తెలుగుదేశం నేతలను, రాష్ట్ర ప్రభుత్వం వెంటాడుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో తెలుగుదేశం నేతల పై ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. ఇందు కోసం, కొత్త కొత్త మార్గాలు, కోనేళ్ళ క్రిందట కాయితాలు ప్లాన్లు చూసి మరీ, చట్ట ప్రకారం ఎలాంటి ఇబ్బంది కలగకుండా, టిడిపి నేతలకు షాక్ ఇస్తున్నారు. గత నెలలో వారం రోజుల గ్యాప్ లో, విశాఖపట్నంలో తెలుగుదేశం నేత సబ్బం హరి, ఇంటి ప్రహరీ గోడను జీవీఎంసి అధికారులు, ఉదయం నాలుగు గంటలకు వచ్చి, చెప్పా పెట్టకుండా, జేసీబీలతో కూల్చేసారు. అది పార్క్ స్థలం అని, పార్క్ స్థలం వంద గజాలు ఆక్రమించి నిర్మాణాలు చేసారు అంటూ, అక్కడ వాచమేన్ కోసం ఉన్న టాయిలెట్ ని పడేసారు. అప్పుడే దీని పై రచ్చ జరిగింది. అయితే ఇవన్నీ సక్రమంగానే ఉన్నాయి అంటూ, సబ్బం హరి చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాయితాలు అధికారులకు ఇస్తానని, వాళ్ళే తేలుస్తారని అన్నారు. దీని పై కోర్టుకు వెళ్ళే ఉద్దేశం లేదని తెలిపారు. అయితే సబ్బం హరిని మాత్రం వదలలేదు. జీవీఎంసి అధికారులు మళ్ళీ వేరే రూట్ లో వచ్చారు. ఓపెన్ స్పేస్ కోసం రిజర్వ్ చేసిన భూములు భవనాలు కట్టారు అంటూ, మరో విషయంతో సబ్బం హరి ఇంటికి వచ్చారు. అయితే ఈ సారి మాత్రం ఉదయం పూట జేసిబీలు వేసుకుని వచ్చి కూల్చలేదు.

sabbam 07112020 2

నోటీసులు అంటించి, అందులో మూడు రోజులు సమయం ఇస్తున్నట్టు చెప్పారు. అయితే ఈ నోటీసు ఇవ్వటానికి సబ్బం హరి ఇంటికి వెళ్ళగా, ఆయన ఇంట్లో లేరు. ఆయన వాచ్మెన్ కు నోటీస్ ఇవ్వగా, వాచ్మెన్ నోటీస్ తీసుకోవటానికి నిరాకరించారు. దీంతో అధికారులు ఆ నోటీస్ ని గోడకు అంటించి వెళ్ళారు. 40 ఏళ్ళ క్రితం వేసిన లే అవుట్ లో, రిజర్వ్ ఓపెన్ స్పేస్ వదలకుండా కట్టారు అంటూ, నోటీసులు ఇచ్చి, వాటిని మూడు రోజుల్లో తొలగించాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం ఏమి చేయాలో, అది మేమే చేస్తాం అని ఆ నోటీసుల్లో చెప్పారు. ఇది ఇలా ఉంటే గతంలో కోర్టుకు వెళ్ళను అని చెప్పిన సబ్బం హరి, వేధింపులు రోజు రోజుకీ ఎక్కవు అవటంతో, ఆయన హైకోర్టుకు వెళ్లారు. శుక్రవారం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. పిటీషన్ పై విచారణ చేసిన కోర్టు మధ్యంతర ఆదేశాలు ఇస్తూ, సోమవారం వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని, సోమవారం ఈ విషయం పై పూర్తి స్థాయిలో విచారణ చేసి, ఆ రోజు తదుపరి ఆదేశాలు ఇస్తామని కోర్టు తెలిపింది. అయితే మరోసారి సబ్బం హరికి నోటీసులు ఇవ్వటం పై చంద్రబాబు మండి పడ్డారు. ఇది ఆటివిక చర్య అని, ఎప్పుడు ఎవరిది కూల్చేద్దామా అనే ఆలోచనలే ఈ ప్రభుత్వానికి ఉన్నాయని విమర్శలు గుప్పించారు.

నీతి నిజాయతీగా ఉండటమే ఆయన చేసిన పాపం. తప్పు జరిగింది చూడండి అని చెప్పినందుకు, ఆయన పైనే కేసు పెట్టి, అరెస్ట్ చేసిన వింత ఘటన ఇది. నెల్లూరు జిల్లా అనికేపల్లికి చెందిన సామాన్య దళితుడు జైపాల్ వద్ద కష్టపడి పండించిన పంటను దళారులు తక్కువ ధరకు కొని ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకున్నారు. తన పేరుతో అక్రమాలు జరిగాయని ఆయనే స్వయంగా జిల్లా ఉన్నతాధికారులను కలిసి విచారణ జరపమంటే బాధితుడిపైనే క్రిమినల్ కేసులు పెట్టారు. ధాన్యం కొనుగోళ్ల కుంభకోణం వెనకున్న వైసీపీ పెద్ద రెడ్లను కాపాడేందుకు దళితుడిని బలి చేసారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. జైపాల్ పై బనాయించిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని కోరుతూ, జైపాల్ తల్లితో కలిసి తెలుగుదేశం నాయకులు నిన్న కల్లెక్టరేట్ కు వచ్చారు. పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్ కుమార్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, జెన్ని రమణయ్య, శ్రీపతి బాబు, కుంకాల దశరధనాగేంద్ర ప్రసాద్, గుమ్మడి రాజా యాదవ్, నలగర్ల సుబ్రహ్మణ్యం తదితరులు, వచ్చి జైపాల్ అరెస్ట్ పై కలెక్టర్ కు మోర పెట్టుకున్నారు. న్యాయం చేయమని జిల్లా ఉన్నతాధికారులను స్వయంగా కలిసి కోరిన దళితుడిపై క్రిమినల్ కేసు పెడతారా అని కలెక్టర్ ని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో తన పేరుతో జరిగిన అక్రమాలపై విచారణ జరపమని కోరిన దళిత రైతు గాలి జైపాల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ఖండించారు

jaipal 07112020 2

జైపాల్ తల్లి అచ్చమ్మ జరిగిన ఘటన పై బోరు మని మీడియా ముందు తన గోడ చెప్పుకుంది. కూలి చేసుకుని నిజాయతీగా బతకడమే తమకు తెలుసని దొంగతనాలు తమకు తెలియవని...ఇంతగా వేధించే బదులు మా కుటుంబాన్ని చం-పే-యం-డి కలెక్టర్ గారూ.. అని రోదించింది. నిజాయితీగా బ్రతకటమే మా తప్పా అని ప్రశ్నించారు. తప్పు జరిగింది అని ఫిర్యాదు చేస్తే తన బిడ్డ పైనే కేసు పెట్టారని, కష్టపడి బ్రతికే రైతు నా బిడ్డను, దొంగను చేసారు అంటూ బోరున విలపించారు. తాము చిన్న చిన్న వాళ్ళం అని, చిన్నగా వ్యవసాయం చేసుకుంటూ, చేపలు అమ్ముకుంటూ బ్రతికే వారమని, అలాంటిది తమ పైనే, అక్రమ కేసులు పెట్టి, దొంగతనం కేసులు పెట్టి వేధిస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని వాపోయారు. ఎవరో చేసిన తప్పుకు తాము ఎందుకు బలి అవ్వాలని, తప్పుడు పత్రాలు సృష్టించి తమను ఇబ్బందులు పెడుతున్నారని, ఈ వయసులో నాకు ఈ కష్టం తెచ్చిపెట్టారని, దొంగలు, దోపిడీలు చేసే వాళ్ళు భయపడాలి కానీ, తాము నిజాయతీగా కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళం అని వాపోయారు. అన్యాయం జరుగుతుంది అని చెప్తే, ఎక్కడ అన్యాయం జరిగిందో చూడాలి కానీ, తప్పు చేస్తున్నారు అని చెప్పిన మా పైనే కేసు పెట్టారని వాపోయారు.

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జస్టిస్ రాకేష్ కుమార్ నేతృత్వం వహిస్తున్న బెంచ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఎత్తున హెబియస్ కార్పస్ పిటిషన్లు నమోదు అయ్యాయి. ఆ హెబియస్ కార్పస్ పిటిషన్లపై ఈ రోజు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతుందా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. అంటే ఆర్టికల్ 356 ఉపయోగించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఏమో అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రోజు విజయవాడకు చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లంటి లోచిని అనే వ్యక్తుల హెబియస్ కార్పస్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేస్తూ, ఈ రాష్ట్రంలో చాలా పరిణామాలు మేము గమనిస్తున్నాం, అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతుందా లేదో అని చర్చించి, విచారణ చేసి, ఏమైనా ఉత్తర్వులను, న్యాయస్థానాలు ఇచ్చే అవకాసం ఉందో లేదో చెప్పాలి అంటూ, దీనికి సంబంధించి అన్ని న్యాయపరమైన అంశాలు పరిశీలించాలని, కోర్టుకు ఎంత వరకు ఈ విషయంలో వెళ్లేందుకు పరిమితులు ఉంటాయో చెప్పాలని, తమకు దీనికి సంబంధించి మొత్తం సమాచారం ఇవ్వాలని, పిటీషనర్ తరుపు న్యాయవాదిగా ఉన్న రవి తేజ అనే లాయర్ ను, గౌరవ హైకోర్టు ఆదేశించింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగపరంగా పాలన చేయటం లేదు కాబట్టి, కోర్టులు ఏమి చేయగలవో, చట్టాలు చూసి చెప్పాలని కోరింది.

hc 06112020 2

అంతే కాకుండా కోర్టు, కొన్ని విషయాలు ప్రస్తావన కూడా చేసింది. ముఖ్యంగా అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్న బిల్లు, అసెంబ్లీలో ఆమోదం పొందిన తరువాత, అది శాసనమండలిలో తిరస్కరణకు గురి అయితే, శాసనమండలినే రద్దు చేయాలనే నిర్ణయం తీసుకోవటం, మేము గమనించామని చెప్పింది. అలాగే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నమోదు అవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్ల పై కూడా, మేము గమనిస్తున్నాం అని కోర్టు చెప్పింది. ఇప్పటికే ఈ విషయం పై , పోలీసుల పై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక అదే విధంగా, సోషల్ మీడియాలో న్యాయమూర్తుల పై , కోర్టుల పై చేస్తున్న వ్యాఖ్యలపై, చర్యలు తీసుకోండని, కోర్టు చెప్పినా, ఏ చర్య తీసుకొని పరిస్థితిని కు మేము గమనించామని, ఇలా పలు సందర్భాలను కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి అనేక అంశాల పై అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుందా లేదా అనేది పరిశీలించాల్సి ఉందని, మీరు కూడా ఈ విషయం పై అఫిడవిట్ దాఖలు చేయండి అంటూ, కోర్టు ఆదేశించింది. మొత్తంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పనుల పై , ఇప్పటి వరకు పలు కామెంట్ లు చేస్తూ, హెచ్చరిస్తూ వచ్చిన కోర్టు, ఇక తొందరలోనే చర్యలకు కూడా దిగుతాం అనే సంకేతాలు ఇచ్చింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం, ఇలాంటి తప్పులు జరగకుండా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై గత రెండు రోజులుగా, సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలు, అలాగే గతంలో ఉండవల్లి శ్రీదేవికి సన్నిహితంగా ఉండే ఇద్దరు, రెండు రోజుల్లు క్రితం, ఎమ్మెల్యే శ్రీదేవి అలాగే ఎంపీ సురేష్ పై ప్రెస్ మీట్ పెట్టి, అవినీతి చేస్తున్నారు అంటూ కొన్ని ఆధారాలు బయట పెట్టారు. అలాగే తమను వాడుకుని వదిలేసారని, డబ్బులు తీసుకుని ఇవ్వటం లేదు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడేమో తమ పై కేసులు పెట్టి వేధిస్తున్నారు అంటూ, ప్రెస్ మీట్ లో వాపోయారు. అయితే దీని పై స్పందించిన ఉండవల్లి శ్రీదేవి వారు తన పై అనవసరంగా అల్లరి చేస్తున్నారని, వారి వళ్ల తన ప్రా-ణా-ని-కి కూడా ముప్పు ఉందని, వారి పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. అయితే నిన్నటి వరకు ఈ వ్యవహరం ఇలా ఉండగా, ఈ రోజు మరో మలుపు తిరిగింది. సందీప్ అనే వ్యక్తి ఒక సేల్ఫీ వీడియో విడుదల చేసి, జరిగినది మొత్తం జగన్ కు విన్నవించుకుంటూ తమను కాపాడాలని కోరారు. సేల్ఫీ వీడియోలో తన బాధ చెప్పుకున్నారు. ఈ వీడియో అన్ని టీవీ చానల్స్ లో వచ్చింది. అయితే మరి కొద్ది సేపటికి గతంలో ఉండవల్లి శ్రీదేవితో ఆటను మాట్లాడిన ఆడియో విడుదల చేసి, మరో సేల్ఫీ వీడియో విడుదల చేసారు. తన పై అనవసరంగా శ్రీదేవి అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని, ఆమె పెకాటి ఆదిద్దాం అంటూ చెప్పింది అంటూ, ఒక ఆడియో విడుదల చేసారు. అయితే ఇది ఫేక్ అని ఉండవల్లి శ్రీదేవి ఒక టీవీ ఛానల్ లో చెప్పారు.

undaalli 07112020 2

ఇక మరో పక్క ఈ అంశం పై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు, వంగలపూడి అనిత స్పందించారు. ఉండవల్లి శ్రీదేవి పై చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని డిమాండ్ చేసారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పోటా పోటీగా పేకాట క్లబ్ లు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని జూదాంద్రప్రదేశ్ గా మారుస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో మంత్రి గుమ్మనూరు వ్యవహారం మర్చిపోక ముందే ఇప్పుడు సొంత పార్టీ నేతలే, ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్ లో భాగోతం ఆధారాలతో బయట పెట్టారని ఆరోపించారు. ఆధారాలు ఇంత స్పష్టంగా ఉన్నాయని, ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఉండటానికి అర్హులు కాదని, మీడియాలో వస్తున్న ఆడియో టేప్ లో పై విచారణ చేపించి, ఆమెను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేసారు. స్వయంగా ఎమ్మెల్యేనే పేకాట నిర్వహించాలని చెప్తుంటే, ముఖ్యమంత్రి ఈ విషయం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ప్రజలు వీరికి సమస్యలు తీర్చటం కోసం ఎమ్మెల్యేలను చేస్తే, వీళ్ళు అవేమీ పట్టించుకోకుండా పేకాటలో బిజీగా ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం, పోలీసులు ఈ అంశం పై సీరియస్ గా దృష్టి పెట్టాలని, చట్ట ప్రకారం వ్యవహరించి, ఉండవల్లి శ్రీదేవి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

Advertisements

Latest Articles

Most Read