అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై, సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ సబ్బం హరి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అమరావతిని మూడు ముక్కలు చేసే విషయంలో జగన్ మోహన్ రెడ్డికి బీజేపీ సహకారం ఉందని, జనసేన పార్టీ ఏమి మాట్లాడటం లేదు అని అందరూ, జగన్, మోడీ, పవన్ ని విమర్శిస్తున్నారని, వాళ్ళను ఒక పక్కన పెడితే, మరో ముఖ్యమైన వ్యక్తి గురించి అందరూ మర్చిపోయారని, ఆ వ్యక్తి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. అమరావతిని చంపేయటంలో కేసీఆర్ ది కీలక పాత్ర అని నేను నుమ్ముతానని సబ్బం హరి అన్నారు. తనకు చాలా దగ్గర మనుషులు చెప్పిన విషయం ప్రకారం, కేసీఆర్ ఆదేశాల మేరకే, జగన్ మోహన్ రెడ్డి అమరావతిని చంపేయటం మొదలు పెట్టారని, దీని పై తన దగ్గర కచ్చితమైన సమాచారం ఉందని సబ్భం హరి సంచలన వ్యాఖ్యలు చేసారు.

అమరావతిని మూడు ముక్కలు చేస్తూ, ఇక్కడ జగన్ నిర్ణయం తీసుకోగానే, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుందని, ఇక్కడ రేట్లు పడిపోయాయని అన్నారు. ఈ నిర్ణయం పై కేసీఆర్ ఎంతో ఖుషీగా ఉన్నారని అన్నారు. అమరావతిని చంపేస్తే, హైదరాబాద్ లో ఉన్న మీ ఆస్తులు విలువ రెట్టింపు అవుతుందని, జగన్ తో కేసీఆర్ అన్నట్టు, తనకు ఒక వ్యక్తి చెప్పారని సబ్భం హరి అన్నారు. కష్టపడి అందరం కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ నుంచి వెళ్ళిపోమన్నారు, సరే మన బ్రతుకు ఏదో మనం బ్రతుకుదాం అని ఇక్కడకు వచ్చి, అమరావతి నిర్మాణం చేసుకుంటే, మన బ్రతుకులు మీద మళ్ళీ మళ్ళీ కొడుతున్నారని, అటు హైదరాబాద్ లేక, ఇటు అమరావతి లేక, నాశనం చేసారని అనంరు. వైసీపీ, బీజేపీ, జనసేనతో పాటుగా, కేసిఆర్ ని , ఈ విషయంలో మర్చిపో కూడదు అని, చేసిన నష్టం మొత్తం ఆయనే అంటూ, సబ్బం హరి సంచలన వ్యాఖ్యలు చేసారు.

2014లో తెలుగుదేశం పార్టీని దెబ్బ తీస్తే, అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ తమ వెంటే ఉంటారని, భావించిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని కూడా లేకుండా చేసింది. అయితే, అక్కడ కేసీఆర్ వచ్చి హ్యాండ్ ఇచ్చారు, ఇక్కడ మాత్రం చంద్రబాబు వచ్చారు. అప్పటి నుంచి చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, హైదరాబాద్ కు మించిన ధీటైన రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్ళారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, 33 వేల ఎకరాలు సేకరించారు. ఒక్క గజం భూమి ఇవ్వటానికి గొడవ గొడవ చేసే ఈ రోజుల్లో, రైతులు కూడా అటు రాష్ట్రానికి, ఇటు తమ భవిష్యత్తు బాగుటుందని ముందుకు వచ్చి భూమి ఇచ్చారు. ఈ భూములు ఇవ్వకుండా, భూములు తగలబెట్టిన చరిత్ర కూడా చూసాం. ఎవరి రాజధాని అమరావతి అంటూ, ఏడ్చిన ఏడుపులు చూసాం. చంద్రబాబుని అమరావతి నిర్మాణం జరగనివ్వకుండా ముప్పు తిప్పలు పెట్టారు. అమరావతి నిర్మాణం ఆపాలి అంటూ, గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు వేయించారు. అందులో ఒకరు, జనసేన నాయకుడు బోలిసెట్టి కూడా ఉన్నారు. ఇవన్నీ దాటుకుని వచ్చేసరికి, 2018 అయ్యింది. అంటే చంద్రబాబుకి మిగిలిఉంది, ఏడాది సమయం.

ఆ ఏడాది సమయంలోనే అమరావతి అనేక నిర్మాణాలు జరిగాయి. తరువాత జగన్ వచ్చారు, అమరావతి మూడు ముక్కలు అయ్యింది. 15 నెలలు తరువాత కూడా, వైసీపీ, బీజేపీ, జనసేన, అమరావతి విషయంలో చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నాయి. అమరావతిని భ్రమరావతి అంటూ, అమరావతి పై అనేక కుట్రలు చేసింది వైసీపీ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసింది జనసేన. ఇప్పుడేమో, 5 ఏళ్ళలో ఎందుకు అమరావతి నిర్మాణం జరగలేదు, అది చంద్రబాబు తప్పు అంటున్నారు. ఆపింది వీళ్ళే, అడిగేది వీళ్ళే. చంద్రబాబు సిఆర్డీఏ చట్టంలో తప్పులు చేసారు కాబట్టి, జగన్ అవకాసంగా తీసుకున్నారని, పవన్ అంటున్నారు అంటే, మొత్తం చంద్రబాబే చేసాడు, జగన్ ది ఏమి తప్పు లేదు అన్నట్టు చెప్తున్నారు. ఇక బీజేపీ సంగతి చెప్పే పనే లేదు. ఇలా గతంలో అమరావతి పై నిరంతరం ఏడ్చిన వాళ్ళు, ఎంతో కొంత పని చేసిన చంద్రబాబు పైనే, ఇప్పటికీ ఏడుస్తున్నారు అంటే, వీళ్ళకు అమరావతి కంటే, చంద్రబాబు మీదే ద్వేషమే ఎక్కువలా ఉంది. ఏది ఏమైనా, ఈ కంపు కొట్టిన కుల రాజకీయాల్లో నష్టపోయింది మాత్రం, అమరావతి రైతులే.ఇందులో చంద్రబాబుకు పోయేది ఏమి ఉండదు అని, ఇప్పటికైనా ఆ మూడు పార్టీలు గ్రహిస్తే, అమరావతి రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు...

జూన్ 2019 వరకు, అమరావతి ఒక అతి పెద్ద నిర్మాణాల ఆక్టివిటీ జరుగుతున్న ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపుగా 40 వేల మంది కార్మికులు, వారి నివాసాలు, వారి అవసరాలు కోసం పెట్టే సంతలతో, అమరావతి కళకళలాడుతూ ఉండేది. ఏ మూల చూసినా ఎదో ఒక నిర్మాణం జరుగుతూనే ఉండేది. అవన్నీ చూసిన రాష్ట్ర ప్రజలు, మనకు ఒక మంచి రాజధాని వస్తుందని మురిసిపోయారు. భూములు ఇచ్చిన రైతులు, తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశ పడ్డారు. జూన్ 2019న ప్రభుత్వం మారింది, ఇక అంతే అప్పటి నుంచి అమరావతి ఒక నిశ్శబ్ద నగరంగా మారిపోయింది. పునాదులు కోసం తవ్విన గోతులు, మొండి గోడలు, సగం తవ్విన రోడ్డులు, సగంలో ఉన్న నిర్మాణాలు వెక్కిరిస్తున్నాయి. అయినా ఈ ప్రభుత్వం, ఏదో ఒక రోజు, నిర్మాణం మళ్ళీ మొదలు పెట్టక పోతుందా అనే ఆశతో అక్కడ ప్రజలు ఎదురు చేసారు. కానీ వారి ఆశలు, నిరసలు అయ్యాయి. స్వార్ధ రాజకీయాలకు అమరావతి బలి అయి పోయింది.

అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో ఉన్నా, శాసనమండలి సెలెక్ట్ కమిటీకి పంపించినా, అవేమీ పట్టించుకోకుండా, బిల్లు ఆమోదించుకున్నారు. ఇక నుంచి అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే. అసెంబ్లీ జరిగే సమయంలో మాత్రమే అమరావతి రాజధాని. అది కూడా అన్ని అసెంబ్లీ సమావేశాలు ఇక్కడే జరుగుతాయి అనే గ్యారంటీ లేదు. గట్టిగా ఒక 20-30 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరుగుతాయి. అయితే ఇప్పుడు ఉన్న ప్రశ్న. అమరావతి భవిష్యత్తు ఏమిటి ? భూములు ఇచ్చిన రైతులు పరిస్థితి ఏమిటి ? ఇప్పటికే అక్కడ రోడ్డులు వేసారు, నిర్మాణాలు సగంలో ఉన్నాయి, అవి దేనికీ ఉపయోగపడవు. మరి రైతులని ఏమి చేస్తారు ? ఈ ప్రశ్నకు సమాధానం లేదు. 90 శాతం పూర్తయిన భవనాలు ఏమి చేస్తారు, అనేదాని పై క్లారిటీ లేదు. ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఆ సొమ్ము అంతా నిరుపయోగమేనా ? కోర్టులు ఏమి చెప్తాయి. ఇవన్నీ సమాధనం ప్రశ్నలుగా ఉన్నాయి. వీటికి సమాధానాలు, ఎప్పటికి దొరుకుతాయో మరి.

అమరావతి... ఇది ఒక స్వప్నం. 2014 దాకా, మనది అనుకున్న హైదరాబాద్, మనం నిర్మించుకున్న హైదరాబాద్ ను కాదని, మన బ్రతుకు ఏదో మనం బ్రతుకుదాం. మన కష్టం మనమే పడదాం. మరో హైదరాబాద్ ని మన తెలివితేటలతో , కష్టంతో నిర్మించుకుందాం అని అనుకున్నాం. అనుకున్నట్టే, మంచి విజన్, అనుభవం ఉన్న చంద్రబాబుని ఎన్నుకున్నాం. ఆయన అన్నీ అలోచించి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయం తీసుకున్నారు. రివర్ ఫ్రంట్ క్యాపిటల్ కావటంతో, నీరుకు ఇబ్బంది ఉండదు. అన్ని ప్రాంతాలకు బస్, రైల్, ఎయిర్ కనెక్టివిటీ ఉంటుందని, జనాభా కాని, భౌగోళికంగా కానీ, అన్ని విధాలుగా అమరావతి రాష్ట్రంలో అందరికీ సమాన దూరంలో ఉంటుందని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి అమరావతి పై ఏడుపులు మొదలయ్యాయి. భ్రమరావతి అని ఒకరు అంటే, ఎవరు రాజధాని అమరావతి అని మరొకరు, ఇలా అన్ని పార్టీలు అమరావతి మీద ఏడుపులు మొదలు పెట్టాయి.

చివరకు కులం కూడా తీసుకువచ్చారు. 2018 వరకు నిర్మాణాలు మొదలు కాకుండా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు కూడా వేసారు. అయితే 2018 నుంచి 2019 మధ్యే, దొరికిన ఆ ఒక్క ఏడాదిలోనే అనేక నిర్మాణాలు పూర్తి చేసారు చంద్రబాబు. హైకోర్టు నిర్మాణం పూర్తయ్యింది. ఐఏఎస్ క్వార్టర్స్ , ఐపిఎస్ క్వార్టర్స్ , జడ్జీలు క్వార్టర్స్ , ఎన్జీవోల క్వార్టర్స్, ఇలా అనేక నిర్మాణాలు చేసారు. కొండవీటి వాగు ఎత్తిపోతల నిర్మాణం చేసారు. సీడ్ ఆక్సెస్ రోడ్ నిర్మాణం జరిగింది. అంతర్గత రోడ్డుల నిర్మాణం జరిగింది. రైతులకు ఇచ్చే ప్లాట్లు అభివృద్ధి పనులు జరిగాయి. ఇక 5 టవర్ల శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణం కూడా మొదలయ్యింది. మరో పక్క, అక్కడ నివాసం ఉండే వారి కోసం, ప్రభుత్వమే హ్యాపీ నెస్ట్ అనే ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. హాట్ కేకులులా ఫ్లాట్లు అమ్ముడు పోయాయి. ఇలా మొత్తం, ఈ నిర్మాణాల పై రూ.10 వేల కోట్లు ఖర్చు చేసారు. ఇప్పుడు అమరావతిని మూడు ముక్కలు చెయ్యటంతో, రూ10 వేల కోట్లతో చేసిన ఈ నిర్మాణాలు అన్నీ, బూడిదలో పోసిన పన్నీరు అవ్వనున్నాయి.

Advertisements

Latest Articles

Most Read