు అప్పచెప్పారు. దీనికి కారణం, కోర్టుల పై చేస్తున్న ఈ కామెంట్స్ వెనుక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారని, అందుకే సిబిఐ విచారణకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు. ఆ తరువాత కూడా ఏ మాత్రం జంకు లేకుండా, తమ ప్రభుత్వం చట్ట వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందేమో అని చూడకుండా, మమ్మల్ని కావాలని టార్గెట్ చేసారు అంటూ, హడావిడి చేసారు. అయితే ఇలా ఇన్నాళ్ళు వైసీపీ పార్టీని చూసిన ఏపి ప్రజలు, నిన్నటి నుంచి వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూసి ఆశ్చర్య పోతున్నారు. నిన్న ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యుల్ ని, హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

ycp 12012021 2

దీంతో నిన్నటి నుంచి వైసీపీ నేతలు, హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, తమ విజయంగా, నిమ్మగడ్డకు తగిన శాస్తిగా చెప్పుకున్నారు. కొడాలి నాని అయితే, ఇది కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటూ, హైకోర్టు చెప్పు దెబ్బలు కొట్టింది అనే విధంగా మాట్లాడారు. అలా అనుకుంటే, ప్రభుత్వానికి ఇప్పటికే కోర్టు కొట్టిన చెప్పు దెబ్బల లిస్టు డబల్ సెంచరీకి దగ్గరలో ఉందని కొడాలి నాని మర్చిపోయారేమో. ఇక మరో నాయకుడు అయితే, న్యాయం తమ వైపే ఉందని హైకోర్టు తీర్పుని గౌరవిస్తున్నాం అని అన్నారు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ, హైకోర్టుని ఆకాశానికి ఎత్తేసారు. వైసీపీలో ఈ మార్పు చూసిన ప్రజలు ఆవాక్కయ్యారు. ఇప్పటికైనా వైసీపీకి కోర్టుల పట్ల, జడ్జిల పై మంచి అభిప్రాయం వచ్చినందుకు సంతోషిస్తూ, ఇక ముందు కూడా ఇలాగే కొనసాగాలని, వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు కూడా, ఎక్కడ తేడా ఉందో చూసుకుని సరి చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నిన్న ఇంత పెద్ద విషయంలో ఎదురు దెబ్బ తగిలినా, హుందాగా వేరే బెంచ్ ముందు అపీల్ చేసుకున్నారు కానీ, న్యాయవ్యవస్థను ఎవరూ విమర్శలు చేయలేదనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న జాయింట్ డైరెక్టర్ ను ఎన్నికల కమిషన్ తొలగించిన సంగతి తెలిసిందే.  ఎన్నికల కమిషన్ సెక్రటరీగా ఉన్న వాణీమోహన్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తొలగించారు. వాణీమోహన్ సేవలు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ లో అవసరం లేదని, అందుకే ఆమెను తొలగిస్తున్నామని నిమ్మగడ్డ తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ కు వివరాలు తెలుపుతూ లేఖ రాసారు. వాణీమోహన్‍ను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆమెను రిలీవ్ చేస్తూ ప్రభుత్వానికి కూడా తెలిపారు. నిన్న జాయింట్ డైరెక్టర్ ముందస్తు సమాచారం లేకుండా సెలవు పై వెళ్ళటం, మిగతా ఉద్యోగులను కూడా సెలవు పెట్టాలని ఒత్తిడి చేయటంతో, అయన్ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అయితే ఈ రోజు ఏకంగా ఎన్నికల కమిషన్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారిని కూడా తప్పించటం సంచలనంగా మారింది. అయితే ఆమెను కేవలం సేవలు అవసరం లేదనే రిలీవ్ చేసారని చెప్తున్నా, దీని వెనుక ఇంకా ఏదో ఉండే ఉంటుందని అంటున్నారు. మరికొద్ది సేపట్లోనే, హైకోర్టు డివిజిన్ బెంచ్ లో, నిన్న సింగల్ బెంచ్ ఎన్నికల్ షెడ్యుల్ సస్పెండ్ చేస్తూ ఇచ్చిన తీర్పు పై, వాదనలు విననున్నారు.

Advertisements

Latest Articles

Most Read