తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా, లోకేష్ గుంటూరు ఎస్పీ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది. రెండు రోజుల క్రితం, పొన్నూరులో, ఒక వైసీపీ ఎమ్మెల్యే ప్రహరీ గోడ ఓపెనింగ్ అంటూ ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో తీసింది, మణిరత్నం అనే ఒక వ్యక్తి. అతనిది దళిత సామజికవర్గం. అయితే ఆయన ప్రహరీ గోడ ఓపెనింగ్ అంటూ, ఉన్న ఫ్లెక్స్ వీడియో తీయటం, అలాగే ఆ గోడ మరో పక్క ఏమి లేకపోవటం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త వైరల్ అయ్యింది. సోషల్ మీడియా మొత్తం అదే వీడియో రెండు రోజులు తిరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పై ట్రోల్స్ వచ్చాయి. కియా, హీరో, అపోలో వంటి కంపెనీ ప్రారంభోత్సవాలు చూసిన ఏపి ప్రజలు, ఇలా ప్రహరీ గోడలు, బోరింగ్ పంపులు ఓపెనింగ్ లు చూస్తున్నారు అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే నిన్న ఉదయం ఆ వీడియో పోస్ట్ చేసిన మణి రత్నం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు అంటూ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, అలాగే నారా లోకేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, పోలీసుల విఖరి ని ఖండించారు. కేవలం పోస్ట్ పెడితే అరెస్ట్ చేస్తారా, అతను చేసిన తప్పు ఏమిటి అంటూ పోలీసుల వైఖరిని కూడా తప్పుబడుతూ పోస్ట్ చేసారు. అలాగే ఆ మణిరత్నం అనే వ్యక్తిని తెలుగుదేశం పార్టీ నేతలు విడిపించుకుని తీసుకుని వచ్చారు.

ln 26112020 2

అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, గుంటూరు ఎస్పీ ట్విట్టర్ ఎకౌంటు నుంచి, చంద్రబాబు,లోకేష్ పోస్ట్ చేసిన పోస్ట్ లకు రిప్లై ఇస్తూ, ఇది తప్పుడు సమాచారం అని, ఫేక్ ప్రచారం చేస్తున్నారని, మేము ఎవరినీ అరెస్ట్ చేయలేదని, తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం అంటూ, పోస్ట్ చేసారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. సహజంగా ఒక అధికారి నుంచి, ప్రతిపక్ష నేతకు ఇలాంటి రిప్లై రాదు. ఏదో రాజకీయ పార్టీ లాగా,అధికారులు ఇలా రిప్లై ఇవ్వటం పై అందరూ ఆశ్చర్యపోయారు. అయితే దీని పై లోకేష్ మళ్ళీ రిప్లై ఇస్తూ, ఎప్సీ గారు మీకు నిజంగా గడ్స్ ఉంటే పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో సీసీ ఫుటేజ్ బయట పెట్టండి అంటూ సవాల్ విసిరారు. అంతే కాదు, మళ్ళీ బాధితుడి వీడియో కూడా పోస్ట్ చేసారు. నిన్న ఎస్పీ గారు ఫేక్ అన్నారు అని, ఈ రోజు కేవలం ప్రశ్నించటానికి పిలిచామని చెప్పారని, సోషల్ మీడియా పోస్ట్ చేస్తే, పోలీసులు ప్రశ్నిస్తారా అని పోస్ట్ చేస్తూ, మీ లిమిట్ లో మీరు ఉండాలని, మీరు డ్యూటీ చేయాల్సింది ఈ రాష్ట్రానికి, ప్రజలకు అని మర్చిపోకండి అంటూ, ట్వీట్ చేసారు. దీని పై ఇంకా ఎలాంటి స్పందన, గుంటూరు ఎస్పీ నుంచి రాలేదు. మరి ఈ విషయం ఎటు దారి తీస్తుందో చూడాలి.

ఆంధ్రర్పదేశ్ ప్రభుత్వానికి ఈ రోజు సుప్రీం కోర్టులో కోరుకున్న రిలీఫ్ దొరకలేదు. కానీ ఒక చిన్న విషయంలో మాత్రం ఊరట లభించినా, దాని వల్ల పెద్దగా ఉపయోగం లేదనే చెప్పాలి. అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి, ఏసిబి చేస్తున్న దర్యాప్తును తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. అంతే కాకుండా, ఏసిబి విచారణ నిలిపివేస్తూ హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చిందో, ఆ ఆదేశాల పై స్టే ఇవ్వటానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. ఏపి హైకోర్టు ఏసిబి విచారణ పై ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ విషయంలో ఏపి హైకోర్టు రెండు ఆదేశాలు ఇచ్చింది. ఒకటి అమరావతి భూముల కొనుగోలు పై ఏసిబి చేస్తున్న దర్యాప్తును నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఏసిబి దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను బహిర్గతం చేయకుండా, మీడియాలో ప్రచురించకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ రెండు ఆదేశాలను సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టులో ఏపి ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఈ కేసు పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఏపి ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది రాజీవ్ దావన్ హాజరు అయ్యారు. అలాగే దమ్మాలపాటి తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్, హారీష్ సాల్వే హాజరు అయ్యి, తమ వాదనలు వినిపించారు. హారీష్ సాల్వే, ముకుల్ ఇద్దరూ గతంలో ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించిన వారు, ఈ సారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించటం విశేషం. అయితే ఈ రోజు వాదనలు వాడిగా వేడిగా వాదనలు జరిగాయి. హైకోర్టు దర్యాప్తు ఎలా నిలిపివేస్తుంది అంటూ ప్రభుత్వం తరుపున రాజీవ్ ధావన్ వాదించారు. గత సంప్రదాయాలకు విరుద్ధం అని వాదించారు.

ఇక దమ్మాలపాటి తరుపున వాదించిన ముకుల్, ఇది కక్ష సాధింపు చర్య అని, గతంలో జగన్ కు వ్యతిరేకంగా వాదించారు, అందుకే కక్షతో ఈ కేసు నమోదు చేసారని వాదించారు. 30 ఏళ్ళ పాటు న్యాయవాది వృత్తిలో ఉన్న వారిని అపఖ్యాతి చేయటానికి, ఇతరులపై బురద చల్లటానికి దీన్ని వాడుకుంటున్నారని వాదించారు. సిబిఐకి ప్రభుత్వం లేఖ రాసినా పట్టించుకోలేదని గుర్తు చేసారు. కేసు ఫైల్ చేయక ముందే, ఐటి రిటర్న్స్ కోసం ఎందుకు ప్రభుత్వం పురమాయించిందని, ఇది కచ్చితంగా కక్ష సాధింపు అని అన్నారు. ఇక హరీష్ సాల్వే, ఇది హైకోర్టు మీద నో కాన్ఫిడెన్సు గా అభివర్ణించారు. ఇది హైకోర్టులో తేల్చుకోవాల్సిన అంశం అని, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని అన్నారు. భుములు కొనటం తప్పు కాదని, పలానా చోటు ప్రాజెక్ట్ వస్తుంది అనేది అందరికీ తెలిసే విషయమే అని, తెలిసే భూములు కొంటారని అన్నారు. ఇరువరి వాదనలు విన్న కోర్టు గ్యాగ్ ఆర్డర్ పై మాత్రం స్టే విధిస్తూ, ఏసిబి విచారణ పై మాత్రం హైకోర్టు ఉత్తర్వుల పై ఎలాంటి స్టే ఇవ్వలేదు. జనవరి చివరికి ఈ కేసు వాయిదా వేసి, అప్పటి వరకు, ఎలాంటి విచారణ చేయవద్దని ఆదేశించింది. ఇక ఈ కేసులో ప్రభుత్వానికి అయితే ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గ్యాగ్ ఆర్డర్ పై స్టే ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి వచ్చేది ఏమి లేదు. ఇప్పటికే చేయాల్సిన అల్లరి అంతా ఈ కేసులో చేసారు. కాబట్టి, దీని వల్ల పెద్దగా ఏమి ఉండదు. ఏసిబి విచారణ పై హైకోర్టు ఇచ్చిన స్టే మాత్రం అలాగే ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి, వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శాసనమండలి, హైకోర్టు, ఎన్నికల కమిషన్ లాంటి అతి ముఖ్యమైన రాజ్యాంగ వ్యవస్థలతో, ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరంగా ఉందని అనేక సార్లు విశ్లేషణలు వచ్చాయి. అయినా ప్రభుత్వం మారటం లేదు. ప్రతి రోజు ఏదో ఒక అంశం తెర మీదకు వస్తూనే ఉంది. చివరకు హైకోర్టు మీద చేస్తున్న కుట్రకు, సిబిఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో గత వారం పది రోజలుగా, ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల నిర్వహరణలో బేధాభిప్రాయలు వచ్చాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయ్యింది. మొదట్లో అంటే వైరస్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ వైరస్ అంటే అందరికీ తెలిసి పోయింది. చివరకు సినిమా హాల్స్, స్కూల్స్ లాంటివి కూడా తెరుచుకోమని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి ఎన్నికలు జరపటానికి మాత్రం వెనకడుగు ఎందుకు వేస్తుందో తెలియదు. హైకోర్టు కూడా ఇదే ప్రశ్న అడిగింది. పక్క రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలే నిర్వహిస్తున్నాయి కదా అని ప్రశ్నించింది. ఈ నేపధ్యంలోనే అందరితో సంప్రదింపులు జరిపిన ఎన్నికల కమిషన్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయ్యారు. ఇదే విషయం పై ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీని పై తాము అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని అనుకుంటున్నామని చీఫ్ సెక్రటరీకి రెండు సార్లు లేఖ రాసారు. సహకరించకపోవటంతో, గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసారు.

nimmagadda 24112020 2

అయినా ఎలాంటి మార్పు లేకపోవటంతో మళ్ళీ హైకోర్టు మెట్లు ఎక్కాలని అనుకున్నారు. దీనికి సంబంధించి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ రోజు మరోసారి చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. ఈ సారి పకడ్బంధీగా లేఖలో అంశాలు ఉన్నాయి. తాము ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నామని, దీనికి ప్రభుత్వ సహకారం కావాలని లేఖలో రాస్తూ, గత నెల 3వ తారిఖు ఇదే అంశం పై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని జత పరిచి చీఫ్ సెక్రటరీకి పంపించినట్టు సమాచారం. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ తమకు సోమవారం అందింది అని, అందులో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో తమకు తెలపాలని కోరారని, ఎన్నికల సంఘం అభ్యర్ధన పై ప్రభుత్వం కావాల్సిన ఆన్ని సహకారాలు అందించాలని హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేసేలా చూడాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసారు. దీంతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్, తాము ఇచ్చిన ఆదేశాలు కాకుండా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్నాళ్ళు రమేష్ కుమార్ ని లెక్క చేయని ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టు ఆదేశాల పై ఎలా స్పందిస్తుందో చూడాలి. రమేష్ కుమార్ రాసిన లేఖ పై ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎలా స్పందిస్తారో మరి.

దక్షిణ భారత దేశంలో కర్ణాటక తరువాత, బీజేపీకి కొంచెం బలం ఉన్నది తెలంగాణాలో. ఆంధ్రప్రదేశ్ లో అయితే బీజేపీకి నోటా కంటే తక్కువ వచ్చాయి. తమిళనాడులో ఇంకా ఘోరమైన పరిస్థితి. కేరళలో ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టు పార్టీ ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు కొద్దిగా బలం ఉన్న తెలంగాణా పై ఎదగటానికి బీజేపీ ఫోకస్ పెట్టింది. ఒక్క ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు బీజేపీకి తెలంగాణాలో ఉన్నారు. అయితే మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో, టీఆర్ఎస్ కు చుక్కలు చూపించి, వెయ్యి ఓట్లతో దుబ్బాక గెలిచారు. మొత్తానికి ఒక సీట్ నుంచి, రెండు సీట్ లకు తెలంగాణాలో బీజేపీ ఎదిగింది. ఈ నేపధ్యంలోనే, వెంటనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు వచ్చాయి. ఇంకేముంది, ఇక్కడ కూడా దుబ్బాక సీన్ రిపీట్ చేస్తాం అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే నాలుగు కార్పోరేటర్ సీట్లు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా మేయర్ స్థానం పైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో హిందూ అజెండా తీసుకుని, గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఏదో మాటలు వరుకే కాకుండా, గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వచ్చారు. చార్జ్ షీట్ విడుదల చేసి ప్రచారం చేసారు. ఇక హైదరాబాద్ కాదు భాగ్యనగరం అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా హడావిడి చేసారు. వీరిద్దరూ ఇప్పటికే ప్రచారం పూర్తి చేసుకోగా, ఇప్పుడు మరి కొంత మంది నేతలను తెలంగాణా బీజేపీ నేతలు రప్పిస్తున్నారు. రేపు మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారానికి వస్తున్నారు. ఇక అలాగే ఉత్తర ప్రదేశ్ సియం యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 27న వస్తారని, ఈ నెల 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వస్తారని, మరి కొంత మంది నేతల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు.

హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి నివాసం ఉంటున్నారని, వారి ఓట్ల కోసం, బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల నాయకులను తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో దాదాపుగా 10 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి మాత్రం ఒక్క నాయకుడుని కూడా తీసుకుని రావటానికి ,తెలంగాణా బీజేపీ నేతలు ఒప్పుకోలేదా ? అంటే అవును అనే, జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. ఏపి బీజేపీలో సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జీవీఎల్ తప్ప, మిగతా ఎవరూ కనిపించరు. వీరేమో జగన్ మోహన్ రెడ్డికి అనుకూలం అనే ప్రచారం ఉంది. జగన్, కేసీఆర్ స్నేహం అందరికీ తెలిసిందే. అందుకే తెలంగాణా బీజేపీ నేతలు, ఆంధ్రా బీజేపీ నేతలను దూరం పెట్టినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఏపి బీజేపీ నేతలు అంటేనే మండిపడుతూ ఉంటారు. అలాంటిది వీరి వల్ల నష్టం తప్ప, లాభం లేదని, మొన్న ఒక ప్రముఖ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయి. మొత్తానికి ఇది ఏపి బీజేపీ నేతల పరిస్థితి. మరి ఇక్కడేమో ఏకంగా చంద్రబాబుని, జగన్ ని కొట్టేసి అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్తున్నారు. చూడాలి వీళ్ళ ఆశలు ఎలా నెరవేరుతాయో. ప్రజలను ఎలా ఒప్పిస్తారో.

Advertisements

Latest Articles

Most Read