మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్, గుంటూరు అర్బన్ ఎస్పీ అయిన అమ్మిరెడ్డి పై ఈ రోజు శాసనమండలిలో సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ఈ నోటీస్ ను ఆయన మండలి చైర్మెన్ కు ఇచ్చి విచారణ చేసి తగు చర్యలు తీసుకోమని కోరారు. గుంటూరు ఎస్పీ తనను సోషల్ మీడియాలో బెదిరించారని, తన హక్కులకు భంగం కలిగించారని, తప్పుడు అరెస్ట్ ను ప్రశ్నిస్తే, తనను అరెస్ట్ చేస్తానని బెదిరింపులకు దిగారని, తన నోటీస్ లో నారా లోకేష్ పేర్కొన్నారు. దీని పై చర్యలు తీసుకోవాలని కోరారు. గత వారం పొన్నూరులో ఎమ్మెల్యే ప్రహరీ గోడ ఓపెనింగ్ అంటూ హడావిడి చేస్తుంటే, మణిరత్నం అనే వ్యక్తి అవి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టటంతో అది వైరల్ అయ్యింది. తరువాత మణిరత్నంను పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. ఈ సమయంలో, నారా లోకేష్ ఒక ట్వీట్ పెట్టారు. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా ? అసలు అందులో ఏముందని అరెస్ట్ చేస్తారు అంటూ ట్వీట్ చేసారు. అయితే దీని పై స్పందించిన గుంటూరు ఎస్పీ అది ఫేక్ ట్వీట్ అంటూ, లోకేష్ ఫేక్ ప్రచారం చేస్తున్నారని, ఇలా చేస్తే అరెస్ట్ చేస్తాం అని హెచ్చరించారు. దీని పై ఘాటుగా స్పందించిన లోకేష్, స్టేషన్ సిసి టీవీ ఫూటేజ్ బయట పెట్టాలని కోరుతూ, అదే విధంగా బాధితుడి వీడియో కూడా పెట్టారు. దీంతో తాము అరెస్ట్ చేయలేదని, కేవలం విచారణ కోసం పిలిచామని పోలీసులు చెప్పారు. అయితే మరి ఎందుకు ఫేక్ ట్వీట్ అని చెప్పారు, ఎందుకు అరెస్ట్ చేస్తామని చెప్పారని లోకేష్ ప్రశ్నించారు. పోలీసులు తమ హద్దుల్లో ఉండాలని, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తే ఇబ్బందులు పడతారని అన్నారు. అయితే దీని పై గుంటూరు ఎస్పీ నుంచి తదుపరి ఎలాంటి వివరణ రాకపోవటంతో, లోకేష్ మండలి చైర్మెన్ కు జరిగిన ఘటన పై ఫిర్యాదు చేసారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ రోజు ఎప్పుడూ చూడని సంఘటనలు ప్రజలు చూసారు. అదే చంద్రబాబు ఏకంగా స్పీకర్ ముందు, కింద కూర్చుని నిరసన తెలపటం. చంద్రబాబు ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారు ? ఎన్నో చూసిన చంద్రబాబు, ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు ? వైసిపీ చెప్పినట్టు చంద్రబాబు రౌడీజం కోసం, రేపు పేపర్ లో హెడ్ లైన్స్ లో రావటానికి ఇలా చేసారా ? అసలు నిజం ఏమిటి అంటే, చంద్రబాబు ఇంతలా నిరసన తెలపటానికి కారణం లేకపోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడు సార్లు వరదలు కానీ, తుఫాన్లు కానీ వచ్చాయి. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి, రెండు సార్లు వారదలు, తుఫాన్లు వచ్చాయి. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత, రైతులు కట్టుకునే ఇన్సురన్సు ప్రీమియం మేమే కడతాం అని చెప్పింది. అయితే ఈ రోజు రైతులకు ఇచ్చే నష్ట పరిహారం పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు ప్రభుత్వం చేసిన పనులు అన్నీ చెప్తూ, మా ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. అన్ని పధకాలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఈ సందర్భంగా, తెలుగుదేశం వైపు నుంచి పయ్యావుల కేశవ్, రైతులకు కట్టాల్సిన క్రాప్ ఇన్సురన్స్ ప్రభుత్వం కట్టలేదని, వారిని ముంచేసారని నినాదాలు చేసారు. అయితే మంత్రి మాత్రం, మేము కట్టాం అంటూ ఎదురు దాడి చేసారు. దీంతో కేశవ్ మా దగ్గర మొత్తం సమాచారం ఉందని, ఆర్టిఐ ద్వారా మొత్తం సమాధానం తెప్పించాం అని చెప్పటంతో, అప్పుడు మంత్రి మాట మార్చి, డిసెంబర్ 15 లోపు ఇన్సురన్సు ప్రీమియం కడతామని చెప్పారు.

payyavula 30112020 2

అయితే ప్రభుత్వం మాట మార్చటంతో, చంద్రబాబు తమకు ఈ విషయం పై మాట్లాడే అవకాసం ఇవ్వాలని కోరటం, ఆయనకు మైక్ ఇవ్వటానికి వీలు లేదు, ఏదైనా రామా నాయుడే మాట్లాడాలి అని జగన్ చెప్పటంతో, ఈ విషయం చివరకు చంద్రబాబు ధర్నా చేసి, సస్పెండ్ చేసే దాకా వెళ్ళింది. అయితే ప్రభుత్వం ఈ ఇన్సురన్సు విషయంలో ఎందుకు ఇంట కంగారు పడింది అనేది చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టే దాకా తెలియలేదు. ఆయన మాట్లాడుతూ, తాము ఆర్టిఐ ద్వారా సమాచారం తెప్పిస్తే, 1300 కోట్లు ఇన్సురన్సు ప్రీమియం కట్టాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం 33 కోట్లు మత్రమే కట్టిందని సమాచారం వచ్చిందని, ప్రభుత్వం మొత్తం కట్టి ఉంటె ఇప్పటి నష్టానికి దాదాపుగా 2 వేల కోట్లు వచ్చేదని అన్నారు. అలాగే పోయిన ఏడాది ఎన్నో విపత్తులు వచ్చిన, అసలు ప్రభుత్వం ఇన్సురన్సు క్లెయిమ్ కూడా చేయలేదని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కట్టలేదని, కట్టామని ఫేక్ సమాచారం చెప్పారని,మేము ఆధారాలు చూపిస్తే, త్వరలో కడతాం అంటూ, మమ్మల్ని ఈ విషయంలో మాట్లాడనివ్వకుండా సస్పెండ్ చేసారని అన్నారు. నష్టం జరిగిపోయిన తరువాత, ప్రీమియం కడితే ఎవరైనా ఇన్సురన్సు ఇస్తారా అని ప్రశ్నించారు. అయితే దీని పై ప్రభుత్వం మాత్రం, ఇన్సురన్సు వచ్చేలా చేస్తాం అంటుంది. మొత్తానికి పయ్యావుల చెప్పిన ఒక్క విషయంతో కంగారు పడిన వైసీపీ, చివరకు అందరినీ సస్పెండ్ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెలిసిన వారు, చంద్రబాబు నైజం గురించి తెలియని వారు ఉండరు. చాలా తక్కువ సందర్భాల్లో చంద్రబాబు సహనం కోల్పోతారు. ఇక అసెంబ్లీలో అయితే చంద్రబాబు ఎప్పుడూ నిరసన తెలపలేదు. ఎమ్మెల్యేలు నిరసన చేస్తారు కానీ, ఎప్పుడూ చంద్రబాబు నిరసన తెలపలేదు. అయితే చరిత్రలో మొదటిసారి చంద్రబాబు అసెంబ్లీలో నిరసన తెలిపారు. రైతులు తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని, దాని పై తనకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని, రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తేవాలని చంద్రబాబు కోరినా, ఆయనకు మాట్లాడే అవకాసం ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు రైతుల కష్టాల గురించి ప్రభుత్వానికి చెప్పాలని, రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చెప్పాలని, అవకాసం ఇవ్వాలని చెప్పినా , ఇవ్వకపోవటంతో, రైతుల తరుపున చంద్రబాబు స్పీకర్ ముందు బైఠాయించారు. ముందుగా కన్నబాబు తమ ప్రభుత్వం ఇది చేసింది , అది చేసింది, తమ ప్రభుత్వంలో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, రైతులు తమ ప్రభుత్వం పై సంతోషంగా ఉన్నారని, మంత్రి చెప్పారు. అయితే మంత్రి సమాధానం పై నిమ్మల రామానాయుడు స్పందిస్తూ, రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి చెప్తూ ఉండగా, జగన్ మోహన్ రెడ్డి కల్పించుకుని, నిమ్మల రామానాయడుకు కౌంటర్ ఇచ్చారు.

cbn 301120202

అయితే జగన్ సమాధానం పై చంద్రబాబు, తనకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని కోరారు. రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి తమకు మాట్లాడే అవకాసం ఇవ్వాలని కోరగా, అవకశం ఇవ్వలేదు. స్పీకర్ కు చంద్రబాబుకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అయితే ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి, నిమ్మల రామానాయడుకి సమాధానం ఇచ్చాం కాబట్టి, ఆయనే మాట్లాడాలని, చంద్రబాబుకి మాట్లాడే అవకాసం ఎలా ఇస్తాం అంటూ ఆయనకు ఇవ్వటానికి వీలు లేదని జగన్ అన్నారు. దీంతో రైతుల తరుపున మాట్లాడే అవకాసం ఇవ్వకపోవటంతో, చంద్రబాబు స్వయంగా అసెంబ్లీ స్పీకర్ ముందు కింద కూర్చుని , నిరసన తెలిపారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని, రైతుల కష్టాల గురించి, మాట్లాడే అవకాసం ఇవ్వాలని నిరసన తెలిపారు. అయితే ఆయానకు మాట్లాడే అవకాసం ఇవ్వకూడదు అని, అది సాంప్రదాయం కాదని, తాము ఇంకా బిజినెస్ చేసుకోవాలని, వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలనీ, జగన్ కోరారు. దీంతో రైతులు సమస్యల పై ప్రతిపక్షం మాట్లాడకుండానే అందరినీ సస్పెండ్ చేసారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ముందుగా చనిపోయిన వారికి సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అయితే ఈ రోజు శాసనసభ సమయానికి ప్రారంభం కాలేదు. దాదాపుగా అరగంట లేటుగా సమావేశం ప్రారంభం అయ్యింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన టైంకి కాకుండా, లేట్ గా ప్రారంభం కావటం ఎప్పుడూ లేదని, జగన్ మోహన్ రెడ్డి రాలేదని సభను వాయిదా వేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అయితే మీరు బయట నిరసన తెలుపుతున్నారు కదా, ఎప్పుడు అయితే ఏముందిలే అంటూ అధికార పక్షం కౌంటర్ ఇచ్చింది. అయితే సభ ప్రారంభమే ఇలా ప్రారంభం అయ్యింది. తరువాత బీఏసి సమావేశం జరగటం, అందులో పది రోజుల పాటు అసెంబ్లీ జరగాలి అంటూ తెలుగుదేశం పట్టుబట్టం, కుదరదు మేము అయుదు రోజులే జరుపుతాం అంటూ, అధికార పక్షం చెప్పటం జరిగిపోయాయి. ఇక తరువాత, అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అసలు ఆ బిల్లు పై మాట్లాడే అవకాసం కూడా ఇవ్వలేదు. దీంతో తెలుగుదేశం పార్టీ వాక్ అవుట్ చేసింది. ఇది అయిపోయిన తరువాత వ్యవసాయం పై ప్రభుత్వం చర్చ మొదలు పెట్టింది. మంత్రి కన్నబాబు సుదీర్ఘంగా చెప్పారు.

lokesh 301112020 2

అయితే తుఫాను వల్ల నష్టపోయిన రైతుల సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రభుత్వం వాటి గురించి చెప్పటం లేదని, వాటి గురించి తమ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తామని చంద్రబాబు కోరగా, ఆయనకు మైక్ ఇవ్వకపోవటంతో, చంద్రబాబు మొదటి సారి స్పీకర్ పోడియం ముందు నేల పై కూర్చుని నిరసన తెలిపారు. తరువాత చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలను సస్పెండ్ చేసారు. తుఫాను నష్టం గురించి ప్రభుత్వానికి చెప్తాం అని చెప్పినా, అవకాసం ఇవ్వలేదు. ఇలా శాసనసభ ముగిసింది. అయితే ఈ రోజు శాసనమండలిలో కూడా వాడి వేడిగా చర్చ జరిగింది. తుఫాను పై మాట్లాడుతూ, మంత్రి బొత్సా, చంద్రబాబు వ్యవసాయం దండగ అని అన్నారని, చెప్పటంతో తెలుగుదేశం అభ్యంతరం చెప్పింది. అసలు ఆ మాట చంద్రబాబు గారు ఎప్పుడు ఎక్కడ అన్నారో చెప్పండి, లేకపోతే వెనక్కు తీసుకోండి అని నారా లోకేష్ అన్నారు. మరో తెలుగుదేశం ఎమ్మేల్సీ టిడి జనార్ధన్, ఆ మాటలు అన్నట్టు నిరూపిస్తే, మేము రాజీనామా చేస్తామని, లేకపోతె మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఏదో పుస్తకంలో రాసారని బొత్సా చెప్పగా, టిడిపి అందులో రాసింది ఏమిటి, మీరు చెప్పేది ఏమిటి అని ఎదురు దాడి చేయటంతో, ఏమి చెప్పలేక అక్కడ కూడా సభ వాయిదా పడే పరిస్థితి వచ్చింది.

Advertisements

Latest Articles

Most Read