తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని, 20 రోజుల క్రితం, ఈఎస్ఐ స్కాం పేరుతొ ప్రభుత్వం, అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు పైల్స్ ఆపరేషన్ అయిన మరుసటి రోజే, అరెస్ట్ చేసి, దాదాపుగా 15 గంటలు, 600 కిమీ తిప్పి ఆయన్ను విజయవాడ తీసుకొచ్చారు. అయితే, ఆపరేషన్ అయ్యి 24 గంటలు మాత్రమే కావటంతో, అచ్చెన్నాయుడు గారికి తీవ్ర రక్త శ్రావం అయ్యి, ఆయనకు మరోసారి ఆపరేషన్ చెయ్యాల్సి వచ్చింది. ఇదంతా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో, ప్రభుత్వం ఆధ్వర్యంలో, పోలీస్ రేమాండ్ లోనే జరిగింది. ఆయనకు ఆరోగ్యం బాగోకపోవటం, రెండు సార్లు ఆపరేషన్ చెయ్యటంతో, కోర్టు కూడా, ఆయన్ను హాస్పిటల్ లో పెట్టి తగ్గేదాకా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే నాలుగు రోజుల క్రితం, అర్ధరాత్రి పూట అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చెయ్యటానికి, హాస్పిటల్ వర్గాలు ప్రయత్నించటం, వెంటనే ఏసీబీ అధికారులు అరెస్ట్ చెయ్యటానికి రెడీ కావటంతో, టిడిపి ప్రతిఘటించింది. ఆయన ఆరోగ్యం కుదుట పడలేదు, రెండో సారి ఆపరేషన్ చేసారు, నొప్పితో ఇబ్బంది పడుతున్నారు అని నిరసన తెలపగా, వెనక్కు తగ్గారు. అయితే ఈ రోజు హుటాహుటిన, అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేసి, విజయవాడ సబ్ జైలు కు తరలించారు.

ఆయన కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. వీల్ చైర్ పై అంబులెన్స్ దాకా తీసుకుని వచ్చారు. ఇదంతా కేవలం ఒక గంటలో జరిగిపోయింది. అయితే ఈ పరిణామం జరిగిన గంట ముందు, అచ్చెన్నాయుడు పై వేసిన బెయిల్ పిటిషన్‍ మీద వాదనలు జరిగాయి. ఈ రోజు బెయిల్ పిటీషన్ పై, వాదనలు ముగిసాయి. అచ్చెన్నాయుడు తరుపున, సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు ముగియటంతో, రేపు కాని, ఎల్లుండి కాని, బెయిల్ పై తీర్పు రానుంది. ఈ విషయం తెలిసిన గంట సేపటికే, అచ్చెన్నాయుడుని డిశ్చార్జ్ చేస్తూ హాస్పిటల్ వర్గాలు నిర్ణయం తీసుకోవటం, పోలీసులు సబ్ జైలుకు తరలించటం జరిగిపోయాయి. ఇవి రెండు యాద్రుచికంగా జరిగాయో, లేదో కాని, తెలుగుదేశం ప్రభుత్వం, దీని వెనుక జగన్ ఉన్నారని, విచారణ అయిపొయింది కాబట్టి, ఆయనకు ఎలాగూ బెయిల్ వస్తుంది కాబట్టి, ఒక్క రోజు అయినా అచ్చన్నను జైలులో పెట్టటానికి, జగన్ ఈ విధంగా చేసారని, టిడిపి ఆరోపిస్తుంది.

డిప్యూటీ సియం, రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఈ రోజు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. ఆయన రాజ్యసభకు ఎన్నిక కావటంతో, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసారు. మంత్రి పదవికి కూడా రాజీనామా చేసే అవకాసం ఉంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తరువాత, పిలి సుభాష్ చంద్రబోస్, మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తనకు పార్లమెంట్ లో అడుగు పెట్టటం, చిరకాల కోరిక అని, అది ఇప్పుడు తీరిందని అన్నారు. ఈ ఏడాది కాలంలో తన పని తనకు సంతృప్తిని కలిగించిందని అన్నారు. రాజ్యసభలోకి అడుగు పెడుతున్న సందర్భంగా, సంతోషంగా ఉందని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో, అందరితో కలిసి పోరాడతామని అన్నారు. ప్రజల కోసం, కష్టపడి పని చేస్తాం అని అన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, సరిగ్గా ఇక్కడే బోస్ చేసిన వ్యాఖ్యలు, చర్చనీయంసం అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి ఎలక్షన్ ఎజెండానే, ప్రత్యేక హోదా అనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఎన్నికలు అయి, తానూ సియం అవ్వగానే, ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి, చేసేది ఏమి లేదు, ప్లీజ్ సార్ ప్లీజ్ అని అడుగుతూనే ఉండాలి అని, జగన్ అన్నారు. దీంతో ఇక హోదా ఆశాలు పోయాయి. మొన్న రాజ్యసభ సీటు కూడా బీజేపీ అడిగిన వారికి ఇచ్చారు కానీ, ప్రత్యేక హోదా డిమాండ్ చెయ్యలేదు. అయితే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ని, విలేఖరులు, రాజ్యసభలో ప్రత్యేక హోదా పై, ఎలా పోరాటం చేస్తారు అని అడగగా, ప్రత్యేక హోదా వస్తుంది అనే నమ్మకం తనకు లేదు అంటూ, సంచలన వ్యాఖ్యలు చేసారు. డిప్యూటీ సియం హోదాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతే కాదు, హోదా బదులు ఏదో ఇస్తాం అంటున్నారని, దాని గురించి చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే సుదీర్ఘ పోరాటం మేము చేసాం అని, కాని కేంద్ర ప్రభుత్వం, హోదా ఇవ్వం అంటూ, కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారని, వాళ్ళేదో సెకండ్ ఆప్షన్ ఇస్తాం అంటున్నారు అంటూ బోస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి...

తమకు సంఖ్యా బలం లేదని, అక్కడ తమ మాట వినటం లేడని, ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ, జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించిన సంగతి తెలిసిందే. శాసనమండలి రద్దు చర్చ సందర్బంగా, మండలి దండగ అని, మండలి అంటే పెద్దల సభ అని, మన అసెంబ్లీ లోనే, అన్ని రకాల వారు ఉన్నారని, డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, మాజీ అధికారులు, జర్నలిస్టులు ఉన్నారని, శాసనమండలి పై ఒక్క పైసా ఖర్చు పెట్టినా వృధా అని, అందుకే శాసనమండలి రద్దు చేస్తున్నాం అంటూ, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం శాసనమండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నిర్ణయం తీసుకోవటానికి, కారణాలు వేరే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం విషయంలో, అది దేశ చట్టలకే వ్యతిరేకం అని, ఇంగ్లీష్ మీడియంతో పాటుగా, తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉంచాలని, శాసనమండలి, బిల్లుని తిప్పి పంపించింది. ఇక సీఆర్డీఏ రద్దు, మూడు ముక్కల రాజధాని పై బిల్లులు కూడా శాసనమండలి ఆపింది. ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపించాలని కోరింది. ఆ రోజే సెలెక్ట్ కమిటీకి పంపించి ఉండి ఉంటె, ఈ పాటికి ఆ గడువు అయిపోయేది, ప్రభుత్వానికి ఏది ఇష్టం వస్తే, అది చేసుకునే పని. కాని జగన్ మోహన్ రెడ్డి, నా మాటకే ఎదురు చెప్తారా అని, ఏకంగా మండలిని రద్దు చేసి, తీర్మానం కేంద్రానికి పంపించారు.

అయితే కేంద్రం ఇప్పటికే ఈ బిల్లుని పాస్ చేసే అవకాసం కనిపించటం లేదు. కరోనా వల్ల, ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయో తెలియదు. జరిగినా, అవి ముఖ్యమైన బిల్లులు వరుకే పరిమితం అవుతాయి కాని, ఇలాంటి బిల్లులు పరి చర్చించే అవకాసం ఉండదు. దీంతో, అప్పటి వరకు ఆగకుండా, శాసనమండలిలోనే బలం పెంచుకోవాలని వైసీపీ తమ వ్యుహన్ని మార్చుకుంది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన డొక్కాతో కలుపుకుని, వైసీపీకి 10 మంది ఉన్నారు. ఇక రెండు ఇప్పటికే ఖాళీగా ఉండగా, మరో రెండు మోపిదేవి, బోసు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ నాలుగు కూడా వైసిపీ ఖాతాలో అతి త్వరలోనే వెళ్తాయి. ఇక వచ్చే జూన్ నాటికి ఈ నాలిగిటితో కలుపుకుని 25 స్థానాలు ఖాళీ కానున్నాయి. గవర్నర్ కోటా, ఎమ్మెల్యేల కోటాలో 12 స్థానాలు ఖాళీ అవ్వగా, అవీ వైసీపీ గెలుచుకుంటుంది. ఇక మిగతా 7 స్థానిక సంస్థల నుంచి ఎన్నిక అయ్యేవి. అందుకే వీలు అయినంత త్వరగా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి, అక్కడ కూడా బలం పెంచుకుంటే, ఈ 7టిలో కూడా మెజారిటీ తమకే వస్తాయని వైసిపీ అంచనా వేస్తుంది. ఇక మరో వ్యూహంగా, కొంత మంది టిడిపి నేతలను తమ వైపు తిప్పుకుని, రాజీనామా చేసి, మళ్ళీ వారికే ఆ స్థానం ఇచ్చి, తమ పార్టీ ఖాతాలో వేసుకోవాలనే వ్యూహం కూడా ఉంది. మొత్తానికి మండలి పై పైసా ఖర్చు కూడా దండగ అనే దగ్గర నుంచి, మండలిలో ఎలా బలం పెంచుకోవాలనే వ్యూహంలో వైసిపీ ముందుకు వెళ్తుంది.

గత ఏడాది కాలంగా తెలుగుదేశం నేతలు టార్గెట్ గా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, చేస్తున్న అనేక కార్యక్రమాల పై, టిడిపి నేతలు ప్రతి రోజు తమ ఆవేదన చెప్తూనే ఉన్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే ఒక రెండు మూడు నెలలు, దాడులు జరిగాయి అంటే, ఏదో వేడిలో జరుగుతాయిలే అనుకోవచ్చు, కాని ఈ కక్ష సాధింపు మాత్రం, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. తెలుగుదేశం నేతలు అచ్చెంనాయుడుని ఇప్పటికే ఈఎస్ఐ స్కాం అంటూ, ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇక జేసీ బ్రదర్స్ వ్యాపారాల అక్రమం అంటూ, వారిని కూడా ఇబ్బంది పెట్టి, చివరకు అరెస్ట్ చేసారు. ఇక నేతలు, కార్యకర్తలు పై కేసులు అయితే చెప్పే పనే లేదు. ఇంకా నేతలు ఉన్నారని, చంద్రబాబు, లోకేష్ ను కూడా లోపల వేస్తాం అని చెప్తున్నారు కూడా. అయితే, ఇవన్నీ పక్కన పడితే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ, లోక్ సభలో, ఆంధ్రప్రదేశ్ వాణి వినిపించే, గల్లా జయదేవ్ కు, షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గల్లా జయదేవ్ కుటుంబానికి, ముందు నుంచి కంపెనీలు ఉన్నాయి. అమర్ రాజా కంపెనీ గత కొన్నేళ్లుగా, గల్లా కుటుంబం నడుపుతున్న సంగతి అందిరికీ తెలిసిందే. దాదాపుగా 5 వేల మందికి ఉపాధి ఇస్తూ, రాష్ట్రానికి, దేశానికి అనేక పన్నులు కడుతుంది.

చిత్తూరు జిల్లాలో ఉన్న కరకంబాడీలో, ఈ ప్లాంట్ ఉంది. గతంలో 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, ఈ కంపెనీ విస్తరణ కోసం అని చెప్పి, 483.27 ఎకరాలు ఇస్తూ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కాల క్రమేనా విస్తరణ చేసారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఈ 483 ఎకారాలలో, 253 ఎకరాలు వెనక్కు తీసుకోవాలని, ఈ రోజు జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. చెప్పినట్టు విస్తరణ చెయ్యలేదని, అందుకే వెనక్కు తీసుకుంటున్నాం అని తమ ఉత్తర్వుల్లో చెప్పింది. గత రెండు మూడు నెలలుగా, ఈ విషయం పై చర్చ జరుగుతూ ఉండగా, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇలా చాలా కంపెనీలు తమకు ఇచ్చిన పూర్తి భూమి వినియోగించుకోకుండా ఉన్నాయి. ఉదాహరణకు వాన్-పిక్ భూములు, బ్రాహ్మిణీ స్టీల్స్ విషయంలో కూడా, ఇలాగే అనేక ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. మరి ఆ విషయంలో, ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. తెలుగుదేశం నేతలు మాత్రం, లొంగని టిడిపి నేతలను ఇలా ఆర్ధికంగా ఇబ్బందులు పెడుతున్నారని, ఇలాంటి చేస్తే, మిగతా పారిశ్రామికవేత్తలకి, ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అంటూ, ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Latest Articles

Most Read