ఈ రోజు విజయసాయి రెడ్డితో పాటుగా, ఆ పార్టీ ఎంపీలు, ఢిల్లీ వెళ్ళిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, మరీ ఢిల్లీ వెళ్ళింది, ఏపి సమస్య పై కాదు, పార్టీ అంతర్గత విషయాల పై స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ ఢిల్లీ వెళ్లారు. మరి ఆ ఖర్చు పార్టీ ఖాతాలో వేస్తారో, ప్రభుత్వం ఖాతాలో వేస్తారో చూడాలి. వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళింది, తమ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వెయ్యాలని కోరుతూ, వాళ్ళు ఢిల్లీ వెళ్ళారు. ఈ రోజు మూడు గంటల ప్రాంతంలో, లోక్ సభ స్పీకర్ ను కలిసి, రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వెయ్యాల్సిందిగా కోరారు. దానికి సంబందించిన ఫిర్యాదు చేసిన తరువాత, ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో, రఘురామకృష్ణం రాజు పై విజయసాయి రెడ్డి విరుచుకు పడ్డారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, రఘురామకృష్ణం రాజు పై కేసులు ఉన్నాయని, వాటి నుంచి కాపాడుకోవటానికి ఒక పార్టీకి దగ్గర అవుతున్నారని అన్నారు. రఘురామ కృష్ణం రాజు, మా జగన్ నాయకత్వాన్ని "ఎవరి నాయకత్వం అయ్యా, బొచ్చులో నాయకత్వం" అంటూ, జగన్ ని నిందించారని అన్నారు. అలాగే అనేక విషయాల్లో, పార్టీ లైన్ దాటి ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని ఆరోపించారు. ఇవన్నీ చూసిన తరువాత, ఆయన పదవిని అనర్హుడిగా ప్రకటించాలని కోరామని అన్నారు.

అయితే ఈ సందర్భంలో, విజయసాయి రెడ్డికి, కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదురు అయ్యాయి. రఘురామ రాజు అనర్హత పిటీషన్ వెయ్యాలని, చెప్పే మీరు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీని తిడుతూ, మీ పార్టీకి దగ్గరగా ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికే అనర్హత పిటీషన్లు ఇచ్చారు కదా, రఘురామకృష్ణం రాజుకి వర్తించే రూల్స్, వీరికి వర్తించవా ? అని విలేఖరి ప్రశ్నించగా, విజయసాయి రెడ్డి ఇబ్బంది పడ్డారు. ఆ ముగ్గురు ఎవరో తనకు తెలియదు అని, మీకు ఈ విషయంలో ఏమన్నా కావలి అంటే, ఆ పార్టీని అడగండి అంటూ, అసహనం వ్యక్తం చేసారు. రెండో సారి మళ్ళీ అడగగా, జవాబు చెప్పటానికి ఇష్టపడలేదు. ఇక రఘురామరాజు లేవనెత్తిన, క్రమశిక్షణ సంఘం విషయం ప్రస్తావించగా, అది మా పార్టీ అంతర్గత విషయం అని, అన్నీ పార్టీలో ఉన్నాయని, అన్నీ రూల్స్ ప్రకారమే చేసాం అని, అవన్నీ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ, క్రమశిక్షణ సంఘం గురించి చెప్పకుండా, తప్పించుకునే సమాధనం చెప్పారు. మరి రఘురామరాజుకు వర్తించే అనర్హత, ఇక్కడ ఉన్న ముగ్గురు రెబల్స్ కు వర్తించవా ?

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పై, వైసిపీ పార్టీ నేతలు కాని, ప్రభుత్వంలో ఉన్న వారు కాని, ఏదో ఒక విధంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న స్పీకర్ తమ్మినేని కూడా, కోర్టులే పాలించుకోండి, ఇక మేము ఎందుకు అనే విధంగా, మాట్లాడారు అంటే, మనం ఎక్కడకి వెళ్తున్నామో అర్ధం అవుతుంది. అయితే కోర్టులు మాత్రం, తీర్పులు ఇచ్చింది వైసీపీ రంగుల విషయంలో, చట్టం అతిక్రమించి మాతృభాష బోధన తీసివేయటం, అలాగే జగన్ అడిగిన వైఎస్ వివేక హత్య కేసు సిబిఐకి ఇవ్వటం, పోలీసులు మీదే ఆరోపణలు వస్తే డాక్టర్ సుధాకర్ దాడి సిబిఐకి ఇవ్వటం లాంటి తీర్పులు ఇచ్చారు. చట్టం దాటి ప్రవరిస్తే, కోర్టులు కలుగచేసుకోవటం, మనం చూస్తూనే ఉంటాం. అయితే, కొంత మంది మాత్రం, తీర్పులు ఇచ్చిన జడ్జిల పై, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఇలా అనేక రూపాల్లో జడ్జీల పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా, ఏకంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ టార్గెట్ గా, చేస్తున్న ప్రయత్నాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బీసీ సంఘం నేత హన్స్ రాజ్ పేరుతో, రాష్ట్రపతికి ఒక ఫిర్యాదు వెళ్ళింది.

ఈ ఫిర్యాదులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరీ, వైఖరి వల్లే, హైకోర్టులో కరోనా పెరిగిపోయింది అని, పేర్కొన్నారు. అలాగే చీఫ్ జస్టిస్ వైఖరితోనే, రిజిస్టార్ రాజశేఖర్ గుండె నొప్పి వచ్చి చనిపోయారని, చీఫ్ జస్టిస్ తీవ్ర ఒత్తిడి పెట్టారని, తరుచూ ఆయన చెప్తూ ఉండేవారని, ఇప్పుడు ఆయన చనిపోవటానికి కారణం, చీఫ్ జస్టిస్ అంటూ ఆ ఫిర్యాదులో తెలిపారు. ఇక మే నెలలో, జడ్జీల ప్రమాణస్వీకారం కూడా, ఒక చిన్న హాల్ లో చేసారని, కరోనా వ్యాప్తికి కారణం అయ్యారు అంటూ ఫిర్యాదులో తెలిపారు. హైకోర్టులో ఇప్పుడు కరోనా ఎక్కువ అయ్యి, కోర్టులు మూసేసే పరిస్థితి వచ్చిందని, దీనికి కారణం చీఫ్ జస్టిస్ అంటూ ఆ ఫిర్యాదులో చెప్పారు. ఈ ఫిర్యాదు రాష్ట్రపతితో పాటుగా, సుప్రీం కోర్టు జడ్జిలకు కూడా చేసారు. అయితే ఎక్కడో ఢిల్లీలో ఉండే ఈ హన్స్ రాజ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయాల పై, అదీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పై ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో అర్ధం కావటం లేదు. ఈయన వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం పై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

వైఎస్సార్సీ పార్టీ నర్సాపురం లోకసభ నియోజకవర్గ సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహరాన్ని ఆ పార్టీ అధిషానం సీరియస్ గానే తీసుకుంది. ఆయన పై ఎంపి సభ్యత్వానికి అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు లోకసభ స్పీకరుకు లేఖను ఇచ్చేందుకు ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు సిద్ధమయ్యారు. వారికి స్పీకరు ఓం ప్రకాశ్ బిర్లా అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి పై, తన పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు చేసిన ఓవర్ ఆక్షన్ పై తీవ్ర విమర్శలు చేసిన రామకృష్ణంరాజుకు పార్టీ అధిష్టానం సంజాయిషీ నోటీసు ఇచ్చింది. దీనిపై కుడా స్పందించిన రాజు గారు, తాను యువజన శ్రామీక కాంగ్రెస్ నుంచి ఎంపిగా ఎన్నికయ్యాయని, తనకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంజాయిషీ లేఖ రాస్తే చెల్లుబాటు కదనీ, క్రమశిక్షణ సంఘం చెయ్యల్సింది, విజయసాయి రెడ్డికి ఏమి సంబంధం అని వ్యాఖ్యానించారు. తాను పార్టీకి, ముఖ్యమంత్రికి విదేయుడినంటునే సుతిమెత్తగా అంటించారు.

ఇక తన పై ఒక సామజివర్గం మనుషులు చేస్తున్న బెదిరింపులు విషయంలో, ఆయన ఎన్నికల కమిషనర్‌ను, లోక్ సభ స్పీకరును, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి తన రక్షణ కల్పించాలని కోరారు. దీంతో విసిగిపోయిన వైకాంగ్రెస్ పార్టీ రామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వంపైనే వేటు వేయాలని నిర్ణయించింది. ఆయన పై అనర్హత వేటు వేయాలంటూ లోకసభకు స్పీకర్‌కు లేఖ అందజేయాలని పార్లమెంటు సభ్యులకు ఆదేశాలిచ్చింది. దాంతో విజయవాడనుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వైకాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, కొందరు న్యాయవాదులు బయలుదేరి వెళ్లారు. అయితే ఈ పరిణామం చోటు చేసుకున్న సమయంలో రఘురామరాజు మరో అనూహ్యం నిర్ణయం తేసుకున్నారు. తన పై అనర్హత వేటు వేసే అధికారం వీళ్ళకు లేడని, వేరే పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీస్ ఇచ్చారని, అనర్హత ప్రాసెస్ ని అడ్డుకోవాలని కోర్టులో పిటీషన్ వేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు అని, తమ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అలాగే తాను ఎక్కడా పార్టీని కాని, నాయకుడిని కానీ, ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తేవటమే తన పాపమా అని రఘురామ రాజు అన్నారు. ఈ పార్టీ పేరు వ్యవహారం పై ఇప్పటికే ఈసీ దృష్టికి తెచ్చానని, ఆ నిర్ణయం ఏమిటో చూడాలని కోర్టుకు తెలిపారు.

ఈ నెల 24 వతేదీన ఆయాసంతో చికిత్స నిమిత్తం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన 62 సంవత్సరాల వయస్సుగల తన భర్త వసంతరావు కనిపించడం లేదని అతని భార్య ధనలక్ష్మి, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్నుంచి ఆస్పత్రి వారిని అడుగుతుంటే తమకు ఏమీ తెలియదని చెబుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా వివరాలు తీసుకున్నారు , కానీ ఇంత వరకు సమాచారం లేదని ఆమె చెబుతున్నారు. తన భర్త ఎక్కడున్నాడన్నది తమకు అంతుబట్టడం లేదని ఆమె విలపిస్తున్నారు. వీరికి సంతానం లేదు. పైగా వసంతరావు సోదరుడు కూడా కొద్దిరోజుల క్రితమే చనిపోయారు. ఆయన దశదిన కర్మలు మొదలవడానికి ముందు వసంతరావు ఆయాసంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళారు. వసంతరావును పరిశీలించిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళమని చెప్పారు. దీంతో వసంతరావు, ధనలక్ష్మి ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ ఇద్దరు వసంతరావును ఆస్పత్రి లోపలికి తీసుకువెళ్ళారు, ధనలక్ష్మిని బయటే ఉండమన్నారు.

అయితే లోసల తన భర్త చికిత్స పొందుతున్నాడని ఆమె బయటే సాయంత్రం వరకు వేచి ఉంది. ఆమెకు ఎవరూ ఏమీ వివరాలు చెప్పలేదు. అక్కడి వారిని అడిగితే చికిత్స చేస్తున్నారన్నట్లుగా చెప్పడం, ఇక్కడ వద్దు రేపు రండి అని చెప్పటంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. మరునాడూ ఆస్పత్రికి వెళ్ళితే వసంతరావు అనే వ్యక్తి లేరంటూ సమాధానం వచ్చేసరికి ఆమె భయాందోళనకు గురయింది. అప్పట్నుంచి భర్త కోసం ఎదురు చూస్తేనే ఉంది,. అటు ఆస్పత్రిలోని వారు ఏమీ చెప్పడం లేదు, ఇటు పోలీసులూ ఏమీ చెప్పడం లేదని, తన భర్తను వెతికి పెట్టండి అంటూ ఆమె ఇప్పుడు బహిరంగంగా ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భర్త ఆచూకీ కనిపించడం లేదని ఆమె ఆరోపిస్తున్నది. ఆస్పత్రికి వెళ్ళిన రోజున చాలాసేపటికి గాని సిబ్బంది స్పందించలేదని, చివరికి బతిమాలుకుంటే తన భర్తను వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకువెళ్ళారని, ఆ తరువాత నుంచి తన భర్త జాడలేదని వాపోతున్నది. బంధువు శంకరనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్పత్రి లో తమకు సమాధానం చెప్పడం లేదని, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read