కాలం చెల్లిన బీర్ల విక్రయాలతో మందుబాబుల ఆరోగ్యం గుల్లగుల్ల అవుతోంది. తయారు చేసిన బీర్లకు ఆరు నెలలు మాత్రమే కాలపరిమితి ఉంటుంది. అంతలోపే వాటిని వినియోగించాలి. అయితే క-రో-నా నేపథ్యంలో నాలుగు నెలలుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులతో కం-టో-న్మెం-ట్ జోన్ల మినహా అన్ని చోట్ల మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఎగబడి తమకు కావాల్సిన బీర్లను కొనుగోలు చేశారు. మద్యం ఎక్కువగా అమ్ముడుపోయే వాటిలో బీర్ కే ఎక్కువ డిమాండ్. అయితే అవసరాలకు అనుగుణంగా మద్యం సరఫరా లేకపోవడం, కొత్త కొత్త బ్రాండ్లు దుకాణాల్లో దర్శనమిస్తుండటంతో మద్యం ప్రియులు తప్పుకుంటున్నారు. పైగా చల్లటి వాతావరణంలో కరోనా వ్యాప్తి చెందుతుందనే ప్రచారం ఎక్కువగా సాగడంతో మద్యం విక్రయాలు సన్నగిల్లాయి. దీంతో బీర్ల నిల్వలు పేరుకుపోయాయి. చీప్ లిక్కర్, విస్కీ బ్రాందీ విక్రయాలు బాగా పెరిగినప్పటికీ బీర్లను కొనుగోలు చేసే వారు తగ్గిపోయారు. దీంతో ఇటీవల ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది. దీన్ని సాకుగా చేసుకొని రంగంలోకి దిగిన మఫియా అక్రమ దందాకు తెరలేపారు.

బీర్లు తయారుచేసే కంపెనీలతో కుమ్మక్కై కాలం చెల్లిన బీర్లను దుకాణాలకు తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాటిళ్లపై కొత్త స్టిక్కర్లు అంటించి విక్రయాలను ప్రోత్సహిస్తున్నారు. సందట్లో సడేమియా అన్న చందంగా కాలం చెల్లిన బీర్లను కొత్త బాటిళ్లతో కలిపి అమ్ముతున్నారు. వీటిని సేవిస్తే ఎంతటి బీరుబాబైనా అనేక రుగ్మతలకు లోను కావాల్సిందే. ప్రధానంగా వంటిపై దురద రావడం, దద్దుర్లు లేయడం, విరేచనాలు కావడం, వాంతులవ్వడం, కడుపులో, కళ్లు మంటగా ఉండటం ఇలా అనేక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా బేవరీస్ కంపెనీలు ఉత్పత్తి బీరు ఆరునెలలోనే వినియోగించాలి. ఒక వేల కాలం చెల్లింది అంటే ఆయా బీర్లను వినియోగంకు పనికి వస్తాయా లేదా అంటూ ల్యాబ్ టెస్టుకు పంపుతారు. ఒకవేళ అందులో సెడ్మెంట్ రాలేదంటే వాటిని మరో 10 రోజులు విక్రయంకు అనుమతిస్తారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ వార్తలు అధికం అవ్వటంతో, కాలం చెల్లిన వీటి అమ్మకాలను ప్రస్తుతం నిలిపివేసినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఒకవేళ దుకాణాల్లో ఉంటే కూడ వీటి విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని మంగళవారం హవాలా రాకెట్ ను చేధించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి విజయవాడతో లింకు ఉండి హైదరాబాద్ వరకు హవాలా రాకెట్ నడుస్తోంది. ఇలా ఎన్నాళ్ళనుంచి నడుస్తోందో తెలియదు కాని, బంగారు వ్యాపారి ప్రవీణ్ జైన్, ఆతనితోపాటు చామకూరి హరిబాబు, వల్లూరి శివప్రసాద్, చామకూరి అనందరావులను అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వెల్లడించిన వివరాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన చామకూరి అనందరావు, చామకూరి హరిబాబు ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరు కూడా దేవి జ్యూయలరి మాలో పనిచేస్తున్నారు. జ్యుయలరీ యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ వారిద్దరికి రూ. 50 లక్షల దేశీయ నగదు, సుమారు 25 లక్షలు విలువ చేసే 34 వేల యుఎస్ డాలర్లను ఇచ్చారు. ఈ మొత్తంతో పాటు విజయవాడకు చెందిన శివనాధ్ నుంచి రూ. 50 లక్షలు, భరత్ నుంచి రూ. 20 లక్షలు, ఉత్తమ్ నుంచి రూ 15 లక్షలు, దివాకరనుంచి రూ 12 లక్షలు మొత్తం రూ 1.47 లక్షలు సేకరించి వాటితో పాటు 34 వేల అమెరికన్ డాలర్లను తీసుకుని హైదరాబాద్ లో ఉన్న తన సోదరుడు కీర్తికి ఇచ్చి రమ్మని ప్రవీణ్ కుమార్ జైన్ ఇద్దరు గుమస్తాలకు చెప్పారు.

దీంతో నగదును తీసుకుని ఏపీ 37 బిడబ్యు 4532 నెంబరు కారులో బయలుదేరారు. కారులో వెనుక సీట్లలో ప్రత్యెక బాక్సులలో నగదును ఉంచి బయలుదేరారు. సమాచారం తెలిసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేజింగ్ చేసి భవానీపురం వద్ద అడ్డుకుని నగదును స్వాధీనం చేశారు. భూనీపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రవీణ్ కుమార్ జైన్‌ పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ డాక్టర్ కె వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎసీపీ టి కనకరాజు, వి ఎస్ ఎన్ వర్మ, ఇన్ స్పెక్టర్ కృష్ణమోహన్, సిబ్బంది హవాలాను చేధించారు. పోలీసు కమిషనర్ వారందరని అభినందించారు. నెల రెండు నెలల క్రితం కూడా, ఇలాంటి హవాలా కుంభకోణమే ఒకటి బయట పడింది. తరుచుగా ఈ హవాలా ర్యాకెట్ లు బయట పడటంతో, పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు.

వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, అమరావతి పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను అభినందించారు. ప్రభుత్వం మనసులో ఉన్నది ఈయన చెప్పారని, అమరావతిని కనీసం శాసన రాజధానిగా కూడా ఉంచకూడదు అనే ప్రభుత్వ అంతరంగాన్ని, నాని చెప్పారని అన్నారు. రఘురామరాజు మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని, విశాఖపట్నంకు తరలిస్తున్నారని, మనం గతంలో అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఈ రోజు ఈ విషయంలో, మంత్రి కొడాలి నాని గారు, ఆ నిజాన్ని బహిర్గత పరిచారు. ఎందుకుంటే ఈ అంశం కోర్టులో ఉంది. రైతుల దగ్గర భూమి తీసుకున్నారు. తీసుకుని ప్రభుత్వంతో ఒక అగ్రిమెంట్ రాసారు. సిఆర్డీఏ వాళ్ళు. అగ్రిమెంట్ లో ఏమన్నారు, మేము ఇక్కడ రాజధాని నిర్మిస్తాం, రాజధాని అంటే రాజభవన్ ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, హెచ్ఓడీలు ఉంటాయి అని ఒక మాస్టర్ ప్లాన్ చెప్పి, అగ్రిమెంట్ చేసారు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చెయ్యరు అంట, డబ్బులు లేవు అంట, రాజభవన్, సెక్రటేరియట్ విశాఖలో కట్టుకుంటారు అంట, అవసరం అయితే ఒక సెషన్ అసెంబ్లీ కూడా విశాఖలో చెయ్యటానికి అసెంబ్లీ కూడా కట్టుకుంటారు అంట. రెండు సెషన్స్ అసెంబ్లీ అమరావతిలో పెడతారు అంట. రైతులు ఇచ్చిన భూమిని అభివృద్ధి చెయ్యకుండా, పేదలకు పంచుతారు అంట. "

"పేదలకు పంచుతూ, అందరం ఒప్పుకోవాలి అంట, అది కోర్టులో ప్రశ్నిస్తే, మీరు కోర్టులో వేసిన కేసులని విత్ డ్రా చేసుకోక పొతే, ఈ చిన్న రాజధానిని కూడా అమరావతిగా ఉంచం అని చెప్పి, మంత్రి గారు అంటున్నారు. మరి అది వార్నింగ్ అనాలో, లేక మరి ఇంకేమి అనుకోవాలో. ఒక పక్క కోర్టులో కేసు ఉండగానే, ఈ రకంగా బెదిరిస్తున్నారు అంటే, వీళ్ళు ఎలా ఉన్నారో చూసుకోవాలి. నాని గారు ఏమి మాట్లాడినా కూడా, వారి ఎక్స్ప్రెషన్ లో ఉన్న మాధుర్యం, మా లాంటి వారి కంటే, జగన్, చంద్రబాబు గారి కంటే, నాని గారికి, ఎక్కువ వ్యూస్ వస్తాయి. పితృ భాష ఎక్కువగా వాడతారు కాబట్టి, ఆ భాష నచ్చే వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఎక్కువగా ఆయన ప్రసంగాలు వింటారు. ఈ విషయంలో అయితే మా ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నాని గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే మీ మనసులో దాగి ఉన్న నిజాన్ని ఈ రోజు, ప్రజలకు మీడియా సాక్షిగా తెలియచేసి నందుకు, ప్రభుత్వ అంతరంగాన్ని తెలియచేస్తూ, అమరావతిలో ఈ రాజధాని కూడా ఉంచం అని చెప్పినందుకు సంతోషం" అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, వైసీపీకి చెందిన కార్యకర్తలే, హైకోర్టులో కేసు వెయ్యటం సంచలనం అయ్యింది. అయితే ఈ కేసు పై ఈ రోజు వాయిదా ఉండటంతో, విచారణ జరిగింది. అయితే ఈ రోజు కేసు పై ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు గతంలో, ఈ కేసు పై కౌంటర్ దాఖలు చెయ్యల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ రోజు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యలేదు. తగినంత సమయం ఇచ్చినా, ఎందుకో కానీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యలేదు. సరైన సమాచారం లేదా ? లేదా మరింత సమాచారం రావాల్సి ఉందా ? లేదా అక్కడ నిజంగానే ఏదైనా జరుగుతుందా, అది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిందా ? అనే చర్చ జరుగుతుంది. అయితే ఈ రోజు విచారణలో, ప్రభుత్వ తరుపు లాయర్లు మాట్లడుతూ, కోర్టు దృష్టికి ఒక విషయం తీసుకుని వచ్చారు. ఈ పిటీషన్ వేసిన వారిలో, ఒక వ్యక్తి మైనింగ్ కేసులో ముద్దాయిగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, ఇప్పుడు ఆ అంశం పై ఇక్కడ విచారణ జరగటం లేదు కదా అని ప్రశ్నించింది.

దీంతో ప్రభుత్వ తరుపు లాయర్ కు ఏమి చెప్పాలో అర్ధం కాలేదు. అయితే హైకోర్టు కౌంటర్ ఎప్పుడు దాఖలు చేస్తారో చెప్పాలని, ప్రభుత్వాన్ని కోరింది. దీనికి స్పందించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది, మరో వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని, హైకోర్టుకు తెలిపారు. దీంతో, హైకోర్టు, ఈ కేసు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని, రాజుపాలెం అనే మండంలో ఉన్న కొండమోడు దగ్గర, అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ, వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్తలే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై గత నెల 26న విచారణ జరపగా, పూర్తి నివేదిక తమకు సమర్పించాలని, హైకోర్టు కేసుని ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే దీని పై విచారణ జరిపినా, ప్రభుత్వం ఈ రోజు కౌంటర్ దాఖలు చేయలేదు. పూర్తి నివేదికతో, మరో వారం రోజుల్లో కౌంటర్ వేస్తామని కోర్టుకు చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read