వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. షోకాజ్ నోటీసుకి సమాధానం ఇస్తారు అనుకున్న సమయంలో, అది కాకుండా, జగన్ మోహన్ రెడ్డికి ఆరు పేజీల లేఖ రాసారు రఘురామకృష్ణం రాజు. విజయసాయి రెడ్డి తనకు పంపించిన నోటీసును, ఆ లేఖలో ప్రస్తావించారు రఘురామకృష్ణ రాజు. విజయసాయి రెడ్డి తనకు ఇచ్చిన నోటీసులో, లెటర్ హెడ్ చూస్తే, మన పార్టీది లాగా లేదని అన్నారు. మన పార్టీ వైఎస్ఆర్ పేరును ఉపయోగించోద్దని ఎన్నికల కమిషన్ చెప్పిందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీ పేరుకు బదులు, మరో పేరుతో ఉన్న లెటర్ హెడ్ తో తనకు నోటీసు ఇచ్చారని అన్నారు. వెంకటేశ్వర స్వామీ భక్తుడిగానే నేను తిరుమల తిరుపతి దేవస్థానం భూములు వేలం పై స్పందించానని అన్నారు. మీ కోటరీ నా పై, క్రీస్టియన్ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియం పైనా కొందరు నా వ్యాఖ్యలని వక్రీకరించారని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎప్పుడూ పాల్పడలేదని అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్తవం అని లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని నేను కలవాలి అనుకుంటున్నాను, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. అయితే రఘురామరాజు లేఖ విడుదలకు ముందు, ప్రధాని మోడీ పై, అనుకూలంగా ఉన్న ఒక ఆడియో సంగ్ ని కూడా ఆయన విడుదల చేసారు. సోషల్ మీడియాలో కూడా దాన్ని షేర్ చేసారు. చైనాతో కనుక మనకు యుద్ధం జరిగితే, ఆ యుద్ధంలో మోడీ గెలుస్తారు అంటూ, పాట సాగుతుంది. అయితే దీని పై కొందరు స్పందిస్తూ, రఘురామకృష్ణ రాజు, బీజేపీకి దగ్గర అవుతున్నారా అనే అనుమానం కూడా కలుగుతుంది. అయితే దీని పై స్పందించిన రఘురామరాజు,తనకు ఇద సినీ పరిశ్రమలో పని చేసే ఒక మిత్రుడు ఫార్వర్డ్ చేసారని, అదే నేను అందరికీ ఫార్వర్డ్ చేసానని, ఇలాంటి క్లిష్ట సమయంలో, ప్రధానికి అందరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందని, దాంట్లో తప్పు ఏమి ఉంది అంటూ ప్రస్తావించారు. అయితే, ఇప్పుడు ఈ ఆడియోతో పాటు, జగన్ కు రాసిన లేఖ పై, జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నేత, రఘురామకృష్ణం రాజు. ఆయన ఎంపీ అయిన దగ్గర నుంచి, రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా, తన అభిప్రాయాలు కుండబద్దలు కొడుతున్నారు. తాను ఎంపీగా ప్రమాణం చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకుంటూ, ప్రజల కోసమే పని చేస్తానని, ప్రజలకు ఇబ్బంది జరిగితే అది చెప్పాల్సిన బాధ్యత తన పై ఉందని చెప్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనులు పై, బహిరంగంగా ఎత్తి చూపటంతో, ఆ పార్టీకి చెందిన నేత, జనరల్ సెక్రటరీ విజయసాయి రెడ్డి, రఘురామకృష్ణంరాజుకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయితే దీని పై గత నాలుగు రోజులుగా రఘురామరాజు తన అభిప్రాయాలని చెప్తూ వచ్చారు. ఈ రోజు తాను వైసిపీ ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు రిప్లై ఇవ్వటమా, లేక జగన్ మోహన్ రెడ్డికి నేరుగా లేఖ రాయటమా, ఏదో ఒకటి చేస్తానని, ఈ రోజు 12 గంటల లోపు వారికి రిప్లై ఇస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన ఏమి చేస్తారా అని అందరూ టెన్షన్ గా ఉన్న సమయంలో, ప్రాముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ఇవన్నీ చూస్తుంటే, రఘురామరాజు ఏదో భారీ ప్లాన్ తోనే ఉన్నారని తెలుస్తుంది.

జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేస్తూ, "Will Raghu Raju’s arrow Bow and arrow hit the bulls eye ???? today !!! Hold you breath !!!" అంటూ ట్వీట్ చేసారు. రఘురామరాజు ఈ రోజు కుంభస్థలాన్ని కొడతారా ? ఊపిరి బిగబట్టండి అంటూ ట్వీట్ చేసారు. సహజంగా జంధ్యాల రవి శంకర్ ఏదో విషయం ఉంటే తప్ప హైప్ చెయ్యరు. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ విషయం, నిమ్మగడ్డ విషయం, అమరావతి విషయం ఇలా అనేక విషయాల్లో, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజు విషయంలో కూడా ఆయన ఏమైనా న్యాయ సలహాలు ఇచ్చారా ? అంటే, ఈ ట్వీట్ చూస్తే నిజమే అనిపిస్తుంది. రఘురామరాజు లేవనెత్తిన అంశాలు, ఏకంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మనుగడకే ప్రమాదం అనే వార్తలు కూడా వచ్చాయి. మరి ఆ విషయంలో, ఏదైనా చట్టం బయటకు తీసి, ఇరికించబోతున్నారా ? ఏది చేసినా జగన్ ని ఇబ్బంది పెట్టె వ్యూహమే కాని, పార్టీ రద్దు వరుకే వెళ్ళే అవకాశం ఉండదు అనే విశ్లేషణ కూడా వస్తుంది. చూద్దాం ఏమి చేస్తారో ?

రాష్ట్రంలో చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేసే కందిపప్పు, పంచదార ధరలను పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటివరకు తెల్ల కార్డు లబ్దిదారులకు సబ్సిడీపై ఇస్తున్న చక్కెర, కందిపప్పుల ధరలు పెరగను న్నాయి. గతంలో కిలో కందిపప్పు రేషన్ దుకాణాలలో రూ. 40 ఉండగా.. దానిని రూ. 27 పెంపుదల చేసి రూ. 67కి అందించనున్నారు. అలాగే లబ్దిదారులకు అరకిలో చొప్పున అందిస్తున్న పంచదార ధర ఇప్పటి వరకు రూ. పది ఉండగా.. దానిని రూ. 17కు పెంచారు. వచ్చే నెల నుంచి ఈ ధరలు అమలులోకి రాను న్నాయి. అయితే దారిద్ర్య రేఖకు అత్యంత దిగువన ఉన్న అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు (కేంద్ర ప్రభుత్వ పధకం) మాత్రం పాత ధరలకే ఆయా సరుకులు అందనున్నా యి. ఇదిలా ఉండగా.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇలా పేదలకు ఉపయోగపడే వాటి పై, పొట్ట నింపుకునే వాటి పై, ధరలు పెంచటం పై అన్ని వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి.

దీని పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ స్పందించారు. ఒకేసారి, కేజీకి రూ.27 పెంచటం పై, ఆయన తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. అయితే ఈ సందర్భంలో, రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న, ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించిన తీరులో లోకేష్ స్పందించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు, తమ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని, ఇప్పటికే ఈ విషయం పై, ఎలక్షన్ కమిషన్ రెండు మూడు సార్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉపయోగించవద్దు అని చెప్పిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పిన విషయం తెలిసిందే. అయితే పెరిగిన రేషన్ సరుకులు రేట్లు పై, లోకేష్ స్పందిస్తూ, జగన్ పార్టీని కొత్తగా పిలిచారు. ‘‘యుశ్రారైకాపా'' అంటూ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనే అర్ధం వచ్చేలా లోకేష్ స్పందిస్తూ, ''యుశ్రారైకాపా'' ప్రభుత్వం ఈ చేత్తో ఇచ్చి, ఆ చేత్తో లాగేసుకుంటుంది అని, రేషన్ సరుకుల రేట్లు పెంపుదల వల్ల, పేదల పై అదనంగా రూ.600 కోట్లు పడుతుందని అన్నారు.

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు వాహనాల్లో వెళ్ళేందుకు పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. ఏపీ సరిహద్దుల్లో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతిస్తామని నల్గొండ జిల్లా ఎస్పీ ఆకుల వెంకట రంగనాథ్ చెప్పారు. తెలంగాణ నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ ద్వారా వాడపల్లి మీదుగా వెళ్ళే వాహనాలు రాత్రి 7 గంటల్లోగా ఏపీ సరిహద్దులకు చేరుకోవాలని సూచించారు. పాస్ ఉంటేనే తెలంగాణ వాహనాలను ఏపీలోకి అనుమతిస్తామని చెప్పారు. సరుకు రవాణా, అత్యవసరర సేవలకు మినహాయింపు ఉంటుందని నల్గొండ మీదుగా మాచర్ల వెళ్ళే వాహనాలకు అనుమతి లేదని ఆయన వివరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క-రో-నా వికృత రూపం దాలుస్తోంది. రోజు రోజుకు క-రో-నా మహమ్మారి విస్తృత స్థాయిలో విజృంభిస్తూ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఒకే రోజు రికార్డు స్థాయిలో 813 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 25,778 మంది నుంచి నమూనాలు సేకరించి, పరీక్షించగా, ఈ కొత్త కేసులు బయట పడ్డాయి. తాజాగా రిపోర్టెన క-రో-నా పాజిటివో రాష్ట్రంలో 755 కేసులు నమోదుకాగా, ఇతర రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చినవారికి 55 మందికి, విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిలో 8మంది కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో క-రో-నా కేసులు అత్యంత వేగవంతంగా 13 వేలు దాటేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 13,098 కేసులు ఉన్నాయి. వీటిలో 10,848 కేసులు రాష్ట్ర పరిధిలోని కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి 1,865, విదేవఝల నుంచి 385 కేసులు ఉన్నాయి. అలాగే ఈ మొత్తం పాజిటిలో తాజాగా 24 గంటల్లో కోలుకున్న 401 మంది బాధితులతో కలుపుకుని ఇప్పటి వరకు 5,908 మంది కోలుకుని, డిశ్చార్జి అయ్యారు. ప్రసుత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,480మంది ఆసుపత్రుల్లో 1,541 మంది క-రో-నా కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 7,021 యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక క-రో-నాకు బలైపోతున్న వారి సంఖ్య రాష్ట్రంలో రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా రాష్ట్రంలో ఒకే రోజు 12 మంది మృతి చెందారు. వీరిలో కర్నూ లులో ఆరుగురు, కృష్ణల్లో అయిదు గురు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు. దీంతో ఈ రెండు జిల్లాల్లో క-రో-నాతో మరణించిన వారి సంఖ్య 116గా ఉంది. రెండు జిల్లాల్లోనూ 58 మంది చొప్పున కరోనాతో మరణించారు.

Advertisements

Latest Articles

Most Read