అమరావతి విషయంలో, జగన్ మోహన్ రెడ్డి పై ప్రజలు ఎంత గుర్రుగా ఉన్నారో, అలాగే బీజేపీ పై కూడా ప్రజలు అంతే ఆగ్రహంతో ఉన్నారు. అమరావతిని జగన్ మోహన్ రెడ్డి మార్చేసి, మూడు ముక్కలు చేస్తుంటే, అందరూ కేంద్రం ఆపుతుంది అని అనుకున్నారు. ఎందుకంటే, వచ్చిన ప్రభుత్వం అల్లా, మేము రాజధాని మారుస్తాం అంటే, అది అయ్యే పని కాదు. ఇదే కొత్త ఒరవడి అన్ని రాష్ట్రాలు తీసుకుంటే, కేంద్రం ఏమి చేస్తుంది. అందుకే ఇలాంటి విషయాల పై కూడా కేంద్రం జోక్యం చేసుకుంటుందని అనుకున్నారు. కానీ కేంద్రం మాత్రం, రాజధాని మా పరిధిలో అంశం కాదని తప్పించుకున్నారు. అయితే గతంలో అనేక విషయాల్లో కేంద్రం కల్పించుకున్న తీరుని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పీపీఏల విషయంలో ఏమి హక్కు ఉందని కేంద్రం కల్పించుకుంది ? దేశానికి నష్టం కాబట్టి, కల్పించుకున్నారు. ఇప్పుడు రాజధాని కూడా అంతే. మరో పక్క అక్కడ 29 వేల రైతు కుటుంబాలు రోడ్డున పడి ఆశగా కేంద్రం వైపు చూస్తుంటే, కేంద్రం చేతులు ఎత్తేసింది. దీంతో అందరు కేంద్రాన్ని తప్పు బడుతున్నారు.

బీజేపీ, జగన్ ఆడుతున్న నాటకంగా చెప్తున్నారు. అయితే ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా బీజేపీని విమర్శిస్తున్నారు. బీజేపీ నేత, మాజీ టిటిడి బోర్డు సభ్యులు ఒ.వి.రమణ, బీజేపీ వైఖరిని తప్పు బడుతూ, ఓక ఎడిటోరియల్ రాసారు. ఒక పక్క సుజనా చౌదరి ఒక్క ఇంచ్ కూడా ఇక్కడ నుంచి రాజధాని కదలదు అంటారు, మరో పక్క టీజీ వెంకటేష్, హైకోర్టు రాయలసీమకు వస్తే, లాభం లేదని, పూర్తి స్థాయి రాజధాని కావలి అంటారు, వెంటనే జీవీఎల్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, రాజధాని అనేది కేంద్రానికి సంబంధం లేదని, అది రాష్ట్రము ఇష్టం అని చెప్తారు. ఇక్కడ సోము వీర్రాజు గారేమో, మేము అమరావతి రైతుల తరుపున పోరాటం చేస్తున్నాం అంటారు. ఇలా ఒకే పార్టీలో ఇన్ని అభిప్రాయాలు ఎందుకు ? మనం 0.68 శాతం ఓటింగ్ తెచ్చుకున్న పార్టీ, రేపు అధికారంలోకి రావాలి అంటే, ఇలాంటి పెద్ద విషయాల్లోనే ఒక నిర్ణయం తీసుకోక పొతే, ప్రజలు ఎలా విశ్వసిస్తారు అని ఆయన ఎడిటోరియల్ రాయటంతో, ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు. దీంతో ఆయన ఇదే అభిప్రాయం మళ్ళీ చెప్తూ, నేను చేసింది తప్పు అయితే, జీవీఎల్ చేసింది తప్పు కదా ? సుజనా చేసింది తప్పు కదా ? వాళ్ళని ఎందుకు సస్పెండ్ చెయ్యటం లేదు అని ప్రశ్నించారు. తాను ముందు నుంచి పోరాడుతున్నా అని, టిటిడి భూములు విషయం బయటకు తెచ్చి పోరాడిన విషయాన్నీ, పార్టీకి మంచి చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఏదైనా అమరావతి మీద అందరూ పార్టీలో ఒక అభిప్రాయంతో ఉండాలని అన్నారు.

అమరావతిలో ఏముంది ? అమరావతి ఒక గ్రాఫిక్స్. అమరావతి ఒక స్మశానం. అమరావతి ఒక ఏడాది. అమరావతిలో పందులు తిరుగుతున్నాయి. 5 ఏళ్ళలో అమరావతిలో ఏమి కట్టారు. అమరావతిలో ఒక్క ఇటుక పడలేదు. అమరావతిలో ఒక్క శాశ్వత కట్టడం లేదు. అమరావతి ఒక భ్రమరావతి. ఇవి అమరావతి పై వైసీపీ నాయకులతో పాటు, కొంత మంది అమరావతి పై గిట్టని వారు చేసిన వ్యాఖ్యలు. అమరావతి పై హేళన చేస్తూ, వ్యాఖ్యలు చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. అయితే, ఇప్పుడు ఈ వాదనలకు ఫుల్ స్టాప్ పడనుంది. ఈ రోజు హైకోర్టు పరిధిలో జరిగిన విచారణలో, హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు అమరావతికి సంబంధించి వేసిన కొన్ని పిటీషన్ల పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని అమరావతికి ఇప్పటి వరకు చేసిన ఖర్చు, జరుగుతున్న పనుల పై, పిటీషనర్ తరుపు న్యాయవాది, హైకోర్టు ముందు కొన్ని ఆధారాలు పెట్టారు. అందులో ముఖ్యంగా అమరావతి కోసం రూ.52 వేల కోట్ల పనులు సాగుతున్నాయని, సిఆర్డీఏ నివేదికను కోర్టుకు సమర్పించారు.

ఇవి చూసిన హైకోర్టు, కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు ఇప్పటి వరకు అమరావతి కోసం ఎంత ఖర్చు చేసారు. ఎన్ని భవనాలు కట్టారు. ఇవి ఎంత స్థాయిలో నిర్మాణం అయ్యాయి. కాంటాక్టర్లకు ఇంకా ఎంత డబ్బులు ఇవ్వాలి. అంత డబ్బు ఎలా సమీకరించారు. ఇలాంటి వివరాలు మొత్తం తమ ముందుకు ఉంచలాని, దీనికి సంబంధించి నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు హైకోర్టు ఆదేశించింది. కట్టిన భవనాలు వాడుకోకుండా అలా ఉంచితే పాడైపోతాయి కదా. ఆ నష్టం ఎవరు భరిస్తారు అని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను హైకోర్టు, ఈ నెల 14కు వాయిదా వేసింది. దీంతో ఇప్పుడు అధికార వైసీపీ అమరావతిలో కట్టిన భవనాలు, వాటి ఖర్చులు, అవి ఏ స్థాయిలో పనులు పూర్తయ్యాయి వంటి పూర్తి వివరాలు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో, ఇప్పటి వరకు అమరావతిలో ఏమి లేదు అని వారు చేస్తున్న వాదన తప్పు అని వారే చెప్పినట్టు అవుతుంది. మరి ప్రభుత్వం ఏమి చెప్తుందో, 14 వ తేదీ వరకు ఆగాల్సిందే.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ, ఈ రోజు ఆక్షన్ లోకి దిగారు. తన కార్యాలయంలో, తాను లేని సమయంలో చేసిన మార్పులు పై ఆయన విచారణకు ఆదేశించారు. ఎవరు చెప్తే ఈ మార్పులు చేసారు, ఎందుకు చేసారు అనే విషయాల పై సమగ్ర దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు. తన కార్యాలయంలో ఎందుకు మార్పులు చెయ్యాల్సి వచ్చిందో, తేల్చాలని అన్నారు. నిమ్మగడ్డ లేని సమయంలో, ఆయన కార్యాలయంలో కొన్ని మార్పులు చేసారు. ఇవి వాస్తు మార్పులుగా చెప్పారు. స్టేట్ ఎలక్షన్ కమీషనర్ చాంబర్, అలాగే అధికారులు కార్యాలయం మధ్యలో ఉన్న తలుపు మూసివేసారు. అయితే ఈ విషయం పై, కొన్ని వార్తా పత్రికల్లో, తానె ఈ వాస్తు మార్పులు చేసినట్టు కధనాలు రావటంతో, ఆయన స్పందిస్తూ, ఈ విషయం పై ఎంక్వయిరీకి ఆదేశించామని, తానూ "rationalist" అని చెప్పుకొచ్చారు. తాను రాక ముందే, కార్యాలయంలో మార్పులు జరిగాయని, దీని పై విచారణ జరుగుతున్నట్టు, నిమ్మగడ్డ చెప్పారు.

ఆంద్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన సమయంలో,ఆయన మాట్లాడుతూ ఈ వ్యవస్థ రాజ్యంగ వ్యవస్థ అని, స్వాతంత్ర సంస్థ అని, రాగద్వేషాలు లేకుండా పని చేస్తానాని చెప్పారు. తనకు ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణ సహకారం అందుతుందని, ఆశిస్తున్నా అంటూ, నిమ్మగడ్డ చెప్పారు. తానూ గత శుక్రవారం గవర్నర్ ఆదేశాలు రాగానే, బాధ్యతలు చేపట్టానని, ఈ విషయం అధికారులకు కూడా తెలియ చేసానని చెప్పారు. గతంలో రమేష్ కుమార్ ని ప్రభుత్వం తొలగించి, కనక రాజ్ ని పెట్టటం, తరువాత నిమ్మగడ్డ హైకోర్టు కు వెళ్ళటం, హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేయటం, అయినా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వక పోవటంతో, కోర్టు ధిక్కరణ పిటీషన్ వెయ్యటం, ఇదే క్రమంలో ప్రభుత్వం పలు మార్లు సుప్రీం కోర్టుకు వెళ్ళటం, సుప్రీం కోర్టు కూడా కొట్టేయటం, ఇలా అనేక విషయాలు జరిగిన తరువాత, నిమ్మగడ్డ ఎన్నికల కమీషనర్ గా నియమింప బడ్డారు. 

వైసీపీ నేత, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. వారం రోజుల క్రితమే, గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దీంతో ఈ రోజు అమలాపురం వచ్చిన ఆయన మీడియా సమావేశం పెట్టారు. కోనసీమలోని ఒక మండంలో వైసిపీ యువనేతల ఏర్పాటు చేసిన అభినందనల కార్యక్రమానికి పండుల రవీంద్ర బాబు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా, ఆయన తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేసారు. మా ముఖ్యమంత్రి జగన్ ను, జడ్జీలు కానీ, చంద్రబాబు కానీ, కేసులు కనీ ఏమి వెంట్రుక కూడా కదపలేరు అంటూ, చేతి మీద వెంట్రుక పీకి హావభావాలు చూపించారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు కూడా అవాక్కయ్యారు. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి అవినీతి కేసుల్లో 16 నెలలు జైలుకు వెళ్లి వచ్చి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై ఉన్నారని, అలాంటిది కేసులు, జడ్జీలు ఏమి పీకలేరు అని చెప్పటం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

పదవి వచ్చిన ఆనందంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అది జగన్ కే చివరకు ఇబ్బంది అవుతుందని, కొంచెం కంట్రోల్ లో మాట్లాడాలని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. చంద్రబాబు వరకు అయితే, రాజకీయ ఆరోపణలు అనుకోవచ్చని, కానీ ఈయన ఏకంగా జడ్జీలు, కేసులు ఏమి పీకలేరు అంటూ, చేతి మీద వెంట్రుకలు పీకి చూపించటం, జుబుక్సాకరం అని, ఆయన ఇబ్బందుల్లో పడటమే కాకుండా, జగన్ ని కూడా ఇబ్బందుల్లోకి నెట్టుతారని వాపోతున్నారు. ఇప్పటికే వైసిపీ నేతలు, కోర్టులు పై, జడ్జీల పై ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఆరోపణలతో, వారి పై హైకోర్టు, గత వారం సుప్రీం కోర్టు కూడా సీరియస్ అయిన విషయం తెలిసిందే జడ్జీలను ఇష్టం వచ్చినట్టు తిడుతున్న వైసీపీ నాయకులు, పేటీయం బ్యాచ్ పై, కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసాయి. దీని పై త్వరలోనే తీవ్ర చర్యలు కూడా తీసుకునే అవకాసం ఉంది. ఈ తరుణంలో, ఇప్పుడు ఎమ్మెల్సీ పండుల రవీంద్ర బాబు, జడ్జీలు తమ అధినేతను ఏమి పీకలేరు అని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. పూర్తీ వీడియో ఇక్కడ చూడవచ్చు https://youtu.be/ECC5j1tU9sQ

Advertisements

Latest Articles

Most Read