రఘురామకృష్ణం రాజు, ఢిల్లీలో బిజీ బిజీగా గడ్పుతున్నారు. నిన్న రెండు గంటల పాటు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ లో గడిపిన రాజు గారు, నిన్న రాత్రి పార్లమెంట్ స్పీకర్ ని కలిసారు. ఈ రోజు హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని, అలాగే మరో కేంద్ర మంత్రి రాజ్ నాధ సింగ్ ని కలిసారు. వీరి ముగ్గురితో మాట్లాడిన తరువాత, రఘు రామరాజు మీడియాతో మాట్లాడారు "నేను ఎంపీ పదవికి ప్రమాణం చేసినప్పుడు రాజ్యాంగంపై ప్రమాణం చేశాను. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది. రాజ్యాంగానికి లోబడి, బాధ్యత నేను నిర్వహిస్తే, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం అని చెప్పే ఒక రాజకీయ పార్టీ నుంచి, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ నేను చేసిన వ్యాఖ్యల పై నోటీసులు ఇవ్వటం కరెక్ట్ కాదు. ఇటు వంటి క్లిష్ట సమస్యలు ఉన్నాయి. అయితే సారద్ యాదవ్ గారిని ఉదాహరిస్తూ, కొంత మంది నన్ను టార్గెట్ చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళే, కొంత మంది కుట్ర చేస్తున్నారని అర్ధం అవుతుంది. సరద్ యాదవ్ గారి కేసు వేరు, నా కేసు వేరు. సరద్ యాదవ్ గారు, ప్రతిపక్ష పార్టీలతో కలిసి ర్యాలీలు చేసారు. నేను ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన వాడిగా, ప్రవర్తించాను. మా ముఖ్యమంత్రి గారిని కలలో కూడా నేను ఏ రోజు ఒక్క మాట కూడా అనలేదు. పార్టీని కూడా ఎప్పుడూ ఏమి అనలేదు. మా మంత్రులే ఇసుక మీద స్పందించారు. ఇసుక మాయం అవుతుంది అని మంత్రి పెద్దిరెడ్డి గారే అన్నారు. అందుకే నేను కూడా వాటి పై చర్యలు తీసుకోమని కోరాను. పార్టీని కాదు ప్రభుత్వాన్ని కోరాను. సూచనలు చేశాను."

"ఇక్కడ అందరూ గుర్తుంచుకావాల్సింది ఏమిటి అంటే, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. కొన్ని సార్లు ప్రభుత్వంలో, అనేక పార్టీలు కలిసి ఉంటాయి. కాని పార్టీ వేరు. పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. పార్టీ సభ్యుడిగా పార్టీని ఏనాడు విమర్శించలేదు. ప్రభుత్వానికి మాత్రం సలహాలు ఇచ్చాను. 80 శాతం హిందువులు మనోభావాలు గుర్తిస్తూ, వెంకన్న ఆస్తులు అమ్మవద్దు అని కోరాను. అది పాలకవర్గ నిర్ణయం, దాన్ని విబేధిస్తే పార్టీని దిక్కరించాను అన్నారు. అయితే కొంత మంది మా ఎమ్మెల్యేలు నా పై తిరుగు బాటు చేసారు. ఎవరి ఆదేశాలు మేరకు చేసారో తెలియదు, కాని కొంత మంది మా ఇంచార్జ్ అయిన వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు అని అంటున్నారు. అయితే ణా దిష్టి బొమ్మలు తగలబెట్టి, నన్ను బెదిరింపులు చేసి, హడావిడి చేసారు. పోలీసులు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు. అందుకే నేను, కేంద్ర ప్రభుత్వాన్ని రక్షణ కావాలని కోరారు. పార్లమెంట్ స్పీకర్ గారికి వినతి ఇచ్చాను. ఇవన్నీ మాట్లాడటానికి ఢిల్లీ వచ్చాను. "

"నిన్న స్పీకర్ ని కలిసాను, ఈ రోజు కిషన్ రెడ్డి గారిని కలిసి ఈ విషయం చెప్పను. అలాగే రాజనాద్ సింగ్ గారికి గౌరవ ప్రదంగా కలిసాను. నిన్న ఎన్నికల సంఘాన్ని కలిసి, కొన్ని రూల్స్ తెలుసుకున్నాను. ఇంకా ఎవర్ని అయినా కలవాల్సి వస్తే కలుస్తాను. ఎవర్ని కలుస్తానో చెప్పలేను కాని, అవసరం అయితే కలుస్తాను. అయితే, షోకాజ్ కి రిప్లై ఇవ్వాలా, లేక జగన్ గారికి వివరణ ఇవ్వాలా అనేది చూస్తున్నా. పార్టీని ఏమి అనకపోయినా, వారికి కావాల్సిన సోషల్ మీడియాలో, వారి సమాజికవర్గ గ్రూపులలో నా పై చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, నేను క్రమశిక్షణతో ఉన్నాను, మీరు ఎన్ని రాతలు రాపించినా, నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు, జగన్ గారిని ఏమి అనబోను. ఇటువంటి ప్రయత్నాలు ఆపండి. ప్రజలు గమనిస్తున్నారు. జగన్ కు నాకు, గ్యాప్ తేకండి అని మరొక్కసారి, విజయసాయి రెడ్డి గారిని అర్ధం చేసుకోవాల్సిందిగా కోరుతూ, నోటీసుని విత్ డ్రా చేసుకోమని కోరుతున్నాను" అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

గతంలో, చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, చంద్రబాబు అవినీతి చేసారు అంటూ, అప్పటి ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ప్రధాని మోడీ కూడా, ఎన్నికల ప్రచారంలో , ఏపి వచ్చి, చంద్రబాబుకు పోలవరం ఏటీఏంల మారింది అంటూ, ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసారు. అయితే ఇవన్నీ కేవలం రాజకీయం కోసం చేసిన వ్యాఖ్యలు అని, చంద్రబాబుని ఎన్నికల్లో ఇబ్బంది పెట్టటానికి మాత్రమే చేసిన వ్యాఖ్యలు అని, ఇప్పుడు తేలిపోయింది. అటు కేంద్రం కాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాని, చంద్రబాబు హయంలో, పోలవరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అంటూ, వచ్చిన ఫిర్యాదుల పై, ఈ రోజు కేంద్ర జలశక్తి శాఖ స్పందించింది. పెంటపాటి పుల్లారావు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ, పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదని తేల్చి చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ పై, ఎలాంటి విచారణ అవసరం లేడని తేల్చి చెప్పింది. ప్రధాని కూడా పోలవరంని ఏటీఏంలా వాడుకుంటున్నారు కదా అని ఆడగగా, కేంద్ర జలశక్తి శాఖ వాటిని కూడా తోసిపుచ్చింది.

తమకు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి, పోలవరం ప్రాజెక్ట్ పై విచారణ జరపమని, ఎక్కడా ఆదేశాలు రాలేదని తేల్చి చెప్పింది. అంతే కాదు, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వమే, పోలవరం ప్రాజెక్ట్ పై అవినీతి జరిగింది అంటూ వేసిన విచారణ కమిటీ నివేదికనే పక్కన పెట్టిందని కేంద్రం చెప్పింది. నిబంధనలు ప్రకారమే, మొత్తం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది అని, పోలవరం పై ఎలాంటి అవినీతి గత ప్రభుత్వ హయంలో జరగలేదని చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టు నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం చెప్పింది. జరిగిన నిర్ణయాలు అన్నీ, అథారిటీ ఆదేశాల ప్రకారమే జరిగాయని చెప్పింది. 2017లో కాంట్రాక్టు మార్పు కూడా, నిబంధనలు ప్రకారమే జరిగిందని చెప్పింది. అంచనాల పెరుగుదలకు అనేక కారణాలు ఉంటాయాని చెప్పింది. కొన్ని చెల్లింపుల పై రాష్ట్రంలో విజిలెన్స్ విచారణ జరుగుతుందని, ప్రధానికి జలశక్తి శాఖ నివేదించింది. దీనికి సంబందించిన పూర్తి నివేదికను జలశక్తి శాఖ, కేంద్రానికి పంపింది.

ఈఎస్ఎ కేసులో అరెస్టయిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆయనను ఈ నెల 25 నుండి 27 వరకు మూడు రోజులు పాటు కస్టడీకి ఎసిబి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. అచ్చెన్న నాయుడి ఆరోగ్యపరిస్థితుల రీత్యా ఆయనను చికిత్స పొందుతున్న ఆస్పత్రిలో ఎసిబి అధికారులు విచారిస్తున్నారు. గురువారం ఏసీబీ డీఎస్సీ ప్రసాద్ ఈ విచారణను ప్రారంభించారు. అయితే ఈ కేసులో అచ్చె న్న సహా నిందితులను జైలు రిమాండ్ నుంచి ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారి స్తున్నారు. అచ్చెన్నను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలో విపక్షం అధికార పార్టీపై విరుచుకుని పడింది. అచ్చెన్నను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసారనే కథనాలు ఆధారంగా ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేసి అచ్చెన్నపై హత్యకు కుట్ర జరుగుతుందని అభియోగించింది. అధికారులు ఒత్తిడిపై ఆసువత్రినుండి బలవంతంగా డిశ్చార్జ్ చేసారని ప్రతిపక్షం ఆరోపించింది. అయితే ఏసీబీ కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే గుంటూరు జీజీహెచ్ లోనే అచ్చెన్నను ఆయన న్యాయవాది సమక్షంలో వీడియో రికార్డింగ్ తో పాటుగా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నను ఏసీబీ కస్టడీకి తీసుకుని విచారిస్తున్న అంశంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. ఈ చర్యను తప్పుబట్టారు.

అయితే మరోపక్క, అచ్చెన్నాయుడు విచారణాలో కూడా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయని, అచ్చెన్నాయుడు ఎదురు ప్రశ్నించటంతో, ఏసీబీ దగ్గర సమాధానం లేదని కొన్ని పత్రికలు రాసాయి. నిన్న అచ్చెన్నాయుడుని మూడు గంటల పాటు ఏసీబీ అధికారాలు విచారణ చేసారు. మొదటగా, అచ్చెన్నాయుడు నేపధ్యం, ఆయన రాజకీయ, కుటుంబ జీవితం గురించి కొన్ని ప్రశ్నలు అడిగారని సమాచారం. మందులు కొనుగోళ్ళలో ఎలాంటి ప్రొసీజర్ పాటించారు, టెండర్లు లేకుండా కొన్ని కొనుగోళ్ళు ఎందుకు చేసారు అని అడగగా, అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ, మందులు కొనుగోళ్ళ వ్యవహారంలో తన సంతకం ఎక్కడా లేడని, మందులు కొనే టైంకి, నేను ఆ మంత్రినే కాదని ఆయన చెప్పారు. టెలిమెడిసిన్‌ విషయంలో మాత్రం, కేంద్రం ఇవి మొదలు పెట్టాలని చెప్పటంతో, తెలంగాణాలో ఎలా చేసారో అలా చెయ్యండి అని చెప్పానని అచ్చెన్న చెప్పగా, ఒక కంపెనీతో ఒప్పందం చేసుకోవాలని ఎలా చెప్తారు అని చెప్పగా, తెలంగాణాలో చేసినట్టు చెయ్యమన్నానని, కాని తరువాత ఒప్పందంలో తాను ఎక్కడా సంతకం చెయ్యలేదు కదా అని అచ్చెన్న ఎదురు ప్రశ్నించారు. ఎక్కడా ఒప్పందాల పై తన సంతకాలు లేవని, ఏమైనా ఉంటే చూపించండి అని అన్నారు. అప్పటికి టైం రాత్రి 8 అవ్వటంతో, విచారణ ముగించారు.

కరోనా సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇచ్చిన సహాయం గురించి చెప్పారు. 39.14 కోట్ల కేజీల బియ్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ మూడు నెలల్లో పంపించామని చెప్పారు. దీని వల్ల 7.83 కోట్ల మంది లబ్ది పొందారని అన్నారు. 2.71 కోట్ల మంది లబ్దిదారులకు, 2.71 కోట్ల కేజీల కందిపప్పు, ఈ మూడు నెలల్లో ఇచ్చామని నిర్మలాసీతారామన్ అన్నారు. 500 రూపాయల చొప్పున, మూడు నెలలకు మహిళలకు ఇచ్చామని అన్నారు. జన్ ధన్ అకౌంటులు ఉన్నవారికి, డబ్బులు నేరుగా ఇచ్చామని అన్నారు. అలాగే భావన నిర్మాణ కార్మికులను కూడా కేంద్రం ఆదుకుందని, 196 కోట్లు ఇచ్చామని, 19 లక్షల మంది దీని వల్ల లబ్ది పొందారని అన్నారు. అలాగే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే, స్రామిక్ రైళ్ళు 3 కేటాయించమని అన్నారు. రాష్ట్రం ఎన్ని కోరితే ఎన్ని ఇస్తాం అని అన్నారు. గుజారాత్ లో చిక్కుకున్న శ్రీకాకుళం వాసులని తీసుకు రావటానికి, మేము ఎంతో ప్రయత్నం చేసామని, కేంద్రం చేసిందిని గుర్తు చేసారు. ఇవి కాకుండా, నగదు కింద, రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇచ్చామని అన్నారు.

కరోనా కారణంగా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని తలచి, అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా డబ్బులు ఇచ్చామని, ఒక్క కరోనాను ఎదుర్కోవటానికే, రూ.8025 కోట్లు కేంద్రం రాష్ట్రానికి, ఈ మూడు నెలలలో ఇచ్చిందని అన్నారు. రాష్ట్రం డబ్బులు లేక ఇబ్బంది పడుతుందని, కేంద్రం ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తుందని, డబ్బులు, బియ్యం, పప్పులు, ట్రైన్ల కేటాయింపు చేసామని అన్నారు. అలాగే పీపీఈ కిట్లు, మాస్కులు, ఇలా ఏమి కావాలో అవి, నేను అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు ఫోనులు చేసి వాళ్లకు కావల్సింది ఇచ్చామని అన్నారు. అయితే ఈ సందర్భంగా, వైసీపీ పై ఆరోపణలు చెయ్యవద్దు అనుకున్నా అని, కాని ఒక విషయం చెప్పాలని అన్నారు. పీపీఏల విషయంలో, రాష్ట్రం అనుసరించిన విధానం వల్ల, అంతర్జాతీయంగా ఇబ్బంది వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. ఇక చివరగా, అసలు బాంబు పేల్చారు నిర్మలా సీతారామన్. కేంద్ర ప్రభుత్వం, ఒక రేటుకి కరెంటు ఇస్తున్నామని చెప్పినా, రాష్ట్రం మాత్రం భారీగా ప్రజల నుంచి చార్జ్ చేస్తున్నారని, కేంద్రం యూనిట్ 2.70కి ఇస్తుంటే, రాష్ట్రం మాత్రం ప్రజల నుంచి రూ.9 యూనిట్ ధర తీసుకుంటుందని తెలుసుకుని, షాక్ అయ్యానని, ఈ కరోనా టైంలో ఇలా చెయ్యటం కరెక్ట్ కాదని, ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని కోరారు.

Advertisements

Latest Articles

Most Read