పోలీసుల తీరు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి రైతులను అరెస్ట్ చేసి, వారిని 18 రోజులుగా రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. అమరావతి రైతుల పై పోలీసులు, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసారు. తరువాత కింద కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు పంపించారు. అయితే వీరికి ఇక్కడ బెయిల్ నిరాకరించటంతో వారు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. కొద్ది రోజుల క్రితం వీరికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆ సందర్భంలో హైకోర్టు ఈ అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు, సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకమని తెలిపింది. ఆ అరెస్ట్ ని ఖండిస్తూ పోలీసుల తీరుని కోర్టు తప్పుబట్టింది. ఈ విషయం పై తమకు పూర్తి నివేదక ఇవ్వాలని పోలీసులని, కింద కోర్టుని కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు, కింద కోర్టు, హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసు నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. పోలీసులు, కింద కోర్టు ఇచ్చిన వివరాలు పరిశీలించిన హైకోర్టు, జరిగిన పరిణామాల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టటం, వారిని జైలుకు పంపించటం, ఇది కచ్చితంగా అక్రమ అరెస్ట్ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి 41 ఏ నోటీస్ ఇవ్వకుండా, ఎందుకు అరెస్ట్ చేసారని పోలీసులని ప్రశ్నించింది. ఇది అక్రమ నిర్బంధం అని, ప్రాధమిక హక్కులు హరించటమే అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

hc 28112020 2

ఈ చర్యను కోర్టు ధిక్కరణ చర్యగా భావిస్తామని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, దీని పై తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు ఘాటుగా స్పందించింది. రైతుల తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది, పోలీసులు జరిగిన దానికి, కోర్టుకు సమర్పించిన నివేదికకు వ్యత్యాసం ఉందని, వక్రీకరించి చెప్తున్నారని అన్నారు. దీని పై ప్రభుత్వ తరుపు లాయర్ స్పందిస్తూ, ఇప్పటికే వారికి బెయిల్ వచ్చేసింది కాబట్టి, ఈ కేసుని ఇంతటితో వదిలేయాలని, ఈ కేసు ముగిసిపోయినట్టే అని అన్నారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, బెయిల్ ఇచ్చినా, అక్రమ నిర్బంధం పై విచారణ చేయవచ్చని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది, ఇది చాలా చిన్న విషయం అని, దీనికి కోర్టు ధిక్కరణ అవసరం లేదని చెప్పగా, కోర్టు స్పందిస్తూ, ఇది మీకు చిన్న విషయం కావచ్చు, ఇక్కడ రైతుల ప్రాధమిక హక్కులు హరించబడ్డాయి, వారు అక్రమంగా అరెస్ట్ చేయబడ్డారు, ఈ కేసు పై సహజ న్యాయ సూత్రాలు పాటిస్తూ, తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. మరి దీని పై పోలీసులు బాధ్యులు అవతారా ? కోర్టు ఏమి చెప్తుంది అనేది వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు వివరాలు అడిగితే, ఆ వివరాలు కోర్టుకు ఇవ్వలేమని, అవి రాజ్యాంగ విరుద్ధం అంటూ ప్రభుత్వం తరుపున రాష్ట్ర డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది. సహజంగా కోర్టు అడిగితే, ఎక్కడ విషయం దాయటం అనేది ఉండదు. అదీ వేల కోట్లు ఖర్చు చేసిన కేసు పై హైకోర్టులో కేసు నడుస్తూ ఉండగా, అవి మేము మీకు ఇవ్వం అని చెప్పటం పై అందరూ షాక్ అయ్యారు. ఏదైనా ఉంటే సీల్డ్ కవర్ లో ఇచ్చి, హైకోర్టుకు ఇది బయటకు ఇవ్వద్దు అని చెప్పవచ్చని, అలా కాకుండా నిబంధనలు చెప్తూ, అసలు కోర్టుకు సమాచారం ఇవ్వం అని చెప్పటం కర్రెక్టా కాదా అనే చర్చ జరుగుతుంది. అసలు కేసు విషయానికి వస్తే, అమరావతి మార్పు విషయం పై హైకోర్టులో అనేక కేసులు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా ఒక కేసు విషయం పై అందరికీ ఆసక్తి నెలకొంది. అది ఇప్పటి వరకు అమరావతిలో పెట్టిన ఖర్చు. గత తెలుగుదేశం హయాంలో దాదాపుగా 9 వేల కోట్లు పైన ఖర్చు అయ్యిందని చెప్తున్నారు. కొండవీటి వాగు, సీడ్ ఆక్సెస్ రోడ్డు, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్, వివిధ అంతర్గత రోడ్డులు, డ్రైనేజిలు, ఐఏఎస్, ఐపిఎస్, జడ్జి క్వార్టర్స్, ఎన్జీవో హౌసింగ్, నాలుగవ తరగతి హౌసింగ్, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హౌసింగ్, ఇలా అనేక అనేక బిల్డింగ్ల నిర్మాణాలు జరిగాయి. అయితే ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసిన భవనాలు ఇప్పుడు ఇక్కడ ఆపేసి, మళ్ళీ వైజాగ్ వెళ్లి, అక్కడ మళ్ళీ ఇంతా ఖర్చు చేసి భవనాలు నిర్మాణం చేయటం ఏమిటి అనేది పిటీషన్.

ag 28112020 2

అయితే దీని పై స్పందించిన హైకోర్టు, అసలు అమరావతి పై ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసారు, ఏ ప్రాజెక్ట్ కు ఎంత ఖర్చు చేసారో చెప్పండి అంటూ రాష్ట్ర ప్రభుత్వ అకౌంటెంట్ జెనెరల్ ను వివరాలు ఇవ్వమని ఆదేశించింది. అయితే ఇలా అయినా అసలు అమరావతి పై ఎంత ఖర్చు చేసారో తెలుస్తుందని, ఇన్నాళ్ళు వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు అక్కడ గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయా, నిజమైన నిర్మాణాలు జరిగాయా అనేది తెలుస్తుందని అందరూ ఆశించారు. అయితే రెండు వాయిదాలకు కూడా అకౌంటెంట్ జెనెరల్ వివరాలు ఇవ్వకపోవటంతో హైకోర్టు సీరియస్ అయ్యి, వివరాలు ఇవ్వకపోతే అకౌంటెంట్ జెనెరల్ ను కోర్టుకు పిలుస్తామని హెచ్చరించింది. అయితే రెండు రోజుల క్రితం డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ పేరుతో హైకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసి, తాము లెక్కలు అన్నీ రాష్ట్రపతికి, గవర్నర్ కి ఇస్తామని, అక్కడ నుంచి అసెంబ్లీకి వస్తుందని, ఇలాంటి వివరాలు బహిర్గత పరచటం కుదరదు అంటూ, దానికి సంబంధించి రాజ్యాంగంలో చెప్పిన రూల్స్ అన్నీ వివరిస్తూ, వివరాలు ఇవ్వటం కుదరదనే విధంగా అఫిడవిట్ లో తెలిపారు. అయితే ఈ అఫిడవిట్ పై కోర్టు ఎలా స్పందిస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

జమిలి ఎన్నికలు 2021, 2022లో వచ్చేస్తాయి అంటూ, గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే క-రో-నా కారణంగా ఈ చర్చ మరుగున పడింది. అయితే నెల రోజులు క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తనకున్న సమాచారం మేరకు జమిలి ఎన్నికలు వచ్చే అవకాసం ఉందని, ఏ పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని, జగన్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపు ఇచ్చారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను వైసీపీ, ఏపి బీజేపీ నేతలు ఖండించారు. చంద్రబాబు క్యాడర్ ని కాపాడుకోవటం కోసం, ఇలా చెప్తున్నారు అంటూ, ఎన్నికలు ఇప్పట్లో రావని కౌంటర్ ఇచ్చారు. ఈ చర్చ మన రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం గత కొన్ని రోజులుగా నడుస్తుంది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు పేరిట, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. 2022 చివర్లో ఎన్నికలు పెడితే, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు లేట్ గా జరిపి, కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ముందుకు జరపాలని అనుకున్నారు. అయితే ఇదంతా చర్చ మాత్రమే. ఎక్కడా అధికారికంగా ఎవరూ ఈ విషయం చెప్పలేదు. అయితే జమిలి ఎన్నికల పై, ఈ రోజు ఏకంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటన చేయటంతో, ఇది పెద్ద వార్త అయ్యింది. ఈ రోజు గుజరాత్ లో జరిగిన రాజ్యాంగా దినోత్సవంలో మోడీ పల్గుని, ఈ వ్యాఖ్యలు చేసారు.

modi 26112020 2

జమిలి ఎన్నికలు అనేది కేవలం చర్చించి వదిలేసే విషయం కాదని, మన దేశానికి జమిలి ఎన్నికలు ఎంతో అవసరం అని ప్రధాని అన్నారు. మన దేశంలో మాటి మాటికి, కొన్ని నెలల వ్యవధిలోనే న్నికలు వస్తూ ఉంటే, ప్రతి సారి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని మోడీ అన్నారు. అందుకే ఒకేసారి ఎన్నికలు జరిపితే మనకు ఎంతో మేలని ప్రధాని అన్నారు. ఖర్చు పరంగా కూడా దేశానికీ ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అలాగే వివిధ ఎన్నికలకు వివిధ ఓటర్ లిస్టు లు ఉన్నాయని, వీటి వల్ల వ్యయం, సమయం కూడా వృధా అవుతుందని మోడి అన్నారు. మన దేశంలో లోక్ సభ, అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలు ఒకేసారి రావాలని, దీని పై అధ్యయనం చేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. దీంతో జమిలి ఎన్నికల పై మరో సారి చర్చ జరుగుతుంది. సాక్షాత్తు ప్రధాని నోట్లో నుంచి ఈ మాట వచ్చింది అంటే, కేంద్రం జమిలి ఎన్నికలకు రెడీ అవుతునట్టే అనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది. నెల రోజుల క్రితం చంద్రబాబు చెప్పిన మాటలు నిజం అవుతాయా అనిపిస్తుంది. ఇది రాజకీయంగా బీజేపీ వేస్తున్న ఎత్తు అయినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జమిలి ఎన్నికల పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోర్టుల్లోనే కాదు, కేంద్రం వద్ద, గవర్నర్ వద్ద కూడా బిల్లులు ఆగిపోతున్నాయి. బిల్లులు చట్టబద్ధంగా ఉండటం లేదు అంటూ, కొందరు కోర్టుకు వస్తుంటే, కోర్టు వాటిని పరిశీలించి, చట్ట విరుద్ధంగా ఉంది అని నమ్మితే, వాటికి బ్రేకులు వేస్తుంది. అయితే కోర్టులు తమ పై కక్ష కట్టారు అని ప్రచారం చేసారు. అయితే కోర్టు పరిశీలనకు వెళ్ళని బిల్లులు కొన్ని, చట్టానికి లోబడి లేకపోతే గవర్నర్ వద్ద కానీ, కేంద్రం వద్ద కానీ బ్రేక్ పడుతుంది. గత వారం గవర్నర్ వీసి నియామక ఫైల్స్ ని వెనక్కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా కేంద్రం కూడా బిల్లుని వెనక్కు పంపి రాష్ట్రానికి షాక్ ఇచ్చింది. ఇప్పటికే దిశా బిల్లుని మూడు సార్లు వెనక్కు పంపిన కేంద్రం, ఇప్పుడు మరో బిల్లు విషయంలో కూడా ఇదే చేసింది. జగన్ ప్రభుత్వం, ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2019 అనే బిల్లుని తీసుకు వచ్చి, దాన్ని శాసనసభలో ఆమోదించి, గవర్నర్ వద్దకు పంపి, అక్కడ కూడా ఆమోదించుకుని, రాష్ట్రపతి వద్దకు ఫైల్ పంపించింది. అయితే ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళకుండానే, కేంద్రం వద్దే ఆగిపోయింది. కేంద్ర చట్టాలు కాలరాసే విధంగా ఈ బిల్లు ఉంది అంటూ కేంద్రం అభ్యంతరం చెప్పింది. కేంద్ర చట్టాలను ఉల్లంఘించే విధంగా, ఈ చట్టం ఎలా రూపొందించారు అంటూ, కేంద్ర హోం శాఖ కొంచెం ఘాటుగానే అధికారులను ప్రశ్నించినట్టు తెలుస్తుంది.

jagan 26112020 2

ఏకంగా సివిల్ కోర్టు అధికారాలు రద్దు చేస్తూ ఎలా చట్టం చేస్తారు అంటూ, కొన్ని ప్రశ్నలు వేసి, వాటికి సమాధనం చెప్పాలి అంటూ రాష్ట్ర అధికారులను కోరింది. వీటి పై ఇటీవల అధికారులు సమాధానాలు ఇచ్చినా, కేంద్రం వాటికి సంతృప్తి పడలేదని, తమ అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుని, బిల్లులలోని కొన్ని క్లాజులు పూర్తిగా మార్చలాని, అప్పుడే బిల్లు ఆమోదం పొందుతుందని చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దాదాపుగా 16 నెలలు తరువాత బిల్లు వెనక్కు రావటంతో ఏపి ప్రభుత్వం షాక్ అయ్యింది. మొదటి అసెంబ్లీ సెషన్ లోనే బిల్లు అసెంబ్లీలో ఆమోదించినా, ఇప్పటి వరకు కేంద్రం ఆమోదించకుండా, ఇప్పుడు తిప్పి పంపింది. అయితే ఇప్పుడు మళ్ళీ క్లాజులు అన్నీ మార్చి, మళ్ళీ సవరించిన బిల్లు అసెంబ్లీ, శాసనమండలి ఆమోదం పొందాలి. ఇక్కడ అయిన తరువాత, మళ్ళీ గవర్నర్ ఆమోదం పొందిన తరువాత, కేంద్రం వద్దకు మళ్ళీ వెళ్ళాలి. బిల్లు రూపొందించిన సమయంలోనే, తగు జాగ్రత్తలు, తగు న్యాయ సలహాలు తీసుకుని ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read