టీడీపీ సీనియర్ నాయకులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి సారి ప్రభుత్వం పై గట్టిగా పోరాడాతున్న సందర్భంలో, అవి ప్రజల్లోకి వెళ్తున్నాయి అంటే, వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అమరావతి భూములపై ఆరోపణలు కూడా అలాంటివే అని అన్నారు. టీడీపీ పై రాజకీయ కక్షతోనే అమరావతి పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఇప్పటికి 16 నెలలు అయ్యిందని, మంత్రి వర్గ ఉప సంఘాలు, expert కమిటీలు, సిఐడి, ఏసిబీ ఇలా అనేక ఎంక్వయిరీలు వేసి, ఇప్పటికీ ఆధారాలు చూపించకుండా, బురద చల్లే పనిలోనే ఉన్నారని అన్నారు. దుర్మార్గుల పాలనలో మంచివాళ్లు పడే కష్టాలకు మన రాష్ట్రమే ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. తమ దోపిడీకి ఇదే చివరి అవకాశం అనే టైపులో వైసీపీ ఇష్టం వచ్చినట్టు చేస్తుందని అన్నారు. ఎవరినీ మాట్లడతనివ్వటం లేదని, ప్రజలు కూడా విసిగిపోయారని, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని, ప్రజలే వీరి పై ఎదురు తిరిగే రోజు, తొందర్లోనే ఉందని అన్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా స్వేఛ్చ ఉందా అని ప్రశ్నించారు ? ఉద్యోగులు దగ్గర నుంచి ప్రజల వరకు ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేక పోతున్నారని, ఎస్సీ మహిళల పరిస్థితి దారుణంగా ఉందని, వారి మానానికి రక్షణ లేకుండా ఊళ్ళలో పరిస్థితితులు ఉన్నాయని అన్నారు. వైసీపీ చేస్తున్న అరాచకంతో ప్రాధమిక హక్కులే కాదని, జీవించే హక్కుని కూడా ప్రజలు కోల్పోతున్నారని చంద్రబాబు అన్నారు. పోలీసులని అడ్డు పెట్టుకుని, ప్రతిపక్షాన్ని అణిచివేసే కార్యక్రమం చేస్తున్నారని, పోలీసులు ఒక పార్టీ కాకుండా, అందరి హక్కుల కోసం నిలబడాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేకుండా చెయ్యాలనే ధోరణితో చాలా ప్రమాదం అని చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్రంలో ఒక మతం టార్గెట్ గా కొన్ని జరుగుతున్నాయని, ఏ మత విశ్వాసాన్ని దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదనే విషయం గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు అన్నారు. అన్ని మతాలను గౌరవించి, వారి మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని చంద్రబాబు అన్నారు.

మాజీ స్పీకర్, మంత్రి పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్న, కోడెల శివప్రసాద్ చనిపోయి రేపటకి ఏడాది అవుతుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆయన గత ఏడాది సెప్టెంబర్ 16న బలవంతంగా చనిపోయిన సంగతి తెలిసిందే. స్పీకర్ గా, మంత్రిగా, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేసిన వ్యక్తి పై ఫర్నిచర్ దొంగ అనే ఆరోపణలు చెయ్యటం, అలాగే తమ అనుకూల మీడియాలో, విష ప్రచారం చెయ్యటం, చేయని తప్పుకు నిందలు మోపటంతో, ఒకప్పుడు ప్రజల కోసం పల్నాడులు పెత్తందార్లకు తల వంచకుండా బ్రతికిన కోడెల, నేడు కూడా ఎవరికీ తల వంచకుండా బలవంతంగా చనిపోయారు. రేపు కోడెల శివప్రసాద్ ప్రధమ వర్ధంతి కావటంతో, కోడెల అభిమానులు, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పలు సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసారు. ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పటల్‌ సౌజన్యంతో సత్తెనపల్లితో పాటుగా నరసరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు నేతృత్వంలో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే మరి కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడతో పాటు కోడెల విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు కోడెల తనయుడు శివరాం తెలిపారు. అయితే ఈ ఏర్పాట్లు తెలుసుకున్న పోలీస్ శాఖ అభ్యంతరం చెప్పింది. కోడెల ప్రధమ వర్ధంటికి అడ్డంకులు సృష్టిస్తూ, కోవిడ్ నిబంధనల పేరుతో రేపు కార్యక్రమం చెయ్యకూడదు అంటూ నోటీసులు ఇచ్చారు. కోడెల శివరాంకు దీనికి సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డా.చదలవాడ అరవింద బాబుకి, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలకు కూడా నోటీసులు ఇస్తూ, రేపు ఎలాంటి కార్యక్రమాలు చెయ్యకూడదని నోటీసులు ఇచ్చారు. దీని పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు లేని ఇబ్బంది, మాకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే రేపు కార్యక్రమాలు జరుగుతాయని, కార్యక్రమాన్ని ఆపేది లేదని, అన్ని కార్యక్రమాలు అనుకున్న ప్రకరామే జరిపి తీరుతాం అని, కోడెల శివరాం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రూల్ అఫ్ లా ఉందా ? ఇప్పటికే అనేక సార్లు మిమ్మల్ని హెచ్చరించాం. అయినా మీ తీరు మారలేదు. మీ తీరుతో ప్రభుత్వానికి నష్టం. చేతకాక పొతే రాజీనామా చెయ్యండి అంటూ హైకోర్టు డీజీపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమలాపురం మండలం ఇందుపల్లిలో వెంకటరాజు అనే వ్యక్తి అదృశ్యం కేసు పై, వెంకటరాజు మేనమామ, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు అయ్యింది. అమలాపురంలో అక్రమంగా ఒక వ్యక్తిని నిర్బంధించారు. వైజాగ్ లో కేసుకు సంబంధించి ఆచూకీ చెప్పాలి అంటూ, అమలాపురంలో ఉన్న వ్యక్తిని నిర్బంధించటంతో, వాళ్ళు హైకోర్టులో పిటీషన్ దాఖలు చెయ్యగానే, ఇతన్ని విడుదల చేసారు. అయితే ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంలో, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ రాష్ట్రంలో, ఏమి జరుగుతుంది ? గతంలో ఇలాంటి పిటీషన్లలోనే రాష్ట్ర డీజీపీ హైకోర్టు ముందు హాజరు అయ్యి, రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు చేస్తానాని, హామీ ఇచ్చారని, అయితే తరువాత కూడా ఇలాంటి ఘటనలు జరగటం ఏమిటి అంటూ, హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. ఇటువంటి పరిస్థితితులు రాష్ట్రంలో సరి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

మా దగ్గరకు వచ్చే ప్రతి కేసుని సిబిఐ ఎంక్వయిరీకి ఇచ్చే పరిస్థితి ఉండదని, హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి పరిస్థీతులు రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయి అంటూ, గతంలో జరిగిన అన్ని సంఘటనలు కోర్టు గుర్తుకు చేసింది. ఇటువంటి పరిస్థితి సరైనది కాదని, మీ తీరుతో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో విచారణ జరిగిన ప్రతి సారి పోలీసులదే తప్పని తేలిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పుతుంది అంటూ, హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపిలో రూల్ అఫ్ లా అమలు కావటం లేదని, పోలీస్ వ్యవస్థని కంట్రోల్ చేయలేకపొతే, డీజీపీ రాజీనామా చేసి బాధ్యతలు నుంచి తప్పుకోవచ్చని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ పరిణామం పై పోలీస్ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి. రాజకీయంగా కూడా, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నారని, అనేక ఆరోపణలు గతంలో వచ్చాయి. మరి ఇంత ఘాటుగా స్పందించిన తరువాత అయినా, పోలీస్ వ్యవస్థ మారుతుందో లేదో చూడాలి.

హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఎట్టకేలకు ఒక కేసులో ఊరట లభించింది. విజయవాడ స్వర్ణా ప్యాలెస్ ఘటనలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై, బాధ్యులు పేర్లు లేకుండా, కేవలం కొంత మందినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్తూ, ఈ ఘటనలో సంబంధం ఉన్న అందరి బాధ్యుల పేర్లు కూడా తేల్చండి అంటూ, అప్పటి వరకు ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టే పై, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు ఇచ్చిన స్టే పై, ఆదేశాలు ఇస్తూ, ఆ స్టే ఎత్తివేసి, విచారణ చేసుకునే అవకాసం ఇవ్వాలి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు వద్ద పిటీషన్ వేసింది. ఈ కేసు పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేస్తూ, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు పై విచారణ చేసుకోవచ్చని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇది ప్రభుత్వానికి ఊరట ఇచ్చే అంశం అయినా, ప్రభుత్వం టార్గెట్ మాత్రం డాక్టర్ రమేష్ అనే విషయం, ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి చూసిన వారికి అర్ధం అవుతుంది.

ఈ ఘటన మొత్తానికి డాక్టర్ రమేష్ బాధ్యుడు అనేది ప్రభుత్వం అభిప్రాయం. అయితే సుప్రీం కోర్టు మాత్రం, డాక్టర్ రమేష్ ని కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయన్ను నిర్బందించకుండా, విచారణ చేసుకోవచ్చని, అలాగే డాక్టర్ రమేష్ కూడా విచారణకు సహకరించాలని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి, అంటిసిపేటరీ బెయిల్ కోసం ఎవరైనా ప్రయత్నం చేసుకుంటే, అది హైకోర్టు చూసి, తగిన ఆదేశాలు ఇవ్వచ్చు అంటూ సుప్రీం తన తీర్పులో తెలిపింది. ఈ తీర్పు ఒక రకంగా ప్రభుత్వానికి విజయమే అయినా, డాక్టర్ రమేష్ ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే మోటివ్ మాత్రం కుదరలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అదీ కాక ఈ ఘటన హోటల్ లో జరిగింది, ఆ హోటల్ యజమాని బాధ్యులు అవుతారు, అలాగే అక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారులు బాధ్యులు అవుతారు, కానీ అక్కడ వైద్యం చెయ్యటానికి వచ్చిన డాక్టర్ రమేష్, అగ్ని ప్రమాదానికి బాధ్యులు ఎలా అవుతారు అనేది, కూడా ప్రశ్న. ఏది ఏమైనా, ఈ ఘటనకు డాక్టర్ రమేష్ బాధ్యుడు అనే ఆధారాలు ఉంటే ఆయన్ను శిక్షించాలి, లేకపోతే ఎవరు బాధ్యులు అయితే వారి పై చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

Advertisements

Latest Articles

Most Read