రాష్ట్ర రాజధానిని తరలించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రేపటితో 200 రోజులు గడిచిపోయాయి. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 2015లో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చి న రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ మరుసటి రోజు నుండే రాజధాని అమరావతినే కొనసాగించాలని రైతులు తలపెట్టిన ఉద్యమానికి రేపటితో 200 రోజులు పూర్తి కావస్తుందని రాజధాని జెఎసి ప్రకటించింది. మూడు ముక్కల రాజధానులకు వ్యతిరేకంగా ఏపికి ఏకైక రాజధానిగా ఆమరావతినే కొనసాగించాలని వేలాదిమంది రైతులు, మహిళలు, వివిధ ప్రజాసంఘాలు, ఆఖకిలపక్ష పార్టీల సహకారంతో అమరావతి పరిధిలో ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్నందున స్వచ్చంధంగా ఇంటిలోనే సభ్యులు కలసి నిరసనలు కొనసాగించే కార్యక్రమం చేపట్టిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. రాజధాని తరలింపు వార్తల నేపధ్యంలో రాజధాని రైతులు మృతిచెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

రాజధాని జేఎసితోపాటు కొందరు రైతులు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాష్ట్ర శాసన మండలిలో కూడా పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం లభించని విషయం తెలిసిందే. వీటి అన్నిటి మధ్య రేపు అమరావతి పోరాటం 200 రోజులకి చేరుకుంటుంది. అయితే, సరిగ్గా ఇలాంటి సమయంలోనే, అమరావతి రైతులకు మద్దతు తెలపటానికి, ఒక అధికార పార్టీకి చెందిన ఎంపీ సంఘీభావం తెలుపుతున్నారని, అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. ఆయన ఎవరో కాదు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. అమరావతి మూడు ముక్కలు చేసినందుకు, రైతులను రోడ్డుపాలు చేసి, మహిళల పై లాఠీ దెబ్బలు తగిలినా, 200 రోజులుగా అమరావతి వాసులు చేస్తున్న పోరాటానికి, మద్దతుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రఘురామకృష్ణం రాజు మాట్లాడి, అమరావతి వాసులకు మద్దతు తెలపనున్నారు. ఒక పక్క వైసిపీ పార్టీ మొత్తం అమరావతిని హేళన చేస్తుంటే, అదే పార్టీకి చెందిన ఎంపీ, అమరావతి రైతులకు మద్దతు తెలపనున్నారు.

రఘురామకృష్ణం రాజు ఇస్తున్న జర్కుల నుంచి, ఇక విముక్తి తీసుకోవాలని, వైసిపీ భావిస్తుంది. ఆయన పై అనర్హత వేటు వేసే దిశగా, వైసిపీ పావులు కదుపుతుంది. రేపు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ, లాయర్లు, ఎంపీలతో కలిసి, వైసీపీ నేతలు, రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీ అయ్యి, రఘురామరాజు పై అనర్హత పిటీషన్లు వేస్తారని తెలుస్తుంది. అయితే ఈ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, తన పై చర్యలు తీసుకోవాలి అంటూ, వస్తున్న వార్తల పై రఘురామ రాజు స్పందించారు. "వీళ్ళకు అసలు కంటెంట్ లేదు. నేను పార్టీని, సియం ని ఏమి అనలేదు. వీళ్ళు ఖాళీగా ఉన్నారు, విమానం ఉంది, ప్రభుత్వ ఖర్చు, తిరుగుతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో విమానం వేసుకుని వచ్చి, ఏదో షో చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా, ప్రత్యేక విమానం వేసుకుని వచ్చి, ప్రభుత్వం ఖర్చులో వేస్తారు. ఇది అనవసర ఖర్చు. ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు. టిటిడి భూములు వేలం ఆపమన్నాని, ఇసుకలో అక్రమాలు మంత్రులే మాట్లాడుతున్నారు, నేను అదే చెప్పా, ఇళ్ళ స్థలాల కుంభకోణం కూడా అంతే. మరి వీళ్ళు నా మీద ఎందుకు పడుతున్నారో. పార్టీకి దేవుడు భూములు అమ్మకానికి, పార్టీకి ఇసుక కుంభకోణానికి సంబంధం ఏమిటి ? ఇది ప్రభుత్వ సంగతి. రెండిటికీ తేడా ఉంది. "

"వీళ్ళకు విమాన ఖర్చులు కూడా దండగ. నన్ను స్పీకర్ సంజయషీ అడుగుతారు, నేను జగన్ గారికి ఏమి రిప్లై ఇచ్చానో, అదే స్పీకర్ గారికి చెప్తాను. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ప్రజల కష్టాలు, ఒక ఎంపీ, సియంకు తెలియ చెయకూడదు అనే వాదన ఏంటో అర్ధం కావటం లేదు. ప్రజల సమస్యలు లేవనెత్తటం తప్పా ? ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పాను, రాజు గారి మీద ఆక్షన్ తీసుకోవచ్చు అని, అని మా పార్టీ ఎంపీ బాలసౌరి గారు, జగన్ గారికి భరోసా ఇచ్చారని, తరువాతే వీళ్ళు ఇక్కడకు వస్తున్నారని తెలిసింది. చూద్దాం ఏమి చేస్తారో. అయితే నా వరకు, ఇది వృధా. స్పెషల్ ఫ్లైట్ డబ్బులు, దాదాపుగా 14 లక్షలు అవుతుంది, ఆ నష్టం తప్ప ఏమి లేదు. నాకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్ళు జగన్ గారికి తెలియకుండా జరిగింది అని అనుకున్నా, అయితే ఈ రోజు విమానం మొత్తం సెట్ చేసారు అంటే, జగన్ గారికి తెలిసే జరిగింది అని అర్ధం అవుతుంది." అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి కొత్త పార్టీ అయిన, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి, ఆ పార్టీ వ్యవహారాలు అన్నీ, విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు. పార్టీ నిర్మాణం, సభ్యత్వాలు, ప్రత్యర్ధుల పై ఏ రోజు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి దాడి చెయ్యాలి, సోషల్ మీడియా, పార్టీ కార్యాలయ వ్యవహారాలు, ఇలా ఒకటేమిటి, అన్నీ విజయసాయి రెడ్డి కనుసన్నల్లో జరిగేవి. రాజ్యసభ సభ్యుడిగా, ఢిల్లీలో వైసీపీ తరుపున మొత్తం ఆయనే. ఇక తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి ఎప్పుడు వచ్చినా, అధికార ప్రతినిధులతో మీటింగ్ లు, సీనియర్ నేతలతో మీటింగ్లు చూస్తూ, పార్టీ మొత్తాన్ని తానే నడుపుతూ వస్తున్నారు. పది రోజుల క్రితం కూడా, తాడేపల్లిలో, అధికార ప్రతినిధులను పిలిపించుకుని మాట్లాడారు. ఇక తాజాగా పార్టీ లైన్ దాటారు అంటూ, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకి పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చారు. అయితే పార్టీలో ఇంత కీలక బాధ్యతలు చూస్తున్న విజయసాయి రెడ్డికి, నిన్న జగన్ షాక్ ఇచ్చారు.

విజయసాయి రెడ్డిని కేలవం ఉత్తరాంధ్రకి పరిమితం చేసారు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం బాధ్యతలు మాత్రమే ఇచ్చి, ఆయనను ఆ మూలకు మాత్రమే పరిమితం చేసారు. చివరకు తన సొంత జిల్లా అయిన, నెల్లూరు జిల్లాకు కూడా ఆయనకు బాధ్యత ఇవ్వలేదు. ఇక తాడేపల్లి ఆఫీస్ బాధ్యతలతో పాట, కర్నాల్,అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం బాధ్యతలు కూడా సజ్జల రామకృష్ణా రెడ్డికి ఇవ్వటం, సంచలనంగా మారింది. ఇక కీలకమైన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల బాధ్యత వైవీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. సజ్జలకి తాడేపల్లి పార్టీ ఆఫీస్ తో పాటు, 6 జిల్లాల బాధ్యత ఇస్తే, వైవీకి 5 జిల్లాల బాధ్యత ఇచ్చారు. విజయసాయి రెడ్డికి కేవలం ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు మాత్రమే ఇవ్వటం, ఆశ్చర్యాన్ని కలిగించింది. సజ్జలకు, విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని, జగన్ సజ్జల వైపు మొగ్గు చూపారని, వస్తున్న ప్రచారం తరువాత, సజ్జలకు ఎక్కువ బాధ్యతలు ఇచ్చి, విజయసాయి రెడ్డికి కట్ చెయ్యటంతో, వైసిపీ శ్రేణుల్లో కూడా చర్చ మొదలైంది.

ఇక రఘురామకృష్ణ రాజు ఇష్యూ ఇంత పెద్దది కావటానికి కారణం, కూడా విజయసాయి రెడ్డి వల్లే అని, పార్టీ హైకమాండ్ నమ్ముతుంది. రఘురామరాజు కూడా, విజయసాయిని టార్గెట్ చేసారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పవర్స్ కట్ అయ్యాయి, మరి రఘురామరాజు గారు ఇప్పటికైనా చల్ల బడతారో లేదో. అయితే విజయసాయి రెడ్డి గత నెలలో, ప్రెస్ మీట్ పెట్టి, జగన్ కు నా పై పూర్తి నమ్మకం ఉందని, నేను కూడా జగన్ ను చనిపోయే దాకా వదలను అని, పార్టీ పూర్తి బాధ్యతలు, సోషల్ మీడియా నేనే చూసుకుంటున్నా అని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే విజయసాయి రెడ్డి వర్గం మాత్రం, విజయసాయి పై పని భారం తగ్గించెందుకునే, ఆయన్ను రాజధాని అవుతున్న విశాఖకు పరిమితం చేసారని చెప్తున్నారు.

కోర్టులు తీరు సరిగ్గా లేదని తమ్మినేని సీతారం అన్నారు. కోర్టులు అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటుంటే, ఇక సియం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉండి, ఏం లాభం అన్నారు తమ్మినేని. కోర్టుల నుంచి పరిపాలిస్తారా అని తమ్మినేని అన్నారు. పరిపాలనలో కోర్టుల జోక్యం ఎక్కువైందని అన్నారు. "కోర్టులు నుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఇది ఆపు, అక్కడకు వెళ్ళు, ఇది స్టాప్ చెయ్యి అంటూ, ఆదేశాలు ఇస్తున్నారు. ఇక అన్నీ వాళ్ళే చేస్తున్నప్పుడు, ప్రజలు ఎందుకు ? ఎన్నికలు ఎందుకు ? ఓట్లు ఎందుకు ?ఎమ్మెల్యేలు ఎందుకు ? ఎంపీలు ఎందుకు ?శాసన సభ ఎందుకు ? అక్కడ ఒక నాయకుడు ఎందుకు ? ముఖ్యమంత్రులు ఎందుకు ? స్పీకర్లు ఎందుకు ? ఇవన్నీ దేనికి ? నేను ఏమి అడుగుతాంటే, డైరెక్ట్ గా మీరే అక్కడ నుంచి రూల్ చేస్తారా ? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా ? న్యాయస్థానాలు, ఈ విధమైన డైరెక్షన్స్ ఇస్తున్నాయి. అయినా బాధతో అంగీకరిస్తున్నాం. రాజ్యాంగం రాసిన వాళ్ళు, ఈ రోజు జరుగుతున్నవి అలోచించి ఉండి ఉంటే, అప్పుడే ఇలాంటి వాటికి ప్రత్యామ్న్యాయం రాసే వారు ఏమో. తీర్పులు వస్తాయని, ఇలాంటివి జరుగుతాయని, వాళ్ళు అనుకుని ఉండరు. లేకపోతే, ఏదో ఒక ఏర్పాటు చేసి ఉండే వాళ్ళేమో. మా నిర్ణయాలు తప్పు అయితే ప్రజలు ఓడిస్తారు. రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకు వెళ్తున్నాం" అని స్పీకర్ అన్నారు.

రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఆయన స్పీకర్. స్పీకర్ కి, కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి. ఆ లక్ష్మణ రేఖలు దాటి మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడకూడదు అని నిబంధనలు లేవు కాని, స్వీయ నియంత్రణ ఉండాలి. స్పీకర్ కు ఆంక్షలు లేవని, న్యాయ వ్యవస్థకు కూడా వ్యతిరేకంగా మాట్లాడతారా ? స్పీకరే ఇలా మాట్లాడితే, ప్రజలు ఎలా గౌరవం ఇస్తారు ? ఇది రాజకీయ అరాచకత్వం. ఆయన రాజకీయ నాయకుడిగా ఉండాలి అనుకుంటే, స్పీకర్ పదవికి రాజీనామా చేసి, రాజకీయ నాయకుడిగా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. స్పీకర్ గా ఉంటూ, తన పరిధి దాటి, ఇలా మాట్లాడుతూ, చివరకు న్యాయవస్థను ప్రశ్నించే స్థాయికి వెళ్లి పోయారు. నిబంధనలు స్పీకరే అతిక్రమిస్తే, ఇక సామాన్య ప్రజలు ఏమి చేస్తారు ? మంచిగా ఉంటే కోర్టులు ఏమి చేస్తాయి ? చట్ట విరుద్ధంగా వెళ్తే కోర్టులు, చట్ట ప్రకారం నిర్ణయాలు ప్రకటిస్తాయి. కోర్టులుకే ఈ అధికారం ఉంది. అలాంటి కోర్టులనే, ఇష్టం వచ్చినట్టు మాట్లడటం దారుణం" అని నారాయణ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read