ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఈ రోజు గవర్నర్ ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 11:30 గంటలకు గవర్నర్ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. గత నాలుగు రోజులు నుంచి జరుగుతున్న పరిణామాలు అన్నీ నిమ్మగడ్డ, గవర్నర్ కు వివరించనున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తన పై ప్రభుత్వంలోని వివిధ వర్గాలు చేస్తున్న విమర్శలు, అలాగే ఎన్నికలకు సహకరించబోమని, ఉద్యోగులు, పోలీసులు చెప్పటం పై, ఆయన ఆగ్రహంగా ఉన్నతు తెలుస్తుంది. ఇన్నాళ్ళు సభలు, సమావేశాలు, ఈ పధకం, ఆ పధకం అంటూ ఉద్యోగులను కూడా భాగస్వామ్యులను చేసి, పెద్ద పెద్ద మీటింగ్ లు పెట్టారని, ఇప్పుడు ఎన్నికలు అనగానే తన పై దాడి చేస్తున్నారని, ఆ సభలకు సంబంధించిన ఫోటోలు గవర్నర్ కు ఇచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అదే విధంగా, ఏ పరిస్థితిలో ఎన్నికల షెడ్యుల్ ఇవ్వాల్సి వచ్చింది, తరువాత జరిగిన పరిణామాలు, సింగల్ బెంచ్ షెడ్యుల్ రద్దు చేయటం, మళ్ళీ ఈ రోజు డివిజన్ బెంచ్ కు అపీల్ చేయటం, ఇవన్నీ గవర్నర్ కు నిమ్మగడ్డ వివరించనున్నారు. అదే విధంగా ఎన్నికలు పెట్టే ముందు చేసిన కసరత్తు కూడా, నిమ్మగడ్డ వివరించే అవకాసం ఉంది. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికల గురించి, నిమ్మగడ్డ ప్రస్తావించే అవకాసం ఉంది.

rajbhavan 12012021 2

ముఖ్యంగా బీహార్, కర్ణాటక, రాజస్తాన్, హర్యానా ఎన్నికలతో పాటుగా, కేరళలో జరగబోయే ఎన్నికలు గురించి, అలాగే మన పక్కన ఉన్న హైదరాబాద్ లో జరిగిన మునిసిపల్ ఎన్నికల గురించి, అక్కడ తీసుకున్న జాగ్రత్తలు, మనం ఏమి చేస్తున్నాం అనేవి వివరించే అవకాసం ఉంది. ఇక సుప్రీం కోర్టు కూడా ఈ మధ్య కాలంలో, ఎన్నికలకు అభ్యంతరం చెప్పలేదనే విషయం కూడా చెప్పే అవకాసం ఉందని తెలుస్తుంది. మొత్తంగా, పూర్తి ఆధారాలతో, ఆయన తన వాదనను గవర్నర్ వద్ద వివరించే అవకాసం ఉంది. మరో పక్క, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కూడా గవర్నర్ ను కలుస్తారని తెలుస్తుంది. మొత్తంగా, ఈ రోజు రాజ్ భవన్ వేదికగా ఎలాంటి సంచలనాలు ఉంటాయో చూడాలి. ఇక, ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన పిటీషన్ ను డివిజన్ బెంచ్ విచారించనుంది. నిన్న సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిన్నే డివిజన్ బెంచ్ లో ఛాలెంజ్ చేసింది. ఈ రోజు దీని పై విచారణ చేస్తామని డివిజన్ బెంచ్ అంగీకరించింది.

రాష్ట్రహైకోర్టు ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ని తిరస్కరించి, ప్రజారోగ్యమే ముఖ్యమని చెప్పడం జరిగిందని, దాన్ని తాము తప్పుపట్టడంలేదని, కానీ అదేదో అధికారపార్టీ సాధించిన పెద్ద విజయంగా వైసీపీనేతలు భావించడాన్నే తాము తప్పుపడు తున్నామని టీడీపీఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టడం జరిగిందన్న ఆయన, ఆనాడు తేలుకుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉన్న వైసీపీనేతలు, ఇప్పుడేదో పెద్ధ ఘనకార్యం సాధించినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపట్టిందన్న అక్కసుతో ,హైకోర్టు న్యాయమూర్తు లను కూడా దూషించారని, ముఖ్యమంత్రి అయితే ఏకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ నే తప్పుపడుతూ సుప్రీంకోర్టుకే లేఖరాశాడన్నారు. కోర్టుల నిర్ణయాలు పక్కనపెడితే, ప్రభుత్వం నిజంగా ఎన్నికలకు వెళ్లడానికి ఎందుకు భయపడుతోందో చెప్పాలన్నారు. కోవిడ్ అనేదే ఉంటే ముఖ్యమంత్రి నేడు నెల్లూరులో వేలాదిమందితో బహిరంగ సభ ఎలా నిర్వహించాడో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. ద్యందుకాణాలు తెరిచినప్పుడు, పాఠశాలలు ప్రారంభిం చినప్పుడు, ప్రభుత్వకార్యక్రమాల పేరుతో అధికారపార్టీవారు సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించినప్పుడు లేని కరోనా ఎన్నికల నిర్వహణకు వచ్చేసరికి పాలకులకు ఎందుకు గుర్తుకొస్తుందో చెప్పాలన్నారు. అన్నివ్యవస్థలు రాష్ట్రంలో యథావిథి గా పనిచేస్తున్నప్పుడు వైరస్ ప్రభావం ఎక్కడుందో చెప్పాలన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అనేదికూడా ఫ్రంట్ లైన్ వారియర్లకే ముందు ఇస్తామని కేంద్రం స్పష్టంచేసినందున, ఎన్నికల సిబ్బందికి ఉన్న అభ్యంతరమేమిటని అశోక్ బాబు ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలు వాయిదావేయమని కోరిన ప్రభుత్వం, తిరుపతి ఉప ఎన్నికను వాయిదా వేయమని ఎందుకు కోరడం లేదన్నారు. గతంలో స్థానికఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పుడు, రెండు నెలలవరకు రాష్ట్రంలో కరోనాఅనేది రాదని చీఫ్ సెక్రటరీతో ఎన్నికల సంఘానికి లేఖరాయించిన ప్రభుత్వం, మార్చిలోఎన్నికలు నిర్వహించవచ్చనే హామీని ఏమైనా ఇవ్వగలదా అన్నారు.

ఈ ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలుస్తామనే ఆలోచన ఉంటే, ఎందుకు ఎన్నికలు వాయిదా వేయిస్తుందో చెప్పాలన్నారు. ఎన్నికల కమిషనర్ గా రమేశ్ కుమార్ ఉంటే తమ దౌర్జన్యాలు, బెదిరింపులు, రిగ్గింగులు, ప్రలోభాలు పెట్టడం సాగవని తెలిసే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు వెళ్లడంలేదని అశోక్ బాబు స్పష్టంచేశారు. రమేశ్ కుమార్ ఎస్ఈసీగా లేకుంటే ఎన్నికల్లో ఇష్టమొచ్చినట్లు చేసుకోవచ్చన్నఆలోచన ప్రభుత్వానికిఉందని, అధికారపార్టీ నేతలు, మంత్రుల మాటల్లోనే అర్థమవుతోందన్నారు. పార్టీ గుర్తుపై స్థానికఎన్నికలు జరగనప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందిఏమిటన్నారు. వ్యాక్సిన్ పంపిణీ జరిగే సమయంలో నే తిరుపతిఉప ఎన్నిక జరిగితే, అప్పుడు ప్రభుత్వం ఆ ఎన్నిక నిర్వహించవద్దని కోర్టునుఆశ్రయించగలదా అని అశోక్ బాబు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికారపార్టీ జెండా ఎగరదన్న ఒకేఒక్క కారణంతోనే ప్రభుత్వం, హడావుడిగా ఇళ్లపట్టాలు, అమ్మ ఒడి పేరుతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలను నిర్వహిస్తోంద న్నారు. ఎన్నికలకోడ్ పల్లెలకు వర్తించదని తెలిసినప్పుడు, పథకాల అమలుకు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ ఉండదన్నారు. ఎన్నికలకమిషనర్ రాజీనామా చేయాలంటున్న ప్రభుత్వం, మంత్రులు, గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన అనేక తీర్పులపై ఎందరురాజీనామాలు చేశారో చెప్పాలన్నారు. ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పే అంతిమతీర్పు కాదనే నిర్ణయాన్ని ప్రభుత్వం గుర్తంచుకుంటే మంచిదన్నారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టి, ఎన్నికలు పెట్టాల్సిందే నని చెబితే అప్పుడు వైసీపీప్రభుత్వం ఏంచేస్తుందో చెప్పాలన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఎప్పుడుఎన్నికలు జరిగినాకూడా టీడీపీకి వచ్చిన ఇభ్బందేమీ లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ను కోర్టు నిలిపివేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. వ్యాక్సినేషన్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ నిలిపివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ రెండు గంటల పాటు తమ వాదనలు వినిపించారు. ఎన్నికలు, వ్యాక్సినేషన్ ఒకేసారి ప్రభుత్వం చేయలేదని వాదించారు. ప్రభుత్వ వాదనను హైకోర్టు ఒప్పుకుంది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, డివిజనల్ బెంచ్‌కు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ పిటీషన్ వేయనున్నారు. అయితే ప్రభుత్వానికి మాత్రం, ఈ తీర్పు భారీ ఊరటను ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఈ రోజు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యుల్ ని నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధం అని, సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, హైకోర్టు డివిజిన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్పీలుకు వెళ్ళింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో సంక్రాంతి సెలవలు ఉండటంతో, ఈ పిటీషన్ ని అత్యవసర పిటీషన్ గా భావించి, వెంటనే విచారణ చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం తరుపున న్యాయవాది డివిజన్‌ బెంచ్‌ను కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటీషన్, రేపు డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చే అవకాసం ఉంది. రేపు డివిజన్ బెంచ్ అత్యవసర విచారణకు తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాలి. అయితే ఈ రోజు హైకోర్టు, ఎన్నికల్ షెడ్యుల్ ని కొట్టేయటం పై, వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. నాయకులు వరుస ప్రెస్ మీట్ లు పెట్టి, హైకోర్ట్ తీర్పుని స్వాగతిస్తుంటే, వైసీపీ సోషల్ మీడియా, హైకోర్టు తీర్పుని మా విజయం అంటూ చెప్పుకొస్తుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, వైసీపీ నేతలకు సడన్ గా హైకోర్టు అంటే ప్రేమ పుట్టుకు రావటం.

hcc 11012021 2

ఇక ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేసిన దగ్గర నుంచి, అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలవటం, వాళ్ళు ఎన్నికలకు సహకరించలేం అని చెప్పటం, రాత్రికి ఎన్నికల కమిషన్ షెడ్యుల్ విడుదల చేయటం, ఆదేశాలు ఇవ్వటం, ఎన్నికల నియమావళి, అలాగే ఈ రోజు ఒక ఆఫీసర్ ని సస్పెండ్ చేయటం, మధ్యలో ఉద్యోగ సంఘాలు, పోలీస్ సంఘాలతో తిట్టించటం, ఇలాంటివి అన్నీ చేసిన తరువాత, ఈ రోజు హైకోర్టులో పిటీషన్ పై విచారణ జరపటం, ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యుల్ కొట్టేయటం, వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై,పలువురు స్పందిస్తూ, ఈ తీర్పు పై కోర్టులో నిలవకపోవచ్చని అభిప్రాయ పడుతున్నారు. దీనికి అనేక ఉదాహరణలు చెప్తూ, సహజంగా కోర్టులు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవని, గతంలో వెస్ట్ బెంగాల్ లో, స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని, రెండునెలల క్రితం కేరళలో కూడా ఇలాగే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. చూద్దాం ముందు ముందు, ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Advertisements

Latest Articles

Most Read